ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు చెందిన యువ నేత, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలకు గుర్తింపు ఉంది. వైరి వర్గాలను టార్గెట్ చేయడంలో వీరిద్దరిదీ అందె వేసిన చేయి అని చెప్పక తప్పదు. అయితే వీరిద్దరికీ జాయింట్ గానే కష్టాలు మొదలైపోయాయని చెప్పాలి. ఎందుకంటే… వైసీపీ అధికారంలో ఉండగా… రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు …
Read More »సాయిరెడ్డి వంతు వచ్చేసింది!
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన నిర్వాకాలపై కూటమి పాలనలో వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ కేసుల్లో కొందరు అరెస్టు అవుతూ వస్తున్నారు. మరికొందరు కోర్టులను ఆశ్రయించి ముందస్తు బెయిళ్లు తీసుకుంటూ ప్రస్తుతానికి అరెస్టుల నుంచి ఉపశమనం పొందుతున్నారు. రోజులు గడిచే కొద్దీ ఈ జాబితా పెరిగిపోతూనే ఉంది. ఇప్పుడు ఈ జాబితాలోకి మాజీ …
Read More »అమరావతి పై అనుమానాలొద్దు.. ఇక పరుగులే
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షం వైసీపీ నాయకులు సృష్టిస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ఏపీ మంత్రులు కోరారు. రాజధాని కోసం వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకువచ్చి పెడుతున్నారని, ఈ అప్పులు ఎలా తీరుస్తారని, తిరిగి ప్రజలపై భారాలు మోపుతారని గత నాలుగు రోజులుగా వైసీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మంత్రులు నారాయణ, కేశవ్, కందుల దుర్గేష్ ఖండించారు. రాజధాని పై జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని …
Read More »అసంత్రుప్తివున్నా జగన్ వైపు వెళ్ళట్లేదుగా
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ విఫలమైతే.. ఆ పార్టీ నష్టపోవడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఇప్పుడు ఏపీలోనూ అదే జరుగుతోంది. గత ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమై వైసీపీ రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతేకాదు.. రాజకీయ పతనావస్థలో చాలా జోరుగా జారుకుంటోంది. దీంతో ఈ పరిణామాలు.. కూటమి సర్కారుకు మేలు చేస్తున్నాయి. వాస్తవానికి వైసీపీ బలంగా ఉండి ఉంటే.. కూటమి పరిస్థితి వేరేగా ఉండేదని …
Read More »జగన్ దుబారాతోనూ బాబు సంపద సృష్టి
సంపద సృష్టి అనే పదం విన్నంతనే… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడే అందరికీ గుర్తుకు వస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఆర్థిక కార్యకలాపాలను పరుగులు పెట్టించడం, వాటి ద్వారా సర్కారీ ఖజానాకు ఆదాయాన్ని ఆర్జించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. వైసీపీ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… సీఎం అధికారిక నివాసం కోసమంటూ విశాఖలోని రిషికొండపై వందల కోట్ల రూపాయలు ఖర్చు …
Read More »మంగళగిరిలో ఉచిత బస్సు.. ప్రారంభించిన నారా లోకేష్!
తన నియోజకవర్గంలో ప్రజల కష్టాలపై హుటాహుటిన స్పందిస్తున్న మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్.. తాజాగా ఇక్కడి వారికి ఉచిత బస్సు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ బస్సు అందరికీ ఉచితం కావడం గమనార్హం. అయితే.. ఇది లిమిటెడ్ ప్రాంతాల్లోనే పర్యటించి.. ప్రజలకు సేవలు అందించనుంది. ఇలా రెండు ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి లోకేష్ తాజాగా సోమవారం సాయంత్రం జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సుల రాకతో.. నియోజకవర్గం …
Read More »ఏపీ అప్పులు వేరు.. అమరావతి అప్పులు వేరు: వైసీపీకి షాకిచ్చిన కేంద్రం
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి కేంద్రం భారీ షాకిచ్చింది. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు సహా ఆసియా అభివృద్ది బ్యాంకు ఇస్తున్న రుణాలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అప్పుల్లో భాగం చేయాలని కోరుతూ.. వైసీపీ ఎంపి చేసిన విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. అంతేకాదు.. అసలు అమరావతి అప్పులు వేరు.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు వేరుగా చూస్తున్నట్టు తెలిపింది. రాజధాని కోసం చేస్తున్న అప్పులను సాధారణ రాష్ట్ర అప్పుల జాబితాలో …
Read More »బాబుతో వీర్రాజు ప్యాచప్ అయినట్టే!
2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా… పోటీకి దూరంగా ఉండిపోయిన జనసేన.. ఆ రెండు పార్టీల కూటమికి మద్దతుగా నిలిచింది. వెరసి టీడీపీ, బీజేపీ విజయం సాధించాయి. రెండు పార్టీలు కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ క్రమంలోనే బీజేపీకి చెందిన సీనియర్ నేత సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. నాడు చంద్రబాబు విధానాలను విమర్శిస్తూ సాగిన వీర్రాజు… తాజాగా ఇప్పుడు మరోమారు టీడీపీ సభ్యుల …
Read More »పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారా..?
తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో లెక్కలేనన్ని సంచలనాలు నమోదు అవుతున్నాయి. 2023 చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఫలితంగా అప్పటిదాకా దఫదఫాలుగా వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి చేరిన వారిలో ఓ 10 మంది దాకా కాంగ్రెస్ గూటికి చేరారు. అలా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ గూటికి చేరిన మరో కీలక నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే …
Read More »రాములమ్మ రీ ఎంట్రీ అదిరిపోయినట్టే
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి రాజకీయాల్లోకి పున:ప్రవేశం అదిరిపోయిందని చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన రాములమ్మ… అప్పట్లో మెదక్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఆమెకు అంతగా కలిసి రాలేదు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఆమెకు అవకాశం దక్కింది. ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 3 …
Read More »పార్టీ విధేయులకు అన్యాయం జరగదు: నారా లోకేశ్
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరుకు ఐదేసి ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్న సంగతి తెలిసిందే. ఈ స్థానాలు భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా… మొత్తం 10 స్థానాలకు 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఫలితంగా ఈ ఎన్నికల్లో పోలింగ్ కు అవకాశం లేదనే చెప్పాలి. నామినేషన్లు …
Read More »జనసేన.. నవతరం రాజకీయానికి నాందీ!
జనసేన… దేశ రాజకీయాల్లో నవ శకానికి నాందీ పలికింది. ఇప్పటిదాకా పోటీ చేసిన అన్ని సీట్లను గెలిచిన పార్టీ ఏపీలోనే కాదు… దేశంలోనే మరో పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎన్నికల విజయాల్లోనే కాకుండా సమాజంపై తనకున్న బాధ్యతను గుర్తెరుగుతూ ఆ పార్టీ అధినాయకత్వం ఇప్పుడు ఓ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates