Political News

ప‌వ‌న్ నోరు విప్పేశారు.. ఇక‌, పెద్ద‌లు ఏం చేస్తారు?

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌పై ఏపీ డిప్యూటీ సీఎం, అగ్ర‌హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ విరుచుకుప‌డ్డారు. ఆయ‌న ఉన్న‌దేదో మొహానే చెప్పేశారు. ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌కు సూటిగా.. సుత్తిలేకుండా.. త‌న మ‌న‌సులో మాట‌ను చెప్పేశారు. ఎక్క‌డా డొంక తిరుగుడు లేదు. ఎక్క‌డా నాన్చుడు ధోర‌ణిని కూడా అవలంభించ‌లేదు. మ‌రి ఇప్పుడు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ఏం చేస్తారు? ఏం చేయాలి? అనేది వారి కోర్టులోకే చేరింది. తాజాగా ఆగ్ర‌హం వెనుక‌.. ప్ర‌భుత్వాన్ని పెద్ద‌లు క‌లుసుకోవ‌డం లేద‌న్న …

Read More »

వైసీపీ టాక్‌: సాయిరెడ్డిని కెలికి త‌ప్పు చేశారు ..!

వైసీపీ కీల‌క మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డిపై రెండు రోజుల కింద‌ట వైసీపీ అధినేత జ‌గ‌న్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అయితే..ఈ వ్యాఖ్య‌లు ఆయ‌న‌కు మైలేజీఇవ్వ‌క‌పోగా.. పార్టీలో నేత‌ల నుంచే విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తున్నాయి. సాయిరెడ్డిని కెలికి త‌ప్పు చేశారు స‌ర్‌! అంటూ ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్ నాయకులు తాజాగా జ‌గ‌న్ చెవిలో వేసిన‌ట్టు తెలిసింది. తాజాగా ఇద్ద‌రు జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితంగా ఉండే నాయ‌కులు ఆయ‌న‌నుక‌లిసారు. …

Read More »

జ‌గ‌న్‌కు ఊహించ‌ని షాకులిస్తున్న చంద్ర‌బాబు.. !

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌కు షాకులు ఇవ్వ‌డం పెద్ద విష‌యం కాదు. కానీ.. ఊహించ‌ని విధంగా షాకులు ఇవ్వ‌డమే ఇప్పుడు వైసీపీకి, ఆ పార్టీ అధినేత‌కు కూడా.. ఇబ్బందిగా మారింది. “బాబా ఏముంది కేసులు పెడ‌తాడు.. అంతేగా! పెట్టించుకోండి” అంటూ.. ఆరు మాసాల కింద‌ట పార్టీ నాయ‌కుల‌కు జ‌గ‌న్ సూచించారు. ఆవెంట‌నే బెయిల్పై బ‌య‌ట‌కు కూడా వ‌చ్చేయొచ్చ‌ని తేలిగ్గా చెప్పుకొచ్చారు. కానీ.. కేసులు పెడుతున్నా.. వాటి నుంచి త‌ప్పించుకుని బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం …

Read More »

మహానాడు ఆపమని మాస్క్ లు వేసుకుని వచ్చారు

ఏపీ అధికార కూట‌మికి నేతృత్వం వ‌హిస్తున్న టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే మ‌హానాడుకు మ‌రో మూడురోజుల గ‌డువు మాత్ర‌మే ఉంది. ఈ నెల 27 నుంచి 29 మ‌ధ్య మూడు రోజుల పాటు అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు పార్టీ నాయ‌కులు ఏర్పాట్ల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చేస్తున్నారు. అది కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇలాకా.. క‌డ‌ప‌లో తొలిసారి నిర్వ‌హిస్తున్నారు. క‌డ‌ప‌లోని జ‌గ‌న్ సొంత మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం క‌మ‌లాపురంలో మూడు …

Read More »

ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ తుఫాన్‌.. ఏం జ‌రుగుతుంది?

అగ్ర న‌టుడు, సినీ హీరో ప‌వ‌ర్ స్టార్‌.. తొలిసారి ఇనీ ఇండ‌స్ట్రీపై నిప్పులు చెరిగారు. అనూహ్య రీతిలో ఆయ‌న విరుచుకుప‌డ్డారు. ఇదొక తుఫానేన‌ని చెప్పాలి. ఈ త‌ర‌హా ప‌రుషంగా క‌ఠినంగా ఆయ‌న వ్యాఖ్య‌లు చేసింది ఎప్పుడూలేదు. కానీ.. ఈ ద‌ఫా మాత్రం ఇండ‌స్ట్రీని క‌డిగేశారు. సినీ ప‌రిశ్ర‌మ‌లోని వారికి కృత‌జ్ఞ‌త అంటూ లేద‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య చిన్న‌దేం కాదు. చాలా పెద్ద‌దిగానే చూడాలి. అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ …

Read More »

మిస్ వ‌రల్డ్‌ పోటీ.. వేశ్య‌ల్లా చూస్తున్నారు: మిస్ ఇంగ్లాండ్

భాగ్య‌న‌గ‌రం హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న 74వ‌ ప్ర‌పంచ అందాల సుంద‌రుల(మిస్ వ‌ర‌ల్డ్‌) పోటీలు కొన‌సాగుతున్నాయి. అంగ రంగ వైభ‌వంగా సాగుతున్న ఈ పోటీల్లో ప‌లు దేశాల‌కు చెందిన అందాల ముద్దుగుమ్మ‌లు సంద‌డి చేస్తున్నారు. ఇప్ప‌టికే గ‌త 15 రోజులుగా ఈ పోటీల‌కు వ‌చ్చిన సుంద‌రాంగులు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ.. ఆహూతుల‌కు ఆనందాన్ని పంచుతున్నా రు. అదేస‌మ‌యంలో పోటీని కూడా ర‌స‌ర‌మ్యం చేస్తున్నారు. ఇక‌, తెలంగాణ ప్ర‌భుత్వం కూడా.. ఈ పోటీల‌కు ప్ర‌త్యేక …

Read More »

ముహూర్తం పెట్టేశారా.. జ‌గ‌న్ అరెస్టు ఖాయమేనా.. ?

ఎస్‌! ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌. ప్ర‌స్తుతం రాష్ట్రంలో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం వ్య‌వహారం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. దీనిలో కీల‌క పాత్ర వ‌హించిన వారిని ఇప్ప‌టికే ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అరెస్టు చేసింది. వీరు ఇస్తున్న స‌మాచారం ఆధారంగా.. మ‌రింత మందిని అరెస్టు చేస్తున్నారు. ఇప్పుడు మ‌రో పేరు బాల్ రెడ్డి అని వినిపిస్తోంది. ఈయ‌న ఎవ‌రు ఏంట‌నేది .. సిట్ అధికారులు కూపీ లాగుతున్నారు. …

Read More »

అమ‌రావ‌తికి కేంద్రం మ‌రో గుడ్ న్యూస్ చెప్పేసిన‌ట్టే.. !

ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న రాజ‌ధాని అమ‌రావ‌తి వ్య‌వ‌హారంలో మ‌రో కీల‌క ఘ‌ట్టం తెర‌ మీదికి వ‌చ్చింది. కేంద్రం నుంచి మ‌రో గుడ్ న్యూస్ కూడా రాజ‌ధానికి వ‌చ్చింది. రాజ‌ధాని విష‌యంలో గ‌తంలో వ‌చ్చిన అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్ర‌బాబు ఇటీవ‌ల కీల‌క నిర్ణ‌యం తీసుకు న్నారు. ప్ర‌స్తుతం రాజ‌ధానిని మ‌రింత విస్త‌రించే ప‌నిలో ఉన్నారు. ఇప్ప‌టికే 33 వేల ఎక‌రాల భూముల‌ను రైతుల‌నుంచి తీసుకున్నారు. అయితే.. …

Read More »

కాళేశ్వ‌రంపై కీల‌క నిర్ణ‌యం.. బీఆర్ఎస్‌లో వ‌ణుకు?

బీఆర్ఎస్ హ‌యాంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టును ప్రాణ‌ప్ర‌దంగా భావిస్తున్న‌ట్టు అప్ప‌టి సీఎం కేసీఆర్ చెప్పా రు. అయితే.. ఈ కాళేశ్వ‌ర‌మే.. కాసులు కురిపించింద‌ని.. కోట్ల‌కు కోట్ల సొమ్మును వెనుకేసుకునేలా చేసింద‌ని కాంగ్రెస్ నాయ‌కులు ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే రేవంత్‌రెడ్డి సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టాక అవ‌కాశం కోసం ఎదురు చూశారు. ఇంత‌లోనే కాళేశ్వ‌రానికి అనుసంధానంగా నిర్మించిన మేడిగ‌డ్డ ప్రాజెక్టు కూలింది. దీంతో కాళేశ్వ‌రంపై దుమ్ముదులిపే చ‌ర్య‌ల‌కు రంగం రెడీ చేసుకున్నారు. ఈ క్ర‌మంలో …

Read More »

చంద్రబాబును ఫాలో కావాలన్న మోదీ

ఏపీ సీఎంగా చంద్రబాబు, భారత ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసింది మొదలు వికసిత్ భారత్-2047 కోసం నిర్విరామంగా శ్రమిస్తోన్న సంగతి తెలిసిందే. రాబోయే రెండు దశాబ్దాల కాలంలో సాధించవలసిన ప్రగతి, అందుకు సంబంధించి ఇప్పటి నుంచే రూపొందించాల్సినా కార్యచరణపై ఈ ఇద్దరు నేతలు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే వికసిత్ ఆంధ్ర, వికసిత్ భారత్ కోసం సీఎం చంద్రబాబు ఓ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో ప్రతి …

Read More »

చెల్లి లేఖ‌పై కేటీఆర్ రియాక్షేన్‌

బీఆర్ ఎస్ పార్టీ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌కు ఆయ‌న కుమార్తె, ఎమ్మెల్సీ క‌విత రాసిన సంచ‌ల‌న లేఖ‌.. రాజ‌కీయ వ‌ర్గాల్లో దుమారం రేపింది. ఇక‌, బీఆర్ ఎస్‌పై తీవ్ర చ‌ర్చ‌కు కూడా దారితీసింది. దీనిపై క‌విత శుక్ర‌వారం రాత్రే స్పందించారు. ఆ లేఖ తాను రాసిందేన‌న్నారు. అయితే.. కొంద‌రు కోవ‌ర్టుల కార‌ణంగానే అది బ‌య‌ట‌కు వ‌చ్చి ఉంటుంద‌న్న ఆమె.. కేసీఆర్‌ను దేవుడితో పోల్చారు. ఆయ‌న చుట్టూ ద‌య్యాలు ఉన్నాయ‌ని …

Read More »

క‌విత.. మ‌రో ష‌ర్మిల‌గా మారుతున్నారా!

బీఆర్ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత.. వ్య‌వ‌హారం పై రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ‌ సాగుతోంది. ఆమె గ‌త కొన్నాళ్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. ప్ర‌స్తుతం త‌న తండ్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ వంటివి.. రాజ‌కీయ వ‌ర్గాల‌ను కుది పేస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్‌ను ప్ర‌శ్నించిన కుటుంబ స‌భ్యులు లేరంటే లేరు. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు ఇష్ట‌మైనా … అయిష్ట‌మైనా వాటిని కొన‌సాగించారు. వాటిని పాటించారు. దేశ‌వ్యాప్తంగా పొత్తులు …

Read More »