Political News

వైసీపీ లిక్క‌ర్ స్కామ్‌.. హైద‌రాబాద్‌లో సోదాలు

వైసీపీ హ‌యాంలో ఏపీలో లిక్క‌ర్ కుంభ‌కోణం జ‌రిగింద‌ని.. దాదాపు 2 వేల కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నాన్ని వైసీపీ కీల‌క నాయ‌కులు మింగేశార‌ని ఆరోపించిన కూట‌మి ప్ర‌భుత్వం.. దీనిపై విచార‌ణ‌కు విజ‌య‌వాడ పోలీసు క‌మిష‌న‌ర్ రాజ‌శేఖ‌ర‌బాబు నేతృత్వం లో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని నియ‌మించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో అనేక మంది పేర్ల‌ను కూడా చేర్చింది. వీరిలో క‌సిరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఉర‌ఫ్ రాజ్‌.. పేరు ప్ర‌ముఖంగా ఉంది. అదేవిధంగా ఒక …

Read More »

కాంగ్రెస్ ప్ర‌భుత్వం బుల్ డోజ‌ర్ల‌తో బిజీగా ఉంది: మోడీ సెటైర్లు

తెలంగాణ‌లోని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నిశిత విమ‌ర్శ‌లు గుప్పించారు. “అడ‌వుల్లోకి బుల్ డోజ‌ర్లు పంపిస్తున్నారు“ అంటూ.. ఆయ‌న ఎద్దేవా చేశారు. తాజాగా హ‌రియాణాలో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని మోడీ… అక్క‌డి వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌పై నిర్వ‌హిం చిన స‌ద‌స్సులో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌స్తావ‌న‌ను తీసుకువ‌చ్చారు. కాంగ్రెస్ పాలిత తెలంగాణ‌లో అడ‌వుల్లోకి బుల్ డోజ‌ర్లు పంపిస్తున్నార‌ని.. త‌ద్వారా వ‌న్య‌ప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయ‌ని …

Read More »

అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన ఫలితాలపై చంద్రబాబు హర్షం

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో పర్యటించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్ కు నివాళి అర్పించిన చంద్రబాబు… అక్కడే ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన కింద బలహీన వర్గాలకు చెందిన చాలా …

Read More »

ఇలాంటి క‌న్నీళ్లు… లోకేష్ ఎప్పుడూ చూసి ఉండ‌రు!

క‌న్నీళ్లు క‌ష్టాల్లోనే కాదు.. ఇష్టాల్లోనూ వ‌స్తాయి. ఏక‌న్నీరెన‌కాల ఏముందో తెలుసుకోవ‌డం.. ఈజీనే!  ఇప్పుడు ఇలాంటి క‌న్నీళ్లే.. మంత్రి నారా లోకేష్‌ను చుట్టుముట్టాయి. “తాత వెలుగులు నింపితే…మనవడు గూడుఇచ్చాడయ్యా“ అంటూ మంగ‌ళ‌గిరి ప్ర‌జలు మంత్రి లోకేష్ ను చుట్టుముట్టి.. త‌మ ప‌ట్ట‌లేని ఆనందాన్ని క‌న్నీటి రూపంలో ఆయ‌న ముందు కార్చేసి.. సంతోషం వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. కొంద‌రైతే.. ఆయ‌న‌ను కావ‌లించుకుని త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. విష‌యం ఏంటి? ప్ర‌స్తుత త‌న సొంత …

Read More »

17 ల‌క్ష‌ల‌తో భోజ‌నం పెట్టారు: లెజినోవాపై ప్ర‌శంస‌లు!

సింగపూర్‌లో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో త‌మ కుమారుడు మార్క్ శంక‌ర్ కోలుకుని ఇంటికి తిరిగి వ‌చ్చిన క్ష‌ణాల నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌తీమ‌ణి అన్నా లెజినోవాల‌.. తిరుమల శ్రీ వెంక టేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్ర‌మే తిరుమ‌ల‌కు చేరుకున్న ఆమె.. సంప్ర‌దాయ డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేశారు. అనంత‌రం భూవ‌రాహ‌స్వామిని ద‌ర్శించుకుని ప్రత్యేక పూజ‌లు చేశారు. త‌ర్వాత‌.. క‌ళ్యాణ‌క‌ట్ట‌కు వెళ్లి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. అనంత‌రం …

Read More »

తెలంగాణలో అమల్లోకి ఎస్సీ వర్గీకరణ… ఎవరికి ఎంతంటే?

తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సోమవారం ఓ కీలక అడుగు వేసింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజు అయిన సోమవారం నాడు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకువస్తూ అదికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుతో పాటు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ఈ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. వెరసి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సోమవారం నుంచి అమలులోకి వచ్చినట్టేనని చెప్పాలి. సుదీర్ఘ కాలంగా మాదిగలు వారి తరఫున …

Read More »

పవన్ అభివృద్దిలో మరింత వేగం పక్కా!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపడుతున్న అభివృద్ది పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ అలా చెబుతుంటే.. పనులు ఇలా జరిగిపోతున్నాయి. నిధుల విడుదల, పనుల గుర్తింపు, పనులను కాంట్రాక్టర్లకు అప్పగింత, పనుల ప్రారంభం… అన్నీ ఇట్టే చకచకా జరిగిపోతున్నాయి. ఇందుకు పవన్ ఎంచుకున్న అధికారులే కారణమని చెప్పాలి. కేరళ కేడర్ ఐఏఎస్ అదికారిగా ఉన్న కృష్ణతేజను ఏరికోరి మరీ ఏపీకి రప్పించుకున్న పవన్… …

Read More »

తాను చెడి.. పార్టీని చెరిపి..

గోరంట్ల మాధ‌వ్‌. 2022లో జోరుగా వినిపించిన పేరు. హిందూపురం వైసీపీ ఎంపీగా అప్ప‌ట్లో ఆయ‌న న్యూడ్ వీడియో ఆరోపణల తో అడ్డంగా దొరికిపోయారు. అయితే.. దీనిని స‌మ‌ర్థించుకునేందుకు నానా పాట్లు ప‌డ్డారు. ఇక‌, బీసీ నాయ‌కుడు కావ‌డం.. తాను ఏరికోరి పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేయించి.. పార్టీలో చేర్చుకున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ కూడా.. ఆయ‌న‌ను చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించారు. ఫ‌లితంగా వైసీపీకి మ‌హిళా ఓటు బ్యాంకుదూర‌మైంది. అయితే.. ఇప్ప‌టికీ గోరంట్ల …

Read More »

ఏడాది టైం పెట్టి 10 నెలల్లోనే.. తండ్రికి తగ్గ తనయుడు!

ఎవ‌రైనా నాయ‌కులు ఎన్నిక‌ల‌కు ముందు ఏదైనా హామీ ఇస్తే.. దానిని నెర‌వేర్చేందుకు స‌మ‌యం ప‌డుతుంది. పైగా గెలిచిన త‌ర్వాత‌.. వారిచ్చిన హామీల‌ను అమ‌లు చేయాలంటూ.. ప్ర‌జ‌లు గుర్తు చేయాల్సిన ప‌రిస్థితి కూడా ఉంటుంది. అందుకే.. నాయ‌కులు ఇచ్చే హామీల్లో స‌గానికి పైగా అమ‌లుకు నోచుకోవ‌డం క‌ష్ట‌మ‌నే టాక్ ఉంది. అయితే.. ఈ వాద‌న‌ను కొట్టి పారేస్తూ.. మంత్రి నారా లోకేష్‌.. త‌న తండ్రి చంద్ర‌బాబుకు తగ్గ త‌న‌యుడిగా పేరు తెచ్చుకునే …

Read More »

రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. జ‌గ‌న్ భ‌ర‌తం ప‌డ‌తా!

“ఈ రోజు నుంచే.. ఈ క్ష‌ణం నుంచే నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తా. జ‌గ‌న్ భ‌ర‌తం ప‌ట్టేందుకే.. నేను రాజ‌కీయ‌ నాయ‌కుడిగా మారుతున్నా. జ‌గ‌న్‌కు చుక్క‌లు చూపిస్తా. ఎవ‌రైనా జ‌గ‌న్ గురించి ఫిర్యాదు చేయాల‌ని అను కుంటే.. నిర్భ‌యంగా 7816020048 వాట్సాప్ నంబర్ కు స‌మాచారం పంపండి. నేను మీకు అండ‌గా ఉంటా. అంద‌రం క‌లిసి జ‌గ‌న్ భూతాన్ని జైల్లో పెడ‌దాం” అని ఏపీకి …

Read More »

శ్రీవారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌తీమ‌ణి!

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌తీమ‌ణి, ఇటాలియ‌న్ అన్నాలెజెనోవో తిరుమ‌ల సంప్ర‌దాయాల‌కు పెద్ద‌పీట వేశారు. విదేశాల‌కు చెందిన వారు, ఇత‌ర మ‌తాల‌ను ఆచ‌రించేవారు.. తిరుమ‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి సంప్ర‌దాయాలు పాటించాలో ఖ‌చ్చితంగా వాటిని ఆమె పాటించారు. కుమారుడు మార్క్ శంక‌ర్ ఇటీవ‌ల సింగ‌పూర్లో జ‌రిగిన అగ్రిప్ర‌మాదంలో గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో శ్రీవారికి మొక్కుకున్న అన్నా లెజెనోవా.. మార్క్ శంక‌ర్ …

Read More »

స్టూడెంట్‌గా దాచుకున్న సొమ్ము నుంచి కోటి ఖ‌ర్చు చేశా: నారా లోకేష్‌

మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్‌గా ఉన్న‌ప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయ‌ల‌ను ఖర్చు చేసిన‌ట్టు మంత్రి  నారాలోకేష్ తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేయాలన్న సంక‌ల్పం ఉండ‌బ‌ట్టే అలా చేసిన‌ట్టు చెప్పారు. తాజాగా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో 100 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి నిర్మాణానికి నారా లోకేష్ శంకు స్థాప‌న చేశారు. అదేస‌మ‌యంలో మ‌న ఇల్లు-మ‌న లోకేష్ కార్య‌క్ర‌మంలో భాగంగా ప‌లువురికి ప‌ట్టాలు అందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ …

Read More »