Political News

రాజధాని లేకున్నా… విశాఖలో ‘రియల్’ బూమ్

ఏపీ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విశాఖపట్టణం… గతంలో ఎలా ఉందో, భవిష్యత్తులోనూ అలాగే ఉండనుంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం విశాఖను ఏపీకి కార్యనిర్వాహక రాజధానిగా చేస్తారన్న ప్రచారం సాగేది. అంతేనా…రిషికొండ ను తొలిచి మరీ వందల కోట్ల నిధులు ఖర్చు పెట్టి అధునాతన సౌకర్యాలతో కూడిన రాజమహల్ లాంటి భవనాన్ని కూడా జగన్ సర్కారు నిర్మించింది. గతంలో మాట ఎలా ఉన్నా… మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తిరిగి …

Read More »

హైద‌రాబాద్‌కు ప్ర‌పంచ‌స్థాయి గుర్తింపు: రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్‌కు ప్ర‌పంచ స్థాయి గుర్తింపు తెస్తామ‌ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గ‌త ప‌దేళ్ల‌లో రాష్ట్రాన్ని నాశ‌నం చేశార‌ని.. దీంతో అభివృద్ధి లేకుండా పోయింద‌న్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంత‌రం కృషి చేస్తున్న‌ట్టు తెలిపారు. శ్రీవిశ్వావ‌సు నామ నూత‌న సంవ‌త్స‌రాదిని పుర‌స్క‌రించు కుని.. హైద‌రాబాద్‌లోని ర‌వీంద్ర‌భార‌తిలో జ‌రిగిన వేడుక‌ల్లో సీఎం పాల్గొన్నారు. తొలుత పంచాంగ శ్ర‌వ ణం చేసిన ఆయ‌న‌.. అనంత‌రం ప్ర‌సంగించారు. బ‌డ్జెట్ ఉగాది ప‌చ్చ‌డి! ఇటీవ‌ల …

Read More »

జ‌గ‌న్‌కు భ‌యం తెలీదు: వైసీపీ పంచాంగం!

శ్రీవిశ్వావ‌సు నామ తెలుగు సంవ‌త్స‌రాదిని పుర‌స్క‌రించుకుని గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఉగాది ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పంచాంగ క‌ర్త‌, ప్ర‌ముఖ అవ‌ధాని నారాయ‌ణ మూర్తి పంచాంగ ప‌ఠ‌నం చేశారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ ది మిథున రాశి అని తెలిపారు. ఈ రాశివారికి భ‌యం అనేది ఉండ‌ద‌ని.. అదే విధంగా జ‌గ‌న్‌కు కూడా భ‌యం లేద‌ని తెలిపారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. ఆయ‌న …

Read More »

‘పేద‌ల‌కు ఉగాది’.. చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఉగాదిని పుర‌స్క‌రించుకుని కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తెలుగు వారి పండుగలలో ప్ర‌ధంగా వ‌చ్చే ఉగాదిని పుర‌స్క‌రించుకుని పేద‌ల‌కు ఆర్థిక స‌హాయం అందించేలా చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకోవ‌డం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు.. 3 వేల మందికి పైగా ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి నుంచి సొమ్ములు అందించే ఫైలుపై ఆయ‌న ఉగాది సంద‌ర్భంగా తొలి సంత‌కం చేశారు. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఉగాదిని పుర‌స్క‌రించుకుని పేద‌ల‌కు మేలు …

Read More »

అమరావతికి తిరుగు లేదు… ఆరోసారీ సీఎంగా చంద్రబాబు

నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఇకపై ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశమే లేదు. అంతేనా… అమరావతిని ఏపీకి రాజధానిగా ఎంపిక చేసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంకో రెండు పర్యాయాలు కూడా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడం ఖాయమే. అంతేకాదండోయ్… అర్హత ఉండి ఇప్పటికిప్పుడు తగిన పదవులు దక్కని వారికందరినీ దశల వారీగా పదవులు దక్కుతాయని…అది కూడా చంద్రబాబు ద్వారానే సాధ్యమవుతుందనీ తేలిపోయింది. ఈ …

Read More »

ఉద్యోగార్థులకు రేవంత్ మార్క్ ఉగాది గిఫ్ట్!

తెలంగాణలో కొలువుల కోసం కోట్ల కళ్లతో ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం నిజంగానే అదిరిపోయే బహుమతి ఇచ్చారు. ఆదివారం తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు నేల వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సంబరాల వేళ గ్రూప్ 1 పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలు విడుదల చేసిన రేవంత్ సర్కారు..వారి …

Read More »

పవన్ కు లోకేశ్ జత… మొగల్తూరు హైస్కూల్ కు మహార్థశ

మొగల్తూరు… మెగాస్టార్ చిరంజీవి సొంతూరు. ఆ ఊరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాతబడిపోయింది. సర్కారీ పాఠశాలలకు నిధులు విడుదల కావడమే గొప్ప. అలాంటిది అప్పటికే ఉన్న భవనాలను ఆధునీకరించేందుకు నిధులు అంటే అస్సలు ఊహించడానికే వీలు కాదు. అలాంటిది ఇప్పుడు మెగాస్టార్ సోదరుడు, జనసేన అదినేత పవన్ కల్యాణ్ పుణ్యమా అని మొగల్తూరు హైస్కూల్ కు మహార్దశే పట్టింది. తన స్వగ్రామం అభివృద్ధిపై పవన్ దృష్టి సారించిన సంగతి …

Read More »

‘జమిలి’కి జెల్ల కొట్టింది కాంగ్రెస్సేనా..?

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా… జమిలి ఎన్నికలు వస్తాయా? రావా? అన్న దిశగా ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. అంతేకాకుండా కేంద్రంలో అదికారంలో ఉన్న ఎన్డీఏ జమిలి ఎన్నికలకు అనుకూలంగా పకడ్బందీగా పావులు కదుపుతున్న నేపథ్యంలో జమిలి జరిగితే పరిస్థితి ఎలా ఉంటాయన్న దిశగానూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ సీనియర్ మోస్ట్ నేత, భారత మాజీ రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శనివారం ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు …

Read More »

గిరిజన మహిళల ఆప్యాయతకు పవన్ ఉగాది గిఫ్ట్ లు

జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ మనసు ఎంత సున్నితమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ విషయం అయినా తన మనసుకు నచ్చిందంటే… దాని కోసం ఆయన ఏమైనా చేస్తారు. ఎంత దూరం అయినా వెళతారు. అది సినిమా అయినా..నిజ జీవితం అయినా ఆయన అదే వైఖరితో సాగుతారు. ఇప్పుడు రాజకీయ నేతగా ఉచ్ఛ దశలో ఉన్న పవన్ మరింతగా సున్నితంగా మారిపోయారని చెప్పక …

Read More »

ఈ విష‌యంలో వంశీది త‌ప్పా.. అధికారులది త‌ప్పా?!

వ‌ల్ల‌భనేని వంశీ. వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే. కానీ, ప్ర‌స్తుతం ఆయ‌న జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ. వివిధ కేసులు.. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. దీంతో సుమారు రెండు మాసాల‌కు పైగానే వంశీ జైలు జీవితం గ‌డుపుతున్నారు. ఆయ‌న‌కు బెయిల్ కూడా ద‌క్క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. వంశీని బ‌య‌ట‌కు వ‌దిలితే.. టీడీపీ నాయ‌కుడు, గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై దాడి చేసిన ఘ‌ట‌న‌పై ఫిర్యాదు చేసిన స‌త్య‌వ‌ర్థ‌న్‌ను చంపేసే ప్ర‌మాదం ఉందంటూ.. కోర్టు …

Read More »

వైసీపీ దాష్టీకాల‌పై పోరాడిన జ‌ర్న‌లిస్టుకు చంద్ర‌బాబు ఘ‌న స‌త్కారం!

వైసీపీ హ‌యాంలో ఆ ప్ర‌భుత్వ అరాచ‌కాలు, దాష్టీకాల‌పై పోరాడిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, ఓ ప్ర‌ధాన పత్రిక‌లో స‌బ్ ఎడిట‌ర్‌గా, రిపోర్ట‌ర్‌గా ప‌నిచేసి రిటైర్ అయిన‌.. అంక‌బాబుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌మున్న‌త స‌త్కారం ప్ర‌క‌టించారు. అమ‌రావ‌తి రాజ‌ధాని ఉద్య‌మం స‌హా.. డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను రెండు చేతులు వెన‌క్కి విర‌గ్గ‌ట్టి న‌డిరోడ్డుపై అరెస్టు చేసిన తీరును అంక‌బాబు ప్ర‌శ్నించారు. అంతేకాదు.. త‌న సోష‌ల్ మీడియా, సొంత చానెల్ ద్వారా.. వైసీపీ ప్ర‌భుత్వ …

Read More »

సిట్ ముందుకు శ్రవణ్… ‘ట్యాపింగ్’ కొలిక్కి వచ్చేనా?

తెలంగాణ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఓ మీడియా సంస్థ యజమాని శ్రవణ్ రావు శనివారం ఉదయం దుబాయి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండైన ఆయన తన ఇంటికి వెళ్లకుండా.. నేరుగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ కేసుపై విచారణ చేస్తున్న ప్రత్యేక …

Read More »