Political News

కేసీఆర్ బయటకొచ్చారు!.. అసెంబ్లీలో సమరమే!

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు వాడీవేడీగా సాగేలా కనిపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం అసెంబ్లీలో ప్రదాన ప్రతిపక్ష నేతగా ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) సభకు హాజరే కాలేదు. ఫలితంగా అధికార పక్షం కాంగ్రెస్ ను నిలువరించే సరైన నేత లేరనే …

Read More »

జగన్ వి చిన్నపిల్లాడి చేష్టలు

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. జగన్ ను ఓ విధ్వంసకారుడిగా అభివర్ణించిన నారాయణ.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ లాంటి వారిని జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రం సర్వనాశనం అయిన విషయం వాస్తవం కాదా? అంటూ …

Read More »

ఏ ఎమ్మెల్యే ఎటు వైపు? దాసోజు గెలిచేనా?

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక‌ల పోలింగ్ ఈ నెల 20న జ‌ర‌గ‌నుంది. అయితే.. ఈ ఎన్నిక‌లు ఏపీలో మాదిరిగా ఏకగ్రీవం అయ్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. మొత్తం ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల‌కు ఏకంగా 11 మంది అభ్య‌ర్థులు నామినేష‌న్ వేశారు. వీటిలో కాంగ్రెస్+సీపీఐ నుంచి న‌లుగురు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఒక్క‌రు ఉండ‌గా.. మిగిలిన వారు ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగారు. దీంతో ఈ ఎన్నిక‌ల్లో ఓటు …

Read More »

చంద్రబాబుతో విభేదాలపై సోము ఓపెన్ అప్

Somu Veerraju

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో రాజకీయ బంధాలపై బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ తరఫున సోమవారం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మనసు విప్పి మరీ మాట్లాడారు. చంద్రబాబుకు తాను వ్యతిరేకిని అన్నది కేవలం అపోహ మాత్రమేనని ఆయన ఆసక్తికర వ్యాఖ్య చేశారు. చంద్రబాబు నాయకత్వంలోనే తాను గతంలో పనిచేసిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా …

Read More »

దువ్వాడ అరెస్టుకు రంగం రెడీ.. ఏ క్ష‌ణంలో అయినా.. !

వైసీపీ కీల‌క నాయ‌కుడు, బీసీ నేత‌, ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస‌రావు అరెస్టుపై రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న‌నే ఏక్ష‌ణంలో అయినా అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌భుత్వం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డమే త‌రువాయి అన్న‌ట్టుగా పోలీసులు కూడా వేచి చూస్తున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో దువ్వాడ‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఉమ్మ‌డి ప‌శ్చిమ‌ గోదావ‌రి, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో దువ్వాడ‌పై జ‌నసేన …

Read More »

వంగ‌వీటి రాధా రాజ‌కీయ స‌న్యాసం?

విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. అనూహ్య‌మైన పొలిటిక‌ల్ బాంబు పేలింది. దీనికి కార‌ణం.. వంగ‌వీటి రాధా.. రాజ‌కీయ స‌న్యాసం చేయ‌నుండ‌డ‌మే. విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో ఇక‌, రాధా పేరు వినిపిం చే అవ‌కాశం లేక‌పోవ‌డ‌మే. ఈ విష‌యంపై అంత్యంత స‌న్నిహిత వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం ప్ర‌కారం.. ఔన‌నే అంటున్నారు రాధా అనుచ‌రులు. దీంతో విజ‌య‌వాడలో ఇక‌, రంగా పేరు మాత్ర‌మే వినిపించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఆత్మాభిమానమే ప్ల‌స్సు-మైన‌స్సు! …

Read More »

ఇక య‌న‌మ‌ల కధ ముగిసినట్టే!

టీడీపీలో త‌రంతో పాటు స్వ‌ర‌మూ మారుతోంది. నేటి త‌రానికి అనుకూలంగా రాజ‌కీయాలు మారుతున్న నేప‌థ్యంలో ఆదిశ‌గానే.. సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో క‌ష్ట‌మే అయినా.. కొంద‌రు సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టాల్సి వ‌స్తోంది. ఇలాంటివారిలో తాజాగా తెర‌మీదికి వ‌చ్చిన పేరు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు. ఈయ‌న రాజ‌కీయాలు ప్రారంభించింది టీడీపీతోనే. అన్న‌గారి పిలుపుతో రాజ‌కీయ అరంగేట్రం చేసిన రామ‌కృష్ణుడు.. త‌ర్వాత కాలంలో స్పీక‌ర్‌గా, మంత్రిగా కూడా ప‌నిచేశారు. …

Read More »

రోజా, బైరెడ్డిలకు కష్టాలు… ఏం జరుగుతోంది?

ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు చెందిన యువ నేత, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలకు గుర్తింపు ఉంది. వైరి వర్గాలను టార్గెట్ చేయడంలో వీరిద్దరిదీ అందె వేసిన చేయి అని చెప్పక తప్పదు. అయితే వీరిద్దరికీ జాయింట్ గానే కష్టాలు మొదలైపోయాయని చెప్పాలి. ఎందుకంటే… వైసీపీ అధికారంలో ఉండగా… రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు …

Read More »

సాయిరెడ్డి వంతు వచ్చేసింది!

వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన నిర్వాకాలపై కూటమి పాలనలో వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ కేసుల్లో కొందరు అరెస్టు అవుతూ వస్తున్నారు. మరికొందరు కోర్టులను ఆశ్రయించి ముందస్తు బెయిళ్లు తీసుకుంటూ ప్రస్తుతానికి అరెస్టుల నుంచి ఉపశమనం పొందుతున్నారు. రోజులు గడిచే కొద్దీ ఈ జాబితా పెరిగిపోతూనే ఉంది. ఇప్పుడు ఈ జాబితాలోకి మాజీ …

Read More »

అమ‌రావ‌తి పై అనుమానాలొద్దు.. ఇక పరుగులే

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ప్ర‌తిప‌క్షం వైసీపీ నాయ‌కులు సృష్టిస్తున్న విషప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు నమ్మ‌రాద‌ని ఏపీ మంత్రులు కోరారు. రాజ‌ధాని కోసం వేల కోట్ల రూపాయ‌ల‌ను అప్పుగా తీసుకువ‌చ్చి పెడుతున్నార‌ని, ఈ అప్పులు ఎలా తీరుస్తార‌ని, తిరిగి ప్ర‌జ‌ల‌పై భారాలు మోపుతార‌ని గ‌త నాలుగు రోజులుగా వైసీపీ అనుకూల మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని మంత్రులు నారాయ‌ణ‌, కేశవ్‌, కందుల దుర్గేష్ ఖండించారు. రాజ‌ధాని పై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు న‌మ్మ‌రాద‌ని …

Read More »

అసంత్రుప్తివున్నా జగన్ వైపు వెళ్ళట్లేదుగా

సాధార‌ణంగా ఒక రాజ‌కీయ పార్టీ విఫ‌ల‌మైతే.. ఆ పార్టీ న‌ష్ట‌పోవ‌డమే కాదు.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు కూడా బ‌లోపేతం అవుతాయి. ఇప్పుడు ఏపీలోనూ అదే జ‌రుగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో 11 స్థానాల‌కే ప‌రిమిత‌మై వైసీపీ రాజ‌కీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతేకాదు.. రాజ‌కీయ ప‌త‌నావ‌స్థ‌లో చాలా జోరుగా జారుకుంటోంది. దీంతో ఈ ప‌రిణామాలు.. కూట‌మి స‌ర్కారుకు మేలు చేస్తున్నాయి. వాస్త‌వానికి వైసీపీ బ‌లంగా ఉండి ఉంటే.. కూట‌మి ప‌రిస్థితి వేరేగా ఉండేదని …

Read More »

జగన్ దుబారాతోనూ బాబు సంపద సృష్టి

సంపద సృష్టి అనే పదం విన్నంతనే… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడే అందరికీ గుర్తుకు వస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఆర్థిక కార్యకలాపాలను పరుగులు పెట్టించడం, వాటి ద్వారా సర్కారీ ఖజానాకు ఆదాయాన్ని ఆర్జించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. వైసీపీ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… సీఎం అధికారిక నివాసం కోసమంటూ విశాఖలోని రిషికొండపై వందల కోట్ల రూపాయలు ఖర్చు …

Read More »