గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలకు సవాల్గా మారింది. కొన్ని రోజుల కిందట జనసేన నుంచి వచ్చిన ఎర్రం వెంకటేశ్వర రెడ్డి వైసీపీలో చేరారు. దీంతో సత్తెనపల్లిలో వైసిపి మరింత పుంజుకుంటుంది అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే మరోవైపు వైసీపీలోనే సత్తెనపల్లిలో ఉన్న లోకల్ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు తుమ్ములాటలు తరచుగా తరమీదకు వస్తున్నాయి. అంబటి రాంబాబు తమను పట్టించుకోవడంలేదని కనీసం తమకు …
Read More »కాంగ్రెస్ టార్గెట్ @150
కర్నాటక ఎన్నికల్లో సాధించిన ఘనవిజయం కాంగ్రెస్ పార్టీ నేతల్లో అంతులేని ఆత్మవిశ్వాన్ని నింపినట్లే ఉంది. అందుకనే ఈ ఏడాది చివరలో జరగబోతున్న మధ్యప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాదించాలని గట్టిగా డిసైడ్ అయ్యింది. మధ్యప్రదేశ్ లోని 230 సీట్లలో కాంగ్రెస్ 150 గెలుచుకుంటుందని అగ్రనేత రాహుల్ గాంధి చెప్పారు. ఇపుడు ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కు 96 సీట్లుంది. నిజానికి 2018 ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీయే. కాకపోతే ముఖ్యమంత్రి …
Read More »బీఆర్ఎస్ వెరీ రిచ్ గురూ
తెలంగాణా లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రిచ్చెస్ట్ రాజకీయ పార్టీ ఏదంటే ఎవరైనా బీఆర్ఎస్ అనే చెప్పాలి. ఆ పార్టీకి స్ధిర, చరాస్తులు విపరీతంగా పోగుపడుతున్నాయి. బ్యాంకుల్లో పార్టీ ఖాతాలో సుమారు రు. 760 కోట్లు ఉన్నట్లు కేసీయారే చెప్పారు. అందుకనే పార్టీ కోసం ప్రత్యేకంగా విమానాన్నే కొనుగోలు చేయాలని కేసీయార్ ఆ మధ్య చాలా ఆలోచనలు చేశారు. తర్వాత ఎందుకో ఆ జోరు తగ్గింది. ఇపుడిదంతా ఎందుకంటే …
Read More »విలీనం దిశగా షర్మిల అడుగులు?
తెలంగాణాలో ఉనికి చాటుకోవాలన్నా, రాజకీయంగా నిలదొక్కుకోవాలన్నా కాంగ్రెస్ లో విలీనం చేయటమే వైఎస్ షర్మిల ముందున్న ఆప్షన్ అనే ప్రచారం పెరిగిపోతోంది. వైఎస్సార్టీపీ పెట్టిన షర్మిల కొంతకాలంగా హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎంత హడావుడిచేస్తున్నా జనాలైతే పార్టీని పెద్దగా పట్టించుకోవటంలేదనే చెప్పాలి. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ మధ్యలో షర్మిల పార్టీ ఉనికి కూడా చాటుకోలేకపోతోంది. ఈ నేపధ్యంలోనే ఏమిచేయాలనేది షర్మిలకు పెద్ద సమస్యగా మారింది. …
Read More »మరింత కాక రేపిన పొంగులేటి-జూపల్లి రాజకీయం..
తెలంగాణ రాజకీయాల్లో కొన్ని రోజులుగా ఆసక్తిగా మారిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యవహారం.. రోజుకో మలుపు తిరుగుతోంది. వారిద్దరూ ఏ పార్టీలో చేరుతారనే విషయంపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురై.. ఆ పార్టీ నుంచి బయటకొచ్చిన ఈ నేతలను తమ పార్టీలోకి లాక్కునేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ చీఫ్ రేవంత్ …
Read More »హరహరా ఎందుకు ఇన్ని కష్టాలు
అసలు నిర్మాత ఏఎం రత్నంకు ముహూర్త బలం బాలేనట్టు ఉంది. పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు ఏ క్షణంలో తలపెట్టారో కానీ అప్పటి నుంచి విఘ్నాలు తలెత్తునే ఉన్నాయి. కరోనా టైంలో వర్షానికి సెట్లు కూలిపోయాయి. షూటింగ్ చాలా సార్లు వాయిదా పడుతూ ఆగుతూ సాగుతూ జరుగుతోంది. కొందరు ఆర్టిస్టులు మారిపోయారు. దీనికన్నా చాలా ఆలస్యంగా మొదలైన బ్రో, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లు శరవేగంగా చిత్రీకరణలు …
Read More »మహానాడు.. ఆ నలుగురు ఏమయ్యారు?
అత్యంత కీలకమని టీడీపీ అధినేత చెబుతూ వచ్చిన మహానాడు.. ముగిసింది. వచ్చే 2024 ఎన్నికల్లో గెలు పే లక్ష్యంగా ఆయన ఈ మహానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్.. తన ఇమేజ్కలగలిపి వచ్చే ఎన్నిక ల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలనేది చంద్రబాబు వ్యూహం. అయితే.. ఇంత ఇంపార్టెంటు అని చెబుతున్న మహానాడుకు నలుగురు కీలక నాయకులు.. డుమ్మా కొట్టడం.. పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వారిలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, విశాఖ …
Read More »ఏపీలో మారుతున్న పొలిటికల్ పవనాలు..
ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే ఏపీలో కేబినెట్ భేటీకి రంగం రెడీ అయింది. జూన్ 7వ తేదీన ఈ భేటీ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గత రెండు రోజుల కిందట సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. తొలిరోజు నీతిఆయోగ్ భేటీలో పాల్గొన్నారు. అనంతరం.. పార్లమెంటు …
Read More »వైసీపీ వర్సెస్ జనసేన.. ఒంగోలు కుతకుత!
ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షం జనసేనల మధ్య రాజకీయం గరంగరంగా మారింది. జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్న ట్వీట్లు.. వేస్తున్న కామెంట్లు రాజకీయంగా చర్చకు దారితీస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు కౌంటర్గా వైసీపీ నుంచి కూడా అదేరేంజ్లో కౌంటర్లు పడుతున్నాయి. అయితే.. ఇవి మరింత ముదిరి.. ఫ్లెక్సీల దాకా వచ్చాయి. ఒకరికి వ్యతిరేకంగా ఒకరు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజుల కిందట …
Read More »టీడీపీ.. దీనికే సమాధానం చెబుతుంది?
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశం.. తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల మేనిఫెస్టోనే. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో మహ19-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు రూ.1500 చొప్పున నగదు బదిలీ.. స్కూలుకెళ్లే ప్రతి చిన్నారికీ అమ్మ ఒడి.. రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున సాయం.. ఇలాంటి ఆకర్షణీయ హామీలతో తెలుగుదేశం ప్రకటించిన మేనిఫెస్టో హాట్ టాపిక్గా మారింది. సంక్షేమ పథకాల అమలుతో జగన్ ప్రభుత్వం తమ గుప్పెట్లో పెట్టుకున్న వర్గాలను ఆకర్షించడమే లక్ష్యంగా …
Read More »మోడీ తప్పుచేస్తున్నారా?
నరేంద్రమోడీ తప్పు చేస్తున్నారు. ప్రపంచంలో మన దేశ ఖ్యాతిని గొప్పగా చాటి చెబుతున్న మహిళా రెజ్లర్ల సమస్యలను పరిష్కరించటంలో మోడీ చాలా నిర్లక్ష్యం చూపుతున్నట్లు అర్ధమవుతోంది. ఆదివారం పార్లమెంట్ భవనం దగ్గరకు వెళ్ళాలని ప్రయత్నించిన మహిళా రెజ్లర్ల ను పోలీసులు అడ్డుకుని ఈడ్చుకుని తీసుకెళ్ళి బస్సుల్లో పడేశారు. బస్సుల్లో వాళ్ళందరినీ వేర్వేరు పోలీసుస్టేషన్లకు తీసుకెళ్ళారు. పోలీసుల చర్యలతో ఏమైందంటే మహిళా రెజ్లర్ల మీద జరుగుతున్న దాడులు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా టెలిక్యాస్టయ్యింది. దీనివల్ల పోయేది రెజ్లర్ల …
Read More »మహానాడులో వీటిని మిస్సయ్యారా? మిస్ చేశారా?
అంగరంగ వైభవంగా రెండు రోజుల పాటు నిర్వహించిన మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు అనేక విషయాలను ప్రస్తావించారు. వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతల దూకుడును ప్రస్తావిం చారు. రౌడీ రాజకీయం అంటూ.. విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న దోపిడీని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. అయితే.. ఇంత వరకుబాగానే ఉంది. కానీ, పార్టీ నాయకులు..సీనియర్ నేతలు ఆశగా ఎదురు చూసిన మూడు విషయాలను మాత్రం చంద్రబాబు మిస్ …
Read More »