“గన్నవరం నియోజకవర్గం నన్ను కాదనే వారు ఉన్నారా? నా పేరు చెబితే.. గ్రామాలకు గ్రామాలే తరలి వస్తాయి. ఏమనుకుంటున్నాడు వాడు(ప్రత్యర్థి నేత). ఒక్కసారి గన్నవరం గ్రౌండ్లోకి దిగితే.. తెలుస్తుంది. నోటికి వచ్చింది మాట్లాడడం కాదు. గన్నవరంలో ఏ పిల్లినడిడినా.. ఏ పిట్టనడిగినా.. వంశీ గురించి చెబుతారు. నాకు ఏమైనా జరిగితే.. గన్నవరం గన్నవరం మొత్తం నిలబడుతుంది“- ఖచ్చితంగా రెండేళ్ల కిందట అప్పటిఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు …
Read More »ఏపీలో ఉచితాలతో పాటు అభివృద్ధికీ ప్రాధాన్యం!
ప్రజలకు ఉచితాలు ఇవ్వడం బెటరే. కానీ.. ప్రస్తుతం ఈ ఉచితాల కారణంగానే రాష్ట్రం అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్ హయాంలో ఉచితాలు.. బటన్ నొక్కుళ్ల కారణంగానే.. 4 లక్షల కోట్ల రూపా యల వరకు అదనంగా అప్పులు చేయాల్సి వచ్చింది. ఇది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచింది. ఉచిత పథకాలు పొందిన వారు కూడా.. తమ కుటుంబంలో ఉద్యోగాలు వస్తే బాగుండనని.. అమరావతి రాజధాని ఏర్పాటు చేస్తే.. బాగుంటుందని …
Read More »ఉత్తరాంధ్రలో వైసీపీ : కన్నబాబుకు కలిసిరానుందా?
ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్ గా నియమితులు అయిన మాజీ మంత్రి, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మె ల్యే కురసాల కన్నబాబుకు.. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో నెగ్గుకు రావడం అంత ఈజీకాదన్న వాదన పార్టీలో నే వినిపిస్తుండడం గమనార్హం. ఉత్తరాంధ్రలో ఉన్నవి మూడు జిల్లాలే అయినా.. ముప్పై రకాల రాజకీయాలు ఇక్కడ సాగుతుంటాయి. నాకు నేనే రాజు-నేనే మంత్రి అన్నట్టుగా వైసీపీనాయకులు ఇక్కడ వ్యవహరిస్తుంటారనేది గతంలో ఇక్కడ ఇంచార్జ్గా పనిచేసిన సాయిరెడ్డి …
Read More »తిరుపతి వేదికగా ఒకే స్టేజీపై ముగ్గురు సీఎంలు?
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతి వేదికగా రేపు ఓ అరుదైన సన్నివేశం ఆవిష్కృతం కానుంది. ఒకే వేదికను ముగ్గురు సీఎంలు పంచుకోనున్నారు. ఇందుకు తిరుపతి వేదికగా రేపు ప్రారంభం కానున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ వేదికకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో పాటుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి …
Read More »సినీప్రముఖులకు శ్రీకాళహస్తి బ్రహోత్సవాల ఆహ్వానం
టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ కు శ్రీకాళహస్తిలోని శ్రీ మక్కంటి ఆలయ బ్రహ్మోత్సవాల ఆహ్వానం అందింది. ముక్కంటి ఆలయంలో ఏటా మహా శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి జరుగుతున్న బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ యువ నేత బొజ్జల సుధీర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన కాళహస్తి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను …
Read More »ఏపీలో తొలి ‘గులియన్’ డెత్… వర్రీ అక్కర్లేదన్న వైద్యులు
ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) పేరిట ఓ కొత్త వ్యాధి అంతకంతకూ ప్రబలుతోంది. ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండగా… వారంతా గుంటూరులోని జీజీహెచ్ కు వస్తున్నారు. ఈ వ్యాధికి చికిత్స రాష్ట్రంలోని ఒక్క గుంటూరు జీజీహెచ్ లోనే అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఈ వ్యాధిగ్రస్తుంతా గుంటూరుకే తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల ఈ వ్యాధి బారిన పడిన ప్రకాశం జిల్లా కొమరవోలు మండలం …
Read More »వెంకయ్య… ఇంకా యమా యాక్టివ్ గా ఉన్నారు!
ముప్పవరపు వెంకయ్యనాయుడు భారత రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేెక గుర్తింపును సంపాదించుకున్న తెలుగు నేత. బీజేపీతో రాజకీయం మొదలుపెట్టి… బీజేపీతోనే రాజకీయాలకు స్వస్తి పలికిన మన నెల్లూరు జిల్లా నేత. దేశ ద్వితీయ పౌరుడిగా ఉపరాష్ట్రపతిగా ఆయన దేశానికి సేవలు అందించారు. ఎప్పుడో 1949లో జన్మించిన వెంకయ్య.. ఈ జూలై వస్తే 75 ఏళ్ల వయసును పూర్తి చేసుకుంటారు. అయితేనేం… ఆయన ఇప్పటికీ యమా యాక్టివ్ గా ఉన్నారు. ఉపరాష్ట్రపతి …
Read More »వైరల్ వీడియో : స్కూటర్ పై పాలమ్మిన మల్లారెడ్డి!
తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి.. పేరు విన్నంతనే మస్త్ మజా వచ్చేస్తుంది. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ, ఎన్నెన్నో వ్యాపారాల్లో కాలు పెట్టిన మల్లారెడ్డి.. అన్నింటా సక్సెస్ నే చవిచూశారు. ఆపై రాజకీయాల్లోకి వచ్చాక… అందులోనూ తన లెగ్ గోల్డెన్ లెగ్గేనని నిరూపించుకున్నారు. ఆదిలో టీడీపీతో రాజకీయ ప్రస్థానాన్నిమొదలుపెట్టిన మల్లారెడ్డి.. మల్కాజిగిరి నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఏకంగా కేసీఆర్ కేబినెట్ …
Read More »“కర్మఫలం క్షమించదు… నెక్ట్స్ పెర్ని నాని!” : రవీంద్ర
టీడీపీ గన్నవరం కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. వంశీ మాదిరే వైసీపీ జమానాలో నోరు పారేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన మరికొందరు నేతల అరెస్టులు తప్పవని చెబుతున్న టీడీపీ నేతలు… అందుకు సంబంధించి గతంలో ఎన్నడూ లేనంత ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ సీనియర్ నేత, మచిలీపట్నం …
Read More »“వంశీ బయటకు వచ్చేది ఎప్పుడు?”: వైసీపీ
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడలోని సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఆ పార్టీ కార్యకర్త సత్యవర్థన్ను కిడ్నాప్ చేసి.. బెదిరించి.. ఆయనతో కేసు వెనక్కి తీసుకునేలా వత్తిడి చేశారన్న అభియోగాలతో పోలీసులు వంశీని అరెస్టు చేశారు. అయితే.. ఏదో ఒకరకంగా.. బెయిల్పై బయటకు తీసుకువచ్చేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ.. …
Read More »పదవిలో ఉంటే కాషాయ వస్త్రాలు కట్టకూడదట!
ఎర్రన్నలు… అదేనండి మన వామపక్ష పార్టీలకు చెందిన నేతలు ఎప్పుడేం మాట్లాడతారో కూడా అర్థం కాదు. అసలే జనాల్లో పట్టు కోల్పోయిన ఎర్ర దండు నేడో, రేపో దుకాణాలు పూర్తిగా బంద్ చేసుకోక తప్పని పరిస్థితులు కనపడుతున్నాయన్న వాదనలు తరచూ వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దుకునే పనిని పక్కనపెట్టేసిన లెప్ట్ పార్టీ నేతలు.. అధికారంలో ఉన్న నేతలు.. అది కూడా పోటీ చేసిన అన్ని స్థానాలను గెలిచిన.. 100 శాతం …
Read More »కేసు వాపస్ తీసుకుంటే 40 లక్షలు అన్నారు, ఇప్పుడేమో….
వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ హయాంలో జరిగిన దాడి ఘటనలో వంశీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయినా… అరెస్ట్ ముప్పు నుంచి రక్షణ పొందుతూ వంశీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయినా కూడా ఈ కేసు తనకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates