Political News

వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వొచ్చన్న బీజేపీ ఫైర్ బ్రాండ్

ఏపీ అసెంబ్లీలో వైసీపీకి నిబంధనల ప్రకారం ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు అన్న విషయం తెలిసిందే. కానీ, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ నేతలు మారాం చేస్తున్నారు. దీంతో, జగన్ అండ్ కోపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి బీజేపీ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ లాయర్ సుబ్రహ్మణ్యస్వామి బాసటగా నిలిచిన వైనం చర్చనీయాంశమైంది. టెక్నికల్ గా ఏ శాసన సభలో …

Read More »

నేను ఊహించ‌లేదు: ప‌వ‌న్‌కు చంద్ర‌బాబు అభినందన‌లు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను సీఎం చంద్ర‌బాబు అభినందించారు. అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై ప్ర‌సంగించిన సీఎం.. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ చూస్తున్న‌పంచాయ‌తీ రాజ్ ను ప్ర‌స్తావించారు. త‌న శాఖ‌ను పవ‌న్ క‌ల్యాణ్ అద్భుతంగా ముందుకు న‌డిపిస్తున్నార‌ని చెప్పారు. తాను అస్స‌లు ఊహించ‌లేద‌ని.. చాలా బాగా ప‌నిచేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. దీనికిగాను తాను ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అభినంద‌న‌లు తెలుపుతున్నాన‌ని చెప్పారు. ముఖ్యంగా ఏపీలో చేప‌డుతున్న స్వ‌చ్ఛాంద్ర …

Read More »

వైసీపీకి ప్రతిపక్ష హోదాపై తేల్చేసిన చంద్రబాబు

అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు అడ్డుకోవడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నిన్న చీకటి రోజు అని, గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు అడ్డుపడిన తీరును ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ అంటే ఒక గౌరవమని, ఒక పవిత్ర దేవాలయం అని..కానీ,వైసీపీ సభ్యులు దానిని అపవిత్రం చేశారని మండిపడ్డారు. సరిగ్గా 11 గంటలకు జగన్ శాసన సభకు 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చిన కేవలం …

Read More »

బాబు, పవన్ లతో హన్మన్న భేటీ.. మ్యాటరేంటంటే?

ఏపీకి మంగళవారం ఓ విశిష్ట అతిథి విచ్చేశారు. నేరుగా ఏపీ రాజదాని అమరావతి వచ్చిన సదరు అతిథి… ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోనూ భేటీ అయ్యారు. ఆ విశిష్ట అతిథి మరెవరో కాదు… ఈ తరం నేతలంతా వీహెచ్ గా… ఆత్మీయులంతా హన్మన్నగా పిలుచుకునే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నేత, మాజీ ఎంపీ వి.హన్మంతరావు. మంగళవారం హైదరాబాద్ …

Read More »

రేవంత్ దెబ్బను ఆ పార్టీలు తట్టుకోలేకపోతున్నాయా…?

ఎనుముల రేవంత్ రెడ్డి… సిసలైన రాజకీయాన్ని టీడీపీలో నేర్చుకుని కాంగ్రెస్ లో చేరిన గండరగండుడు. రేవంత్ వచ్చేదాకా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరమేనని చెప్పాలి. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజీ దక్కి ఉండాల్సింది. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్రాప్ లో పడిపోయిన కాంగ్రెస్ ఆ క్రెడిట్ ను ఆయనకే వదిలేసి చేేజేతులారా నష్టాన్ని కొని తెచ్చుకుంది. ఆ తప్పు …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ నలుగురి ఓట్లు ఎలా..?

ఏపీలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. గురువారం ఉదయం ఈ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ జరగనుంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లంతా ఉపాధ్యాయులే కావడంతో అదేమంత సాధారణ జనానికి పెద్దగా సంబంధం లేని వ్యవహారమే. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు (డిగ్రీ పూర్తి చేసిన వారు) తమ ఓటు హక్కు వినియోంచుకుంటారు. అయితే ఈ గ్రాడ్యుయేట్లు కూడా తమకు ఎక్కడ ఓటు హక్కు ఉంటే …

Read More »

మే నుంచే త‌ల్లికి వంద‌నం.. చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఏపీలోని చిన్నారుల త‌ల్లులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ‘త‌ల్లికి వంద‌నం’ ప‌థ‌కంపై సీఎం చంద్ర బాబు ఏపీ అసెంబ్లీలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై స్పందించిన సీఎం చంద్ర‌బాబు.. ఐదు సంవ‌త్స‌రాలుగా భ్ర‌ష్టు ప‌ట్టిపోయిన వ్య‌వ‌స్థ‌ల‌ను, వైసీపీ హ‌యాం లో నిర్వీర్యం అయిపోయిన వ్య‌వ‌స్థ‌ల‌ను గాడిలో పెడుతున్న‌ట్టు చెప్పారు. త‌ను నాలుగోసారి ముఖ్య‌మంత్రి అయ్యాయ‌ని.. కానీ.. ఇలాంటి ఇబ్బందుల‌ను గ‌తంలో ఎప్పుడూ ఎదుర్కోలేద‌న్నారు. అప్ప‌ట్లోనూ …

Read More »

ప్రవీణ్ ఆదిత్యకు ఫైబర్ నెట్ పగ్గాలు

అటు జీవీ రెడ్డి, ఇటు ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ పంతాలు, పట్టింపుల కారణంగా పెను వివాదానికి కేంద్రంగా మారిన ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ దిద్దుబాటులో భాగంగా రెండో దశ చర్యలకు తొలి అడుగు పడింది. ఇప్పటికే సంస్థను వివాదంలోకి నెట్టిన జీవీ రెడ్డి సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేయగా… తన వంతు ఆజ్యం పోసిన దినేశ్ ను చంద్రబాబు సర్కారు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. …

Read More »

సోమిరెడ్డి గారూ.. ‘సందడి’ లేదండి!

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతాయని… కూటమి సర్కారును విపక్ష వైసీపీ కడిగిపారేస్తుందని.. వైసీపీ చేసే వాదనలను కూటమి తుత్తునీయలు చేస్తుందని అంతా ఆశించారు. ఆ మేరకే…సోమవారం నాటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఏపీ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా మధ్యాహ్నం దాకా టీవీలకు అతుక్కుపోయాయి. అయితే వారి ఆశలన్నీ అడియాశలే అయిపోయాయి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతుందనుకున్న వైసీపీ తనకు ప్రధాన …

Read More »

15 ఏళ్ల పాటు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం: పవన్

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలు, వైసీపీ అనుకూల మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఒకటే దుష్ప్రచారం పదేపదే చేస్తున్నాయని టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టి కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు 9 నెలలుగా కొనసాగుతూనే ఉన్నాయని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వ ఐక్యతపై ఏపీ డిప్యూటీ …

Read More »

ఆ ఇద్దరు… ఎవరు ఎవరికీ తగ్గట్లేదు

ఇటు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ గా కొనసాగుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి… అటు రాజకీయ నేతగా మారిన సినీ నటి మాధవీ లత… ఇద్దరు కూడా ఒకరికి ఒకరు ఏమాత్రం తగ్గకుండా సాగుతున్నారు. ఓ చిన్న వివాదం వీరిద్దరి మధ్య రచ్చకు కారణంగా నిలవగా.. ఆ రచ్చ దాదాపుగా రెండు నెలల తరబడి కొనసాగుతుండటం గమనార్హం. ఓ వైపేమో వీరిద్దరి …

Read More »

య‌న‌మ‌ల సేఫ్‌.. వంగ‌వీటికి ల‌క్ ..!

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుతం మండ‌లిలో టీడీపీ ప‌క్ష నాయ‌కుడిగా కూడా ఉన్న య‌న‌మ‌ల రా మ‌కృష్ణుడు సేఫ్‌జోన్‌లోనే ఉన్నార‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఆయ‌న ప‌ద‌వీ కాలం.. వ‌చ్చే నెల‌తో ముగియ నుంది. దీంతో తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల జాబితాలో ఈయ‌న సీటు కూడా చేరింది. అయి తే.. ఈయ‌న‌ను వ‌దులుకునే అవ‌కాశం చంద్ర‌బాబుకు లేద‌ని అంటున్నారు పార్టీ సీనియ‌ర్లు. వైసీపీ హ‌యాంలో మూడు రాజ‌ధానుల బిల్లు …

Read More »