Political News

ఓట‌మికి నేనే బాధ్యుడిని.. మౌన దీక్ష చేస్తా: పీకే

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని అధికారంలోకి వ‌స్తామ‌నిప్ర‌క‌టించిన రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌.. ఆశించిన విధంగా ఫ‌లితాల‌ను రాబ‌ట్టుకోలేక పోయారు. క‌నీసం 234 మంది అభ్య‌ర్థుల‌ను నిలబెట్టినా ఒక్క చోట కూడా.. ఆయ‌న డిపాజిట్ ద‌క్కించుకోలేక పోయారు. అయితే.. ఓట్లు మాత్రం 3.3 శాతం వ‌చ్చాయి. ఇవి ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీలైన కాంగ్రెస్‌, ఆర్జేడీల కూటమిని చావు దెబ్బ కొట్టాయ‌న్న చ‌ర్చ ఉంది. అయితే.. పీకే ప్రారంభించిన జ‌న్ …

Read More »

రాజధానికి కూతవేటు దూరంలో మావోయిస్టుల కలకల

ఏపీ రాజధాని అమరావతి సమీపంలో విజయవాడ నగర శివారు కానూరు కొత్త ఆటోనగర్‌లో మావోయిస్టుల కలకలం రేగింది. కేంద్ర బలగాలు సోదాలు చేపట్టి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ భవనాన్ని షెల్టర్‌గా చేసుకుని మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. అరెస్టయిన మావోయిస్టుల్లో 12 మంది మహిళలు, నలుగురు కీలక హోదాల్లోని వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. 11 మంది …

Read More »

మెరుపు దాడుల మాస్టర్ మైండ్.. హిడ్మా!

ఏపీలోని మారేడుమిల్లిలో ఈ ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మృతి చెందారు. మెరుపు దాడుల మాస్టర్ మైండ్ హిడ్మా మృతి చెందడం సంచలనం రేకెత్తించింది. ఆయనది ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలోని పునర్తి గ్రామం. హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో హిడ్మాకు పట్టు ఉంది. హిడ్మా దళానికి అత్యంత శక్తివంతమైన దళంగా పేరుంది. భారీ ఆపరేషన్లలో హిడ్మాదే మాస్టర్‌ …

Read More »

అమ‌రావ‌తికి చ‌ట్ట భ‌ద్ర‌త‌!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టిస్తున్నారు. నిర్మాణాలు కూడా వ‌డివ‌డిగా సాగుతున్నాయి. గ‌త వైసీపీ హ‌యాంలో ఐదేళ్లు ప‌డకేసిన నిర్మాణాల‌తో అమ‌రావ‌తి అట‌వీ ప్రాంతాన్ని త‌ల‌పించింది. దీంతో కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక 40 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చుచేసి.. అట‌వీ ప్రాంతంగా ఉన్న అమ‌రావ‌తిలో తిరిగి బాగు చేత కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. ఆ వెంట‌నే కేంద్రం ద్వారా ప్ర‌పంచ బ్యాంకు, ఏడీబీల నుంచి నిధులు తీసుకువ‌చ్చి ప్ర‌స్తుతం ప‌నులు వేగంగా …

Read More »

హ‌సీనాకు మ‌ర‌ణ శిక్ష‌… మోడీకి ఇబ్బందేనా?

బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాన మంత్రి షేక్ హ‌సీనాకు ఢాకాలో ఉన్న అంత‌ర్జాతీయ నేర వివాదాల ప‌రిష్కార కోర్టు (ఐసీటీ) తాజాగా మ‌ర‌ణ శిక్ష విధించింది. 2023-24 మ‌ధ్య కాలంలో దేశంలో చోటు చేసుకున్న రిజ‌ర్వేష‌న్ల ఉద్య‌మం.. తీవ్ర రూపం దాల్చిన‌ప్పుడు .. ప్ర‌ధానిగా హ‌సీనా వ్య‌వ‌హ‌రించిన తీరుతో నిరుద్యోగులు, విద్యార్థులు ర‌గిలిపోయారు. ఇది దేశంలో పెను ఉత్పాతానికి దారి తీసింది. ఫ‌లితంగా పెద్ద ఎత్తున అల్ల‌ర్లు చోటు చేసుకున్నాయి. వీటిని …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే డిజిట‌ల్ అరెస్టు: బ్యాంకు మేనేజ‌ర్ మోసం

ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యే, మైదుకూరు శాస‌న స‌భ్యుడు పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌..(ఈయ‌న పార్టీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి వియ్యంకుడు)ను కొన్నాళ్ల కింద‌ట సైబ‌ర్ నేర‌గాళ్లు.. డిజిట‌ల్ అరెస్టు చేసిన‌విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో ఈ ఘ‌ట‌న తీవ్ర‌స్థాయిలో క‌ల‌క‌లం రేపింది. ఈ క్ర‌మంలో ఏకంగా 1.7 కోట్ల రూపాయ‌ల సొత్తును సైబ‌ర్ నేర‌స్తులు దోచుకున్నారు. అయితే.. దీనిపై సైబ‌ర్ పోలీసుల‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు …

Read More »

విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎవరేం చేశారు?

విశాఖలో ఐసీసీ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. చివరిరోజు విశాఖ ఉక్కు పరిశ్రమపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం అయ్యింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేసాయో చెబుతూ, ప్రజాధనం కాపాడటానికి కార్మికులు కూడా బాధ్యతగా పని చేయాలని చంద్రబాబు చెప్పారు. ఇంత స్పష్టంగా చెప్పిన దాన్ని వక్రీకరించి ఫేక్ ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఆరోపణ. వైసీపీ …

Read More »

మ‌రో 30 రోజులే గ‌డువు.. జిల్లాల వ్యూహం ఏమ‌వుతుంది ..!

రాష్ట్రంలో జిల్లాల విభజన, డివిజన్‌ల‌ విభజన, అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటు అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. అయితే, దీనికి సంబంధించిన సమయం మరో 30 రోజులు మాత్రమే ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 20 కల్లా కొత్త జిల్లాల‌ సరిహద్దులను లేదా కొత్త డివిజన్ల‌ సరిహద్దులను నిర్ణయించాల్సిన అవసరం ఏర్పడింది. డిసెంబర్ 21వ తేదీ తర్వాత ఇక జిల్లాల సరిహద్దులు, మండలాల సరిహద్దులు, డివిజన్ల‌ …

Read More »

టీడీపీలో ఇదే హాట్ టాపిక్‌.. మ్యాట‌ర్ ఏంటంటే…!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత టిడిపిలో ఆసక్తికర చర్చ తెర మీదకు వచ్చింది. దేశంలో జమిలి ఎన్నికలకు అవకాశం ఉంటుందని.. నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన కూడా సాకారం అవుతుందన్న ఆశలు, అంచనాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపైనే టీడీపీ నాయకులు ఆసక్తిగా చర్చిస్తున్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో టికెట్లు ద‌క్కని వారు, టికెట్లు త్యాగం చేసిన వారు ఇప్పుడు నియోజకవర్గ పున‌ర్విభ‌జ‌న‌పైనే ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో …

Read More »

‘పోలిక‌లు’ స‌రే.. రంగా వార‌సురాలిగా స‌క్సెస్ అయ్యేనా ..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ పరిచయమున్న రాజ‌కీయ నేత‌, దివంగ‌త‌ వంగవీటి మోహన్ రంగా ఫ్యామిలీ నుంచి మహిళా నాయకురాలుగా ఆయన కుమార్తె ఆశా కిరణ్ తాజాగా రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమె ఏ పార్టీలో చేరుతారు ఆమె వెనక ఎవరున్నారు అనే విషయాలు పక్కన పెడితే.. రంగా కుటుంబం నుంచి ఇప్పటివరకు ఇద్దరు నాయకులు ప్రజల్లోకి వచ్చారు. రంగా మరణానంతరం ఆయన సతీమణి వంగవీటి రత్నకుమారి కాంగ్రెస్ …

Read More »

జంపింగుల‌కు మ‌రో 4 వారాల గ‌డువు: సుప్రీం

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీ నుంచి 2023 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని.. త‌ర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసిన 10 మంది ఎమ్మెల్యేల వ్య‌వ‌హారం మ‌రోసారి సుప్రీంకోర్టులో విచారణ‌కు వ‌చ్చింది. ఈ విష‌యంలో త‌న‌కు స‌మ‌యం కావాలంటూ.. స్పీక‌ర్ ప్ర‌సాద‌రావు.. కొన్ని రోజుల కింద‌ట .. సుప్రీంలో పిటిష‌న్ వేశారు. దీనిపై మ‌రోసారి విచార‌ణ జ‌రిగింది. అయితే.. ఎందుకింత సాగ‌దీస్తున్నారన్న ప్ర‌శ్న సుప్రీంకోర్టు నుంచి వ‌చ్చింది. దీనికి …

Read More »

ఆ దేశ మాజీ ప్రధానికి ఉరిశిక్ష ఖరారు

బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఐసీటీ కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఢాకా అల్లర్ల కేసులో హసీనాకు ఈ శిక్ష విధించారు. ఆమె ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం తీసుకుంటోంది. షేక్‌ హసీనా తీరు మానవత్వానికి మచ్చ అని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయబడింది. హసీనాను దోషిగా ఢాకా ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రిబ్యునల్‌ తేల్చింది. హసీనా నేరం చేసిందని చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. హసీనా మానవత్వాన్ని మరిచింది, …

Read More »