వైసీపీ హయాంలో చోటుచేసుకున్న లిక్కర్ కుంభకోణం కేసులో మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డికి, అప్పటి సీఎం జగన్కు ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు తాజాగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో బెయిల్ కోసం పిటిషన్ వేసినప్పటికీ, విచారణ సాగుతున్న సమయంలో మైసూరులో పోలీసుల చేతికి చిక్కిన ప్రముఖ …
Read More »పార్టీ మార్పు: హరీష్రావు రియాక్షన్ ఇదే!
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. “నేను పార్టీ మారుతున్నట్టు కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. దీనిపై ఇంతకన్నా ఏమీ చెప్పలేను“ అని వ్యాఖ్యానించారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. అయితే..కొందరు అదే పనిగా బీఆర్ ఎస్పై విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. …
Read More »వంశీకి బెయిల్… జైలు నుండి రిలీజ్ కానున్నారా?
వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు ఇప్పుడప్పుకే జైలు జీవితం ముగియదని చెప్పక తప్పదు. ఎందుకంటే… వంశీ సింగిల్ కేసులోనే అరెస్టు అయినా… ఆ తర్వాత ఆయనపై వరుసగా కేసులు నమోదు అయిపోయాయి. ఫలితంగా ఓ కేసులో బెయిల్ వస్తే… ఇంకో కేసులో ఆయనకు రిమాండ్ తగులుతోంది. వెరసి బెయిల్ వచ్చినా వంశీ జైలు వెలుపలికి వచ్చే ఛాన్స్ ఇప్పుడప్పుడే దక్కేలా లేదని చెప్పాలి. దళిత యువకుడు సత్యవర్థన్ కిడ్నాప్ …
Read More »నాడు ఇందిర.. నేడు మోదీ
భారత సైనిక సత్తా ఏనాడూ.. ఏ దేశానికి కూడా తీసిపోని విధంగా ధృడంగానే సాగుతోంది. నిన్నటిదాకా అగ్ర దేశాలైన అమెరికా, చైనా, రష్యాల స్థాయిలో సైనిక పాటవం భారత్ కు లేకపోవచ్చు. కాని ఇప్పుడలా కాదు. ఏ ఒక్క దేశానికి కూడా తీసిపోని రీతిని భారత సైనిక సత్తాను కేంద్ర ప్రభుత్వం అంతకంతకూ పెంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పటిదాకా భారత సైన్యానికి అత్యధిక ప్రోత్సాహం లభించిన పాలనల్లో రెండింటిని ప్రత్యేకంగా చెప్పుకోక తప్పదు. వాటిలో తొలిది అలనాటి …
Read More »ఆపరేషన్ కెల్లార్!… నాయక్ మృతికి రివెంజ్ దెబ్బ!
పహల్ గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 100 మంది కరడుగట్టిన తీవ్రవాదులతో పాటుగా పదుల సంఖ్యలో పాక్ సైనికులు కూడా చనిపోయారు. ఈ విషయాన్ని పాక్ కూడా దాదాపుగా ధృవీకరించింది. అయితే పాక్ ప్రోత్సాహంతో ఉగ్ర మూకలు భారత సైన్యంపై దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ దాడుల్లో …
Read More »కూటమి సర్కారును మెచ్చుకున్న జగన్!
సమయం ఏదైనా, సందర్భం ఏదైనా రెండు ప్రత్యర్థి రాజకీయ పార్టీల మధ్య ప్రోత్సాహకర, పొగడ్తలతో కూడిన వ్యాఖ్యలు వినిపించవు. ఇక ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను చూస్తే… కూటమి పార్టీలు, వైసీపీల మధ్య ఈ తరహా సుహృద్భావ వాతావరణం కనిపించే ప్రసక్తే లేదు. ఎందుకంటే… కూటమి సర్కారు సారధి చంద్రబాబుతో పాటు ఉప సారథి పవన్ కల్యాణ్ లంటే… జగన్ కు అసలే గిట్టడం లేదు. వారి ప్రస్తావన …
Read More »‘భారతి’ గోవిందప్ప అరెస్టు.. గుట్టు వీడినట్టే!
ఏపీలో రోజుకో మలుపు తిరుగుతున్న మద్యం కుంభకోణం కేసులో మంగళవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్టు చేశారు. కర్ణాటక లోని మైపూర్ లో తలదాచుకున్న గోవిందప్ప గురించిన పక్కా సమాచారాన్ని సేకరించిన సిట్ అధికారులు సోమవారం రాత్రి అక్కడకు చేరుకుని… గోవిందప్పను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను మైసూరు నుంచి విజయవాడ తరలిస్తున్నట్లుగా సమాచారం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ …
Read More »సాయంత్రం చర్చలు- అర్ధరాత్రి దాడులు: తిప్పికొట్టిన భారత్
పాకిస్థాన్ తన దమన నీతిని మరోసారి రుజువు చేసుకుంది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో భారత ఆర్మీ ఆపరేషన్స్ విభాగం డైరెక్టర్ జనరల్తో పాకిస్థాన్ ఆర్మీ ఆపరేషన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ ఫోన్ చేసి సుమారు గంటపాటు చర్చించారు. ఇకపై.. తాము సరిహద్దుల నుంచి సైన్యాన్ని వెనక్కి తిరిగి రప్పిస్తామని.. మీరు కూడా అలానే చేయాలని పాక్ అధికారి కోరారు. దీనికి భారత్ అంగీకరించింది. అదేవిదంగా మేం మిస్సైళ్లను, …
Read More »మోడీ స్పీచ్: పాకిస్థాన్ కు 3 హెచ్చరికలు!
జమ్ము కశ్మీర్లో ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాంలో గత నెల 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది(ఒకరు నేపాలీ) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మతం పేరు అడిగి మరీ ఉగ్రవాదులు వీరిని హతమార్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్లోని ఉగ్రమూకల శిబిరాలపై బెబ్బులిలా విరుచుకుపడింది. ఉగ్రతండాలను ధ్వంసం చేసింది. ఉగ్రవాదులను పదుల సంఖ్యలో హత …
Read More »తెంపరి ట్రంప్.. ఇచ్చి పడేసిన భారత్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోటి దురదకు భారత ప్రభుత్వం కూడా అలానే దూకుడుగా సమాధానం ఇచ్చింది. కీలక మైన పాకిస్థాన్-భారత్ ఉద్రిక్తతల విషయంలో జోక్యం చేసుకున్న ట్రంప్.. శనివారం.. సాయంత్రం 5 గంటల సమయంలో నేను ఇరువురితోనూ మాట్లాను. వెంటనే కాల్పుల విరమించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాలు చాలా గొప్ప దేశాలు.. ఇద్దరు పాలకులు చాలా పరిణితి చెందిన వారు. గొప్ప వ్యక్తులు. అని పేర్కొన్నారు. …
Read More »భారత్-పాక్ యుద్ధాన్ని ఆపా: ట్రంప్ సెల్ఫ్ గోల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. భారత్-పాకిస్థాన్ల మధ్య తానే యుద్ధాన్ని నిలువరించా నని తాజాగా చెప్పుకొచ్చారు. యూఎస్ మీడియాతో మాట్లాడిన ట్రంప్.. అతి పెద్ద అణుయుద్ధాన్ని నిలువరించినట్టు తెలిపారు. భారత్-పాకిస్థాన్లు రెండూ అణుయుద్ధానికి దిగే అవకాశం ఉందని గమనించి.. తానే యుద్ధాన్ని నిలువరించేలా వారిని ఒప్పిం చానని పేర్కొన్నారు. ఇరు దేశాలను అత్యంత ఘనమైన దేశాలుగా పేర్కొన్న ట్రంప్.. తన సంబంధాలు రెండు దేశాలతోనూ …
Read More »ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం: ప్రధాని మోడీ
ఉగ్రవాదులను మట్టిలో కలిపేశామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ అంటే.. కేవలం ఆపరేషన్ కాదని.. దేశంలోని కోట్లాది మంది మహిళల సిందూరానికి ప్రతీకగా పేర్కొన్నారు. తొలుత ఆయన శౌర్య పరాక్రమాలను ప్రదర్శించిన భారత సైన్యానికి, సశస్త్ర సీమా బల్కు సెల్యూట్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates