Political News

కేసీఆర్ స‌ర్కారుపై బాబు ప్రేమ‌.. ఇక టీ టీడీపీ ఎందుకు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తిరిగి పార్టీని అధికారంలోకి తేవాల‌ని చూస్తున్న టీడీపీ అధినేత‌.. అధికార వైసీపీ ప్ర‌భుత్వం, సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల‌ను ప‌దునెక్కించారు. రైతుల స‌మ‌స్య‌లు ప‌ట్ట‌ని వైసీపీ ప్ర‌భుత్వం అంటూ బాబు ధ్వ‌జ‌మెత్తారు. కానీ ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో రైతులు సంతోషంగా ఉన్నారంటూ.. ఇక్క‌డి కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని పొగుడుతూ వ్యాఖ్యానించ‌డం మాత్రం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్టీ అధినేతే.. కేసీఆర్‌కు సానుకూలంగా మాట్లాడితే ఇక తెలంగాణ‌లో టీడీపీ ఉండ‌డం ఎందుక‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. …

Read More »

వంగ‌వీటి వార‌సురాలు వ‌స్తున్నారా?

వంగ‌వీటి రంగా.. విజ‌య‌వాడ‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లోనూ కీల‌క పాత్ర పోషించిన దివంగ‌త నాయ‌కుడు. బెజ‌వాడ రాజకీయాల్లో ఆయ‌న ఆధిప‌త్యం గొప్ప‌గా సాగింది. ఈ సారి ఏపీ ఎన్నిక‌ల్లో ఆయ‌న పేరు నిల‌బెట్టాల‌నే ల‌క్ష్యంతో.. వంగ‌వీటి రంగా కుమార్తె ఆశాల‌త రాజ‌కీయం రంగ‌ప్ర‌వేశం చేయ‌బోతున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. తండ్రి వార‌స‌త్వాన్నిపుణికిపుచ్చుకుని రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసేందుకు ఆమె రానున్నార‌ని, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి పోటీ చేయ‌నున్నార‌ని స్థానిక రాజ‌కీయ …

Read More »

బీజేపీకి రాముల‌మ్మ రాం రాం!

తెలంగాణ‌లో సీనియ‌ర్ నాయ‌కురాలు విజ‌య‌శాంతి… బీజేపీకి గుడ్‌బై చెప్ప‌నున్నారా? ఆ పార్టీపై అసంతృప్తిని ప‌రోక్షంగా బ‌య‌ట‌పెడుతున్నారా? మ‌రో దారి చూసుకోబోతున్నారా?.. అంటే అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలే అందుకు కార‌ణ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. తాజాగా మ‌ణిపూర్ ఘ‌ట‌న‌పై విజ‌యశాంతి ట్వీట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇది బీజేపీ తెలంగాణ శాఖ‌కు మింగుడుప‌డ‌డం లేద‌ని తెలిసింది. బీజేపీతోనే రాజ‌కీయ జీవితం ప్రారంభించిన ఈ రాముల‌మ్మ‌.. సొంత పార్టీ …

Read More »

జగన్ గర్జిస్తే లోకేష్ లాగులో పోసుకోవాలి: అంబటి

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్‌కు భయం అంటే ఏంటో పరిచయం చేస్తా అంటూ లోకేష్ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లోకేష్ పై మంత్రి అంబటి రాంబాబు ప్రతి విమర్శలు గుప్పించారు. జగన్ గర్జిస్తే లోకేష్ లాగులో పోసుకోవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి …

Read More »

జగన్ కు సారీ చెప్పిన పిల్లి సుభాష్

రామచంద్రాపురం వైసీపీలో రాజుకున్న రాజకీయ చిచ్చు ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోన్న సంగతి తెలిసిందే. మంత్రి వేణుగోపాల్ వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ ల కోల్డ్ వార్ ఎపిసోడ్ కు ది ఎండ్ కార్డ్ వేసేందుకు తూర్పుగోదావరి వైసీపీ ఇన్ చార్జ్ మంత్రి, ఎంపీ మిథున్ రెడ్డి చేసిన మధ్యవర్తిత్వం దాదాపుగా ఫలించినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాను పార్టీ మారబోతున్నాను అంటూ జరుగుతున్న ప్రచారంపై తాజాగా పిల్లి సుభాష్ …

Read More »

ఏపీకి అమరావతే రాజధాని:పురంధేశ్వరి

అమరావతిలోని ఆర్ 5 జోన్ లో ఏపీ సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన తర్వాత అమరావతి రాజధానిపై చర్చ తీవ్రతరం అయిన సంగతి తెలిసిందే. గతంలో అమరావతి పేరు కూడా ఎత్తని జగన్..ఇకపై మనందరిదీ అమరావతి అంటూ ప్రకటించడంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయడానికి జగన్ ప్రయోగించిన చిట్టచివరి అస్త్రం ఈ పట్టాల పంపిణీ కార్యక్రమమని విమర్శిస్తున్నారు. త్వరలోని విశాఖకు రాజధానిని …

Read More »

జగన్ పై గళమెత్తిన సర్పంచ్ లు

జగన్ హయాంలో సర్పంచ్ ల దుస్థితి వర్ణనాతీతం అని టీడీపీ నేతలు చాలా కాలంగా విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. సర్పంచ్ లను జగన్ తోలుబొమ్మలుగా మార్చారని, రాజ్యాంగం వారికి ప్రసాదించిన కొన్ని హక్కులను కాలరాస్తున్నారని విపక్ష నేతలు కూడా మండిపడుతున్నారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులను జగన్ పక్కదారి పట్టించారని, తక్షణమే పక్కదారి పట్టించిన 8,660 కోట్ల రూపాయలను గ్రామపంచాయతీల ఖాతాలలో జమ చేయాలని టీడీపీ అధినేత …

Read More »

సీబీఐకి ఇంగిత జ్ఞానం లేదు: సజ్జల

వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల సీబీఐ అధికారులు కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్ తో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ కేసులో వైఎస్ సునీత ఇచ్చిన వాంగ్మూలంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు చేయడం రాజకీయ దుమారం రేపింది. టీడీపీ నేతలే వివేకా హత్యకు పాల్పడ్డారని మీడియాకు చెప్పాలంటూ సజ్జల తనకు సూచించారని సునీత చెప్పిన వైనం …

Read More »

మోడీ ఇంత భయపడుతున్నారా ?

మణిపూర్లో అల్లర్లపై పార్లమెంటులో చర్చించేందుకు నరేంద్రమోడీ ఎంత భయపడుతున్నారో అర్ధమవుతోంది. రెండున్నర నెలలుగా మణిపూర్లో ఎంతటి ఘోరాలు జరుగుతున్నాయో అందరు చూస్తున్నదే. ఒకవైపు రాష్ట్రం అట్టుడికిపోతున్నా, ఘోరాలు జరుగుతున్నా మోడీ ఏమాత్రం పట్టించుకోకుండా హ్యాపీగా విదేశాల్లో తిరిగొచ్చారు. అంతర్జాతీయస్ధాయిలో దేశంపరువు పోయినా మోడీ లెక్కచేయలేదు. ఆ దశలన్నీ దాటిపోయి ఇపుడు మొదలైన వర్షాకాల సమావేశాల్లో ఇదే అంశాన్ని చర్చించాలంటే కేంద్రప్రభుత్వం ఇష్టపడటంలేదు. పార్లమెంటులో చర్చజరిగితే ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలంటేనే …

Read More »

కోడిక‌త్తి కేసులో జ‌గ‌న్ విన్న‌పాలు కొట్టివేత‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా.. ఆయ‌న‌పై విశాఖ ఎయిర్ పోర్టులో జ‌రిగిన కోడిక‌త్తి దాడి కేసు గురించి అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టికి నాలుగేళ్ల‌కుపైగానే ఈ కేసు నానుతోంది. ఈ దాడి చేసిన జ‌నుప‌ల్లి శ్రీనివాస‌రావు అనే యువ‌కుడు ఇప్ప‌టికీ జైల్లోనే ఉన్నాడు. స‌రే.. ఈ కేసు దాదాపు పూర్తికావొచ్చింది. అయితే.. కేసులో తాజాగా అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసును మ‌రోసారి పూర్తిగా విచారించాలంటూ సీఎం జ‌గ‌న్ …

Read More »

విభజన హామీలపై ఏపీ, తెలంగాణలే తేల్చుకోవాలట

ఏపీకి ప్రత్యేక హోదా అందని ద్రాక్షగా మిగిలిన సంగతి తెలిసిందే. ఇక, ఇరు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో ఉన్నాయి. రాష్ట్రం విడిపోయి పదేళ్లు గడిచినా విభజనానంతరం తీవ్రంగా నష్టపోయిన ఏపీ కోలుకోలేకపోయింది. ఈ నేపద్యంలోనే హోదాతో పాటు విభజన హామీల అమలు ప్రస్తావన పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రతిసారీ టీడీపీ ఎంపీలు లేవనెత్తుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే …

Read More »

ఆంధ్ర అప్పుల‌ పై ఇదే కేంద్రం లెక్క‌

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ దుస్థితికి మీరంటే మీరు కార‌ణ‌మంటూ అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ విమ‌ర్శ‌లు చేసుకుంటూనే ఉన్నాయి. చంద్ర‌బాబు హ‌యాంలోనే ఏపీ అప్పుల కుప్ప‌గా మారిపోయింద‌ని వైసీపీ నాయ‌కులు అంటున్నారు. కానీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అభివృద్ధి చేయ‌డం చేత‌కాక‌, అప్పుల‌తో రాష్ట్రాన్ని జ‌గ‌న్ న‌డిపిస్తున్నార‌ని టీడీపీ వాళ్లు గొంతెత్తున్నారు. మీ హ‌యాంలో అప్పులు లెక్క‌లు ఇవి అంటూ ప‌ర‌స్ప‌రం విమ‌ర్శించుకుంటున్నారు. అస‌లు ఎవ‌రి ప్ర‌భుత్వంలో ఎంత …

Read More »