Political News

ఏపీలో ఎన్నిక‌.. షెడ్యూల్ విడుద‌ల‌!

ఏపీలో కీల‌క‌మైన ఓ రాజ్య‌స‌భ సీటు ఎన్నిక‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా షెడ్యూల్ ప్ర‌క‌టించింది. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. త‌న రాజ్య‌స‌భ సీటుకు రాజీనామా చేసిన విజ‌య సాయిరెడ్డి సీటుకే ఇప్పుడు తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ ప్ర‌క‌టించింది. దీని ప్ర‌కారం.. భ‌ర్తీ కానున్న ఈ సీటుకు ఈ నెల 29వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల‌ను తీసుకుంటారు. అనంత‌రం.. ఈ నెల …

Read More »

ఆ ఇద్దరు ఓకే అంటే సాయిరెడ్డి సేఫేనా?

ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డిని ఇప్పుడు కేసులు చుట్టుముట్టేలానే ఉన్నాయని చెప్పక తప్పదు. ఓ వైపు కాకినాడ సీ పోర్టు వాటాల బదిలీ, మరోవైపు ఏపీ లిక్కర్ స్కాం.. ఇలా రెండు కీలక కేసులు సాయిరెడ్డిని నిద్ర పోనివ్వడం లేదు. ఇప్పటికే రెండు, మూడు సార్లు ఈ కేసుల్లో విచారణకు హాజరైన …

Read More »

బర్త్ డే కోసం ఫ్యామిలీతో ఫారిన్ కు చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు..ఢిల్లీ నుంచి విదేశీ విమానం ఎక్కనున్నారు. ఫలానా దేశం అని తెలియదు గానీ.. యూరోప్ లోని పలు దేశాల్లో చంద్రబాబు తన ఫ్యామిలీతో కలిసి దాదాపుగా ఆరు రోజులు సరదాగా గడపనున్నారు. చంద్రబాబు టూర్ పై ఏపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటనను విడుదల చేసింది. యూరోప్ పర్యటనను ముగించుకుని …

Read More »

విశాఖ‌కు మ‌హ‌ర్ద‌శ‌.. ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు!

ప్ర‌స్తుతం ఐటీ రాజ‌ధానిగా భాసిల్లుతున్న విశాఖ‌ప‌ట్నానికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. తాజాగా విశాఖ‌ప‌ట్నానికి సంబంధించిన అనేక కీల‌క ప్రాజెక్టుల‌కు చంద్ర‌బాబు నేతృత్వంలోని కేబినెట్ ప‌చ్చ‌జెండా ఊపింది. ప్ర‌ధానంగా విశాఖ‌కు మ‌ణిహారంగా భావిస్తున్న టీసీఎస్ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చింది. టీసీఎస్ సంస్థ‌తో రెండు మాసాల కిందట స‌ర్కారు ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ‌.. విశాఖ‌లో ఏర్పాటుకు మొగ్గు చూప‌డంతో ఐటీ హిల్స్‌పై ఏర్పాటుకు స‌ర్కారు అంగీకరించింది. దీనికిగాను 21.66 ఎక‌రాల‌ను కేటాయించేందుకు ప‌చ్చ‌జెండా …

Read More »

‘ఇది సరిపోదు.. వైసీపీని తిప్పికొట్టాల్సిందే’

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగింది. దాదాపుగా 3 గంటలకు పైగా సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో అజెండాలోని అంశాలపై చర్చ పూర్తి అయిన తర్వాత..కేబినెట్ మంత్రులతో చంద్రబాబు రాజకీయ అంశాలపై కీలక చర్చను చేపట్టారు. కూటమి సర్కారును అప్రతిష్ఠ పాలు చేసేందుకు వైసీపీ వ్యవహరిస్తూనే ఉందని ఆరోపించిన చంద్రబాబు… వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టే …

Read More »

ట్రంప్ టారిఫ్ లను తట్టుకున్న ఏకైక మార్కెట్ మనదే..

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి భారత స్టాక్ మార్కెట్ బయటపడిన మొదటి మార్కెట్‌గా నిలిచింది. ఇటీవల అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు అనంతరం మంగళవారం ట్రేడింగ్ ప్రారంభమైన నేపథ్యంలో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (నిఫ్టీ 50) 2.4 శాతం లాభంతో ట్రేడయ్యింది. ఇది ఏప్రిల్ 2న ట్రంప్ ఆదేశాల తర్వాత పడిపోయిన స్థాయిని మళ్లీ చేరుకోవడం విశేషం. ట్రంప్ చర్యల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా …

Read More »

దేశంలో తొలిసారిగా మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేయనున్న రోబో

మ్యాన్‌హోల్‌లోకి దిగుతూ ప్రాణాలు కోల్పోయే పారిశుద్ధ్య కార్మికుల ఘటనలు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ పనిని చేయడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు, విషవాయువుల బారిన పడే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా మ్యాన్‌హోల్‌లో  ప్రమాదాలు కూడా ఎక్కువే. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది.  రాబోయే రోజుల్లో మ్యాన్‌హోల్ శుభ్రపరిచే పని …

Read More »

పొలిటిక‌ల్ ఐపీఎస్‌లు.. ప్ర‌జ‌లు స్వాగ‌తించారా ..!

రాజ‌కీయాల్లోకి అఖిల భార‌త ఉద్యోగులు రావ‌డం స‌హ‌జం అయిపోయింది. ఉద్యోగాలు విర‌మ‌ణ చేసిన వారు కొంద‌రు.. మ‌ధ్య‌లోనే పీక్ స్టేజ్‌లో ఉన్న స్థితిలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని బ‌య‌ట‌కు వ‌చ్చిన వారు మ‌రికొందరు. ఎలా చూసినప్ప‌టికీ.. వీరి ల‌క్ష్యం రాజ‌కీయాలు. అందరిబాటా.. ప్ర‌జా క్షేత్ర‌మే. కానీ.. వీరిలో విజ‌యంద‌క్కించుకున్న‌వారు ఎవ‌రు?  ఎంత మంది? అంటే.. ప్ర‌శ్న‌లు త‌ప్ప స‌మాధానం లేదు. అయినా.. ఏటికి ఎదురీదుతున్న‌ట్టు వారు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. …

Read More »

విచార‌ణ‌కు రండి..: సాయిరెడ్డికి నోటీసులు

“విచార‌ణ‌కు రండి. ఈ నెల 18న హాజ‌రై మాకు స‌హ‌క‌రించండి. వ‌చ్చేప్పుడు మీ వ‌ద్ద ఉన్న ఆధారాలు వివ‌రాలు కూడా తీసుకురండి!” అని వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డికి వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంపై విచార‌ణ చేస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు తాజాగా నోటీసులు పంపించారు. ఆయ‌న ఈమెయిల్ స‌హావాట్సాప్‌ల‌కు ఈ నోటీసులు పంపించార‌ని అధికారులు తెలిపారు. ఈ నెల 18న …

Read More »

2న అమరావతికి మోదీ.. రాజధాని పనుల పున:ప్రారంభం

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. మే నెల 2న అమరావతి రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ… రాజధాని పనులను పున:ప్రారంభించనున్నారు. ఈ మేరకు అమరావతి పర్యటనకు సంబంధించి మోదీ షెడ్యూల్ మంగళవారం ఖరారు అయ్యింది. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు …

Read More »

భూమ‌న‌పై టీటీడీ ఫిర్యాదు.. కేసు న‌మోదు!

వైసీపీ నాయ‌కుడు, తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డిపై తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఫిర్యాదు చేసింది. తిరుప‌తి జిల్లా ఎస్పీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రాజుకు టీటీడీ బోర్డు స‌భ్యుడు, బీజేపీ నాయ‌కుడు.. భాను ప్ర‌కాష్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు న‌మోదుచేస్తామ‌ని ఎస్పీ మీడియాకు చెప్పారు. కాగా.. భూమ‌న‌పై టీటీడీ ఫిర్యాదు చేయ‌డం ఇదే తొలిసారి. పైగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం మాజీ చైర్మ‌న్‌పై ఫిర్యాదు చేయ‌డం.. కేసు న‌మోదు చేయ‌డం కూడాఇదే …

Read More »

సోనియా అల్లుడికి ఈడీ న‌జ‌ర్‌.. ఏం జ‌రిగింది?

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నాయ‌కురాలు.. సోనియా గాంధీ అల్లుడు.. ప్రియాంక గాంధీ భ‌ర్త‌.. రాబ‌ర్ట్ వాద్రాను ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు మ‌రోసారి టార్గెట్ చేశారు. విచార‌ణ‌కురావాలంటూ.. తాజాగా ఆయ‌న‌కు నోటీసులు పంపించారు. ఈ నెల 20న ఢిల్లీలోని త‌మ‌ కార్యాల‌యానికి రావాలంటూ.. ఈడీ అధికారులు నోటీసుల్లో స్ప‌ష్టం చేశారు. వ‌చ్చేప్పుడు.. గుర్గావ్‌లోని భూములకు సంబంధించి ఉన్న ఆధారాల‌ను కూడా తీసుకురావాల‌ని పేర్కొన్నారు. కాగా.. గ‌త మూడేళ్ల కింద‌టే వాద్రాపై …

Read More »