ఎస్ ఇది నిజం తెలంగాణ ముఖ్యమంత్రి ఒక కాంగ్రెస్ నేతకు ఎమ్మెల్సీ ఇవ్వడం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇగోను హర్ట్ చేసేలా ఉందన్న చర్చలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచే వేం నరేందర్రెడ్డి ఇంకా చెప్పాలంటే రేవంత్ తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచే రేవంత్కు ప్రతి …
Read More »బడ్జెట్ లో ఎపుడూ లేని కొత్త అంశాలివే!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్న పథకాలు, కార్యక్రమాలకు తోడు కొత్తగా మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఆయా కార్యక్రమాలకు నిధుల కేటాయింపు భారమే అయినప్పటికీ.. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులకు శ్రీకారం చుడుతున్నట్టు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా కేంద్రం అమలు చేస్తున్న అనేక పథకాలను అందిపుచ్చుకోనున్నట్టు ఆయన చెప్పారు. వీటి ద్వారా మరింత స్వావలంబన దిశగా రాష్ట్రాన్ని నడిపించనున్నట్టు ఆయన తెలిపారు. పాఠశాలలకు ఉచిత విద్యుత్ …
Read More »‘ఆరోగ్యశ్రీ’ని మరిపించే బాబు ‘ఆరోగ్య బీమా’
పేదలకు ఉచిత వైద్య సేవల రంగంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ జనాల్లోకి బాగా ఎక్కేసింది. ఉచిత వైద్యం అనే మాట వినిపించినంతనే… ఆరోగ్యశ్రీ పేరే గుర్తుకు వచ్చే పరిస్థితి. అలాంటి ఆరోగ్యశ్రీని మరిపించే మరో కొత్త ఆరోగ్య సేవల పథకానికి ఏపీలోని కూటమి సర్కారు శ్రీకారం చుడుతోంది. ప్రతి పేద కుటుంబానికి రూ.25 లక్షలతో ఆరోగ్య బీమా పథకాన్ని అందించే దిశగా టీడీపీ అధినేత, …
Read More »పయ్యావుల పద్దు రూ.3.22 లక్షల కోట్లు… ఏఏ రంగాలకు ఎంతెంత..?
ఏపీలోని కూటమి సర్కారు శుక్రవారం ఉదయం తన తొలి వార్షిక బడ్జెట్ ను ప్రకటించింది. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. కూటమి సర్కారుకు ఇది తొలి వార్షిక బడ్జెట్ కాగా… ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ కు కూడా ఇది తొలి వార్షిక బడ్జెట్టే. మొత్తంగా రూ.3,22,359 …
Read More »బడ్జెట్తో మారనున్న ఏపీ ముఖ చిత్రం.. పెట్టుబడులకు పెద్దపీట!
ఏపీలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. ప్రవేశ పెట్టే తొలి పూర్తిస్థాయి బడ్జెట్పై చాలానే అంచనాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ ద్వారా ఏపీ ముఖ చిత్రం మారేందుకు, మార్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్ని స్తున్నారు. విజన్-2047తోపాటు.. వికసిత ఆంధ్రప్రదేశ్, పీ-4 లక్ష్యాలకు అనుగుణంగా.. తీర్చిదిద్దిన బడ్జెట్ రాష్ట్రాన్ని మరో 25 సంవత్సరాల పాటు అభివృద్దిలోపురోగమించేంలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒకవైపు నిధుల కొరత వెంటాడుతున్నా… మరోవైపు అభివృద్ది మంత్రంతో …
Read More »సినిమా చూపించకుండానే… తప్పుకుంటే ఎలా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే… నిజంగానే సినిమా చూపించకుండానే తప్పుకున్నంటున్నట్టుగా అనిపిస్తోంది. జగన్ కు ప్రతిపక్షంలో కూర్చోవడం ఇదే కొత్త కాదు. గతంలో 2014 ఎన్నికల్లోనూ వైసీపీ ఓడిపోగా… టీడీపీ అధికారం చేపడితే… ఆ ఐదేళ్లూ ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ప్రతిపక్ష నేత హోదాలో నాడు జగన్ దాదాపుగా మూడేళ్ల పాటు శాసనసభకు హాజరయ్యారు. అధికార పక్షం టీడీపీని తనదైన శైలిలో …
Read More »ఈ బడ్జెట్ తో అంతా మిగుల్చుడే!
ఏపీలో ఆదాయ, వ్యయాలు పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. మునుపటి మాదిరిగా ప్రతి చిన్న దానికీ కోట్ల మేర ప్రజా ధనాన్ని తగలేయడం దాదాపుగా తగ్గిపోయింది. అవసరం ఉన్న వాటికి తప్పించి… ఆదా చేయొచ్చు అన్న ప్రతి చిన్న అంశంపైనా ప్రభుత్వం పొదుపు మంత్రాన్నే పఠిస్తోంది. గతంలో మాదిరిగా ప్రతి చిన్నదానికీ ఇబ్బడిముబ్బడిగా నిధులు వెచ్చించే పనికి అస్సలు అనుమతులు ఇవ్వడం లేదు. అవసరం ఉన్న ఏ చిన్న పని …
Read More »పొన్నవోలు పోరాటం పోసానికి కలిసిరాలేదు
వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి రైల్వే కోడూరు న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. సినీ పరిశ్రమకు కులాలను ఆపాదిస్తూ నంది అవార్డుల ప్రతిష్ఠను మంటగలిపారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె పోలీస్ స్టేషన్ లో పోసానిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం రాత్రి హైదరాబాద్ లోని పోసాని ఇంటికి వెళ్లిన పోలీసులు …
Read More »పోలీసుల ప్రశ్నలకు పోసాని ‘సినిమాటిక్’ సమాధానాలు!
ఉమ్మడి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం, ఓబులవారి పల్లె పోలీసుల అదుపులో ఉన్న సినీ నటుడు, వైసీపీ మాజీ నాయకుడు(తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు గతంలోనే ప్రకటించారు) పోసాని కృష్ణ మురళిని ఎస్పీ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించారు. గతంలో అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు సాధారణ మీడియా ముందు కూడా.. ఆయన చేసిన వ్యాఖ్యలు, కాపులు-కమ్మలు అంటూ చేసిన …
Read More »జగన్ ఇలాకాలో కూటమి హవా.. ఏం జరుగుతోంది?!
వైసీపీ అధినేత జగన్ రెండు రోజుల పాటు తన సొంత జిల్లా కడపలో పర్యటించారు. ఆ సందర్భంగా పులి వెందుల పంచాయతీని ఒక కొలిక్కి తీసుకు వచ్చినట్టు సమాచారం. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పట్టు కోల్పోతోంది. ముఖ్యంగా బలమైన తిరుపతి, తుని వంటి ప్రాంతాల్లో నూ వైసీపీ సభ్యులు పార్టీ మారి.. కూటమికి జై కొట్టడంతో స్థానికంలో టీడీపీ జెండా లేదా జనసేన …
Read More »నాగబాబుకు టైం వచ్చేసిందబ్బా!
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు త్వరలోనే ఏపీ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. వచ్చే నెలలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టడం ఖాయమేనని చెప్పాలి. అంతేకాకుండా ఎమ్మెల్సీగా పదవి చేపట్టిన మరుక్షణమే ఆయనను టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన కేబినెట్ లోకి తీసుకోవడం …
Read More »రేవంత్ తో ‘ఎమ్మార్’ భేటీ.. వివాదం పరిష్కారమయ్యేనా?
ఎమ్మార్ ప్రాపర్టీస్ తెలుగు నేల రాజకీయాలను భారీ కుదుపునకు గురి చేసిన వ్యవహారం. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు దుబాయికి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్… హైదరాబాద్ లో రియిల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టింది. ఈ ప్రాజెక్టుల కోసం ఆ సంస్థకు కేటాయించిన భూములు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలపై పెను దుమారం రేగింది. ఫలితంగా ఈ సంస్థ చేపట్టిన ప్రాజెక్టులన్నీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates