ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు సందర్భాల్లో మోడీ.. పవన్ కల్యాణ్ను ప్రశంసించిన విషయం తెలిసిందే. సనాతన ధర్మ దీక్ష చేపట్టినప్పుడు.. పల్లె పండుగ ప్రారంభించి.. పల్లెల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినప్పుడు కూడా మోడీ పవన్ కల్యాణ్ను ప్రశంసించారు. ముఖ్యంగా కర్నూలులో నిర్వహించిన జీఎస్టీ బచత్ ఉత్సవం వేడుకల్లో మరింతగా పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా …
Read More »‘చంద్రబాబు పనిరాక్షసుడు’
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. వేరే పనులు కూడా పెట్టుకోరు. కానీ, ఏపీ సీఎం చంద్ర బాబు స్టయిల్ మాత్రం వేరు. పండగ పండగే.. పనులు పనులే అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని ఆయన సొంత గ్రామం నారా వారిపల్లెకు కుటుంబ సమేతంగా చంద్రబాబు వెళ్లారు. ఇదేసమయంలో నందమూరి ఫ్యామిలీ …
Read More »విజయ్కు సీబీఐ సెగ… `పొత్తు` కోసమా?
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న కరూర్లో నిర్వహించిన పార్టీ సమావేశంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. నాటి ఘటనలో 41 మంది మృతి చెందారు. ఈ కేసును తాజాగా సీబీఐ విచారణకు చేపట్టింది. ఈ క్రమంలో సోమవారం సీబీఐ ఆదేశాల మేరకు ఢిల్లీలోని ఆ సంస్థకేంద్ర కార్యాలయానికి విచారణ నిమిత్తం విజయ్ హాజరయ్యారు. తొక్కిసలాటకు …
Read More »నారావారి పల్లెముచ్చట్లు: మనవడి ఆటలు – తాత మురిపాలు
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువతీ యువకులతోపాటు.. చిన్నారులకు కూడా ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, పాటలు వంటివి నిర్వహించారు. ఆయా క్రీడలు, సంబరాల్లో సీఎం చంద్రబాబు , ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా చిన్నారులకు నిర్వహించిన ఆటల …
Read More »పందెం కోళ్లు: `అందరూ` కలిసిపోయారు …!
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి జిల్లాలు సహా.. ఉమ్మడి కృష్ణా, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కోడి పందేల జోరు పెరిగింది. అయితే.. ఒకప్పుడు కేవలం ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితం అయిన కోడి పందేలు.. ఇప్పుడు మరింత ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కృష్ణా, గుంటూరు, తాజాగా నెల్లూరు జిల్లాలకు కూడా ఈ …
Read More »ఎంపీ ఈటల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే, చాలా సందర్భాల్లో ఒక ప్రభుత్వంలో సగం పూర్తయి పెండింగ్ లో ఉన్న పనులు మరో ప్రభుత్వంలో పూర్తవుతుంటాయి. అటువంటి సందర్భాల్లో ఫలానా పనికి క్రెడిట్ మాదంటే మాదే అని రాజకీయ పార్టీలు క్రెడిట్ కోసం పోటీ పడుతుంటాయి. తెలంగాణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బి ఆర్ …
Read More »వైసీపీ కార్యాలయంలో `సంక్రాంతి` రద్దు?
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏటా నిర్వహించే సంక్రాంతి సంబరాలను రద్దు చేసినట్టు తెలిసింది. వాస్తవానికి గత ఏడాది కూడా తూతూ.. మంత్రంగా నిర్వహించారు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు మాత్రం ఘనంగా ఈ సంబరాలను తాడేపల్లి నివాసంలో అప్పటి సీఎం హోదాలో జగన్, ఆయన సతీమణి నిర్వహించారు. ఇక, గత ఏడాది మాత్రం పార్టీ ఓడిపోయిన దరిమిలా.. 11 సీట్లకు పరిమితమైన దరిమిలా.. ఈ సంబరాలను …
Read More »సంక్రాంతి వేళ అయినా… సమస్యలపై సీఎం అలర్ట్
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన బిజీ షెడ్యూల్లో గడపనున్నారు. బంధుమిత్రులు, తనను ఎన్నుకున్న ప్రజలతో మమేకం కానున్నారు. ఈ సమయంలోనూ ఆయన రాష్ట్రంలోని ప్రజల సమస్యలపై చాలా అలెర్ట్గా ఉన్నారు. పండుగ వేళలో గోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో 38 తాటాకు ఇళ్లు కాలిపోయాయి. దీనిపై చంద్రబాబు …
Read More »`చలానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ.. ఇతరులకు ఆటంకం కలిగించడంతోపాటు.. ప్రమాదాలకు కూడా కారణమవుతున్న వాహనదారులు పెరుగుతున్నారు. దీనికితోడు ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, రెడ్ సిగ్నల్ జంపింగ్, హైస్పీడ్ రైడింగ్, నోహెల్మెట్ ఇలా.. అనేక విషయాల్లో వాహనదారులు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ.. కేసులు కడుతున్నారు. చలానాల మోత …
Read More »బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ సమస్యలపై దృష్టి!
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. ఉమ్మడిచిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న నారావారి పల్లెకు ప్రతి సంక్రాంతిని పురస్కరించుకుని చంద్రబాబు కుటుంబం మొత్తం అక్కడే ఉంటుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్ సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో చంద్రగిరికి బయలు దేరారు. అయితే.. వాస్తవానికి పండుగ సందడికోసం …
Read More »జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు.. ఎవరు ఏమనుకున్నా.. తాము ప్రజల అభిప్రాయాలు, వారి అభిరుచుల మేరకు.. మార్పులు చేర్పులు చేయాలని సంకల్పించామన్నారు. ముఖ్యంగా పాలనకు అనుకూలంగా లేకపోవడంతో కొన్ని జిల్లాల్లో అభివృద్ధి ముందుకు సాగడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో మార్పులు చేస్తామని తేల్చి చెప్పారు. …
Read More »బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ప్రతి పైసాను ఆచితూచి ఖర్చు చేయాలని చూస్తున్నారు. పన్నుల తగ్గింపు వల్ల వచ్చే ఆదాయంలో కొంత లోటు కనిపిస్తున్నా ఆర్థిక క్రమశిక్షణను కాపాడుకుంటూ వృద్ధిని ఎలా పెంచుతారనేదే ఇక్కడ మెయిన్ పాయింట్. ప్రస్తుత పరిస్థితుల్లో పన్నుల వసూళ్లు అనుకున్నంత స్పీడ్ గా లేవు. ఏప్రిల్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates