2014లో ఉమ్మడి ఏపీ విడిపోయి.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఆ తర్వాత.. కేంద్రంలో ప్రభుత్వం మారడంతో.. విభజన చట్టంలోని చాలా సమస్యలు అపరిష్కృతంగానే ఉండి పోయాయి. అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కేంద్రానికి పలు రూపాల్లో విన్నపాలు చేస్తూనే ఉన్నాయి. అయితే.. ఎట్టకేలకు.. తాజాగా కేంద్ర హోం శాఖ ఈ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా విభజన చట్టం-2014లోని షెడ్యూల్ …
Read More »హైకోర్టుకు పోలీసులు.. జగన్పై పిటిషన్?
వైసీపీ అధినేత జగన్ తమపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం.. హైకోర్టును ఆశ్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ జోక్యాన్ని కోరుతూ.. అధికారుల సంఘం తాజాగా లేఖ రాసింది. అయితే..తాజాగా రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ.. జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని.. అయితే.. ప్రభుత్వ పరంగా కంటే కూడా.. న్యాయ పోరాటం ద్వారానే పోలీసులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. …
Read More »ఫార్మాపై ట్రంప్ టారిఫ్ లు అమెరికాకు పిడుగుపాటే!
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే కొలువుల కోత మొదలుకాగా… త్వరలోనే హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటిదాకా విదేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న దాదాపుగా అన్ని వస్తువులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను భారీగా పెంచేశారు. ఫలితంగా అమెరికాలో ఆయా దేశాల ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. తాజాగా ట్రంప్ ఓ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఫార్మా రంగంపైనా కొత్త …
Read More »అమరావతి టు హైదరాబాద్ రయ్ రయ్!.. కీలక అప్డేట్!
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తెరమీదికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. రాజధాని అమరావతిని నేరుగా హైదరాబాద్తో లింకు చేస్తే.. పెట్టుబడులు, వ్యాపార వేత్తలు రాజధానికి క్యూ కట్టే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు తలపోస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘అమరావతి-హైదరాబద్’ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం చేపట్టాలన్నది చంద్రబాబు ఉద్దేశం. అయితే.. ఈ ప్రాజెక్టును రాష్ట్రపరిధిలో కాకుండా.. జాతీయస్థాయిలో …
Read More »వంశీకి జైలే.. తాజా తీర్పు!
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ.. విజయవాడ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే ఆయన విజయవాడ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారంతో ఆయనకు గతంలో విధించిన రిమాండ్ గడువు పూర్తయింది. ఈ నేపథ్యంలో పోలీసులు.. ఆయనను బుధవారం.. విజయవాడలోని సీఐడీ కోర్టులో హాజరు పరిచారు. పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు.. రిమాండ్ పొడిగించింది. దీంతో మరో 14 రోజుల …
Read More »డీసీసీలే ఇక సుప్రీం!… హస్తం పార్టీ తీర్మానం అమలయ్యేనా?
కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (ఏఐసీసీ) సమావేశాలు గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం మొదలైన ఈ సమావేశాలు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ స్థాయిలో పార్టీ అథ్యక్షుడి నేతృత్వంలోని ఏఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండగా… రాష్ట్రాల్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)లు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఇకపై ఏఐసీసీలతో …
Read More »వీడియో: అమరావతిలో బాబు సొంతిల్లు..
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన సొంతింటికి బుధవారం శ్రీకారం చుట్టారు. కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణీల సమక్షంలో మనవడు నారా దేవాన్ష్ తో కలిసి చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరిలు ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం బుధవారం ఉదయం 8.51 గంటలకు మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ కార్యక్రమాన్ని …
Read More »గాయపడ్డ కొడుకును చేరిన పవన్.. తాజా పరిస్థితేంటి?
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం అత్యంత దారుణంగా గడిచిందని చెప్పక తప్పదు. ఓ వైపు పెద్ద కుమారుడి జన్మదినం… అదే రోజు తెల్లారి లేవగానే.. అగ్ని ప్రమాదంలో చిన్న కుమారుడికి గాయాలు… అది కూడా ఎక్కడో సుదూరాన సింగపూర్ లో ఈ ఘటన జరగడం.. నిజంగానే పవన్ ఎలా ఉగ్గబట్టుకున్నారో తెలియదు గానీ.. సాధారణ వ్యక్తులు అయితే ఈ టెన్షన్ ను తట్టుకోవడం …
Read More »అది జగన్ స్థాయికి తగదు
నాయకుడు అన్న వ్యక్తి.. హుందాగా వ్యవహరించాలి. పైగా.. గతంలో ఉన్నస్థాయి పదవులు అలంకరించిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే.. అది వారికే చీప్గా పరిణమించి.. సమాజంలో మరింత చులక న కావడం ఖాయం. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. పోలీసులను ఉద్దేశించి పదే పదే జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన హుందా తనాన్ని మరింత డౌన్ చేస్తున్నాయి. చివరకు.. ఒక స్టేషన్కు పరిమితమైన …
Read More »ఆర్బీఐ గుడ్ న్యూస్.. వడ్డీ రేట్ల తగ్గింపు
భారత రిజర్వ్ బ్యాంకు బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా 3 నెలల క్రితం వడ్డీ రేట్లను తగ్గించిన రిజర్వ్ బ్యాంకు తాజాగా బుధవారం నాటి త్రైమాసిక సమీక్షలోనూ వడ్డీ రేట్లను మరింతగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును గతంలో 0.25 శాతం తగ్గించిన సెంట్రల్ బ్యాంకు… ఈ సారి కూడా అదే వైఖరిని కొనసాగించింది. బుధవారం …
Read More »చంద్రబాబు ‘డిజిటల్’ పాలన షురూ!
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పాలనను డిటిజల్ రూపంలోకి మారుస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా.. చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. ఈ మాధ్యమం ఇప్పుడు అందరికీ చేరువ అయిన విషయం తెలిసిందే. తెల్లవారి లేచింది మొదలు రాత్రినిద్రపోయే వరకు కూడా.. వాట్సాప్తోనే ప్రజల జీవితాలు అనుసంధానమై ఉంటున్నాయి. దీనిని పసిగట్టిన చంద్రబాబు.. వాట్సాప్ గవర్నెన్స్ను తీసుకువచ్చారు. సుమారు 502 రకాల కార్యక్రమాలను దీని ద్వారా అమలు చేస్తున్నారు. అంతేకాదు.. …
Read More »“జాగ్రత్తగా మాట్లాడండి… జాగ్రత్తగా ఉండండి”
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, విపక్షంలోకి మారితే మరోలా మాట్లాడుతున్న వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై పోలీసు అదికారులు వరుసబెట్టి మరీ తప్పుబడుతున్నారు. గతంలో ఓసారి పోలీసుల బట్టలూడదీసి నడిరోడ్డుపై నిలబెడతామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై పోలీసు అదికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాప్తాడు పర్యటనలోనూ మంగళవారం జగన్ అవే వ్యాఖ్యలను చేశారు. ఈ వ్యాఖ్యలపై శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates