Political News

ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తా.. : దువ్వాడ బెదిరింపుల ప‌ర్వం

వైసీపీ ఎమ్మెల్సీ, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన దువ్వాడ శ్రీనివాస్ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఆయ‌న‌పై ఇప్ప‌టికే ప‌లు ఫిర్యాదులు ఉన్నా.. ఎలాంటి బ‌ల‌మైన కేసులు న‌మోదు కాలేదు. అయితే.. పోలీసులు మాత్రం అవ‌కాశం కోసం చూస్తు న్నారు. కుటుంబ క‌ల‌హాలు.. భార్య‌తో వివాదాలు.. ప్రియురాలితో ముచ్చ‌ట్లు.. ఇలా దువ్వాడ ప‌లు సంద‌ర్భాల్లో మీడియాలో హైలెట్ అయ్యారు. అంతేకాదు.. ప‌విత్ర తిరుమ‌ల‌లో ప్రియురాలితో వెళ్లి ఫొటో షూట్ కూడా …

Read More »

సిసలైన ప్రజాస్వామ్యానికి ప్రతీక తెలంగాణ అసెంబ్లీ

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. గతంలో ఎన్నడూ లేనంత వాడీవేడీగా సాగిన ఈ సమావేశాల్లో చాలా అంశాలపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై అసెంబ్లీలో కూలంకష చర్చలు జరిగాయి. పలు జాతీయ అంశాలపైనా అసెంబ్లీ తీర్మానాలను ఆమోదించింది. అదే సమయంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ల మద్య మాటల తూటాలు పేలాయి. ఇక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీజేపీ …

Read More »

నాడు హైటెక్ సిటీ…ఇప్పుడు క్వాంటం వ్యాలీ: చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించారు. నగరంలోని ఐఐటీ మద్రాస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు వెళ్లిన ఆయన…ఐఐటీ మద్రాస్ లో 35 నుంచి 40 శాతం దాకా విద్యార్థులు తెలుగు వారే ఉండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా యువతే భవిత అన్న మాటను మరోమారు ప్రస్తావించిన చంద్రబాబు… అక్కడి తెలుగు విద్యార్థుల హర్షధ్వానాల మధ్య తన …

Read More »

వంశీకి డబుల్ షాక్… రెండో బెయిల్ పిటిషన్ కొట్టివేత

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కు శుక్రవారం డబుల్ షాక్ తగిలింది. దళిత యువకుడు కిడ్నాప్, బెదిరింపుల కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని వంశీ దాఖలు చేసుకున్న పిటిషన్ ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో బెయిల్ ఇవ్వాలంటూ వంశీ దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు గురువారం కొట్టివేసిన సంగతి తెలిసిందే. తాజాగా …

Read More »

వైసీపీ-ద‌శ‌-దిశ‌.. పొలిటిక‌ల్ వ్యూ.. !

వైసీపీకి ఒక ద‌శ‌-దిశ అంటూ.. లేకుండా పోతోందా? అంటే.. ఔననే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. ఒక సామాజిక వ‌ర్గానికి న్యాయం మ‌రో సామాజిక వ‌ర్గానికి అన్యాయం చేస్తున్నార‌న్న వాద‌న బ‌లంగా ఎస్సీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. మాల సామాజిక వ‌ర్గానికి ఈ పార్టీ ప‌రిమితం అవుతున్న సంకేతాలు వ‌స్తున్నాయి. మాదిగ సామాజిక వ‌ర్గం నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను పార్టీ ప‌ట్టించుకోక‌పోవ‌డం.. అన్ని విధాలా ఇబ్బందిగా మారిపోయింది. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణపై వైసీపీ ఒక పంథాను …

Read More »

ఆశ చావలేదు.. జాబితా వచ్చేదాకా ఆగేది లేదు

తెలంగాణలో కేబినెట్ విస్తరణకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లు ప్రతిపాదించిన జాబితాను పరిశీలించిన అధిష్ఠానం.. తమ వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరిచి… అంతిమంగా ఓ ఫైనల్ లిస్ట్ ను వారి చేతిలో పెట్టినట్గుగా కథనాలు వచ్చాయి. అయితే ఆ జాబితాలో ఎవరి పేర్లున్నాయన్న విషయం మాత్రం …

Read More »

గుండె తరలింపునకు లోకేశ్ ‘సొంత’ విమానం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ సేవా కార్యక్రమాలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. ఇప్పటికే తన మనసుకు నచ్చిన పలు కార్యక్రమాలకు తన సొంత నిధులను వెచ్చిస్తున్న లోకేశ్… గురువారం అవయవదానానికి దన్నుగా నిలిచి ఏకంగా తన సొంత ఖర్చుతో ఓ విమాన సర్వీసును ఏర్పాటు చేశారు. గుంటూరు నుంచి తిరుపతికి ఓ మహిళ గుండెను తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేయగా… అందుకు అవసరమైన విమాన సర్వీసును …

Read More »

దుర్గేశ్ ప్లాన్ సక్సెస్ .. ‘సూర్యలంక’కు రూ.97 కోట్లు

ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా జనసేన కీలక నేత కందుల దుర్గేశ్ సత్తా చాటుతున్నారని చెప్పాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పర్యాటక శాఖలోకి పెద్ద ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులను రాబట్టే దిశగా దుర్గేశ్ చేస్తున్న యత్నాలు ఫలిస్తున్నాయి. అంతేకాకుండా కేంద్రం నుంచి పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కోసం ఏఏ పద్దులు ఉన్నాయి? వాటి కింద ఏఏ అంశాలకు ఎంత మేర నిధులను రాబట్టవచ్చు? అన్న అంశాలపై పట్టు సాదించిన దుర్గేశ్… తాజాగా …

Read More »

బాబుకు జయమంగళ పాదాభివందనం

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మొన్నటిదాకా వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగిన జయమంగళ వెంకట రమణ…చంద్రబాబుకు స్వాగతం పలికే సందర్భంగా ఆయనకు పాదాభివందనం చేశారు. ఆ తర్వాత కూడా చంద్రబాబుతో జయమంగళ ఏదో చెబుతూ అలా ఉండిపోయారు. జయమంగళను అక్కున చేర్చుకున్న చంద్రబాబు.. ఆయన చెప్పినదంతా సావదానంగా విన్నారు. అయినా ఇందులో …

Read More »

2027 జూన్ నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు… ఏపీకి జీవనాడి. జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం అలా కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత లేదు. కేంద్రం నుంచి ఇతోదిక సహకారం కూడా లబిస్తోంది. అయినా కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఏళ్ల తరబడి సాగుతూనే ఉంది. ఈ ప్రాజెక్టును టీడీపీ అధినేత, ఏపీ సీఎం …

Read More »

టాస్క్ ఫోర్స్ ఎంట్రీ.. గేట్స్ సహకారానికి రూట్ క్లియర్

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నేతృత్వంలోని గేట్స్ అండ్ మిలిండా ఫౌండేషన్ ఏపీకి వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు ఇప్పటికే ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అలా ఒప్పందాలపై సంతకాలు కాగానే… ఇలా సహకారం అందించేందుకు గేట్స్ ఫౌండేషన్ సిద్ధమైపోయింది. అదే సమయంలో గట్స్ ఫౌండేషన్ నుంచి ఎప్పుడెప్పుడు సహకారం లభిస్తుందా?అని ఎదురు చూసిన ఏపీలోని కూటమి ప్రభుత్వం కూడా…ఆ సంస్థ నుంచి సహకారం అందుకునేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. …

Read More »

నీచ రాజకీయాలకు దూరం… లేదంటే వారు జైల్లో ఉండేవారు: రేవంత్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరోమారు విరుచుకుపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం నాటి సమావేశాల్లో బాగంగా కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న రేవంత్.. కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో తనను ఎన్నో ఇబ్బందులు పెట్టిన వైనాన్ని రేవంత్ గుర్తు …

Read More »