జమ్ము కశ్మీర్లో ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాంలో గత నెల 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది(ఒకరు నేపాలీ) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మతం పేరు అడిగి మరీ ఉగ్రవాదులు వీరిని హతమార్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్లోని ఉగ్రమూకల శిబిరాలపై బెబ్బులిలా విరుచుకుపడింది. ఉగ్రతండాలను ధ్వంసం చేసింది. ఉగ్రవాదులను పదుల సంఖ్యలో హత …
Read More »తెంపరి ట్రంప్.. ఇచ్చి పడేసిన భారత్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోటి దురదకు భారత ప్రభుత్వం కూడా అలానే దూకుడుగా సమాధానం ఇచ్చింది. కీలక మైన పాకిస్థాన్-భారత్ ఉద్రిక్తతల విషయంలో జోక్యం చేసుకున్న ట్రంప్.. శనివారం.. సాయంత్రం 5 గంటల సమయంలో నేను ఇరువురితోనూ మాట్లాను. వెంటనే కాల్పుల విరమించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాలు చాలా గొప్ప దేశాలు.. ఇద్దరు పాలకులు చాలా పరిణితి చెందిన వారు. గొప్ప వ్యక్తులు. అని పేర్కొన్నారు. …
Read More »భారత్-పాక్ యుద్ధాన్ని ఆపా: ట్రంప్ సెల్ఫ్ గోల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. భారత్-పాకిస్థాన్ల మధ్య తానే యుద్ధాన్ని నిలువరించా నని తాజాగా చెప్పుకొచ్చారు. యూఎస్ మీడియాతో మాట్లాడిన ట్రంప్.. అతి పెద్ద అణుయుద్ధాన్ని నిలువరించినట్టు తెలిపారు. భారత్-పాకిస్థాన్లు రెండూ అణుయుద్ధానికి దిగే అవకాశం ఉందని గమనించి.. తానే యుద్ధాన్ని నిలువరించేలా వారిని ఒప్పిం చానని పేర్కొన్నారు. ఇరు దేశాలను అత్యంత ఘనమైన దేశాలుగా పేర్కొన్న ట్రంప్.. తన సంబంధాలు రెండు దేశాలతోనూ …
Read More »ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం: ప్రధాని మోడీ
ఉగ్రవాదులను మట్టిలో కలిపేశామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ అంటే.. కేవలం ఆపరేషన్ కాదని.. దేశంలోని కోట్లాది మంది మహిళల సిందూరానికి ప్రతీకగా పేర్కొన్నారు. తొలుత ఆయన శౌర్య పరాక్రమాలను ప్రదర్శించిన భారత సైన్యానికి, సశస్త్ర సీమా బల్కు సెల్యూట్ …
Read More »పిఠాపురం నర్సులకు పవన్ కానుకలు.. ఎందుకంటే
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను ఘనంగా సత్కరించి.. వారిపై కానుకలు కురిపించారు. గత రాత్రే పిఠాపురం నుంచి ప్రత్యేక బస్సుల్లో 20 మంది స్టాఫ్ నర్సులను మంగళగిరిలోని జనసేన పార్టీప్రధాన కార్యాలయానికి, తన అధికారిక కార్యాలయానికి వారిని తీసుకువచ్చారు. సోమవారం.. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారిని ఆప్యాయంగా పలకరించిన పవన్ కల్యాణ్.. వారి సేవలను …
Read More »జవహర్, సుగుణమ్మల కష్టం ఫలించిందిగా.. !
వారిద్దరూ మాజీ ఎమ్మెల్యేలు. గత ఎన్నికల్లో పార్టీ అధినేత నిర్ణయానికి తలొగ్గారు. తమకు పోటీ చేసే అవకాశం దక్కలేదన్న బాధ, ఆవేదన ఉన్నా.. మౌనంగా పంటిబిగువున భరించారు. అంతేకాదు.. అప్పటి వరకు నియోజకవర్గంలో దూకుడుగా వ్యవహరించినా.. చివరినిముషంలో టికెట్ దక్కడం లేదని తెలిసినా కుంగిపోలేదు. వారే.. మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. ఇద్దరూ గత ఎన్నికల్లో టికెట్లు కోల్పోయిన వారే. అయితే.. పార్టీ పట్ల …
Read More »పార్టీని నమ్ముకున్నాడు, బాబు చూసుకున్నాడు!
విధేయత, అణుకువ, పార్టీ అధినేత పట్ల అత్యంత గౌరవ మర్యాదలు ప్రదర్శించి.. విధేయతకు కేరాఫ్గా నిలిచిన మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకు సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మక ఆప్కాబ్ చైర్మన్ పదవితో వీరతాడు వేశారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న గన్ని వీరాంజనేయులకు కీలకమైన పదవిని ఇచ్చి ఆయన సేవలను చంద్రబాబు గుర్తించారనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్గా ఇటీవలే నియమించిన ఆయనను …
Read More »అమరావతి ‘మణిహారం’ 70 కాదు 140 మీటర్లు..!
ఏపీ రాజధాని అమరావతికి మణిహారంగా పేర్కొంటున్న ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్ డేట్ వచ్చింది. ఇది 70 మీటర్ల వెడల్పు కాదని.. ఏకంగా 140 మీటర్ల వెడల్పని సీఆర్ డీఏ ప్రకటించింది. దీనికి సంబంధించి కేంద్రం కూడా అంగీకారం తెలిపినట్టు పేర్కొంది. వాస్తవానికి అమరావతి రింగు రోడ్డు ద్వారా.. మూడు ప్రాంతాల్లోని ప్రజలను రాజధాని పరిధిలోకి తీసుకురావాలని.. తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పుంజుకునేలా చేయాలని ప్రభుత్వం భావించింది. …
Read More »వలంటీర్లకు శిక్షణ ఇచ్చారంట, బిల్ – రూ.272 కోట్ల
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను సీఎంగా ఉండగా… ఏపీ ప్రజలకు ఓ అద్భుతమైన వ్యవస్థను అందించానని, దానిని కూటమి సర్కారు రద్దు చేసిందని వలంటీర్ వ్యవస్థ గురించి చెబుతున్న సంగతి తెలిసిందే. సేవ చేసేందుకే వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పిన మాట నిజమేనని.. అయితే ఆ సేవ ప్రజలకు కాకుండా… వైసీపీకి మాత్రమే అందిందని నాటి విపక్షం, నేటి అధికార కూటమి సారథి టీడీపీ ఆరోపించింది. …
Read More »జూన్ నెలలో జనాలకు డబ్బే డబ్బు..!
కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు 2024 ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో రెండు పథకాలకు మరో 30 రోజుల్లో మోక్షం లభించనుంది. అదేవిధంగా మరో కీలక కార్యక్రమానికి కూడా ఆయన ఈ నెలలోనే శ్రీకారం చుట్టనున్నారు. దీంతో జనాల చేతులలోకి దండిగానే సొమ్ములు రానున్నాయని కూటమి పార్టీల నాయకులు చెబుతున్నారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో రంగం కూడా రెడీ అయిందని …
Read More »సైన్యమా.. కదిలించిన బిగ్ బీ పోస్టు
‘భారత సైన్యమా.. వెనుకడుగు వేయకు.. నీ ప్రయాణం ఎప్పటికీ ఆగదు!’ అంటూ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సంచలన పోస్టుచేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు ఇప్పటికే స్పందించినా.. అమితాబ్ బచ్చన్ చాలా సంయమనం పాటించారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో భారత సైన్యాన్ని.. పహల్గామ్ దాడిలో తమ నుదిటి సిందూరాన్ని కోల్పోయిన భారత పుత్రికలను ఉద్దేశించి సుదీర్ఘ పోస్టు చేశారు. పహల్గామ్ దాడిలో …
Read More »పాక్పై మోడీ సంచలన వ్యాఖ్యలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వాన్ని తాము కోరుకోవడం లేదని నర్మగర్భంగా అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో తమ విధానం ఎప్పుడూ మారబోదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ విషయంలో పాకిస్థాన్కు ప్రత్యామ్నాయ మార్గం అంటూ మరొకటి లేదని.. పాకిస్థాన్ ఏ భూభాగాన్నయితే ఆక్రమించుకుందో.. దానిని తిరిగిభారత్కు ఇచ్చేయాలని స్పష్టం చేశారు. ఇంతకు మించిన ఆశలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates