Political News

షాకింగ్‌: ద‌స్త‌గిరి భార్య‌పై దాడి.. చంపుతామ‌ని బెదిరింపు!

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌లో అభియోగాలు ఎదుర్కొంటూ..అప్రూవ‌ర్‌గా మారిన షేక్ ద‌స్త‌గిరి భార్య షాబానాపై దాడి జ‌రిగింది. అయితే.. ఈ విష‌యం ఆల‌స్యంగా ఆమె వెల్ల‌డించారు. దాడి చేసిన వారు వైసీపీ మ‌హిళా కార్య‌క‌ర్త‌ల‌ని, వారు కూడా ముస్లిం సామాజిక వ‌ర్గానికి చెందిన వారేన‌ని తెలిపారు. త‌న‌ను బెదిరించి.. దాడి చేయ‌డంతో పాటు.. జ‌గ‌న్‌, ఎంపీ అవినాష్ రెడ్డిల జోలికి వ‌స్తే.. ద‌స్త‌గిరిని కూడా …

Read More »

ఎంపీ డీకే ఇంట్లోకి ఆగంతకుడు… కానీ చోరీ జరగలేదు

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంటిలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించిన విషయం ఆదివారం హైదరాబాద్ లో పెను కలకలమే రేపింది. అయితే ఆగంతకుడు ఇంటిలోకి ప్రవేశించిన సమయంలో ఎంపీ ఇంటిలో లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కట్టుదిట్టమైన భద్రత కలిగిన డీకే ఇంటిలోకి ఓ ఆగంతకుడు ఎంట్రీ ఇవ్వడం, ఆపై ఏకంగా గంటన్నరకు పైగా అతడు ఆ ఇంటిలో ఫ్రీగా సంచరించిన వైనం …

Read More »

సౌత్ ఇండియ‌న్ లీడ‌ర్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. !

బీజేపీకి ఉత్త‌రాదిలో ఉన్న బ‌లం.. ద‌క్షిణాదికి వ‌చ్చే స‌రికి లేకుండా పోయింది. నిజానికి బండి సంజ‌య్‌, కిష‌న్‌రెడ్డి, పురందేశ్వ‌రి వంటివారు ఉన్నా.. వారు బ‌ల‌మైన గ‌ళం వినిపించ‌లేక పోతున్నారు. బండి సంజ‌య్ ఫైర్ బ్రాండ్ మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ప్ప‌టికీ.. ఆయ‌న ఒక ప్రాంతానికి మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. కానీ, ద‌క్షిణాదిలో చూస్తే.. బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాటిని ఎదుర్కొని.. బీజేపీ ముందుకు సాగ‌డం అత్యంత కీల‌కం. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన …

Read More »

ఈ ఆంధ్రా రాగమేంది కవితక్క.. యాద్రాదికి సారు చేసిందేంటి?

kavitha

కొన్ని పాటలు కొన్ని సందర్భాలకే సూట్ అవుతాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కవిత మర్చిపోతున్నారా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేళ అధికారాన్ని సొంతం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పదేళ్లు పాలన చేసిన నాటి సంగతుల్ని ఆమె మర్చిపోతున్నారా? లేదంటే.. మర్చిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారా? అన్నదిప్పుడు ప్రశ్న. అధికారం చేజారితే భావోద్వేగ రాజకీయాలు మంచివే కానీ.. ప్రాంతాల పంచాయితీలు ఇప్పుడు అవసరమా? అన్నది ప్రశ్న. తాజాగా ఆమె మాట్లాడుతూ ఒక కీలక …

Read More »

ఢిల్లీలో రేవంత్ ఆ ‘గుట్టు’ కూడా విప్పారా..?

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ల పై విపక్షం బీఆర్ఎస్ గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను ఢిల్లీకి వెళ్లిన మాట వాస్తవమేనన్న రేవంత్… ఇంకా చాలా సార్లు… ఇంకా చెప్పాలంటే వందల సార్లు వెళతా అంటూ శనివారం నాటి అసెంబ్లీ సాక్షిగానే సంచలన ప్రకటన చేశారు. అయినా ఢిల్లీ వెళుతున్నది తానేదో గోటీలు ఆడటానికి కాదు కదా అన్న రేవంత్… కేంద్ర మంత్రులను, …

Read More »

లాంఛనం పూర్తి… రాజధానికి రూ.11 వేల కోట్లు

నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (హడ్కో) రాజధాని అమరావతికి రూ.11 వేల కోట్ల మేర రుణాన్ని ఇచ్చేందుకు చాలా రోజుల క్రితమే ఒప్పుకుంది. కూటమి సర్కారు అదికారం చేపట్టిన వెంటనే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కేంద్రం పెద్దలతో పాటు …

Read More »

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు… ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే చాలా తక్కువ వ్యవధిలోనే వారిద్దరూ దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ లెగసీని భుజానికెత్తుకున్న వారి పెద్ద కుమార్తె, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఓ రేంజిలో రాణిస్తున్నారు. ఇప్పటికే లెక్కలేనన్ని వివాదాలను దాటుకుని వచ్చిన అఖిల అన్ని అవరోధాలను తట్టుకుని …

Read More »

అంతా సిద్ధం!.. టెస్లా రావడమే ఆలస్యం!

ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా టెస్లాకు పేరుంది. ఆ సంస్థ కార్లు భారత్ లోకి ప్రవేశించేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైపోయింది. ఢిల్లీ, ముంబైలలో కంపెనీ కార్ల షోరూమ్ లు ఏర్పాటు అవుతున్నాయి. ఆపై తన కార్లను ఇక్కడే భారత్ లోనే ఉత్పత్తి చేసే దిశగా టెస్లా అడుగులు వేస్తోంది. ఇందుకోసం సరైన ప్రాంతాల ఎంపిక కోసం కూడా ఆ కంపెనీ అప్పుడే పరిశీలన ప్రారంభించినట్లు సమాచారం. ఈ …

Read More »

21 ప‌ద‌వులు.. 60 వేల ద‌రఖాస్తులు..

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన అనేక మందికి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. నామినేటెడ్ ప‌ద‌వుల‌తో సంతృప్తి క‌లిగిస్తున్నారు. ఎన్ని ప‌ద‌వులు ఇచ్చినా.. ఇంకా వేలాది మంది పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప‌ద‌వులు ద‌క్క‌క ఎదురు చూస్తున్నారు. తాజాగా రెండు రోజుల కింద‌ట‌.. మ‌ళ్లీ నామినేటెడ్ ప‌ద‌వుల వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. రాష్ట్రంలోని 21 ప్ర‌ముఖ దేవాల‌యాల‌కు బోర్డులు ఏర్పాటు చేసి.. వాటికి చైర్మ‌న్‌లుగా కూట‌మి పార్టీల నాయ‌కుల‌ను నియ‌మించాల‌ని …

Read More »

జగన్ కు సాయిరెడ్డి తలనొప్పి మొదలైనట్టే!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి తేరుకోకముందే… వైసీపీని వదిలి చాలా మంది కీలక నేతలు వైరి వర్గాల్లో చేరి ప్రత్యర్థులుగా మారిపోయారు. ఇప్పుడేమో… రాజకీయాలే వద్దంటూ సాగు చేసుకుంటానంటూ వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన వేణుంబాక విజయసాయిరెడ్డి మొన్నటికి మొన్న జగన్ పద్దతి బాగోలేదంటూ సంచలన వ్యాఖ్యలు …

Read More »

వైసీపీకి భారీ దెబ్బ‌.. ‘గుంటూరు’ పాయే!

ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ(ప్ర‌ధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో 2021లో అతి పెద్ద కార్పొరేష‌న్‌గా ఉన్న గుంటూరును ఆ పార్టీ ద‌క్కించుకుంది. నిజానికి బ‌ల‌మైన టీడీపీ ఓటు బ్యాంకును కూడా ఛేదించి ఇక్క‌డ పాగావేసింది. అయితే.. తాజాగా గుంటూరు మేయ‌ర్‌గా ఉన్న వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు కావ‌టి శివ‌నాగ‌ మ‌నోహ‌ర్ నాయుడు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆ వెంట‌నే ఆయ‌న …

Read More »

తోలు తీస్తా: సోష‌ల్ మీడియాకు రేవంత్ వార్నింగ్‌

సోష‌ల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోంద‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విష‌యంలో సీరియ‌స్‌గానే యాక్ష‌న్ తీసుకుంటామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ప్ర‌జాప్ర‌తినిధులు త‌ప్పులు చేస్తే.. వారిని ప్ర‌శ్నించ‌డం వ‌ర‌కు ప‌రిమితం కావాల‌ని, కానీ, వారి ఇంట్లో ఆడ‌వాళ్లు ఏం త‌ప్పులు చేశార‌ని వారిపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నార‌ని ఆయ‌న నిల‌దీశారు. అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న కామెంట్ల‌పై స్పందించారు. …

Read More »