ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని నిర్ణయించారు. అమరావతి విశిష్టత, అభివృద్ధి వంటివి ప్రపంచవ్యాప్తంగా వీరి ద్వారా ప్రచారం చేయించనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. బ్రాండ్ అంబాసిడర్లను ఏర్పాటు చేయడం ద్వారా.. అమరావతిని ప్రపంచ స్థాయిలో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. తద్వారా.. రాజధానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడంతోపాటు.. విద్యాసంస్థలను, విదేశీ …
Read More »జగన్ కు ఈ బీజేపీ సీనియర్ ఇచ్చి పడేశారుగా!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిత్యం కూటమి సర్కారుపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. నోరు తెరిస్తే సూపర్ సిక్స్ హామీల అమలు ఎక్కడ అంటూ ఆయన కూటమి సర్కారును నిలదీస్తున్నారు. అయితే కూటమి నేతలు కూడా అంతే స్థాయిలో జగన్ కు బదులిస్తున్నారు. జగన్ చేసిన విధ్వంసం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆదిలోనే చెప్పిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు…ఆర్థిక …
Read More »బందిపోట్లు, స్మగ్లర్ల సినిమాలేంటి?: మంత్రి సత్యకుమార్
సినిమాలు, వాటి ఇతివృత్తాలపై బీజేపీ సీనియర్ నేత, ఏపీ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం రాత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. బందిపోట్లు, స్మగ్లర్ల బయోగ్రఫీలతో సినిమాలేంటి అని ప్రశ్నించిన మంత్రి…ఆ సినిమాల ద్వారా సభ్య సమాజానికి ఎలాంటి సందేశాలు ఇస్తున్నారంటూ ఒంటికాలిపై లేచారు. తమకు జన్మనిచ్చిన ప్రాంతాల అభివృద్ధి కోసం పాటు పడిన వారి జీవితాలను ఇతివృత్తంగా తీసుకుని సినిమాలు తీస్తే… సమాజాభివృద్ధికి దోహదం చేసినట్టు అవుతుందని …
Read More »ఆంధ్రా తరహా ‘విధ్వంసం’ ఢిల్లీలోనూ జరిగిందా…?
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాగించిన పాలనలో విధ్వంసం చోటుచేసుకుందని, రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిత్యం ఆరోపిస్తూనే ఉన్నారు. ఏపీలో మరోమారు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు ఆయా శాఖలను పరిశీలిస్తూ సాగుతుండగా.. జగన్ సాగించిన దురాగతాలు వరుసబెట్టి బయటకు వస్తున్నాయన్నది టీడీపీ మాట. ఆయా శాఖల్లో తన సొంత మనుషులను …
Read More »మైక్ పట్టుకొని సాక్షి రిపోర్టర్ తో లోకేష్ పంచులు!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ తనదైన మార్క్ రాజకీయంతో దూసుకుపోతున్నారు. 23 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు ఉన్న పార్టీకి రాత్రికి రాత్రి… 135 ఎమ్మెల్యే సీట్లు, 18 ఎంపీ సీట్లు కలిగిన పార్టీగా టీడీపీకి బలమైన కం బ్యాక్ ఇచ్చారు. రాజ్యసభలో జీరో స్థాయికి చేరిన టీడీపీ సంఖ్యను ఆరంటే ఆరు నెలల్లోనే తిరిగి ఖాతా ఓపెన్ అయ్యేలా చేశారు. అంతేనా… వైరి …
Read More »పంకజశ్రీ వాదన.. జగన్కు కూడా అప్లికబులే!
పంకజశ్రీ.. ప్రస్తుతం ఈ పేరు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈమె గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సతీమణి. ప్రస్తుతం వంశీ అరెస్టయి.. జైల్లో ఉన్న నేపథ్యంలో ఆమె మీడియా ముందుకు వచ్చారు. కుట్ర, కిడ్నాప్ కేసులో పోలీసులు కేసు నమోదు చేసి.. వంశీని అరెస్టు చేయడం..గురువారం, శుక్రవారం చర్చగా మారిన విషయం తెలిసిందే. ఇక, ఈ కేసులోనే కోర్టు ఆయనకు 14 రోజలు రిమాండ్ విధించింది. అనంతరం విజయవాడ …
Read More »బాలయ్య కాదు, నాకెప్పుడూ సారే: పవన్
నందమూరి బాలకృష్ణపై ప్రశంసల జల్లు కురిపించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ యాత్రను ముగించుకుని శనివారం విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న యుఫోరియా మ్యూజికల్ కన్సర్ట్కు అతిథిగా విచ్చేసిన పవన్.. తన ప్రసంగంలో బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలయ్య ఎప్పుడూ తనను బాలయ్యా అని పిలవమని అంటుంటారని.. కానీ తనకు మాత్రం అలా పిలవబుద్ధి కాదని.. ఆయన తనకు ఎప్పుడూ సారే …
Read More »ఎన్టీఆర్ ట్రస్ట్ కు పవన్ రూ.50 లక్షల విరాళం
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… దాన గుణంలో ఎప్పుడూ ఆదర్శంగానే ఉంటారు. రైతులు అయినా… వరద బాధితులు అయినా… అగ్ని ప్రమాద బాధితులు అయినా… జాలర్లు అయినా… ఆపదలో ఉన్న ఇతర వర్గాలు ఏవైనా గానీ.. తనకు సమస్య తెలిసినంతనే పవన్ అక్కడ దిగిపోతారు. ప్రభుత్వాలే సాయం చేయాలన్న మాటను పక్కనపడేసి… తనకు తోచిన మొత్తాన్ని సాయంగా అందిస్తూ వారికి భరోసాగా నిలుస్తూ ఉంటారు. ఆ …
Read More »నా పాటకు రాజకీయ రంగు పులమొద్దు: సింగర్ మంగ్లీ
ప్రమెుఖ సినీ గాయని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేస్తూ శనివారం ఓ బహిరంగ ప్రకటనను విడుదల చేసింది. తన పాటకు రాజకీయ ముద్ర ఆపాదిప్తున్నారని ఆరోపించిన మంగ్లీ… ఆ కారణంగా తనకు అవకాశాలు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయినా తాను రాజకీయంగా ఏ ఒక్క పార్టీకో అనుకూలంగా, మరో పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తానని కూడా ఆమె వాపోయింది. తన వృత్తి పాటలు పాడటమే గానీ… రాజకీయాలు చేయడం …
Read More »బ్యాక్ టూ డ్యూటీ… పవన్ ధర్మ పరిరక్షణ యాత్ర పూర్తి
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టిన ధర్మ పరిరక్షణ యాత్ర శనివారం పూర్తి అయ్యింది. మూడు రోజుల పాటు కేరళ, తమిళనాడుల్లో జరిగిన ఈ యాత్రలో పవన్ తన తనయుడు అకీరా నందన్ తో కలిసి సాగారు. తొలుత కేరళకు వెళ్లిన పవన్ అక్కడి నుంచి తన యాత్రను మొదలుపెట్టి… ఆ తర్వాత తమిళనాడు చేరుకున్నారు.. తమిళనాడులోనూ తాను నిర్దేశించుకున్న ఆలయాలను సందర్శించిన పవన్ శనివారం …
Read More »అంతా చట్టబద్ధంగానే జరుగుతుంది : నారా లోకేష్
వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ తొలిసారిగా స్పందించారు. శనివారం విశాఖ వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన సమయంలో మీడియా ప్రతినిధులు ఈ విషయంపై ఆయన స్పందనను కోరారు. దీంతో వంశీ అరెస్టుపై స్పందించిన లోకేశ్… అంతా చట్టబద్ధంగానే జరుగుతోందని, చట్ట ప్రకారమే తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇందులో …
Read More »ఈ సినిమాలని… వైసీపీ వాళ్ళే డిజాస్టర్స్ చేశారట!
సోషల్ మీడియా అన్నది రెండు వైపులా పదునున్న కత్తి. దీని వల్ల సినిమాల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. సినిమాల రీచ్ పెరుగుతోంది. కానీ అదే సమయంలో సినిమాల మీద ఉద్దేశపూర్వకంగా నెగెటివిటీని స్ప్రెడ్ చేసి దెబ్బ తీసే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. కొత్తగా ‘బాయ్కాట్’ బ్యాచ్లు కొన్ని తయారై.. సినిమాలను టార్గెట్ చేయడం ఫ్యాషన్గా మారిపోయింది. బాలీవుడ్లో కొన్ని సినిమాలను ఇలాగే దెబ్బ తీయడమూ తెలిసిందే. కానీ ఒక దశ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates