Political News

ఎస్‌.. వీరి బంధం ఫెవికాల్‌నే మించిందిగా.. !

అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో శుక్ర‌వారం జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌.. వేదిక‌పై జ‌రిగిన కొన్ని కీల‌క ప‌రిణా మాలు చూస్తే.. జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌-ప్ర‌ధాని న‌రేంద్ర మోడీల మ‌ధ్య ఉన్న వ్య‌క్త‌గ‌త బంధం ఎంత ద్రుఢంగా ఉందో అర్థ‌మవుతుంది. వాస్త‌వానికి ప్ర‌ధాని జాతీయ‌స్థాయిలో ప‌ట్టుమ‌ని 6-10 మంది నాయ‌కుల‌తోనే ఇలాంటి బంధాన్ని కొన‌సాగిస్తున్నారు. తెలంగాణ‌లో అయితే.. ఇలాంటి బంధం ఉన్న నాయ‌కులే లేరు. నేరుగా పేరు పెట్టి పిల‌వ‌డం.. ఏక‌వ‌చ‌నంతో …

Read More »

జాతీయ మీడియాకెక్కిన అమ‌రావ‌తి.. బాబు స‌క్సెస్‌.. !

ఏపీ సీఎం చంద్ర‌బాబు కృషి ఫ‌లించింది. ఆయ‌న క‌ల‌లు కంటున్న రాజ‌ధాని అమ‌రావ‌తి పేరు ఇప్పుడు జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. స‌హ‌జంగా చంద్ర‌బాబు.. లేదా.. రాష్ట్ర మంత్రివ‌ర్గం మొత్తం అమ‌రావ తిలో కూర్చుని తాజాగా ప్ర‌ధాని ప్రారంభించిన ప‌నుల‌ను ప్రారంభించేయొచ్చు. ఎందుకంటే.. అమ‌రావ‌తి ప‌నులు ఇప్పుడు కొత్త‌గా చేప‌డుతున్న‌వి కాదు. కాబ‌ట్టి.. వారు ఇంత‌క‌న్నా అట్ట‌హాసంగా స‌భ నిర్వ‌హించి.. పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేయొచ్చు. కానీ, జాతీయ‌స్థాయిలో రాజ‌ధాని …

Read More »

వైసీపీ టాక్‌: ఆ ఒక్క‌డే అన్నీ తానై.. !

వైసీపీలో నాయ‌కులు చాలా మంది డి-యాక్టివేష‌న్‌లో ఉన్నారు. కాక‌లు తీరిన క‌బుర్లు చెప్పిన నాయ‌కులు కూడా మౌనంగా ఉంటూ.. ర‌మ‌ణ మ‌హ‌ర్షుల‌ను మించిపోయారు. దీంతో పార్టీ వాయిస్ వినిపించే వారు లేకుండా పోయారు. ఎవ‌రిని ప‌ల‌క‌రించినా.. నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. ఎవ‌రిని ప‌ల‌క‌రించినా.. కేసులు.. కోర్టులు.. బెయిళ్లంటూ.. తీరిక‌లేని ప‌నుల్లో మునిగిపోయారు. ఒక కేసు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి బెయిల్ తెచ్చుకుంటే మ‌రో కేసు వారిని వెంటాడుతోంది. ఇలాంటి స‌మ‌యంలో …

Read More »

అంబ‌టి గారూ.. మూడు ముక్క‌లాట మ‌రిచారా?!

వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు .. రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిపై మ‌రోసారి అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. అదేస‌మ‌యంలో రాజ‌ధాని విష‌యంలో మూడు ముక్క‌లాట మ‌రిచి పోయిన‌ట్టు ఆయ‌న కామెంట్లు చేశారు. “జ‌గ‌నే అమ‌రావ‌తిని అభివృద్ధి చేయాల‌ని అనుకున్నాడు. కానీ, చంద్ర‌బాబు కోర్టుల‌కు వెళ్లి అడ్డుకున్నారు” అని తాజాగా అంబ‌టి మీడియా ముందు కామెంట్లు చేశారు. దీనిపై నెటిజ‌న్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ఎక్క‌డైనా.. ఎవ‌రైనా.. రాజ‌ధానిని బాగు చేస్తాన‌ని …

Read More »

అమ‌రావతి సాకారానికి ఐదు మెట్లు…!

దేవ‌తా భూమిగా.. అజ‌రామ‌ర‌మైన దేవేంద్రుడి రాజ‌ధానిగా ప్ర‌ధాన మంత్రి అభివ‌ర్ణించిన అమ‌రావ‌తి రాజధాని సాకారం కావాల‌నేది యావ‌త్ తెలుగు ప్ర‌జ‌ల ఆకాంక్ష‌. సీఎం చంద్ర‌బాబు నుంచి డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ల్యాణ్ వ‌ర‌కు.. అంద‌రూ కోరుకునేది కూడా ఇదే. అయితే.. ఇక్క‌డ కీల‌క‌మైన అంశాలు ఉన్నాయి. చెప్పుకొన్నంత ఈజీ.. రాసుకున్నంత తేలిక అయితే.. రాజ‌ధాని నిర్మాణంలో అడుగులు ప‌డ‌డం కుద‌ర‌వు. దీనికి ఎంతో సంక‌ల్ప దీక్ష‌. క‌లిసి వ‌చ్చే అంశాలు …

Read More »

వైసీపీ ‘ష‌ఫిలింగ్’ పాలిటిక్స్ స‌క్సెస్ అయ్యేనా..?

గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీచేసిన ప్ర‌యోగాల గురించి అంద‌రికీ తెలిసిందే. ఒక‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాయ‌కుల‌ను మ‌రో నియోజ‌క‌వ‌ర్గానికి మార్చేశారు. స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గం నేత‌ను డ‌మ్మీ చేశారు. ఇక‌, ఒక జిల్లా నేత‌ను మ‌రో జిల్లాకు మార్చాల‌ని అనుకున్నా.. అది దెబ్బ కొడుతుంద‌ని అనుకున్నారు. దీంతో కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఈ మార్పులు కొన‌సాగాయి. అయితే.. ఈ మార్పులు స‌క్సెస్ కాక‌పోగా.. పార్టీ వ్య‌వ‌స్థీకృతంగా కూడా భారీగా దెబ్బ‌తింది. ప‌నిచేసే …

Read More »

లోకేశ్ అంటే మోదీకి అంత ఇష్టమా..?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లో దినదినాభివృద్ది సాధిస్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమికి బంపర్ విక్టరీ అందించిన లోకేశ్… ఆ తర్వాత కూడా ప్రభుత్వ పాలనలో తనదైన దూకుడుతో సాగుతున్నారు. ఓ వైపు పార్టీ, మరోవైపు ప్రభుత్వం, ఇంకోవైపు కూటమిలోని మిత్రపక్షాలు… అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ సాగుతున్న లోకేశ్ తీరు నిజంగానే అద్భుతమనే చెప్పాలి. ఈ విషయాలు తెలిసే కాబోలు… ప్రధాన …

Read More »

అమరావతి ఒక నగరం కాదు… ఒక శక్తి: మోదీ తెలుగు పలుకులు

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు అమరావతి పరిధిలోని వెలగపూడి సచివాలయం వెనుక ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభా వేదిక మీద నుంచే మోదీ… అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. అమరావతి పనులతో పాటుగా ఏపీలో పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులను కూడా మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్సాహంగా ప్రసంగించిన మోదీ… అమరావతిని …

Read More »

అనూహ్యంగా ఎన్టీఆర్ పేరెత్తిన మోడీ.. బాబుకు ఇదే స‌రైన టైం!

రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నుల పునః ప్రారంభ ఘ‌ట్టానికి వ‌చ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నోటి నుంచి అనూహ్యంగా తెలుగు వారి అన్న‌గారు.. టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ పేరు వ‌చ్చింది. “ఎన్టీఆర్.. విక‌సిత‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోసం క‌ల‌లు క‌న్నారు. ఆ క‌ల‌ల‌ను మ‌నం(చంద్ర‌బాబు-ప‌వ‌న్‌-మోడీ) సాకారం చేద్దాం” అని మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వాస్త‌వానికి మోడీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ పేరును బ‌హిరంగంగా ప్ర‌క‌టించింది కానీ.. ఆయ‌న పేరును త‌లుచుకున్న‌ది …

Read More »

ఆ పాకిస్థాన్ ఫ్యామిలీకి సుప్రీంకోర్టులో ఊరట

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు గడువు ముగిసిన వీసాలపై కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనగర్‌కు చెందిన ఆరుగురు సభ్యుల అహ్మద్ తారిక్ భట్ కుటుంబానికి శుక్రవారం సుప్రీంకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. వీసా గడువు ముగిసినా వారు ఇంకా భారత్‌లో ఉన్నారని కేంద్రం తెలిపిన నేపథ్యంలో, ఈ కుటుంబం అరెస్ట్‌కు గురికావాల్సిన పరిస్థితి …

Read More »

అమ‌రావ‌తిలో మోడీ ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవే!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న 18 కీల‌క ప్రాజెక్టుల‌కు వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. వీటిలో అమ‌రావ‌తి రాజ‌ధానిలో ఏర్పాటు చేసే ప్రాజెక్టులు స‌హా.. ఏపీలో కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టే ప్రాజ‌క్టులు కూడా ఉన్నాయి. అమ‌రావ‌తి రాజ‌ధానిలో 58 వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప్రాజెక్టుల‌కు శ్రీకారం చుట్టారు. 7 జాతీయ ర‌హ‌దారుల‌కు సంబంధించిన ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేశారు(ఇవి ఏపీని ఇత‌ర …

Read More »

వైసీపీ లిక్క‌ర్ స్కాం.. వారికి బెయిల్ ఇవ్వ‌లేం: హైకోర్టు

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో దాదాపు 3500 కోట్ల రూపాయ‌ల మేర‌కు మేసేశార‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. విచార‌ణ చేయిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే రాజ్ క‌సిరెడ్డిని పోలీసులు అరెస్టు చేయ‌డం.. విచార‌ణ సాగిస్తుండ‌డం తెలిసిందే. ఇక‌, తాజాగా.. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్ సెక్రటరీ కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి, జ‌గ‌న్ స‌తీమ‌ణి …

Read More »