Political News

జగన్ గో బ్యాక్..తెనాలిలో హై టెన్షన్

శాంతి భద్రతలు కాపాడుతూ విధి నిర్వహణలో ఉన్న పోలీసుపై గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు దాడి చేశారు. దీంతో, ఆ యువకులకు బుద్ధి చెప్పేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. నడి రోడ్డుపై ఆ యువకులకు అరికాళ్ల కోటింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో మరే గంజాయి బ్యాచ్ పోలీసులపై చేయి ఎత్తకుండా పనిష్మెంట్ ఇచ్చారు. పోలీసులను కొట్టిన ఆ యువకులకు తగిన శాస్తి జరిగిందని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, …

Read More »

పొగరుతో వెళ్లి కరువులో ఇరుక్కున్న పాక్!

జలవనరుల విషయంలో చాలా కాలంగా గా ఓ లబ్ధిదారుగా ఉన్న పాకిస్థాన్ ఇప్పుడు నీటి కొరతతో అల్లాడుతోంది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం ఇప్పుడు ప్రభావాన్ని చూపిస్తోంది. పొగరుతో నదిలో పారేది రక్తం అంటూ చేసిన కామెంట్స్ కు ప్రతిఫలంగా కరువుతో అల్లాడే పరిస్థితి ఎదురైంది. సింధు జలాల ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరించి, తన హక్కైన నీటిని నిలిపివేసిన భారత్ చర్యలతో పాకిస్థాన్ వ్యవసాయ …

Read More »

నందిగంతో సజ్జల ములాఖత్… ఇప్పుడే ఎందుకంటే..?

వైసీపీ అదికారంలో ఉండగా… ఆ పార్టీకి చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఓ రేంజిలో తనదైన హవా సాగించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో పాలుపంచుకున్నవారంతా దాదాపుగా నందిగం అనుచరవర్గమేనని కూడా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయనపై ఇతరత్రా పలు కేసులూ ఉన్నాయి. ఈ క్రమంలో కూటమి సర్కారు అదికారంలోకి రాగానే… పాత కేసుల బూజు దులపగా… నందిగం అరెస్టయ్యారు. ఏకంగా 3 నెలలకు పైగా …

Read More »

ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ.. మళ్లీ జైలుకు వంశీ

కేసుల సుడిలో చిక్కుకున్న వైసీీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ సోమవారం సాయంత్రం విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఆసుపత్రి నుంచి ఆయనను పోలీసులు నేరుగా బెజవాడ జిల్లా జైలుకు తరలించారు. అనారోగ్య కారణాలతో వంశీకి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యంతర బెయిల్ ఆసుపత్రిలో చికిత్స వరకే కొనసాగుతుందని, చికిత్స పూర్తి కాగానే …

Read More »

జనం వద్ద ఇంకా రూ.2 వేల నోట్లు వున్నాయా

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న అతి పెద్ద నిర్ణయాల్లో డీమానిటైజేషన్ కూడా ఒకటి. అన్నింటికంటే కూడా ఈ నిర్ణయమే అతి పెద్దదని కూడా చెప్పాలి. ఈ నిర్ణయంతో అప్పటిదాకా ఉన్న రూ.100, రూ.500 నోట్లు రద్దు కాగా…కొత్తగా రూ.2 వేల నోటు అందుబాటులోకి వచ్చింది. అయితే రూ.100, రూ.500 నోట్లను మార్చిన తర్వాత ఆర్బీఐ రూ.2 వేల నోట్లను రద్దు చేసింది. జనం వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను …

Read More »

5 కాదు 11.. కేసీఆర్ వ్యూహమేంటీ?

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన వ్యూహాన్ని సడెన్ గా మార్చేశారు. బీఆర్ఎస్ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు, నాణ్యతా ప్రమాణాలపై ఏర్పాటు అయిన జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ ఏకసభ్య కమిషన్ విచారణకు ఈ నెల 5న కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. విచారణకు హాజరు అయ్యేందుకు కేసీఆర్ కూడా సానుకూలంగానే ఉన్నా… ఎందుకనో గానీ సోమవారం ఆయన తన …

Read More »

అభివృద్ధిలో తెలంగాణ కంటే ఏపీ అద్భుతం: తెలంగాణ ఎంపీ

తెలుగు నేల విభజన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండా ప్రస్థానం ప్రారంభించిన నవ్యాంధ్రప్రదేశ్.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఇదేదో… ఇప్పుడు ఏపీలో అదికారంలో ఉన్న పార్టీకు చెందిన నేతలో, లేదంటే టీడీపీ అభిమానులో చెబుతున్న మాట కాదు. అభివృద్ధిలో ఏపీతో నిత్యం పోటీ పడుతున్న తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, బీజేపీ నేత, మల్కాజిగిరీ ఎంపీ ఈటెల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో ఏపీ అద్భుతంగా రాణిస్తూ …

Read More »

తిరువూరు డ్రామా కు తెరపడింది

ఏపీలో స్థానిక సంస్థల పాలక వర్గాలు వరుసబెట్టి వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలకు షిప్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉన్నా కూడా ఆయా పురపాలికలకు చెందిన మెజారిటీ సభ్యులు వైసీపీని వీడి టీడీపీ, జనసేనల్లో చేరిపోతున్నారు. ఇప్పటికే విశాఖ, తిరుపతి వంటి కీలక నగరపాలక సంస్థలు టీడీపీ వశం కాగా… తాజాగా కృష్ణా జిల్లా పరిధిలోని తిరువూరు నగర పంచాయతీ కూడా …

Read More »

‘గంజాయి బ్యాచ్ ను పరామర్శించనున్న జగన్’

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్టుండి సడెన్ గా గుంటూరు జిల్లా తెనాలి పర్యటనను ప్రకటించారు. మంగళవారం నాటి జగన్ పర్యటనకు సంబంధించిన నిర్ణయాన్ని వైసీపీ సోమవారం ఉదయం ప్రకటించింది. ఇటీవలే బహిరంగంగా ముగ్గురు యువకులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జాన్ విక్టర్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారట. ప్రస్తుతం అతడిని పరామర్శించేందుకు జగన్ తెనాలి పర్యటనకు వెళుతున్నారు. జాన్ విక్టర్ …

Read More »

కీల‌క ఓటు బ్యాంకు సంతృప్తి.. జ‌గ‌న్‌కు ఛాన్స్ త‌క్కువే!

ఏపీలో కీల‌క‌మైన ఓటు బ్యాంకు సంతృప్తితోనే ఉందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీలో ప్ర‌భుత్వాన్ని మార్చ‌గ‌ల శ‌క్తిగా కొన్ని వ‌ర్గాల‌ను రాజ‌కీయ నాయ‌కులు పేర్కొంటారు. వీరిలో ప్ర‌భుత్వ ఉద్యోగులు.. యువ‌త‌.. గ్రామీణులు కీల‌కం. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు ఉన్నా.. వారు పోలింగ్ బూత్ వ‌ర‌కు వ‌స్తారో రారో.. అనేది చెప్ప‌డం క‌ష్టం. సో.. వారిని దాదాపు ఎలిమినేట్ చేస్తారు. దీంతో సాధార‌ణంగా మ‌హిళ‌ల‌ను, ఉద్యోగుల‌ను, యువ‌త‌ను, గ్రామీణుల‌ను మాత్ర‌మే ఓటు …

Read More »

కేసీఆర్‌కు అచ్చిరాని ‘బీ’-ఆర్‌ఎస్‌?

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సెంటిమెంటు చాలా ఎక్కువ‌. ఆయ‌న హేతువాది అని ఎక్క‌డా చెప్పుకోలేదు. అయితే.. గియితే.. క‌మ్యూనిస్టు భావ‌జాలం కొంత మేర‌కు ఉన్నా.. అవి ఆయ‌న సెంటిమెంటుకు అడ్డం కూడా కాలేదు. నుదిటిన బొట్టు పెట్టినా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో యాగాలు చేసినా.. ఆయ‌న సెంటిమెంటు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఒక్క ఎన్నిక‌ల స‌మ‌యం అనేకాదు.. అస‌లు ఆది నుంచి కూడా సెంటిమెంటుకు పెద్ద పీట వేశారు. …

Read More »

జూన్ 4పై పవన్ మార్కు పవర్ పంచ్ డైలాగ్

జూన్ 4… ఆ రోజు ఏపీలో రాజకీయంగా పెను ప్రకంపనలే సంభవించనున్నాయి. ఇప్పటికే విపక్ష వైసీపీ జూన్ 4న వెన్నుపోటు దినంగా ప్రకటించింది. కూటమి పాలనపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ దిశగా ఆ పార్టీ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. అయితే అదే రోజున కూటమి పార్టీలకు కూడా అత్యంత ముఖ్యమైన రోజే. ఎందుకంటే… ఆ రోజే వైసీపీ పాలనకు తెర పడి కూటమికి రికార్డు మెజారిటీ కట్టబెడుతూ …

Read More »