Political News

ఓడిన వైసీపీకి 10 కోట్లు, గెలిచిన టీడీపీకి…

రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌ముఖ సంస్థ‌లు విరాళాలు ఇవ్వ‌డం కొత్త‌కాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వ‌డం(వాటి ఇష్ట‌మే అయినా).. ఇప్పుడు దేశవ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. వివాదానికి కూడా దారితీస్తోంది. ఒకే సంస్థ బీజేపీకి గ‌త ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏకంగా 757 కోట్ల రూపాయ‌లను విరాళంగా ఇచ్చింది. స‌హ‌జంగానే అధికారంలోకి వ‌చ్చిన పార్టీ స‌ద‌రు సంస్థ‌కు మేలు చేయ‌కుండా ఎలా ఉంటుంది?! ఇదే ఇప్పుడు …

Read More »

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి రాజేశాయి. ఈ క్రమంలోనే అవి రైతులతో మాట్లాడుతున్న సందర్భంగా పవన్ క్యాజువల్ గా చేసిన వ్యాఖ్యలని, వాటిపై అనవసర రాద్ధాంతం అక్కర లేదని జనసేన ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయినా సరే కొందరు తెలంగాణ నేతలు మాత్రం పవన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని అంటున్నారు. ఇక, …

Read More »

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో జరిగిన “రైతన్నా మీకోసం” కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుమారు 30 ఏళ్ల క్రితం రాష్ట్రంలోనే అత్యధిక ఎయిడ్స్ కేసులు నమోదయ్యేవని తెలిపారు. ఎయిడ్స్ మహమ్మారిపై అవగాహన పెంచడానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్న గత పాలనా కాలంలో తీసుకున్న విప్లవాత్మక చర్యలను చంద్రబాబు …

Read More »

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఇద్దరు దివ్యాంగులతో సమయాన్ని గడిపారు. గోగన ఆదిశేషు, శెట్టివారి రఘులతో ముచ్చటించారు. మార్కాపురానికి చెందిన రఘు, బాపట్లకు చెందిన ఆదిశేషుల జీవనం, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ …

Read More »

‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ డిమాండ్ చేశారు. ఆయ‌న వ‌ల్ల తెలుగు ప్ర‌జ‌ల ఐక్య‌త చెడిపోయే ప్ర‌మాదం ఏర్ప‌డింద‌ని అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న సీఎం చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేస్తూ.. సెల్ఫీ వీడియోను విడుద‌ల చేశారు. రెండు తెలుగు ప్ర‌జ‌ల రాష్ట్రాలు భౌతికంగా విడిపోయినా.. శారీర‌కంగా మాన‌సికంగా క‌లిసే ఉన్నాయ‌ని.. ఎలాంటి శ‌తృత్వం లేద‌ని చెప్పారు. …

Read More »

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఇవ‌న్నీ ప్ర‌భుత్వ ఉద్యోగాలేన‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామ‌న్న ఆయ‌న‌.. మ‌రో 40 వేల ఉద్యోగాల భ‌ర్తీకి త్వ‌ర‌లోనే ముహూర్తం పెట్ట‌నున్న‌ట్టు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండున్న‌రేళ్లు పూర్తి చేసుకునే స‌రికి ల‌క్ష ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌న్నారు.(ఇప్ప‌టికే ఇచ్చిన వాటితో క‌లిపి). రాష్ట్ర …

Read More »

మళ్ళీ పాద‌యాత్ర చేసి సాధించేది ఏమన్నా ఉందా జగన్?

అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న ప‌రిస్థితిలో చెప్పడం కష్టంగా మారుతుంది. మారుతున్న కాలాల్లో మారుతున్న ప్రజల అభిప్రాయాలు పార్టీలపై ఉన్న విశ్వసనీయత వంటివి పరిగణలోకి తీసుకున్నప్పుడు పాదయాత్రలు చేసి సెంటిమెంటును రాజేసి తద్వారా అధికారంలోకి రావాలి అన్న విషయంలో నాయకులకు ప్రజలు ఇటీవల కాలంలో పెద్దగా స్పందించడం లేదన్నది స్పష్టం అవుతుంది. తాజాగా ఏపీలో మళ్లీ మరోసారి వైసీపీ …

Read More »

వారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం: చంద్రబాబు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి మహిళలు, పిల్లలు..ఇలా అన్ని వర్గాలకు ఏదో ఒక సంక్షేమ పథకం అందేలా సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలతో పాటు మరెన్నో హామీలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో నిర్దేశిత బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే పథకంపై యావత్ మహిళాలోకం ప్రశంసలు కురిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా …

Read More »

అధికారం వచ్చి ఎన్ని నెలలు అయినా ప్రజల మధ్యే సీఎం

అధికారంలోకి రాక‌ముందు.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండే పార్టీల గురించి తెలుసు. కానీ, అధికారం వ‌చ్చిన త‌ర్వాత కూడా నిరంత‌రం ప్ర‌జ‌ల‌ను అంటిపెట్టుకుని ఉంటున్న పార్టీ ఏదైనా ఉంటే.. అది టీడీపీనే అని చెప్పారు. గత 17 మాసాల్లో ప్ర‌తి నెలా ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రిస్తూనే ఉన్నారు సీఎం చంద్ర‌బాబు అంతేకాదు.. ఏదో ఒక కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతూనే ఉన్నారు. తాజాగా.. సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతన్న మీకోసం …

Read More »

గూగుల్ డేటా సెంట‌ర్‌.. ఊహించ‌నంత వేగంగా!

విశాఖ‌ప‌ట్నంలో ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించుకున్న గూగుల్ డేటా కేంద్రం.. ఊహించ‌ని వేగంగా ముందుకు క‌దులుతోంది. భూ సమీక‌ర‌ణ విష‌యంలో ప్ర‌భుత్వం చాలా వేగంగా అడుగులు వేస్తోంది. మొత్తంగా 506 ఎక‌రాల‌ను గూగుల్ డేటా కేంద్రం, దాని అనుబంధ సంస్థ‌ల‌కు ఇవ్వాల‌ని రాష్ట్ర‌ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా కొంత భాగాన్ని భీమిలి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో కూడా స‌మీక‌రిస్తున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానిని ఇచ్చిన‌ట్టుగానే ఇక్క‌డ కూడా స‌మీక‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక‌, ఇప్ప‌టికే ప్ర‌భుత్వం …

Read More »

బీజేపీ ద‌య‌వ‌ల్ల నా ఇమేజ్ నార్త్‌లోనూ పెరిగింది: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ ద‌య‌వ‌ల్ల త‌న ఇమేజ్ నార్త్ వ‌ర‌కు పాకింద‌ని.. ఒక‌ప్పుడు తానెవ‌రో.. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల‌కు తెలియ‌ద‌ని… కానీ.. బీజేపీ నాయ‌కు లు ఇప్పుడు చేస్తున్న అతి ప్ర‌చారం కార‌ణంగా.. త‌న పేరు ఇప్పుడు ఉత్త‌రాది రాష్ట్రాల్లోనూ వినిపిస్తున్న‌ట్టు తెలిపారు. తాజాగా ఢిల్లీకి వెళ్లిన ముఖ్య‌మంత్రి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఇత‌ర కేంద్ర మంత్రుల‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారికి …

Read More »

గ్లోబల్ సమ్మిట్ కోసం గ్లోబును చుట్టేస్తున్న రేవంత్ సర్కార్

డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో జరగబోయే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలోనే  భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే ఈ సదస్సుకు హాజరు కావాలని ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పంపనుంది. ఈ నెల 4న తెలంగాణ మంత్రులు స్వయంగా వెళ్లి ఆయా …

Read More »