Political News

హైడ్రాపై వసంత ఫైర్.. రేవంత్ న్యాయం చేస్తారని వ్యాఖ్య

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు శనివారం మరోమారు పెను కలకలం రేపాయి. హఫీజ్ పేట్ పరిదిలోని 17ఎకరాల్లో అక్రమ నిర్మాణాలున్నాయని భావించిన హైడ్రా…వాటిని కూల్చివేసింది. ఈ కూల్చిన నిర్మాణాల్లో ఏపీకి చెందిన కీలక రాజకీయ నేత, టీడీపీ యువ నేత, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కార్యాలయం కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కూల్చివేతలపై తాజాగా వసంత స్పందించారు. హైడ్రా తీరుపై ఆగ్రహం …

Read More »

సాయిరెడ్డి బాగోతం బ‌య‌ట పెడ‌తా: రాజ్ కసిరెడ్డి

ఏపీలో వెలుగు చూసిన మ‌ద్యం కుంభ‌కోణం వ్య‌వ‌హారంపై కూట‌మి ప్ర‌భుత్వం విచార‌ణ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ సాగిస్తోంది. ఈ కుంభ‌కోణంలో వేల కోట్ల రూపాయ‌లు దోచుకున్నార‌ని వైసీపీ నాయ కుల‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే కీల‌క నాయ‌కుల‌కు సిట్ నోటీసులు ఇచ్చి విచార‌ణ‌కు పిలుస్తోంది. ఇదిలావుంటే.. ఈ వ్య‌వ‌హారంలో క‌ర్త‌-క‌ర్మ‌-క్రియ అన్నీ క‌సిరెడ్డి రాజ‌శేఖ‌రేన‌ని(రాజ్ క‌సిరెడ్డి) మ‌రో కీల‌క నాయ‌కుడు …

Read More »

సాయిరెడ్డి అప్రూవ‌ర్‌గా మారే ఛాన్స్‌ ఉందా ..!

వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు విజ‌యసాయిరెడ్డి అప్రూవ‌ర్‌గా మారే అవ‌కాశం ఉందా? ఇదే జ‌రిగితే.. ఆయ‌న కీల‌క నేత‌ల పేర్ల‌ను బ‌య‌ట‌కు చెప్పే అవ‌కాశం క‌నిపిస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. సాయిరెడ్డిని జ‌గ‌న్ మీడియా నిరంత‌రం.. ఏకేస్తోంది. రాజ‌కీయాలకు దూరంగా ఉంటాన‌ని చెప్పిన సాయిరెడ్డి ఇప్పుడు కూట‌మి పంచ‌న చేరుతున్నార‌ని.. ఆయ‌న త్వ‌ర‌లోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటార‌ని కూడా వ్యాఖ్యానిస్తోంది. దీనిలో వాస్త‌వం ఎంత ఉందో …

Read More »

పంతాల‌కు పోయి.. పాడు చేసుకున్నారా.. వైసీపీ సీరియ‌స్..!

గ్రేట‌ర్ విశాఖ‌ప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్ గొల‌గాని వెంక‌ట కుమారిపై అవిశ్వాసం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో కార్పొరేష‌న్‌ను కాపాడుకోవాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కుల‌కు బాధ్యతలు అప్ప‌గించారు. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్‌, మాజీ మంత్రి కురసాల క‌న్న‌బాబుకు ఈ బాధ్యతను అప్పగించారు. ఇదే సమయంలో మిగిలిన నాయ‌కుల‌కు కూడా స‌హ‌క‌రించాల‌ని సూచించారు. వీరిలో మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారు. …

Read More »

పింక్ డైమండ్ తర్వాత గోశాలతో స్వామి రాజకీయం

తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాల వ్యవహారంపై వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య తీవ్ర వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. దీనిపై ధర్నాలు, నిరసనలు కూడా జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. దీనికి ప్రతిగా టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు కూడా స్పందించారు. అయితే, ఈ వివాదంలో ఇప్పుడు తమిళనాడుకు చెందిన …

Read More »

ఎమ్మెల్యే వ‌సంత‌కు హైడ్రా ఎఫెక్ట్‌

టీడీపీ ఎమ్మెల్యే.. మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం శాస‌న స‌భ స‌భ్యుడు వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌కు.. హైడ్రా షాకిచ్చింది. ఆయ‌న నిర్మిస్తున్న ఓ భ‌వ‌నాన్ని.. హైడ్రా అధికారులు శ‌నివారం కూల్చేశారు. వాస్త‌వానికి ఏపీకి చెందిన ఎమ్మెల్యే వ‌సంతకు హైడ్రా షాక్ ఇవ్వ‌డం ఏంట‌న్న చ‌ర్చ స‌హ‌జంగానే తెర‌మీదికి వ‌స్తుంది. అయితే.. ఆయ‌న వ్యాపార వేత్త కావ‌డంతో హైద‌రాబాద్ శివారులోని కొండాపూర్‌లోనూ.. ‘వ‌సంత హౌస్‌’ పేరుతో నిర్మాణం చేస్తున్నారు. ఈ నిర్మాణంపైస్థానికులు హైడ్రాకు ఫిర్యాదు …

Read More »

విశాఖ మేయ‌ర్ పీఠం కూట‌మిదే.. చేతులెత్తేసిన వైసీపీ!

గ‌త నెల రోజులుగా తీవ్ర సందిగ్ధంలో ప‌డిన గ్రేట‌ర్ విశాఖ‌ప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్ పీఠంపై కూట‌మి జెండా ఎగ‌ర‌నుంది. తాజాగా శ‌నివారం ఉద‌యం 11 గంట‌లకు జ‌రిగిన అవిశ్వాస ఓటింగ్‌లో వైసీపీ నాయ‌కురాలు, ప్ర‌స్తుత మేయ‌ర్ గొల‌గాని హ‌రి వెంక‌ట వెంక‌ట కుమారి ఓడిపోయారు. దీంతో కూట‌మి పార్టీలు పైచేయి సాధించారు. మొత్తం 98 మంది కార్పొరేట‌ర్లు విశాఖ‌లో ఉన్నారు. వీరిలో ఒక‌రు ఎప్పుడో దూరంగా ఉన్నారు. దీంతో …

Read More »

ఒక్క దెబ్బ‌కు జ‌గ‌న్‌కు రెండు షాకులిచ్చిన చంద్ర‌బాబు.. !

ఒక్క దెబ్బ‌కు రెండు షాకులు అంటే.. ఎలా ఉంటుందో చంద్ర‌బాబు చేసి చూపించారు. వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు సౌండ్ లేకుండా చేశారు. కీల‌క‌మైన రెండు విష‌యాల్లో చంద్ర‌బాబు చేసిన రాజ‌కీ యం వైసీపీ నేత‌ల‌కు నోట మాట రాకుండా… లేకుండా కూడా చేసింది. 1) మ‌త్య్స‌కారుల‌కు ఇచ్చే భృతి. 2) పాస్ట‌ర్ల‌కు ఇచ్చే గౌర‌వ వేత‌నం. ఈ రెండు విష‌యాల‌ను వైసీపీ త‌న‌ఖాతాలో వేసుకుంది. ఈ రెండు …

Read More »

కూటమి నేతలకు పవన్ వార్నింగ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం ఓ సంచలన వ్యాఖ్య చేశారు. భూ సంబంధిత సమస్యలపై తన కార్యాలయంతో పాటుగా జనసేన నిర్వహించిన జన వాణిలకు వెల్లువెత్తిన ఫిర్యాదులపై శుక్రవారం ఆయన ఆయా శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భూకబ్జాలపై ఇకపై కఠినంగా వ్యవహరించనున్నట్లు ఆయన ప్రకటించారు. కష్టపడి సంపాదించుకున్న జాగాలు, వారసత్వంగా వస్తున్న ఆస్తులను కాపాడుకునేందుకు జనం ఎంతగా ఇబ్బందులు …

Read More »

ఈ రెడ్డ్లు ఇద్దరూ మాత్రం దొరకరు

ఒక‌రు మ‌ద్యం అక్ర‌మాల్లో వేల కోట్ల రూపాయ‌లు తిన్నార‌న్న‌ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. మ‌రొక‌రు గ‌నుల అక్ర‌మాల్లో వంద‌ల‌ కోట్ల రూపాయ‌లు పోగేసుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ రెండు కేసుల‌కు సంబంధించి ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాల‌ను కూడా నియ‌మించింది. వారికి చేతినిండా సొమ్ములు కూడా ఇచ్చింది. ఎక్క‌డికి వెళ్లేందుకైనా.. నిందుల‌ను అరెస్టు చేసేందుకైనా కూడా అనుమ‌తులు ఇచ్చింది. అయినా.. స‌ద‌రు నిందితులు మాత్రం ఇప్ప‌టికీ దొర‌క‌లేదు. స‌రిక‌దా.. అస‌లు.. …

Read More »

జ‌పాన్‌ లో రేవంత్ చేస్తున్న పనేంటి!

“రండి పెట్టుబ‌డులు పెట్టండి. మీకు అవ‌స‌ర‌మైన స‌కల సౌక‌ర్యాలుక‌ల్పించేందుకు మా ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది“ అని రేవంత్ రెడ్డి జ‌పాన్ పారిశ్రామిక వేత్త‌ల‌కు పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం జపాన్‌ పర్యటనలో ఉన్నఆయ‌న టోక్యోలో నిర్వహించిన ఇండియా-జపాన్‌ భాగస్వామ్య కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి జ‌పాన్‌కు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైద‌రాబాద్ పెట్టుబ‌డులకు గ‌మ్య స్థానంగా మారిద‌న్నారు. అనేక ఎక‌రాల భూమి …

Read More »

నన్ను రాజకీయాల్లోకి లాగకండి: గంగూలీ గగ్గోలు

గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి అడుగు పెడతారని తరచూ వార్తలు వచ్చేవి. ఆయన బెంగాల్‌లో ఏదో ఒక పార్టీలో చేరతారని, ముఖ్యమైన హోదా తీసుకుంటారని రకరకాల ఊహాగానాలు వినిపించేవి. కానీ, అలాంటి వార్తల నుంచి గంగూలీ ఎప్పుడూ దూరంగానే ఉన్నారు. రాజకీయాలపై తన వైఖరిని క్లియర్‌గా చెప్పలేదు కానీ, ఆయన మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామకాల సమస్యపై కొందరు …

Read More »