Political News

బాబుతో సోమనాథ్, సతీశ్ రెడ్డి భేటీ… విషయమేంటి?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం బిజీబిజీగా గడిపారు. ఓ వైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, మరోవైపు తనను కలిసేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు రావడంతో బాబు షెడ్యూల్ బిజీగా సాగింది. ఇందులో భాగంగా బాబుతో డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీశ్ రెడ్డి, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ లతో పాటు పలువురు రక్షణ, అంతరిక్ష రంగాలకు చెందిన ఓత్సాహిక పారిశ్రామికవేత్తలు పలువురు భేటీ అయ్యారు. …

Read More »

జయకేతనం ముహూర్తం అదిరిపోయిందిగా!

జయకేతనం పేరిట జనసేన ఆవిర్బావ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరగనున్నాయి. జనసేనాని. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం శివారు ప్రాంతం చిత్రాడలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు భారీగా జరిగాయి. 10 లక్షల మందికిపైగా హాజరయ్యే ఈ సభ కోసం అంతకుమించిన ఏర్పాట్లు జరిగాయని తెలుస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటిదాకా మరే పార్టీ నిర్వహించనంత రీతిలో జనసేన ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలన్న ఆ పార్టీ …

Read More »

మంత్రిగా నాగబాబు.. మరి రాములమ్మ?

తెలుగు నేలలో సినిమా రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖులు ఒకేసారి చట్టసభలకు ఎంపికయ్యారు. ఏపీ శాసన మండలి సభ్యుడిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్ర బాబు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన ఏపీ కేబినెట్ లో మంత్రిగానూ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు తెలంగాణ శాసన మండలి సభ్యురాలిగా విజయశాంతి కూడా ఎన్నికయ్యారు. మరి ఆమెకు తెలంగాణ కేబినెట్ లోకి ఎంట్రీ లభిస్తుందా? లేదా? అన్న …

Read More »

పడి లేచిన కెరటం .. ఎక్కడ నెగ్గాలో..ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు: పవన్ కళ్యాణ్

2019 లో స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ఓడినప్పటికి, ఎంతో అభిమానగణం ఉన్నా, అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చే యంత్రాంగం మరియు ఆర్ధికబలం లేక 7 % ఓట్లతో ఒక్క ఎమ్మెల్యే సీటుతో సరిపుచ్చినా, జనాన్ని వీడని జనసేనాని. ఎంతో వయప్రయాసలుకోర్చి ఆసాథ్యం  అనుకున్న పొత్తుని సుసాధ్యం చేసిన వీరమల్లు పవన్ కళ్యాణ్. జనసేన, టీడీపీ మరియు బీజేపీ పొత్తు కోసం తన పార్టీకి రావలిసిన సీట్లను త్యాగం …

Read More »

లులూ తిరిగొచ్చింది!… కొత్తగా దాల్మియా వచ్చింది!

కూటమి పాలనలో ఏపీ పారిశ్రామికంగా పరుగులు పెడుతోంది. కూటమి పాలన మొదలైన తొలి 9 నెలల్లోనే దాదాపుగా రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరగా… వాటి ద్వారా దాదాపుగా రాష్ట్ర యువతకు 4 లక్షల మేర ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. తాజాగా గురువారం జరిగిన నాలుగో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం మరిన్ని పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త పెట్టుబడుల్లో ఏపీ నుంచి వైసీపీ దెబ్డకు పారిపోయిన లులూ …

Read More »

గ్రీష్మ‌ రాక తో వైసీపీ మ‌రింత డీలా

వైసీపీ మ‌రింత డీలా ప‌డ‌నుందా? ఆ పార్టీ వాయిస్ మ‌రింత త‌గ్గ‌నుందా? అంటే.. ఔన‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. ప్ర‌స్తుతం అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నా.. వైసీపీ నాయ‌కులు ఒక్క‌రు కూడా స‌భ కు వెళ్ల‌డం లేదు. దీంతో ఆశ‌ల‌న్నీ మండ‌లిపైనే ఉన్నాయి. మండ‌లిలో కొంత మేర‌కు బ‌లం ఉండడం.. అక్కడ ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఉండ‌డంతో మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, వ‌ర‌దు క‌ల్యాణి వంటి వారు బ‌లంగా వాణిని …

Read More »

లోకేశ్ ‘మంత్రం’ మాయ చేస్తోంది!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర యువత భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దే దిశగా దూకుడుగా సాగుతున్నారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత లోకేశ్ అగ్రరాజ్యం అమెరికాలో ఓ 10 రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా వరల్డ్ టాప్ కంపెనీల కార్యాలయాలను చుట్టేసిన లోకేశ్… ఎక్కడికెళ్లినా.. ఆయా కంపెనీలు, వాటి యాజమాన్యాలకు ఒకే మాట చెప్పారు. అదేంటంటే… ఏపీలో మానవ …

Read More »

బీజేపీలో పాత సామాన్లు: రాజా సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఘోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే, వివాదాల‌కు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వాస్త‌వానికి ఆయ‌న ఎప్పుడు ఏ వ్యాఖ్య‌లు చేసినా వివాదాల‌తోనే ముడిప‌డి ఉంటాయి. ముఖ్యంగా ఓ సామాజిక వ‌ర్గాన్ని, మ‌తాన్ని టార్గెట్ చేసుకుని ఆయ‌న వ్యాఖ్య‌లు సంధిస్తారు. అయితే.. ఈ సారి మాత్రం సొంత పార్టీపైనే నిప్పులు చెరిగారు. బీజేపీలో పాత సామాన్లు అంటూ.. సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు. బీజేపీలో …

Read More »

బాబుతో నాగం భేటీ… ఎన్నెన్ని తీపి గురుతులో?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి కలిశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్న నాగం రాజకీయంగా అయితే పెద్దగా యాక్టివ్ గా లేరనే చెప్పాలి. అయితే చంద్రబాబుతో కలిసి తెలుగు నేలలో నాగం చేసిన రాజకీయాలు ఇప్పటికీ గుర్తున్నాయి. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో నాగం కూడా చంద్రబాబు …

Read More »

రెండో రోజే రచ్చ… బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై వేటు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో రోజే రచ్చ చోటుచేసుకుంది. ఓ చిన్న వివాదం చిలికి చికిలి గాలి వానలా మారి..ప్రదాన ప్రతిపక్షానికి చెందిన సభ్యుడిపై బహిష్కరణ వేటు వేసే దాకా పరిస్థితి వెళ్లింది. ఆపై స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్షం అసెంబ్లీకి సమీపంలో.. సచివాలయం పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… బలవంతంగా బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని …

Read More »

లోగుట్లు బ‌య‌ట‌కు.. జ‌గ‌న్‌కు ఇర‌కాటం ..!

లోగుట్టు పెరుమాళ్ల కెరుక‌.. అనేది ఓల్డు సామెత‌. కానీ, ఇప్పుడు రాజ‌కీయాల్లో లోగుట్లు.. అన్ని పార్టీల్లోనూ కీల‌క నాయ‌కులకు తెలిసే జ‌రుగుతున్నాయి. అవి రాజ‌కీయ వ్యూహాలైనా.. ఆస్తులకు సంబంధించిన వ్య‌వ‌హారాలైనప్ప‌టికీ.. పార్టీ అధినేతల వ్య‌వ‌హారాలు కీల‌కనేత‌లకు తెలిసే జ‌రుగుతున్నాయి. దీంతో నాయ‌కుల‌పై పార్టీ అధినేత‌లు, అధిష్టానాలు కూడా ఓ క‌న్నేసి ఉంటున్నాయి. ఏ చిన్న తేడా వ‌చ్చినా.. స‌ద‌రు నాయ‌కులు యాంటీ అయితే.. ఇబ్బందేన‌ని గ్ర‌హిస్తున్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు ప్ర‌తిప‌క్ష …

Read More »

లాంఛనం పూర్తి… 10 మంది ఏకగ్రీవం

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఐదేసి స్థానాల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదికార కూటములకు ఏకంగా 9 స్థానాలు దక్కగా…విపక్షానికి సింగిల్ సీటు మాత్రమే దక్కడం గమనార్హం. అటు తెలంగాణతో పాటుగా ఇటు ఏపీలోనూ ఐదేసి స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా… వాటికోసం ఐదేసి నామినేషన్లు మాత్రమే వచ్చాయి. దాఖలైన నామినేషన్లన్నీ సరిగానే ఉండటంతో వాటిని అనుమతించిన అధికారులు… ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఐదేసి …

Read More »