Political News

చంద్ర‌బాబు.. మ‌రో పాతికేళ్ల త‌ర్వాత‌..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 75వ పుట్టిన రోజు ఈ రోజు. అయితే.. భ‌విష్య‌త్తును స్వ‌ప్నించే చంద్ర‌బాబు.. మ‌రో పాతికేళ్ల త‌ర్వాత‌.. ఎలా ఉంటారు? అంటే.. ఊహించ‌లేం కానీ.. ఆయ‌న వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. చేస్తున్న ప‌నులు మాత్రంమ‌రో పాతికేళ్ల త‌ర్వాత ఏపీని స‌మూలంగా మార్చివేస్తాయ‌ని అంటున్నారు మేధావులు. చంద్ర‌బాబు పేరు ఇప్పుడు కాదు.. అప్పుడు మార్మోగుతుంద‌ని చెబుతున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి న‌గ‌రాన్ని ప్రపంచానికే త‌ల‌మానికంగా తీర్చిదిద్దడంలో ఆయ‌న చేస్తున్న …

Read More »

కేశినేని యూట‌ర్న్‌.. పొలిటికల్ టాపిక్‌!

విజ‌య‌వాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజ‌కీయంగా యూట‌ర్న్ తీసుకున్నారా? ఆయ‌న వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారా? మ‌ళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఇటీవ‌ల కాలంలో రాష్ట్రంలో పాల‌న బాగానే ఉందంటూ.. ఆయ‌న ఫేస్‌బుక్ వేదిక‌గా మెసేజ్ పెట్టారు. ఆ స‌మ యంలో వైసీపీ రాష్ట్రంలో పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించింది. ఖ‌చ్చితంగా అదేస‌మ‌యంలో నాని త‌న ఫేస్‌బుక్‌లో ఈ మెసేజ్ పెట్టారు. ఇక‌, పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల …

Read More »

హైడ్రాకు వ్యతిరేకంగా కోబ్రా..!

తెలంగాణలో ప్రత్యేకించి భాగ్యనగరి హైదరాబాద్ లో హైడ్రా పేరు వింటేనే జనం హడలెత్తిపోతున్నారు. హైదరాబాద్ లోని నాలాలు, చెరువుల పరిరక్షణ కోసం అంటూ ఎనముల రేవంత్ రెడ్డి నేతత్వంలోని కాంగ్రెస్ సర్కారు తీసుకువచ్చిన ఈ కొత్త వ్యవస్థ ఇప్పటికే చాలా ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేసింది. అదే సమయంలో పలువురు పేదలతో పాటు కొందరు పెద్దల నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చేసింది. హైడ్రాపై కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. …

Read More »

ఏపీలో ఈ ఎమ్మెల్యేల గ‌ప్‌చుప్‌….!

రాష్ట్రంలోని 164 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ పై వారు ప్ర‌స్తావించాల్సి ఉంది. కానీ, సుమారు 90 నుంచి 100 నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు ఎక్కడా క‌నిపించడం లేదు. క‌నీసం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను కూడా వారు ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా.. సొంత ప‌నులు చేసుకుంటున్నార‌న్న‌ది కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట‌. ఈ విష‌యం.. తాజాగా ప్ర‌జా ఫిర్యాదుల వ‌ర‌కు చేరింది. దీనిని సీఎం చంద్ర‌బాబు పేషీ అధికారుల‌కు …

Read More »

అందుకే.. జ‌గ‌న్‌తో చెడింది: ర‌ఘురామ‌ రివీల్‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. అధికారంలో ఉన్న‌ప్పుడు.. ఆయ‌న‌ను తీవ్రంగా విమ‌ర్శించిన వారిలో ముందున్నారు అప్ప‌టి వైసీపీ ఎంపీ, ప్ర‌స్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు..ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్‌. నిరంతరం.. జ‌గ‌న్ విధానాల‌పై ఆయ‌న ర‌చ్చ‌బండ పేరుతో కార్య‌క్ర‌మం నిర్వ‌హించి.. ఢిల్లీ నుంచి విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. కొన్నికొన్ని సంద‌ర్భాల్లో జ‌గ‌న్‌ను కూడా అనుక‌రించి గేలి చేసేవారు. జ‌గ‌న్ పాల‌న‌పై పంచ్‌లు విసిరేవారు. అయితే.. సొంత పార్టీ ఎంపీ అయి ఉండి.. …

Read More »

సాయిరెడ్డిని 3, మిథున్ రెడ్డిని 8 గంట‌లు

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ కుంభ‌కోణంపై కూట‌మి ప్ర‌భుత్వం విచార‌ణ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం.. వ‌రుస పెట్టివైసీపీ కీల‌క నాయ‌కుల‌ను పిలిచివిచారిస్తోంది. దీనిలో భాగంగా విజ‌య‌సాయిరెడ్డిని విచారించిన మ‌ర్నాడే.. వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని కూడా పిలిచి విజ‌య‌వాడ‌లో విచారించింది. అయితే.. ఈ విచార‌ణ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ను త‌ల‌పించింది. అంతా స‌స్పెన్స్‌.. పైగా 8 గంట‌ల సుదీర్ఘ విచార‌ణ‌.(సాయిరెడ్డిని మూడు గంట‌లే విచారించారు). …

Read More »

బాబు బర్త్ డే గిఫ్ట్ అదిరిందిగా

ఏపీలో నిరుద్యోగులు… ప్రత్యేకించి ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు నెలల తరబడి చూస్తున్న ఎదురు చూపులకు ఎట్టకేలకు తెర పడింది. ఏపీకి రెండో సారి సీఎం కాగానే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ ప్రకటనకు సంబంధించిన సంతకమే చేశారు. తాజాగా సరిగ్గా చంద్రబాబు బర్త్ డే నాడు ఈ ప్రకటన విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ …

Read More »

అప్పుడు నువ్వు చెసిందేటి జగన్?

అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక విధంగా.. అధికారం లేన‌ప్పుడు మ‌రో విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు కామ‌న్ అయిపోయిందా? ఆయ‌న వ్య‌వ‌హార శైలి.. తాను చేసిన త‌ప్పులు మ‌రిచి..త‌న హ‌యాంలో జ‌రిగిన దుర్రాజ‌కీయం మ‌రిచి.. నేడు నీతులు చెబుతున్నారు. తాజాగా గ్రేట‌ర్ విశాఖ‌ప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌లో కూట‌మి జెండా ఎగ‌రడాన్ని ఆయ‌న త‌ప్పు బ‌ట్టారు. సీఎం చంద్ర‌బాబుకు ఓ సుదీర్ఘ లేఖ‌ను సంధించారు. అదికూడా త‌న సోష‌ల్ మీడియాలోనే కావ‌డం …

Read More »

హైడ్రాపై వసంత ఫైర్.. రేవంత్ న్యాయం చేస్తారని వ్యాఖ్య

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు శనివారం మరోమారు పెను కలకలం రేపాయి. హఫీజ్ పేట్ పరిదిలోని 17ఎకరాల్లో అక్రమ నిర్మాణాలున్నాయని భావించిన హైడ్రా…వాటిని కూల్చివేసింది. ఈ కూల్చిన నిర్మాణాల్లో ఏపీకి చెందిన కీలక రాజకీయ నేత, టీడీపీ యువ నేత, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కార్యాలయం కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కూల్చివేతలపై తాజాగా వసంత స్పందించారు. హైడ్రా తీరుపై ఆగ్రహం …

Read More »

సాయిరెడ్డి బాగోతం బ‌య‌ట పెడ‌తా: రాజ్ కసిరెడ్డి

ఏపీలో వెలుగు చూసిన మ‌ద్యం కుంభ‌కోణం వ్య‌వ‌హారంపై కూట‌మి ప్ర‌భుత్వం విచార‌ణ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ సాగిస్తోంది. ఈ కుంభ‌కోణంలో వేల కోట్ల రూపాయ‌లు దోచుకున్నార‌ని వైసీపీ నాయ కుల‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే కీల‌క నాయ‌కుల‌కు సిట్ నోటీసులు ఇచ్చి విచార‌ణ‌కు పిలుస్తోంది. ఇదిలావుంటే.. ఈ వ్య‌వ‌హారంలో క‌ర్త‌-క‌ర్మ‌-క్రియ అన్నీ క‌సిరెడ్డి రాజ‌శేఖ‌రేన‌ని(రాజ్ క‌సిరెడ్డి) మ‌రో కీల‌క నాయ‌కుడు …

Read More »

సాయిరెడ్డి అప్రూవ‌ర్‌గా మారే ఛాన్స్‌ ఉందా ..!

వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు విజ‌యసాయిరెడ్డి అప్రూవ‌ర్‌గా మారే అవ‌కాశం ఉందా? ఇదే జ‌రిగితే.. ఆయ‌న కీల‌క నేత‌ల పేర్ల‌ను బ‌య‌ట‌కు చెప్పే అవ‌కాశం క‌నిపిస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. సాయిరెడ్డిని జ‌గ‌న్ మీడియా నిరంత‌రం.. ఏకేస్తోంది. రాజ‌కీయాలకు దూరంగా ఉంటాన‌ని చెప్పిన సాయిరెడ్డి ఇప్పుడు కూట‌మి పంచ‌న చేరుతున్నార‌ని.. ఆయ‌న త్వ‌ర‌లోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటార‌ని కూడా వ్యాఖ్యానిస్తోంది. దీనిలో వాస్త‌వం ఎంత ఉందో …

Read More »

పంతాల‌కు పోయి.. పాడు చేసుకున్నారా.. వైసీపీ సీరియ‌స్..!

గ్రేట‌ర్ విశాఖ‌ప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్ గొల‌గాని వెంక‌ట కుమారిపై అవిశ్వాసం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో కార్పొరేష‌న్‌ను కాపాడుకోవాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కుల‌కు బాధ్యతలు అప్ప‌గించారు. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్‌, మాజీ మంత్రి కురసాల క‌న్న‌బాబుకు ఈ బాధ్యతను అప్పగించారు. ఇదే సమయంలో మిగిలిన నాయ‌కుల‌కు కూడా స‌హ‌క‌రించాల‌ని సూచించారు. వీరిలో మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారు. …

Read More »