Political News

షర్మిల పోటీ పై జగన్ తో పొంగులేటి భేటీ

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు షర్మిల సూత్రప్రాయంగా అంగీకరించారని, అయితే అందుకోసం ఆమె కొన్ని షరతులు విధించారని ప్రచారం జరుగుతోంది. తనను కేవలం తెలంగాణ రాజకీయాలకు పరిమితం చేయాలని, ఏపీ రాజకీయాలపై తాను ఫోకస్ చేయలేనని కాంగ్రెస్ అధిష్టానానికి షర్మిల చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్, …

Read More »

ముందస్తు పై సజ్జల ఫుల్ క్లారిటీ

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని ముమ్మరంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జగన్ భేటీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించే విషయంపై చర్చించారని పుకార్లు వస్తున్నాయి. మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో ముందస్తు ఎన్నికల వ్యవహారం పై ఏపీ …

Read More »

2024 ఎన్నికల్లో వైసీపీదే విజయం:సుమన్

వైసీపీ అధినేత జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2019లో పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే గతంలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినంత మద్దతు జగన్ కు రాలేదని కొందరు వైసీపీ నేతలు పరోక్షంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా టికెట్లు రేట్ల పెంపు వ్యవహారంపై పెద్ద రచ్చ జరిగింది. ఆ తర్వాత చిరంజీవితో పాటు …

Read More »

కేసీఆర్ జీ.. ఆయియే.. మోడీ నుంచి ఆహ్వానం

ఎడ‌మొహం పెడ‌మొహంగా ఉండ‌డ‌మే కాకుండా. ఒక‌రిపై ఒక‌రు నిప్పులు చెరుగుకుంటున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌ర్సెస్ తెలంగాణ సీఎం కేసీఆర్ విష‌యంలో ఆస‌క్తిక ఘ‌ట‌న చోటు చేసుకుంది. “కేసీఆర్ జీ ఆప్ ఆయియే” అంటూ.. మోడీ కార్యాల‌యం నుంచి కేసీఆర్‌కు వ‌ర్త‌మానం అందించింది. ఈ నెల 8న ప్ర‌ధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్ర‌ధాని ప్రారంభించనున్నారు. అనంతరం వరంగల్‌లో …

Read More »

జగన్ వల్లే మార్గదర్శి స్కాం బయటపెట్టా:ఉండవల్లి

మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న తరుణంతో పాటు ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై సీనియర్ పొలిటిషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు తర్వాత పవన్ పై తాను పెద్దగా ఫోకస్ చేయలేదని, పవన్ తో మాట్లాడలేదని అన్నారు. పవన్ …

Read More »

తేల్చిన‌వాటికంటే.. తేల‌నివే ఎక్కువ‌.. టీడీపీ టాక్‌!!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం.. టీడీపీ ముందున్న ప్ర‌ధాన ల‌క్ష్యం. నిండు స‌భ‌లో చంద్ర‌బాబు చేసిన ప్ర‌తిజ్ఞ‌కు తోడు.. పార్టీని నిల‌బెట్టుకునేందుకు సైతం.. వ‌చ్చే ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా.. పార్టీని గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం.. అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రం రెండు ఈ పార్టీపై ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే నియోజ‌క‌వ‌ర్గాల‌పై చంద్ర‌బాబు పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు కూడా ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. రోజుకు మూడు నియోజ‌క‌వ‌ర్గాల చొప్పున మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో …

Read More »

కాంగ్రెస్ ను దెబ్బకొట్టడమే అసలు ప్లానా ?

తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిపై అనేకరకాల విశ్లేషణలు వినబడుతున్నాయి. ఈ విశ్లేషణలు పార్టీ నేతల చర్చల్లో కూడా దొర్లుతున్నాయి. ఇంతకీ అలాంటి విశ్లేషణల్లో ఒక ఇంట్రెస్టింగ్ విశ్లేషణ ఏమిటంటే కాంగ్రెస్ ను దెబ్బకొట్టాడినికే నరేంద్రమోడీ పెద్ద ప్లాన్ వేశారట. ఇందులో భాగంగానే అతివాదిగా పాపులరైన బండి సంజయ్ ను అర్ధాంతరంగా అధ్యక్షస్ధానం నుండి తప్పించారట. మితవాదిగా పేరున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేసినట్లు పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి. దీనికి కారణం …

Read More »

క‌రోనా కంటే జ‌గ‌నే డేంజ‌ర్‌.. దానికి చంద్ర‌బాబే వ్యాక్సిన్‌: లోకేష్

యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ చేశారు. కరోనా కంటే జగనోరా వైరస్ ప్రమాదకరమని, ఈ వైరస్ అన్ని వ్యవస్థల్ని నాశనం చేసిందని వ్యాఖ్యానించారు. ఈ వైర‌స్ నిర్మూల‌న‌కు చంద్ర‌బాబు వ్యాక్సిన్ స‌రైంద‌న ఔష‌ధ‌మ‌ని అన్నారు. అన్ని వ‌ర్గాల‌ వ్యాపారస్తులు కూడా జగనోరా వైరస్ బాధితులేనని, జగనోరా వైరస్కి వ్యాక్సిన్ చంద్రబాబేనని చెప్పారు. యువగళం పాదయాత్ర 147వ రోజు ఉమ్మ‌డి నెల్లూరులోని కోవూరు …

Read More »

ఇరుకున ప‌డుతున్న జ‌గ‌న్.. అదే జ‌రిగితే తీవ్ర న‌ష్టం?

ఏపీ సీఎం జ‌గ‌న్ ఇరుకున ప‌డుతున్నారా? కేంద్రంతో ఆయ‌న తెర‌చాటున చేతులు క‌లిపినా.. ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా ముప్పురాలేదు. వ‌చ్చినా.. స‌రిచేసేందుకు స‌ర్ది చెప్పేందుకు సాయిరెడ్డి వంటి కీల‌క నాయ‌కులు ముందున్నారు. పార్టీని, ప్ర‌భుత్వాన్ని కూడా త‌మ వ్యూహాల‌తో కాపాడుకున్నారు. అయితే.. ఇప్పుడు పోయిపోయి.. జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేస్తున్నార‌నే చ‌ర్చ సాగుతోంది. అదే.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఈ నెల‌లో పార్ల‌మెంటులో ప్ర‌వేశ పెట్ట‌నున్న …

Read More »

జ‌గ‌న్‌.. నువ్వు ఎంత న‌టించినా.. నీలో ఉన్న క్రూర‌త్వాన్ని దాచ‌లేవ్‌: బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. ఏపీ సీఎం జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “జ‌గ‌న్ నువ్వు ఎంత న‌టించినా.. నీలో ఉన్న క్రూర‌త్వాన్ని దాచ‌లేవ్‌” అంటూ వ్యాఖ్యానించారు. “నాలుగేళ్ల నరకం” అంటూ రాష్ట్రంలో వైసీపీ పాలనలో జరిగిన హత్యలపై చంద్రబాబు వీడియోలు విడుద‌ల చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా తాజాగా ఆయ‌న జ‌గ‌న్ పాల‌న‌పై మరో వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హత్యలను …

Read More »

జగన్ ముందస్తు.. మోదీ తథాస్తు

ఏపీ సీఎం జగన్ దిల్లీ పర్యటనపై ఎప్పటిలాగే అనేక ఊహాగానాలు వస్తున్నాయి.. అదే సమయంలో వైసీపీ నేతలు కూడా ఎప్పటిలాగే జగన్ రాష్ట్రం కోసమే వెళ్లారంటూ చాంతాడంత లిస్ట్ చెప్తున్నారు. బుధవారం ఉదయం దిల్లీ వెళ్లిన జగన్ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌లతో భేటీ అయ్యారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జగన్, మోదీల భేటీ జరగ్గా 25 నిమిషాల పాటు …

Read More »

గంటా కొడుకు పొలిటికల్ ఎంట్రీకి రెడీ?

టిడిపి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మంచి ట్రాక్ రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా ఒకసారి ఎంపీ, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత గంటాకు ఉంది. అంతేకాదు, నాలుగు సార్లు నాలుగు వేర్వేరు నియోజకవర్గాలలో పోటీ చేసి తన సత్తా చాటుకున్నారు గంటా. ప్రస్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న శ్రీనివాసరావు రాబోయే ఎన్నికలలో కూడా టిడిపి తరఫున భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని …

Read More »