నిజమే.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆగేదే లేదని తేల్చి చెప్పేశారు. అందుకు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సరేనన్నారు. అంతే… పిఠాపురంలో ఈ నెల 14న జరగనున్న జనసేన ఆవిర్భావ వేడుకల్లో జరగాల్సిన కార్యక్రమం శుక్రవారం సాయంత్రమే ముగిసిపోయింది. ఇదివరకే జనసేనలోకి పెండెం దొరబాబు చేరిక ఖరారు కాగా… శుక్రవారం ఆ లాంఛనం కూడా పూర్తి అయిపోయింది. పెండెం దొరబాబు జనసేనలో చేరిపోయారు. …
Read More »రంగన్న మృతిపై కేబినెట్ లో సుదీర్ఘ చర్చ
వైసీపీ అధినే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై శుక్రవారం నాటి ఏపీ కేబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది. అమరావతిలోని సచివాలంలో సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ఏపీ కేబినెట్ భేటీ జరిగిన సంగతి తెలిసిందే. కేబినెట్ భేటీలో అజెండా అంశాలపై చర్చ ముగిసిన తర్వాత వివేకా హత్య కేసును స్వయంగా చంద్రబాబే ప్రస్తావించారు. …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికలు.. రాములమ్మ రాజకీయం!
రాజకీయాల్లో ఎవరు ఉన్నా.. పదువులు ఆశించకుండా ఉండరనేది నిష్టుర సత్యం. ఎలాంటి పదవులు లేకుండానే ప్రజలకు సేవ చేస్తామని చెప్పేవారు కూడా ఇటీవల కాలంలో కరువయ్యారు. పైగా.. ఏ పార్టీలో ఉన్నా పదవుల కోసమే అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి ఏ పార్టీ వస్తే.. దానికి అనుకూలంగా మారుతున్న వారు పెరుగుతున్నారు. తాజగా గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ నటి, రాములమ్మగా పేరొందిన విజయశాంతి కూడా …
Read More »జగన్ మళ్లీ బెంగళూరు ఫ్లైటెక్కేశారు
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మరోమారు బెంగళూరు బయలుదేరారు. 3 రోజుల క్రితం బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన జగన్… రెండు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉన్నారు. మూడో రోజు మధ్యాహ్నమే ఆయన సతీసమేతంగా గన్నవరం ఎయిర్ పోర్టులో బెంగళూరు విమానం ఎక్కేశారు. ఈ టూర్ లో జగన్ తాడేపల్లిలో ఉన్నది కేవలం రెండు రోజులేనన్న మాట. తాడేపల్లిలో ఉన్న రెండు …
Read More »నారా లోకేశ్ వెంట రాగా… నాగబాబు నామినేషన్
జనసేన అధినే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఎమ్మెల్సి అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 5 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా… అన్నిసీట్లూ కూటమి పార్టీలకే దక్కనున్నాయి. అసెంబ్లీలో ఆయా పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి చూస్తే…వైసీపీకి 11మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో …
Read More »కేసీఆర్కు మరో ఉచ్చు.. సుప్రీంలో నాగం పిటిషన్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మరో ఉచ్చు చిక్కుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన పలు ప్రాజెక్టులకు సంబంధించిన అవినీతి ఆరోపణల కేసుల్లో చిక్కుకున్నారు. వీటిపై విచారణ సాగుతోంది. తాజాగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి సంబంధించిన మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి సుప్రీంకోర్టులో కేసు వేశారు. హైకోర్టులో ఈ వివాదంపై దాఖలు చేసిన కేసులను కొట్టి వేయడాన్ని సవాలు చేయడంతోపాటు ఈ ప్రాజెక్టును చేపట్టిన బీహెచ్ ఈఎల్ …
Read More »పోసానికి బెయిల్.. కానీ, జైలు తప్పలేదుగా!
వైసీపీ మాజీ నాయకుడు, మాటల రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళికి కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా లో అనుచిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టేలా చేసిన ప్రసంగాలపై అందిన ఫిర్యాదు మేరకు.. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం ఓబులవారి పల్లె పోలీసులు.. కొన్ని రోజుల కిందట పోసానిని హైదరాబాద్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను కడపకు తరలించి.. జైలులో రిమాండ్ ఖైదీగా …
Read More »పేర్ని నానిపై హైకోర్టు ఆగ్రహం.. కానీ..!
వైసీపీ మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు పేర్ని వెంకట్రామయ్య ఉరఫ్ పేర్ని నాని వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదలకు ఇచ్చే బియ్యాన్ని దారి మళ్లించారంటూ.. పేర్ని కుటుంబంపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. పేర్ని ఫ్యామిలి వైసీపీ హయాంలో సొంతగా గోడౌన్లు నిర్మించింది. దీనిలో పౌర సరఫరాల శాఖకు చెందిన బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. అయితే.. కూటమి సర్కారు వచ్చాక.. నిల్వలను …
Read More »రెస్ట్ తీసుకుంటారా?…సస్పెండ్ చేయించాలా?: లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… పార్టీ కార్యకర్తల పట్ల ఎంత కన్ సర్న్ తో ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. కార్యకర్తకు కష్టమొస్తే… లోకేశ్ నిమిషం కూడా ఆగరు. అలాంటిది అనారోగ్యం వేధిస్తున్నా…చికిత్స తీసుకుంటూనే… చేతికి సెలైన్ బాటిల్ బ్యాండేజీలను కూడా తీయకుండానే.. తన బాధ్యతలను నెరవేర్చే క్రమంలో అసెంబ్లీకి వస్తున్న నేతలు కనిపిస్తే లోకేశ్ ఊరుకుంటారా? ఎంతమాత్రం ఊరుకోరు. అలాంటి నేతలను ఖచ్చితంగా …
Read More »విజయసాయి బీజేపీ ఎంట్రీ ముహూర్తం ఫిక్స్ .. ?
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు ఎంతో సన్నిహితుడిగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారు అయ్యిందా ? అంటే కూటమి వర్గాల్లో అవును అన్న చర్చలు చాపకింద నీరులా నడుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే విజయసాయి మూడు సంవత్సరాలకు పైగా ఉన్న తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులు కోవడంతో పాటు …
Read More »‘వివేకా హత్య’లో కొత్త కేసు దర్యాప్తు షురూ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాకముందే… ఈ హత్యకు సంబంధించిన మరో కొత్త కేసు దర్యాప్తు ప్రారంభమైపోయింది. ఇప్పటికే ఈ కొత్త కేసు విచారణకు ఓ కొత్త బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త కేసు ఒకింత ఆసక్తి …
Read More »నిజమా?.. బోరుగడ్డ అనిల్ బయటే ఉన్నారా?
బోరుగడ్డ అనిల్ కుమార్ పేరు మొన్నటిదాకా మారుమోగిపోయింది. ప్రతి రోజు ఆయన పేరు ప్రధాన పత్రికల్లో తప్పనిసరిగా కనిపించేది. ఏ నేతనో బెదిరించారనో, ఏదో కేసు నమోదు అయ్యిందనో, మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయ్యిందనో, పోలీస్ స్టేషన్ లోనే రాచ మర్యాదలు అనో, పోలీసులకే స్టార్ హోటల్ తీసుకెళ్లారనో, పోలీసులే బిర్యానీ తినిపించారనో… కోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టేసిందనో… ఇలా ఏదో ఒకటి బోరుగడ్డకు సంబంధించిన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates