Political News

కేసులతో 4 పెళ్లిళ్లు ప్రమాదంలో పడ్డాయా?

ఏపీలో కూటమి సర్కారు వరుసబెట్టి కేసులు నమోదు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. గత వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఈ కేసుల్లో ఇప్పటికే చాలా మంది నేతలు, అధికారులు, అనధికారులు అరెస్టు కాగా… వారిలో పలువురు కీలక వ్యక్తులు ఉన్నారు. అరెస్టుల వరకు ఓకే గానీ.. ఈ అరెస్టుల కారణంగా ఆయా నిందితుల ఇళ్లల్లో శుభకార్యాలు నిలిచిపోయే ప్రమాదం వచ్చి పడిందట. ఈ విషయాన్ని ఏ దారిన …

Read More »

మన సిక్కోలు నాయుడు కీర్తి చక్రతో మెరిశారు

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేజర్ మల్ల రామ గోపాల్ నాయుడు భారత సైన్యం అందించే అత్యున్నత పురస్కారాల్లో రెండోదైన కీర్తి చక్రతో మెరిశారు. కీర్తి చక్రతో మెరవడమే కాదండోయ్.. ఈ గ్యాలంట్రీ అవార్డును అందుకున్న తొలి తెలుగు రైతు బిడ్డ కూడా మన నాయుడే కావడం గమనార్హం. భారత స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఏటా సైనికులు ఇచ్చే గ్యాలంట్రీ అవార్డులను ఈ ఏడాదికి సంబందించి గురువారం రాష్ట్రపతి ద్రౌపది …

Read More »

హాట్ టాపిక్…  కేసీఆర్ కు కవిత 6 పేజీల లేఖ

తెలుగు నేల రాజకీయాల్లో గురువారం ఓ హాట్ టాపిక్ ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాదించిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆయన కుమార్తె, మాజీ ఎంపీ కవిత ఓ సుదీర్ఘ లేఖ సంధించారు. దాదాపుగా 6 పేజీలతో కూడిన ఈ లేఖ ఇటీవలే వరంగల్ కేంద్రంగా జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తర్వాతే రాసినట్లుగా భావిస్తున్నారు. అయితే ఇతమిద్ధంగా ఎప్పుడు ఆమె తన …

Read More »

అరెస్టుకు జగన్ మెంటల్లీ ప్రిపేర్ అయిపోయినట్టే!

ఏపీలో రోజుకో మలుపు తిరుగుతున్న మద్యం కుంభకోణం కేసులో త్వరలోనే ఓ కీలక పరిణామం జరగబోతోందని కూటమి పెద్దలు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. వైసీీపీ హాయాంలో జరిగిన ఈ కుంభకోణం మొత్త ఆ పార్టీ అదినేత, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని… ఇప్పటిదాకా అరెస్టు అయిన దాదాపుగా అందరూ నిందితులు చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ స్కాంలో అంతిమ లబ్ధిదారు కూడా …

Read More »

కూటమి పాలనలో రైతాంగం పరిస్థితి ఎలా ఉంది?

టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు ఏపీలో పాలనను చేపట్టి అప్పుడే ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రంగాల్లో తాము చేసిందేమిటి? సాధించిన ప్రగతి ఏమిటి? ఇంకా చేపట్టాల్సిన చర్యలేమిటి? అన్న వాటిపై సీఎం చంద్రబాబు సమీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం వ్యవసాయం, అనుబంధ రంగాలపైనా ఆయన సమీక్ష చేశారు. ఈ సమీక్ష ఓకే గానీ… చంద్రబాబు ఏడాది పాలనలో రైతాంగం ఎలా ఉంది? అన్న విషయాన్ని పరిశీలిస్తే… …

Read More »

23 నిమిషాల్లోనే పాకిస్థాన్‌కు చుక్క‌లు చూపించాం: మోడీ

రాజ‌స్థాన్‌లోని బిక‌నీర్‌లో ప‌ర్య‌టిస్తున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అమృత్ భార‌త్ స్టేష‌న్ల‌ను ప్రారంభించారు. అనంత‌రం.. నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాల‌పై భార‌త్ చేప‌ట్టి న ఆప‌రేష‌న్ సిందూర్ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. 22 నిమిషాల్లో ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌వాదులు మ‌న ఆడ‌ప‌డు చుల సిందూరం తుడిచేశారని, పేర్లు అడిగి మ‌రీ కాల్చేశార‌ని అన్నారు. అయితే.. ఆప‌రేష‌న్ సిందూర్ ద్వారా మ‌నం 23 నిమిషాల వ్య‌వ‌ధిలోనే పాకిస్థాన్‌కు చుక్క‌లు చూపించామ‌న్నారు. …

Read More »

చంద్రబాబుకు సాయిరెడ్డి లొంగిపోయారు: జగన్

వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత వైసీపీ అధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సాయిరెడ్డికి క్రెడిబులిటీ లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో కసిరెడ్డి రాజ శేఖర్ తో తనకు సంబంధం లేదని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోని తాజాగా విజయసాయిరెడ్డిపై జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు …

Read More »

కేడర్ కు షాక్…పార్టీ నడిపేందుకు డబ్బుల్లేవన్న జగన్

“తాను ఉన్నంతకాలం తత్వం బోధపడదు.. తత్వం బోధ పడ్డాక తానుండడు” అని ఒక కొటేషన్ ఉంది. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కు ఇది అతికినట్లు సరిపోతుంది. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కేడర్ ను, శ్రేణులను, కార్యకర్తలను, ఆఖరికి మెజారిటీ ఎమ్మెల్యేలను కూడా జగన్ విస్మరించారన్నది జగమెరిగిన, జగనెరిగిన సత్యం. అందుకే, ఈ మధ్య పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలతో సమావేశమైన ప్రతి సారీ …

Read More »

ఆ మంత్రుల‌కు చంద్ర‌బాబు క్లాస్‌.. రీజ‌నేంటి ..!

మంత్రివ‌ర్గంలోని కొంద‌రికి మ‌రోసారి సీఎం చంద్ర‌బాబు క్లాస్ ఇచ్చార‌ని తెలిసింది. రెండు రోజుల కింద‌ట జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో కొల్లు ర‌వీంద్ర‌, అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌, సుభాష్, స‌విత‌, కొండ‌ప‌ల్లి రాం ప్ర‌సాద్, అనిత‌ల‌ వంటి కొంద‌రిని ప్ర‌త్యేకంగా త‌న ఛాంబ‌ర్‌లోకి పిలిచి వారితో మాట్లాడిన‌ట్టు తాజాగా తెలిసింది. ప‌నితీరుపై ఆయ‌న స‌మీక్షించార‌ని.. కొన్ని విష‌యాల్లో మంత్రుల వ్య‌వ‌హార శైలిని త‌ప్పుబ‌ట్టారని స‌మాచారం. ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలో మంత్రుల ప‌నితీరు …

Read More »

జగన్ గురుతులు చెరిగిపోతున్నాయి

రాష్ట్రంలో వైసీపీ హ‌యాంలో ప్ర‌జ‌ల‌కు పాల‌న‌ను చేరువ చేసేందుకు ప‌లు ప‌థ‌కాల‌ను అప్ప‌టి సీఎం జ‌గ‌న్ తీసుకువ‌చ్చారు. అయితే.. ప్ర‌భుత్వం మారితే.. పాల‌న మారుతుంద‌న్న‌ట్టుగా.. రాష్ట్రంలో ప‌రిస్థితులు కూడా మారుతున్నాయి. గ‌త వైసీపీ ప్రాభ‌వం ఇప్పుడు త‌గ్గుతోంది. గ‌తంలో అన్నా క్యాంటీన్ల‌ను జ‌గ‌న్ నిలిపివేసి.. చంద్ర‌బాబు పేరును రాకుండా.. లేకుండా చేయాల‌ని ప్ర‌య‌త్నించారు. ఇక‌, రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలోనూ ఇలానే వ్య‌వ‌హ‌రించారు. ఈ ప‌రిణామాలు .. టీడీపీని బాధించినా.. లేకున్నా.. …

Read More »

థియేటర్ ను ఈ రకంగా వాడేసిన పవన్

ప్రజల కోసం..ప్రజల చేత ఎన్నుకోబడిన వారే ప్రజా ప్రతినిధులు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తానని అందరు ప్రజాప్రతినిధులు ఎన్నిలకు ముందు హామీనిస్తారు. కానీ, ఆ హామీని నిలబెట్టుకునే ప్రజా ప్రతినిధులకు కొద్ది మందే ఉంటారు. ఆ కొద్ది మందిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకరు. ప్రజలతో మమేకమయ్యేందుకు తన ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వంటి కారణాలు అడ్డు వస్తుండడంతో పవన్ ‘మన ఊరు-మాటా …

Read More »

ఇక‌.. స‌జ్జ‌ల సంగ‌తి: ఆక్ర‌మిత భూముల స్వాధీనం!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, గ‌త ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సంగ‌తి తేల్చేందుకు స‌ర్కారు సిద్ధ‌మైంది. క‌డ‌ప జిల్లా సీకే దిన్నెమండ‌లం ప‌రిధిలోని అట‌వీ భూముల్లో 55 ఎక‌రాల‌ను ఆక్ర‌మించి.. సజ్జ‌ల ఎస్టేట్‌ నిర్మించిన‌ట్టు ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాల‌పై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొన్నాళ్ళ కింద‌టే తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. అప్ప‌ట్లోనే ఆ వ్య‌వ‌హారంపై విచార‌ణ‌కు ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో క‌లెక్ట‌ర్ నియ‌మించిన రెవెన్యూ, అట‌వీ శాఖల …

Read More »