టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదివారం సరదా సరదాగా గడిపారు. ఓ వైపు పార్టీ వ్యవహారాలు, మరోవైపు ప్రభుత్వ పాలన నేపథ్యంలో క్షణం తీరిక లేకుండా సాగుతున్న లోకేశ్… చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయి కేంద్రంగా జరిగిన దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ను చూస్తూ ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ టీమిండియా జెర్సీ …
Read More »గ్రూప్-2 తేనెతుట్టెను కదిపిందెవరు?
ఈ రోజు నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష విషయంలో పెద్ద వివాదమే ముసురుకుంది. ఈ పరీక్షను రద్దు చేయాలంటే వేల మంది అభ్యర్థులు రోడ్డు మీదికి వచ్చారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాడబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల మీద ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో గ్రూప్-2 ఆశావహులు మండిపడుతున్నారు. ఈ పరీక్షను రద్దు …
Read More »అమరావతికి మరో మణిహారం… ఓఆర్ ఆర్కు కేంద్రం ఓకే!
ఏపీ రాజధాని అమరావతికి మరో మణిహారం లభించింది. నిర్మాణ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యం లో కీలకమైన బాహ్యవలయ రహదారి(ఔటర్ రింగ్ రోడ్డు)ని మరింత విస్తరించేందుకు ప్రతిపాదించిన ఫైలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి శనివారం అర్ధరాత్రి దాటాక కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రాజధాని నిర్మాణంలో కీలకమైన ఓ ఆర్ ఆర్ నిర్మాణ పనులు శర వేగంగా జరగనున్నాయి. ఏంటీ రహదారి.. రాజధాని ప్రాంతాన్ని.. …
Read More »నిజంగానే.. జగన్ భయపడ్దారా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆ పార్టీ నేతలతో పాటు సామాన్య జనం కూడా ధైర్యవంతుడిగా చెబుతూ ఉంటారు. పార్టీ శ్రేణులు అయితే ఏకంగా పులివెందుల పులి అని, సింగిల్ గా వచ్చే సింహమని కీర్తిస్తూ ఉంటారు. తండ్రి చనిపోయిన తరుణంలో కేసులు మీద పడ్డా… వెన్నుచూపని ధీరుడిలా.. అధికార కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టి… కేసులకు కూడా భయపడకుండా సాగిన నేతగా …
Read More »పవన్ సహనానికి ఫిదా కావాల్సిందే!
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న విషయాలకే ఓ రేంజిలో రియాక్ట్ అయిపోతూ ఉంటారని… ఆయనలో సహనం పాళ్లు చాలా తక్కువనే విమర్శలు చాలా కాలం నుంచి ఉన్నవే. ఈ మాటలు నిజమేనన్నట్లుగా పవన్ చలా సందర్భాల్లో చిన్న విషయాలకు కూడా తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. ఆయా అంశాలపై ఊగిపోయారు. జన సైనికులను ఉర్రూతలూగించారు. అయితే పవన్ లో నిగూఢంగా సహనం దాగుందని…ఆ సహనం …
Read More »ఓర్నీ: ఉనికిలో లేని శాఖకు మంత్రి.. పంజాబ్ సిత్రం తెలిస్తే అవాక్కే!
ఇలా కూడా జరుగుతుందా? అన్న ఆశ్చర్యానికి గురి చేసే ఉదంతం ఒకటి పంజాబ్ లో చోటు చేసుకుంది. అక్కడ ఒక మంత్రిగారు ఉనికిలో లేని ఒక శాఖకు ఎంపికయ్యారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శాఖ అన్నది లేకున్నా.. అందులో గడిచిన 20 నెలలుగా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ తప్పిదాన్ని తాజాగా గుర్తించి నాలుకర్చుకున్న అధికారులు దాన్ని సవరించే పనిలో పడ్డారు. విన్నంతనే విచిత్రంగా అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే..2022 …
Read More »వైసీపీలో `గ్యాప్` తీరుస్తున్నారు… నేతలు బయటకు!
ఎట్టకేలకు వైసీపీ నాయకులు బయటకు వస్తున్నారు. ఎన్నికల ఫలితం తర్వాత.. వైసీపీ 11 స్థానాలకు జారిపోయిన తర్వాత.. ఇప్పుడిప్పుడే విధాన పరమైన అంశాలతో వైసీపీ నాయకులు బయటకు రావడం ప్రారంభించారు. తాజాగా అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి.. కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. జగన్ బయటకు రాకూడదా? అని ప్రశ్నించారు. అంతేకాదు .. జగన్ బయటకు వస్తే.. కూటమి సర్కారు తప్పులు బయట పడతాయని …
Read More »తెలుగు రాష్ట్రాల మధ్య `సయోధ్య` సాధ్యంకాదా?
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలతోపాటు విద్యుత్ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. మరో రెండు మాసాల్లో ఎండలు ముదరనున్న నేపథ్యంలో ఈ రెండు అంశాలు కూడా.. రెండు రాష్ట్రాలకూ కీలకంగా మారుతున్నాయి. ఖరీఫ్ సాగు రెండు రాష్ట్రాల్లోనూ ముమ్మరం అవుతోంది. కృష్ణా, గోదావరి ఆయకట్టు ప్రాంతంలో రైతులు సాగుకు సిద్ధమయ్యారు. ఏపీలో అయితే.. నాట్లు కూడా పడుతున్నాయి. ఈ పరిణామాలతో జలాల ప్రాధాన్యం పెరిగింది. మరోవైపు .. ఎండాకాలం ప్రారంభానికి …
Read More »మోదీ టీంలోకి ‘శక్తి’మంతుడు!
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేతగా కొనసాగుతున్నారు. మోదీ బృందంలో ఉన్నవారంతా కూడా వారి వారి విభాగాల్లో లబ్ధ ప్రతిష్టులే. జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరిస్తున్న అజిత్ దోవల్ అయితేనేం… ప్రిన్సిపల్ సెక్రటరీ టూ పీఎంగా కొనసాగుతున్న ప్రమోద్ కుమార్ మిశ్రా అయితేనేం… కేబినెట్ లో అమిత్ షా, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, జై శంకర్, కిరణ్ రిజిజు.. ఇలా ఎవరిని తీసుకున్నా.. …
Read More »అసెంబ్లీకి వెళ్దాం.. `తాడేపల్లి`పై ధిక్కార స్వరాలు!
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. అసెంబ్లీకి వచ్చే విషయంపై ఆ పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దఫా జగన్ సమావేశాలు వస్తారా? రారా? అన్నది సందేహమే. ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఎలా ఉన్నా.. పార్టీ వర్గాల మాట వేరేగా ఉందని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సభకు వెళ్లే విషయంపై కొందరు ఎమ్మెల్యే లు రెడీ అవుతున్నట్టు …
Read More »కబ్జా భూమి సరెండర్ తో పని అయిపోయినట్టేనా…?
భూకబ్జా అనేది నేరం. ఈ నేరానికి జీవిత కాలం పాటు జైలు శిక్ష విధించే దిశగా ఏపీలోని కూటమి సర్కారు సాగుతోంది. అంటే.. భూకబ్జాలకు పాల్పడినట్టుగా నేరం నిరూపితమైతే… దోషులకు ఏకంగా 14 ఏళ్ల జైలు శిక్ష తప్పదన్న మాట. మరి వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి ఈ వ్యవహారాన్ని చాలా లైట్ గా తీసుకుంటున్నట్టుగా ఉంది. తాను భూకబ్జా చేసినట్లుగా తేలితే.. తాను కబ్జా …
Read More »రేవంత్ కు మోదీ ఫోన్.. సీఎంకు పీఎం భరోసా
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో రేవంత్ కు కాల్ చేసిన మోదీ… శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)లో చోటుచేసుకున్న ప్రమాదంపై ఆరా తీశారు. ఎస్ఎల్బీసీలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, భయపడాల్సిన అవసరం ఏమీ లేదని ఆయన రేవంత్ కు భరోసా ఇచ్చారు. ఇందుకోసం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates