Political News

భారత్‌కు 26/11 కీలక నిందితుడు.. పాకిస్తాన్ పాత్ర బయటపడుతుందా?

2008లో 166 మందిని పొట్టనపెట్టుకున్న ముంబై 26/11 ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడైన తహావూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు భారత్‌కు రాబోతున్నాడు. అమెరికాలో పదేళ్లుగా న్యాయపోరాటం చేస్తూ వచ్చిన రాణా.. తాజాగా అమెరికా సుప్రీం కోర్టు అతని చివరి పిటిషన్‌ను తిరస్కరించడంతో భారత్‌కు అప్పగించనున్నారు. గురువారం మధ్యాహ్నం ఇండియాలో అడుగుపెట్టే అవకాశం ఉంది. రాణా భారత్‌కు రాగానే ఢిల్లీ పటియాలా హౌస్‌లోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరయ్యే అవకాశం ఉంది. …

Read More »

జగన్ కు అన్ని దారులూ మూసేస్తున్నారా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అదికార కూటమి పూర్తిగా కార్నర్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. తనకు తానుగా ఏ విషయాన్ని కూడా లేవనెత్తని కూటమి ప్రభుత్వం… జగన్ తనకు తానుగా చేస్తున్న తప్పులను ఆధారం చేసుకుని ఆయనను కార్నర్ చేసే దిశగా వ్యూహాత్మకంగా సాగుతోందని చెప్పక తప్పదు. ఓ విపక్ష నేతగా జగన్ ఘాటు వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణమే. అలా చేయకపోతే వైసీపీ క్షణాల్లో వీక్ అయిపోతుంది. పార్టీని …

Read More »

రాజీ బాటలో రోజా సక్సెస్ అయ్యారా..?

ఆర్కే రోజా పేరు వింటేనే కూటమి పార్టీలు అంతెత్తున ఎగిరి పడుతున్నాయి. వైసీపీ అదికారంలో ఉండగా.. టీడీపీ, జనసేనలపై ఓ రేంజిలో విరుచుకుపడిన రోజా వీడియోలను గుర్తుకు తెచ్చుకుని కూటమి పార్టీల నేతలు కుతకుతలాడి పోతున్నారు. అలాంటి రోజా కూటమి సర్కారుతో… ప్రత్యేకించి టీడీపీతో రాజీ కుదుర్చుకున్నారని, ఇప్పటికే ఈ రాజీ కుదరిపోయిందని, ప్రస్తుతం రోజా అరెస్టు నుంచి బయటపడిపోయారని, ఎంచక్కా ఆమె అరెస్టు భయం నుంచి బయట పడి …

Read More »

హెచ్‌సీయూపై కాంగ్రెస్ గేమ్ స్టార్ట్, బీఆర్ఎస్ ఆన్సర్ ఉందా..?

కంచే గచ్చిబౌలి భూముల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. పర్యావరణాన్ని పెద్ద ఎత్తున నాశనం చేస్తున్నారని, కాంగ్రెస్ తెలంగాణా సమాజానికి అన్యాయం చేస్తుంది అంటూ తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే దీని వెనుక బీఆర్ఎస్ వాస్తవాలను చంపేస్తోంది అంటూ కాంగ్రెస్ లెక్కలు బయట పెడుతోంది. 2016 నుంచి 2019 మధ్య కాలంలో …

Read More »

తెలంగాణను మించిన స్పీడుతో ఏపీ

పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నట్లే కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడ కూడా ఇరు రాష్ట్రాల మధ్య పొరపొచ్చాలు గానీ, అభిప్రాయ బేధాలు గానీ తలెత్తకుండా ముందుకు సాగుతున్నాయి. నిన్నటిదాకా పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ నిలిస్తే… ఇప్పుడు ఆ స్థానాన్ని ఏపీ దాదాపుగా లాగేసుకునే దిశగా దూసుకుపోతోందని చెప్పక తప్పదు. ఇరు రాష్ట్రాలకు భౌగోళిక వ్యత్యాసాలు ఉన్న నేపథ్యంలో ఎవరికి వారుగా తమ రాష్ట్రాలకు సరిపడ రంగాలను …

Read More »

బాబు ఆనందం అంతా ఇంతా కాదు… ఎందుకంటే…

ఏపీ ముఖ్య‌మంత్రిగా కూట‌మి ప్ర‌భుత్వాన్ని చ‌క్క‌టి స‌మ‌న్వ‌యంతో ముందుకు న‌డిపిస్తున్న చంద్ర‌బాబుకు 10 నెల‌లు పూర్తయ్యాయి. గ‌త ఏడాది జూన్ 10న ఆయ‌న అధికారం చేప‌ట్టారు. అయితే.. ఈ ప‌ది మాసాల కాలంలో ఏరోజూ జ‌ర‌గ‌న‌న్ని ప‌నులు.. సానుకూల కార్య‌క్ర‌మాలు.. ఈ రోజు(బుధ‌వారం-ఏప్రిల్-9) జ‌ర‌గ‌డంతో చంద్ర‌బాబు ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఒక‌ర‌కంగా చెప్పాలంటే..చంద్ర‌బాబు ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నార‌నే అంటున్నారు టీడీపీ నాయ‌కులు. “ఇది గుడ్ వెన్స్‌డే. మా నాయ‌కుడి ఆనందం అంతా …

Read More »

మళ్లీ జోగి రమేశ్ వంతు వచ్చేసింది!

వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ కేంద్ర కార్యాలయం, గన్నవరం టీడీపీ కార్యాలయాలపై దాడులతో పాటుగా టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటిపై దాడికి యత్నం ఘటనలు కీలకమైనవి. నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టిని ఆకట్టుకునేందుకు, పదవులు దక్కించుకునేందుకు చాలా మంది చాలానే చేశారు. అలాంటి వారిలో …

Read More »

ఫోటో : గాయపడ్డ పవన్ కుమారుడు ఇప్పుడిలా ఉన్నాడు!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. సింగపూర్ లో సమ్మర్ క్యాంపులో ఉన్న పవన్ కుమారుడు… అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు కాలిన గాయాలైన విషయం విదితమే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ తో కలిసి క్యాంపులో ఉన్న ఓ బాలిక చనిపోగా… మార్క్ …

Read More »

కాకాణికి షాకిచ్చిన హైకోర్టు.. అరెస్టు తప్పదా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న కాకాణి పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా ఈ కేసులో పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని కోర్టు తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఇప్పటికే 10 రోజుల పాటుగా పోలీసుల విచారణకు హాజరు కాకుండా… కనీసం నోటీసులు కూడా తీసుకోకుండా …

Read More »

రెండు రాష్ట్రాల‌కూ ఊర‌ట‌.. విభ‌జ‌న చ‌ట్టంపై కేంద్రం క‌స‌రత్తు!

2014లో ఉమ్మ‌డి ఏపీ విడిపోయి.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆ త‌ర్వాత‌.. కేంద్రంలో ప్ర‌భుత్వం మార‌డంతో.. విభ‌జ‌న చ‌ట్టంలోని చాలా స‌మ‌స్య‌లు అప‌రిష్కృతంగానే ఉండి పోయాయి. అప్ప‌టి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ‌ప్ర‌భుత్వాలు కూడా కేంద్రానికి ప‌లు రూపాల్లో విన్న‌పాలు చేస్తూనే ఉన్నాయి. అయితే.. ఎట్ట‌కేల‌కు.. తాజాగా కేంద్ర హోం శాఖ ఈ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా విభ‌జ‌న చ‌ట్టం-2014లోని షెడ్యూల్ …

Read More »

హైకోర్టుకు పోలీసులు.. జ‌గ‌న్‌పై పిటిష‌న్?

వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌మ‌పై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై పోలీసు అధికారుల సంఘం.. హైకోర్టును ఆశ్ర‌యించే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఈ విష‌యంలో ప్ర‌భుత్వ జోక్యాన్ని కోరుతూ.. అధికారుల సంఘం తాజాగా లేఖ రాసింది. అయితే..తాజాగా రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత మీడియాతో మాట్లాడుతూ.. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నామ‌ని.. అయితే.. ప్ర‌భుత్వ ప‌రంగా కంటే కూడా.. న్యాయ పోరాటం ద్వారానే పోలీసుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని భావిస్తున్న‌ట్టు వ్యాఖ్యానించారు. …

Read More »

ఫార్మాపై ట్రంప్ టారిఫ్ లు అమెరికాకు పిడుగుపాటే!

అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే కొలువుల కోత మొదలుకాగా… త్వరలోనే హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటిదాకా విదేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న దాదాపుగా అన్ని వస్తువులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను భారీగా పెంచేశారు. ఫలితంగా అమెరికాలో ఆయా దేశాల ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. తాజాగా ట్రంప్ ఓ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఫార్మా రంగంపైనా కొత్త …

Read More »