జనసేన అధినేత, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ నటించిన బ్రో మూవీపై కొద్ది రోజులుగా రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. బ్రో మూవీలో శ్యాంబాబు క్యారెక్టర్ తనదేనంటూ అంబటి రాంబాబు గొడవ చేయడం, దానికి నిర్మాత విశ్వ ప్రసాద్, సాయి ధరమ్ తేజ్, పృథ్వీ రాజ్ లు క్లారిటీనివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తొలిసారిగా ఆ వ్యవహారంపై పవన్ కల్యాణ్ స్పందించారు. సినిమాను రాజకీయాల్లోకి తేవొద్దని జనసైనికులకు పవన్ …
Read More »వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి బెయిల్ దాఖలకు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది. శుక్రవారం సుప్రీం కోర్టు లో పరిణామం జరిగింది. అయితే ట్రయిల్ కోర్టులో బెయిల్ దాఖలుకు ఎలాంటి అడ్డంకులు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఏదైనా సందర్భంలో సెప్టెంబర్ వరకు కానీ విచారణ ప్రారంభం కాకపోతే బెయిల్ …
Read More »షణ్ముఖ వ్యూహంతోనే జగన్ను గద్దె దింపుతా: పవన్
వైసీపీ అధినేత, సీఎం జగన్కు అహంకారం పెరిగిపోయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. షణ్ముఖ వ్యూహంతోనే ఆయనను గద్దె దింపుతామని చెప్పారు. ఒక దుష్టనేతపై పోరాటం చేస్తున్నామని.. ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్తుంచుకోవాలని సూచించారు. తాజాగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనేక విషయాలను ఆయన పంచుకున్నారు. నేతలకు ఆహ్వానంతన పార్టీలో చేరాలని అనుకునేవారు.. ఎవరైనా వచ్చే చేరొచ్చని పవన్ …
Read More »ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ లో క్రిమినల్స్: తోపుదుర్తి
నీటిపారుదల ప్రాజెక్టుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రాయలసీమ పర్యటన విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో ప్రసంగించిన చంద్రబాబు…రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తోపుదుర్తి చేసిన అవినీతి అంతా కక్కిస్తానని, ఎక్కడ దాక్కున్నా వదిలేది లేదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలు కర్ర తీసుకుని దాడికి వస్తే కర్రతోనే సమాధానం చెప్పాలని …
Read More »కాంగ్రెస్ ఆశలన్నీ వైసీపీ పైనేనా ?
వినడానికి విచిత్రంగా ఉన్నా నిజమంటున్నారు హస్తం పార్టీ నేతలు. ఇంతకీ విషయం ఏమిటంటే షెడ్యూల్ ఎన్నికలు మరో తొమ్మిది నెలల్లో ఉంది. వైసీపీ ఒంటరి పోటీకి రెడీ గా ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ వ్యవహారం ఏమీ తేలలేదు. ఈ మూడు పార్టీల వ్యవహారం తేలకుండా కాంగ్రెస్, వామపక్షాల విషయంలో క్లారిటిరాదు. ఎందుకంటే టీడీపీ, జనసేనతో బీజేపీ గనుక లేకపోతే కాంగ్రెస్ లేదా వామపక్షాలు టీడీపీ, జనసేనతో కలిసే అవకాశముంది. …
Read More »పుంగనూరులో టీడీపీ ఉగ్రరూపం
చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటిస్తున్న నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ అధినేత పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు, వైసీపీ నేతలు ప్రయత్నించడంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. దీంతో టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు కూడా వారి లాఠీలకు పని చెప్పాల్సివచ్చింది. అయినప్పటికీ ఆగకపోయేసరికి భాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. అన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా టీడీపీ కార్యకర్తలు శాంతించకుండ పోలీసులను తరిమికొట్టారు. దీంతో …
Read More »అయిదుగురు కలిసి సీట్ల ఎంపిక.. తేలే విషయమేనా?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలు, కసరత్తుల్లో నిమగ్నమయ్యాయి. ముందుగా పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసే దిశగా ప్రణాళికల్లో మునిగి తేలాయి. ఒక్క సీటు కోసం ఇద్దరి కంటే ఎక్కువ నేతల మధ్య పోటీ, తమ వర్గం వాళ్లకే టికెట్లు దక్కాలనే అగ్ర నేతల పట్టు.. ఇలాంటి సమస్యలు పార్టీలకు తలనొప్పిగా మారాయి. ఇక తెలంగాణలో బీజేపీ విషయానికి వస్తే సీట్ల …
Read More »సీమను పవన్ వదులుకున్నట్టేనా?
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా లేదు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వారాహి యాత్ర పేరుతో ప్రజల్లో ఉంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్రను విజయవంతంగా ముగించారు. ఇక ఇప్పుడు ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టారు. ఉత్తరాంధ్రలో తదుపరి వారాహి యాత్రను కొనసాగించనున్నారు. దీంతో రాయలసీమపై పవన్ ఆశలు వదులుకున్నారని, అందుకే వారాహి యాత్ర కొనసాగింపునకు ఉత్తరాంధ్రను ఎంచుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. …
Read More »సికింద్రాబాద్ బరిలో షర్మిల.. కానీ ఆ పార్టీ నుంచి!
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై విమర్శలు దాడి పెంచిన షర్మిల కొంతకాలం నుంచి మౌనంగా ఉంటున్నారు. మధ్యలో నిరుద్యోగుల సమస్యల కోసం నిరాహార దీక్షలు చేసిన ఆమె.. పాదయాత్ర కూడా నిర్వహించారు. కానీ ఇప్పుడేమో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అయితే ఆమె వచ్చే లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అది కూడా తన సొంత పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ …
Read More »కేఏ పాల్.. ఇక విశాఖ పాల్!
ప్రజాశాంతి పార్టీ పెట్టి.. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేఏ పాల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎన్నికల ప్రచారంలో తన హావాభావాలతో ఆయన చేసిన సందడి గుర్తే ఉండి ఉంటుంది. ఆ ఎన్నికల తర్వాత కొంతకాలం సైలెంట్ అయిపోయిన ఆయన.. మధ్యమధ్యలో సమస్యలపై మాట్లాడుతూ, ఉప ఎన్నికల్లో హల్చల్ చేస్తూ కనిపించారు. ఇప్పుడు మరోసారి ఎన్నికలు దగ్గరపడుతుండడంతో మళ్లీ కేఏ పాల్ యాక్టివ్ అవుతున్నట్లున్నారు. తాజాగా ఆయన …
Read More »‘మార్గదర్శి’ విషయంలో వైసీపీ అనుకున్నది జరగలేదా?!
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, చిట్ఫండ్ కంపెనీ విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుకున్న విధంగా ఏమీ జరగలేదా? ఈ విషయంలో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయని పెద్దలు బాధపడుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ నాయకులు. తాజాగా సుప్రీంకోర్టులోనూ.. సర్కారు తలపెట్టిన కార్యం నెరవేరలేదు. మార్గదర్శి చిట్ఫండ్ కేసులను ఏపీ పరిధిలోని హైకోర్టులో విచారించేలా ఆదేశించాలని కోరుతూ.. ఏపీ ప్రభుత్వం …
Read More »అభివృద్ధి లేదు అని నిరూపిస్తే చెప్పుతో కొట్టించుకుంటా!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కులం తన కులం ఒకటే అయినందుకు సిగ్గుపడుతున్నానని పోసాని కృష్ణ మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులతో సీఎం జగన్ ను చంద్రబాబు తిట్టిస్తున్నాడని విమర్శించారు. మీ బిడ్డగా మీ మంచి కోసం చెబుతున్నా చంద్రబాబుతో ఉంటే.. ఆయన మాట వింటే మీరు సర్వ నాశనమైపోతారని అమరావతి రైతులను హెచ్చరించారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయాక ఒకరోజు తుళ్లూరు మీదుగా జగన్ కారులో వెళుతుంటే రైతులతో …
Read More »