Political News

కిడ్నాప్ తర్వాత వంశీ ‘తాడేపల్లి’ వెళ్లారా..?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు సంబంధించిన అంశాలు ఒక్కటొక్కటిగానే వెలుగులోకి వస్తూ అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ పైనే గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీ… ఆ తర్వాత అధికార పార్టీగా ఉన్న వైసీపీకి దగ్గరైపోయారు. జగన్ ఆదేశాలు జారీ చేశారో… లేదంటే జగన్ వద్ద మార్కులు కొట్టేయడానికి వంశీనే చేశారో తెలియదు గానీ… గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఆయన …

Read More »

జగన్ తీరుపై అయ్యన్న ఫైర్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగం మధ్యలోనో వైసీపీ సభ్యులు బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, పోడియం దగ్గర వైసీపీ సభ్యులు చేసిన రచ్చపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జగన్ తీరును అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎండగట్టారు. వైసీపీ సభ్యుల తీరుపై అయ్యన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుంటే పోడియం దగ్గరకు వచ్చి …

Read More »

టీడీపీ లేదా వైసీపీ.. కొత్త నేతలకు ఏది బెటర్?

రాజకీయాల్లోకి రావాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఏదో రాజకీయ ప్రస్థానం ఉండి… రాజకీయాల్లో బాగా దెబ్బలు తిన్న కుటుంబాల వారు అయితే తప్పించి… రాజకీయాలు అంటే ఆసక్తి చూపని వారే ఉండరు. మరి ప్రస్తుతం రాజకీయాల్లోకి కొత్తగా అడుగు పెట్టాలనుకునే వారికి బెటర్ ఆప్షన్ ఏది అన్న దానిపైనా ఓ ఆసక్తికర చర్చకు అయితే తెర లేసింది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో రోజు సభ …

Read More »

వల్లభనేని వంశీకి ముప్పేట ఉచ్చు

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి ముప్పేట ఉచ్చు బిగుసుకుంది. విజ‌య‌వాడ స‌బ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని పోలీసులు త‌మ క‌స్ట‌డీకి తీసుకున్నారు. టీడీపీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త స‌త్వ‌ర్థ‌న్‌ను కిడ్నాప్ చేసి, బెదిరించిన కేసులో నేరుగా ఆయ‌న‌ను విచారించాల‌న్న పోలీసుల అభ్య‌ర్థ‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లో తీసుకున్న న్యాయ‌స్థానం.. మూడు రోజుల పాటు క‌స్ట‌డీకి అనుమ‌తించింది. దీంత వంశీతో పాటు A7 శ్రీపతి, A8 శివరామకృష్ణ ప్రసాద్ …

Read More »

‘ఫస్ట్’తోనే గట్టెక్కాలి.. ‘సెకండ్’ మాటే వద్దు

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడేసి స్థానాలకు జరగనున్న ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న పార్టీలన్నీ తమ అభ్యర్థుల విజయం కోసం పక్కా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. తెలంగాణలో రెండు టీచర్, ఓ గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరగనుండగా… ఏపీలో రెండ గ్రాడ్యుయేట్, ఓ టీచర్ స్థానానిక …

Read More »

జ‌గ‌న్ తెలుసుకోవాలి: ప్ర‌తిప‌క్ష హోదానే ప్రామాణిక‌మా ..!

ప్ర‌తిప‌క్ష హోదానే ప్రామాణిక‌మా? ఇదీ.. కొన్నాళ్లుగా రాష్ట్రంలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. తాజాగా మ‌రోసారి ర‌చ్చ‌కెక్కింది. ప్ర‌తిప‌క్ష హోదా కోరుతూ.. అసెంబ్లీలో వైసీపీ స‌భ్యులు చేసిన ఆందోళ‌న‌, నిర‌స‌న వంటివి పెద్ద ఎత్తున మీడియాలో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ప్ర‌ధానంగా అసెంబ్లీ తొలి రోజే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగిస్తున్న స‌మయంలోనే ఆందోళ‌న‌కు దిగారు. అంతేకాదు.. స‌భ నుంచి వాకౌట్ చేశారు. ఈ ప‌రిణామాలు ప‌దేళ్లకు పైగా రాజ‌కీయ చ‌రిత్ర‌ను పొగేసుకున్న జ‌గ‌న్‌కు ఎలా ఉన్నా.. …

Read More »

బాబు రెండు దెబ్బలతో అంతా సెట్

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో పార్టీ నేతలను వదిలిపెట్టేది లేదు… అలాగని ఐఏఎస్ లు, ఐపీఎస్ లు అయితే ఉపేక్షించేది అంతకంటే కూడా లేదని చాలా సందర్భాల్లో చంద్రబాబు చేసి మరీ చూపించారు. తాజాగా చంద్రబాబు అలాంటి కఠిన నిర్ణయాన్నే అనుసరించారు. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ వ్యవహారాలను రచ్చకీడ్చిన ఇద్దరు ప్రముఖులపై ఒకే తరహా …

Read More »

జగన్ తో రోజా భేటీ… ‘గాలి’కి గ్రీన్ సిగ్నలా? బ్రేకులా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా సోమవారం భేటీ అయ్యారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన జగన్ ఆ తర్వాత తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సలీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కని సభకు ఇంకేం హాజరవుతాం… ఇకపై ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుందాం అంటూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. …

Read More »

పవన్ పై అంబటి రాంబాబు సెటైర్లు!

ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలని నినాదాలు చేస్తూ నేటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన వైసీపీ నేతలు తమకు ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ఓట్ల శాతం …

Read More »

బీఆర్ఎస్ కు డబుల్ లాస్.. బిందాస్ గా వైసీపీ

తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియనే లేదు… అప్పుడే రెండు రాష్ట్రాల్లో మరో ఎన్నికకు తెర లేసింది. అవి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలే కావడం గమనార్హం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడేసి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం రేపటితో ముగియనుంది. ఈ నెల 27న ఈ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ జరగనుంది. తెలంగాణలో ఓ గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీలకు ఎన్నికలు …

Read More »

మోడీ తెలంగాణ‌కు ఇచ్చింది రెండు ఉద్యోగాలే: రేవంత్

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై సీఎంరేవంత్ రెడ్డి ఫైర‌య్యారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న మంచిర్యాల‌లో నిర్వ‌హించిన ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. నిజానికి ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి బ‌ల‌మైన పోటీ ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీకి కేంద్రంగా చేసుకుని రేవంత్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. రాష్ట్రం ఏర్పడ్డాక‌.. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రలోని బీజేపీ ప్ర‌భుత్వం ఎన్ని ఉద్యోగాలు …

Read More »

‘ఫైబర్ నెట్’ జీవీ రెడ్డి జంట రాజీనామాలు!

అధికార కూటమిలోని కీలక భాగస్వామి టీడీపీకి ఇది ఊహించని పరిణామమేనని చెప్పాలి. ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జీవీ రెడ్డి సోమవారం తన పదవులకు రాజీనామా చేశారు. ఫైబర్ నెట్ చైర్మన్ పదవితో పాటుగా టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ఫైబర్ నెట్ లో వరుసగా చోటుచేసుకున్న పరిణామాలే జీవీ రెడ్డి రాజీనామాకు దారి తీసినట్లుగా సమాచారం. …

Read More »