Political News

బీజేపీ లో చేరికపై స్పందించిన కేశినేని నాని!

విజ‌య‌వాడ మాజీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు కేశినేని నాని.. తిరిగి వైసీపీ గూటికి చేరుతార‌ని.. గ‌త నాలుగు రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అదేస‌మ‌యంలో కాదు, మా పార్టీలోకి వ‌స్తున్నారంటూ.. బీజేపీ నాయ‌కులు కూడా అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో చెబుతున్నారు. వైసీపీలోకి రావాల‌ని నాని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. వైసీపీ శిబిరం నుంచి లీకులు వ‌స్తున్నాయి. ఆయ‌న‌కు, జ‌గ‌న్‌కు మ‌ధ్య గ‌ట్టి అనుబంధం ఉంద‌ని.. ఈ క్ర‌మంలో తిరిగియాక్టివేట్ అవుతున్నార‌న్న‌ది వైసీపీ నేత‌ల మాట‌. …

Read More »

జైల్లో దస్తగిరి బ్యారక్ లోకి వెళ్లింది నిజమే!

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు సంబంధించి ఇప్పటివరకు చోటు చేసుకున్న పలు సంచలన పరిణామాలకు కొనసాగింపుగా మరో సంచలనం చోటు చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన రిపోర్టు ఒకటి సిద్ధమైందని.. త్వరలోనే అధికారికంగా బయటకు వస్తుందని చెబుతున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడైన దస్తగిరి అప్రూవర్ గా మారటం.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు …

Read More »

గెలుపే కాదు… మెజారిటీ కూడా ముఖ్యమే

ఏపీలో మరో 10 రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా… వాటిలో ఓ స్థానం టీచర్స్ కోటా ఎమ్మెల్సీ. దీని గురించి పార్టీలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన రెండు పట్టభద్రుల ఓట్లతో జరిగే ఎమ్మెల్సీ స్థానాలు. ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాలు …

Read More »

“అధికారులు AC గదుల నుండి బయటకి రావాలి” : రేవంత్

ఇటీవల కాలంలో ఏ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఐఏఎస్ అధికారుల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఒక మాజీ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణనాయుడు రచించిన ‘లైఫ్‌ ఆఫ్‌ ఎ కర్మయోగి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వేళ.. ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అధికారులు మంచీ చెడులపై సలహా చెప్పేలా ఉండాలని.. రాజకీయ నేతలు ఇస్తున్న ఆదేశాల్లో …

Read More »

పాలిటిక్స్ పై నాని యూటర్న్… బీజేపీలోకి మాజీ ఎంపీ??

ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చి…ఆ వాసన చూశాక దానికి దూరంగా జరగడం దాాదాపుగా దుర్లభమేనని చెప్పక తప్పదు. ఎందుకంటే… అన్ని రంగాలను శాసిస్తున్న రాజకీయ రంగం… అన్నింటికీ పెద్దన్నగా వ్యవహరిస్తోంది. ఏ పని కావాలన్నా… ఎవరితో కాకున్నా.. ఒక్క రాజకీయ నేత తలచుకుంటే… ఆ పని నిమిషాల్లో పూర్తి అయిపోతుంది. పార్టీ ఏదన్నది ముఖ్యం కాదు. నేతకు లౌక్యం ఉంటే చాలు ఇట్టే పనులన్నీ అయిపోతాయి. కోరినవన్నీ సమకూరిపోతాయి. డబ్బే దస్కం …

Read More »

వంశీపై సానుభూతి ఏమైంది ?

“గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వర్గం న‌న్ను కాద‌నే వారు ఉన్నారా? నా పేరు చెబితే.. గ్రామాల‌కు గ్రామాలే త‌ర‌లి వ‌స్తాయి. ఏమ‌నుకుంటున్నాడు వాడు(ప్ర‌త్య‌ర్థి నేత‌). ఒక్క‌సారి గ‌న్న‌వ‌రం గ్రౌండ్‌లోకి దిగితే.. తెలుస్తుంది. నోటికి వ‌చ్చింది మాట్లాడ‌డం కాదు. గ‌న్న‌వ‌రంలో ఏ పిల్లిన‌డిడినా.. ఏ పిట్ట‌న‌డిగినా.. వంశీ గురించి చెబుతారు. నాకు ఏమైనా జ‌రిగితే.. గ‌న్న‌వ‌రం గ‌న్న‌వ‌రం మొత్తం నిల‌బ‌డుతుంది“- ఖ‌చ్చితంగా రెండేళ్ల కింద‌ట అప్ప‌టిఎమ్మెల్యేగా వ‌ల్ల‌భ‌నేని వంశీ మీడియా ముందు చేసిన వ్యాఖ్య‌లు …

Read More »

ఏపీలో ఉచితాలతో పాటు అభివృద్ధికీ ప్రాధాన్యం!

ప్ర‌జ‌ల‌కు ఉచితాలు ఇవ్వ‌డం బెట‌రే. కానీ.. ప్ర‌స్తుతం ఈ ఉచితాల కార‌ణంగానే రాష్ట్రం అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. జ‌గ‌న్ హ‌యాంలో ఉచితాలు.. బ‌ట‌న్ నొక్కుళ్ల కార‌ణంగానే.. 4 ల‌క్ష‌ల కోట్ల రూపా య‌ల వ‌ర‌కు అద‌నంగా అప్పులు చేయాల్సి వ‌చ్చింది. ఇది ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త‌ను పెంచింది. ఉచిత ప‌థ‌కాలు పొందిన వారు కూడా.. త‌మ కుటుంబంలో ఉద్యోగాలు వ‌స్తే బాగుండ‌న‌ని.. అమ‌రావ‌తి రాజ‌ధాని ఏర్పాటు చేస్తే.. బాగుంటుంద‌ని …

Read More »

ఉత్తరాంధ్రలో వైసీపీ : క‌న్న‌బాబుకు కలిసిరానుందా?

ఉత్త‌రాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్ గా నియ‌మితులు అయిన మాజీ మంత్రి, కాకినాడ రూర‌ల్ మాజీ ఎమ్మె ల్యే కుర‌సాల క‌న్న‌బాబుకు.. ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో నెగ్గుకు రావ‌డం అంత ఈజీకాద‌న్న వాద‌న పార్టీలో నే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఉత్త‌రాంధ్ర‌లో ఉన్న‌వి మూడు జిల్లాలే అయినా.. ముప్పై ర‌కాల రాజ‌కీయాలు ఇక్క‌డ సాగుతుంటాయి. నాకు నేనే రాజు-నేనే మంత్రి అన్న‌ట్టుగా వైసీపీనాయ‌కులు ఇక్క‌డ వ్య‌వ‌హ‌రిస్తుంటార‌నేది గ‌తంలో ఇక్క‌డ ఇంచార్జ్‌గా ప‌నిచేసిన సాయిరెడ్డి …

Read More »

తిరుపతి వేదికగా ఒకే స్టేజీపై ముగ్గురు సీఎంలు?

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతి వేదికగా రేపు ఓ అరుదైన సన్నివేశం ఆవిష్కృతం కానుంది. ఒకే వేదికను ముగ్గురు సీఎంలు పంచుకోనున్నారు. ఇందుకు తిరుపతి వేదికగా రేపు ప్రారంభం కానున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ వేదికకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో పాటుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి …

Read More »

సినీప్రముఖులకు శ్రీకాళహస్తి బ్రహోత్సవాల ఆహ్వానం

టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ కు శ్రీకాళహస్తిలోని శ్రీ మక్కంటి ఆలయ బ్రహ్మోత్సవాల ఆహ్వానం అందింది. ముక్కంటి ఆలయంలో ఏటా మహా శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి జరుగుతున్న బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ యువ నేత బొజ్జల సుధీర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన కాళహస్తి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను …

Read More »

ఏపీలో తొలి ‘గులియన్’ డెత్… వర్రీ అక్కర్లేదన్న వైద్యులు

ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) పేరిట ఓ కొత్త వ్యాధి అంతకంతకూ ప్రబలుతోంది. ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండగా… వారంతా గుంటూరులోని జీజీహెచ్ కు వస్తున్నారు. ఈ వ్యాధికి చికిత్స రాష్ట్రంలోని ఒక్క గుంటూరు జీజీహెచ్ లోనే అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఈ వ్యాధిగ్రస్తుంతా గుంటూరుకే తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల ఈ వ్యాధి బారిన పడిన ప్రకాశం జిల్లా కొమరవోలు మండలం …

Read More »

వెంకయ్య… ఇంకా యమా యాక్టివ్ గా ఉన్నారు!

ముప్పవరపు వెంకయ్యనాయుడు భారత రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేెక గుర్తింపును సంపాదించుకున్న తెలుగు నేత. బీజేపీతో రాజకీయం మొదలుపెట్టి… బీజేపీతోనే రాజకీయాలకు స్వస్తి పలికిన మన నెల్లూరు జిల్లా నేత. దేశ ద్వితీయ పౌరుడిగా ఉపరాష్ట్రపతిగా ఆయన దేశానికి సేవలు అందించారు. ఎప్పుడో 1949లో జన్మించిన వెంకయ్య.. ఈ జూలై వస్తే 75 ఏళ్ల వయసును పూర్తి చేసుకుంటారు. అయితేనేం… ఆయన ఇప్పటికీ యమా యాక్టివ్ గా ఉన్నారు. ఉపరాష్ట్రపతి …

Read More »