ఔను.. నిజమే! ఏపీలో వైనాట్ 175 నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీ.. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసింది. ఊహించని పరాజయం… పార్టీ అధినేత జగన్ వేసుకున్న లెక్కలు దారి తప్పడం తెలిసిందే. అయితే..ఈ ప్రభావం.. పార్టీ నాయకులపై భారీగానే ప్రభావం చూపించింది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదంటూ.. జగన్పై నిప్పులు చెరిగిన నాయకులు ఉన్నారు. ఈ క్రమంలోనే …
Read More »ఇలాగైతే… 20 లక్షల కొలువులు ఓ లెక్కా?
ఏపీలోని కూటమి సర్కారు జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. సర్కారీ ఖజానాను గత ప్రభుత్వ పెద్దలు ఖాళీ చేయడంతో పాటుగా కొత్తగా అప్పులు పుట్టని పరిస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేసి వెళ్లినా…టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో కూటమి సర్కారు అద్భుతాలనే చేసి చూపిస్తోంది. ఈ 9 నెలల కాలంలోనే ఏపీకి రూ.8 లక్షల కోట్ల పై చిలుకు పెట్టుబడులను ఆకర్షించిన కూటమి… వాటి ద్వారా ఏకంగా 6 …
Read More »బాబుకు ఉద్యోగి లేఖ!.. ఇంత చేస్తూ ప్రచారం చేసుకోరా?
ఏపీలో వైసీపీ పాలన, కూటమి పాలనల్లోని వ్యత్యాసాలను ఎత్తి చూపారు ఓ ఉద్యోగి. అంతేనా నాటి ప్రభుత్వ పాలనలో తామెలాంటి ఇబ్బందులు పడ్డామన్న మాటను ఆ ఉద్యోగి తన అక్షరాలతోనే కళ్లకు కట్టారు. అక్కడితోనూ ఆయన ఆగలేదు. ప్రస్తుత ప్రభుత్వం తమ కోసమే కాకుండా రాష్ట్రంలోని వివిధ వర్గాలకు చేస్తున్న న్యాయాన్ని కూడా ప్రస్తావించారు. కూటమి న్యాయం వల్ల జరుగుతున్న లాభాన్నీ సోదాహరణంగా వివరించారు. నాడు అణచివేతతోనే ప్రచారాన్నిహోరెత్తిస్తే.. నేడు …
Read More »కోర్టులతో పరిహాసమా?: ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం ఫైర్
తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రతివాదులైన జంపింగ్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు.. నాలుగు వారాలసమయం కోరారు. తాము అఫిడవిట్లు వేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “కోర్టులతో పరిహాసమా? మా సమయాన్ని వృధా చేస్తారా?” అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయవాదులు స్పందిస్తూ.. ఎమ్మెల్యేలపై అనర్హత …
Read More »మహిళా ఎమ్మెల్యేకు సారీ చెప్పిన స్పీకర్
గెడ్డం ప్రసాద్ కుమార్… తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నేత. ఆది నుంచి కాంగ్రెస్ ను అంటిపెట్టుకుని సాగుతున్న ఆయన… తాజాగా మంగళవారం శాసనసభాపతి హోదాను, గౌరవాన్ని మరింతగా పెంచేలా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. సభలో ఓ సభ్యురాలి గురించి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ఆయన తన ఉదాత్త స్వభావాన్ని మరింతగా ఇనుమడింపజేసుకున్నారు. స్పీకర్ స్థానంలో ఉండి కూడా ఈ తరహా …
Read More »వైసీపీకి వరుస దెబ్బలు.. స్థానికంలో పట్టు ఫట్.. !
స్థానిక సంస్థల్లో వైసీపీ పట్టుకోల్పోతోంది. 2021లో జరిగిన ఎన్నికల్లో ఏకబిగిన రాష్ట్ర వ్యాప్తంగా దుమ్ము దులిపిన వైసీపీ.. ఇప్పుడు మాత్రం ఆ హవాను దాదాపు పోగొట్టుకుంటోందనే చెప్పాలి. ప్రస్తుతం కడప మేయర్ సురేష్బాబుపై అనర్హత వేటు పడుతుండగా.. మరోవైపు.. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరులోనూ.. స్థానికం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇక, ఇప్పటికే పలు చోట్ల వైసీపీ జెండా జారి.. టీడీపీ జెండా ఎగురు తున్న పరిస్థితి కనిపిస్తోంది. కడపలో వైసీపీకి …
Read More »పుల్లారావుదే పైచేయి.. పేట రాజకీయం అదరహో ..!
రాత్రికి రాత్రి ఫోన్లు మోగాయి.. ఉదయానికల్లా.. చిలకలూరిపేటలోని టీడీపీ కార్యాలయం సండదిగా మారి పోయింది. పల్నాడు జిల్లాలోని పలు మండలాలకు చెందిన వారు.. టీడీపీ ఆఫీస్ను వెతుక్కుంటూ వచ్చేశారు. మరికాసేపటికి వారిని వెతుక్కుంటూ.. మీడియా చానెళ్లు పోగుపడ్డాయి. కట్ చేస్తే.. వారంతా మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజనీ బాధితులు! అసలే.. ఆమెపై స్టోన్ క్రషర్ యజమాని చేసిన ఫిర్యాదుతో కేసు నమోదై ఉన్న తరుణంలో గోరుచుట్టుమీద రోకలి …
Read More »కోమటిరెడ్డి ఫ్యామిలీకి డబుల్ ధమాకా
తెలంగాణలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన కేబినెట్ ను పరిపూర్ణం చేసుకునే దిశగా చేసిన యత్నాలు ఎట్టకేలకు ఫలించాయనే చెప్పాలి. కేబినెట్ విస్తరణకు ఇంకా ముహూర్తం అయితే ఖరారు కాలేదు గానీ…కేబినెట్ విస్తరణకు అయితే కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తెలుగు సంవత్సరాది ఉగాదికి కాస్త అటూఇటూగా కేబినెట్ విస్తరణ ఖాయమని చెప్పాలి. విస్తరణలో ఎవరి జాతకం ఎలా ఉన్నా… కోమటిరెడ్డి ఫ్యామిలీకి మాత్రం డబుల్ ధమాకా …
Read More »నేతల కొరత తీర్చేలా.. జనసేన అడుగులు ..!
జనసేనలో నాయకుల కొరత తీవ్రంగానే ఉంది. పైకి కనిపిస్తున్న వారంతా పనిచేయడానికి తక్కువ.. వివాదాలు సృష్టించేందుకు ఎక్కువ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో జనసేనలో క్షేత్రస్థాయి నాయకుల బలం తక్కువగా ఉంది. ఇక, కార్యకర్తల విషయానికి వస్తే.. సినీ మెగా అభిమానులే మెజారిటీ కార్యకర్తలుగా ఉన్నారు. దీంతో జనసేనకు నాయకుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి.. ఇప్పటికిప్పుడు రాజకీయంగా ఇబ్బందులు లేకపోయినా.. మున్ముందు సమస్యగా మారే అవకాశం ఉంది. ఇప్పటి …
Read More »‘వర్గీకరణ’తోనే డీఎస్సీ… ఏప్రిల్ తొలివారంలో నోటిఫికేషన్
ఏపీలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి రంగం సిద్ధం అయిపోయింది. 16 వేలకు పైగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ ఒకే దఫా భర్తీ చేసే దిశగా కూటమి సర్కారు ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసింది. ఈ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకూ రంగం సిద్ధం అయిపోయింది. ఈ విషయంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాటి కలెక్టర్ల సదస్సులో కీలక ప్రకటన …
Read More »దటీజ్ కోటంరెడ్డి ..!
ఆయన పార్టీ మారారు. కానీ, పంథా మాత్రం మార్చుకోలేదు. ఆయనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. ఆయన ప్రజలకు చాలా చేరువైన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. అంతేకాదు.. పార్టీ ఏదైనా ఆయన గెలుపు ఖాయమన్న మాట కూడా వినిపిస్తుంది. గత ఏడాది వైసీపీలో ఉన్న ఆయన.. ఎన్నికలకు కొన్ని నెలల ముందు.. టీడీపీతీర్థం పుచ్చుకు న్నారు. అయినప్పటికీ.. గెలుపు గుర్రం ఎక్కారు. సాధారణంగా అనేక మంది ఇలా …
Read More »కాకాణి కటకటాల్లోకి వెళ్లే టైం వచ్చేసిందా..?
ఏపీలో విపక్షం వైసీపీకి చెందిన మరో కీలక నేత, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుదామంటూ ఉత్సాహపడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఓ కీలక నేరానికి సంబంధించిన కేసు నమోదు అయిపోయింది. జిల్లాలోని క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగానే కాకుండా ఇష్టారాజ్యంగా దోచేసిన కేసులో ఓ ఆరుగురితో పాటుగా కాకాణి పేరు కూడా చేరిపోయింది. ఈ మేరకు నెల్లూరు పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో మొత్తం 10 …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates