ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను ఘనంగా సత్కరించి.. వారిపై కానుకలు కురిపించారు. గత రాత్రే పిఠాపురం నుంచి ప్రత్యేక బస్సుల్లో 20 మంది స్టాఫ్ నర్సులను మంగళగిరిలోని జనసేన పార్టీప్రధాన కార్యాలయానికి, తన అధికారిక కార్యాలయానికి వారిని తీసుకువచ్చారు. సోమవారం.. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారిని ఆప్యాయంగా పలకరించిన పవన్ కల్యాణ్.. వారి సేవలను …
Read More »జవహర్, సుగుణమ్మల కష్టం ఫలించిందిగా.. !
వారిద్దరూ మాజీ ఎమ్మెల్యేలు. గత ఎన్నికల్లో పార్టీ అధినేత నిర్ణయానికి తలొగ్గారు. తమకు పోటీ చేసే అవకాశం దక్కలేదన్న బాధ, ఆవేదన ఉన్నా.. మౌనంగా పంటిబిగువున భరించారు. అంతేకాదు.. అప్పటి వరకు నియోజకవర్గంలో దూకుడుగా వ్యవహరించినా.. చివరినిముషంలో టికెట్ దక్కడం లేదని తెలిసినా కుంగిపోలేదు. వారే.. మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. ఇద్దరూ గత ఎన్నికల్లో టికెట్లు కోల్పోయిన వారే. అయితే.. పార్టీ పట్ల …
Read More »పార్టీని నమ్ముకున్నాడు, బాబు చూసుకున్నాడు!
విధేయత, అణుకువ, పార్టీ అధినేత పట్ల అత్యంత గౌరవ మర్యాదలు ప్రదర్శించి.. విధేయతకు కేరాఫ్గా నిలిచిన మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకు సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మక ఆప్కాబ్ చైర్మన్ పదవితో వీరతాడు వేశారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న గన్ని వీరాంజనేయులకు కీలకమైన పదవిని ఇచ్చి ఆయన సేవలను చంద్రబాబు గుర్తించారనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్గా ఇటీవలే నియమించిన ఆయనను …
Read More »అమరావతి ‘మణిహారం’ 70 కాదు 140 మీటర్లు..!
ఏపీ రాజధాని అమరావతికి మణిహారంగా పేర్కొంటున్న ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్ డేట్ వచ్చింది. ఇది 70 మీటర్ల వెడల్పు కాదని.. ఏకంగా 140 మీటర్ల వెడల్పని సీఆర్ డీఏ ప్రకటించింది. దీనికి సంబంధించి కేంద్రం కూడా అంగీకారం తెలిపినట్టు పేర్కొంది. వాస్తవానికి అమరావతి రింగు రోడ్డు ద్వారా.. మూడు ప్రాంతాల్లోని ప్రజలను రాజధాని పరిధిలోకి తీసుకురావాలని.. తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పుంజుకునేలా చేయాలని ప్రభుత్వం భావించింది. …
Read More »వలంటీర్లకు శిక్షణ ఇచ్చారంట, బిల్ – రూ.272 కోట్ల
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను సీఎంగా ఉండగా… ఏపీ ప్రజలకు ఓ అద్భుతమైన వ్యవస్థను అందించానని, దానిని కూటమి సర్కారు రద్దు చేసిందని వలంటీర్ వ్యవస్థ గురించి చెబుతున్న సంగతి తెలిసిందే. సేవ చేసేందుకే వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పిన మాట నిజమేనని.. అయితే ఆ సేవ ప్రజలకు కాకుండా… వైసీపీకి మాత్రమే అందిందని నాటి విపక్షం, నేటి అధికార కూటమి సారథి టీడీపీ ఆరోపించింది. …
Read More »జూన్ నెలలో జనాలకు డబ్బే డబ్బు..!
కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు 2024 ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో రెండు పథకాలకు మరో 30 రోజుల్లో మోక్షం లభించనుంది. అదేవిధంగా మరో కీలక కార్యక్రమానికి కూడా ఆయన ఈ నెలలోనే శ్రీకారం చుట్టనున్నారు. దీంతో జనాల చేతులలోకి దండిగానే సొమ్ములు రానున్నాయని కూటమి పార్టీల నాయకులు చెబుతున్నారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో రంగం కూడా రెడీ అయిందని …
Read More »సైన్యమా.. కదిలించిన బిగ్ బీ పోస్టు
‘భారత సైన్యమా.. వెనుకడుగు వేయకు.. నీ ప్రయాణం ఎప్పటికీ ఆగదు!’ అంటూ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సంచలన పోస్టుచేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు ఇప్పటికే స్పందించినా.. అమితాబ్ బచ్చన్ చాలా సంయమనం పాటించారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో భారత సైన్యాన్ని.. పహల్గామ్ దాడిలో తమ నుదిటి సిందూరాన్ని కోల్పోయిన భారత పుత్రికలను ఉద్దేశించి సుదీర్ఘ పోస్టు చేశారు. పహల్గామ్ దాడిలో …
Read More »పాక్పై మోడీ సంచలన వ్యాఖ్యలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వాన్ని తాము కోరుకోవడం లేదని నర్మగర్భంగా అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో తమ విధానం ఎప్పుడూ మారబోదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ విషయంలో పాకిస్థాన్కు ప్రత్యామ్నాయ మార్గం అంటూ మరొకటి లేదని.. పాకిస్థాన్ ఏ భూభాగాన్నయితే ఆక్రమించుకుందో.. దానిని తిరిగిభారత్కు ఇచ్చేయాలని స్పష్టం చేశారు. ఇంతకు మించిన ఆశలు …
Read More »పంతం నాదా-నీదా.. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. !
పంతాలకు పోవద్దు.. కలిసి మెలిసి పనిచేయండి.. అని సీఎం చంద్రబాబు తరచుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు చెబుతున్నారు. అంతేకాదు.. నియోజకవర్గాల గొడవలను పెద్దవి కూడా చేసుకోవద్దని ఆయన సూచిస్తున్నారు. అయినా.. ఆయన మాటలను పెద్దగా లెక్కలోకి తీసుకున్నట్టుగా కనిపించడం లేదు. కర్నూలు జిల్లాలోని ఎమ్మెల్యేలకు, ఎంపీ శబరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడిక్కడ నాయకులు శబరికి వ్యతిరేకంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే.. వీరికంటే నేనేం తక్కువ …
Read More »వైసీపీ టాక్: కేసులకు భయపడుతున్న ఫైర్ బ్రాండ్.. !
ఆయన ఫైర్ బ్రాండ్ నాయకుడు. మీసం మెలేసి మరీ ప్రతిపక్ష పార్టీలకు సవాళ్లు రువ్విన నాయకుడు. అధికారంలో ఉన్నప్పుడు.. అసెంబ్లీ వేదికగానే తొడగొట్టే ప్రయత్నం చేసిన నాయకుడు. కానీ, ఇప్పుడు పార్టీ అధికారం నుంచి దిగిపోయే సరికి.. ఆయనకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎక్కడ ఏకేసు తనను చుట్టుముడుతుందోనన్న బెంగ వేధిస్తోంది. అలాగని మౌనంగా ఉంటే.. పార్టీ నుంచి తన కార్యకర్తల నుంచి ఒత్తిళ్లు భరించలేక పోతున్నారట. ఈ క్రమంలో నిరసనలకు, …
Read More »వారి కన్నీళ్లు చూసి.. కరిగిపోయిన పవన్!
రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేత.. భయంకరమైన అభిమానుల కోలాహలం.. ఇంత పెద్ద హంగామా ఉన్న పవన్ కల్యాణ్.. కన్నీటి పర్యంతమయ్యారు. పక్కవారి కష్టాన్ని చూసి ఆయన చలించిపోయారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చే క్రమంలో ఆయనా కన్నీరు పెట్టుకున్నారు. ఆపరేషన్ సిందూర్ లో పాల్గొని జమ్ముకశ్మీర్లోని రాజౌరీలో పాక్ ఎదురు కాల్పుల్లో అమరవీరుడైనా అనంతపురం జిల్లా కిళ్లి తండాకు చెందిన అగ్నివీర్ మురళీనాయక్.. అంత్యక్రియల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. …
Read More »మురళీ నాయక్ కుటుంబానికి పవన్ ఆర్థిక సాయం
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా సరిహద్దు వద్ద ఇరు దేశాల సైనికులు కాల్పులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు, అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే మురళీ నాయక్ పార్థివ దేహానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. ప్రభుత్వం అందిస్తున్న రూ.50 లక్షల ఆర్థిక సాయానికి తోడు పవన్ వ్యక్తిగతంగా రూ.25 …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates