Political News

పంతం నాదా-నీదా.. ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. !

పంతాల‌కు పోవ‌ద్దు.. క‌లిసి మెలిసి ప‌నిచేయండి.. అని సీఎం చంద్ర‌బాబు త‌ర‌చుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు చెబుతున్నారు. అంతేకాదు.. నియోజ‌క‌వ‌ర్గాల గొడ‌వ‌ల‌ను పెద్ద‌వి కూడా చేసుకోవ‌ద్ద‌ని ఆయ‌న సూచిస్తున్నారు. అయినా.. ఆయ‌న మాట‌ల‌ను పెద్ద‌గా లెక్క‌లోకి తీసుకున్న‌ట్టుగా క‌నిపించడం లేదు. క‌ర్నూలు జిల్లాలోని ఎమ్మెల్యేలకు, ఎంపీ శ‌బ‌రికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటున్న పరిస్థితి క‌నిపిస్తోంది. ఎక్క‌డిక్క‌డ నాయ‌కులు శ‌బ‌రికి వ్య‌తిరేకంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అయితే.. వీరికంటే నేనేం త‌క్కువ …

Read More »

వైసీపీ టాక్‌: కేసుల‌కు భ‌య‌ప‌డుతున్న ఫైర్ బ్రాండ్‌.. !

ఆయ‌న ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు. మీసం మెలేసి మ‌రీ ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు స‌వాళ్లు రువ్విన నాయ‌కుడు. అధికారంలో ఉన్న‌ప్పుడు.. అసెంబ్లీ వేదిక‌గానే తొడ‌గొట్టే ప్ర‌య‌త్నం చేసిన నాయ‌కుడు. కానీ, ఇప్పుడు పార్టీ అధికారం నుంచి దిగిపోయే స‌రికి.. ఆయ‌నకు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ఎక్క‌డ ఏకేసు త‌న‌ను చుట్టుముడుతుందోన‌న్న బెంగ వేధిస్తోంది. అలాగ‌ని మౌనంగా ఉంటే.. పార్టీ నుంచి త‌న కార్య‌క‌ర్త‌ల నుంచి ఒత్తిళ్లు భ‌రించ‌లేక పోతున్నార‌ట‌. ఈ క్ర‌మంలో నిర‌స‌న‌ల‌కు, …

Read More »

వారి క‌న్నీళ్లు చూసి.. క‌రిగిపోయిన ప‌వ‌న్‌!

రాష్ట్రానికి ఉప ముఖ్య‌మంత్రి, ఒక పార్టీకి అధినేత‌.. భ‌యంక‌ర‌మైన అభిమానుల కోలాహలం.. ఇంత పెద్ద హంగామా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కన్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ప‌క్క‌వారి క‌ష్టాన్ని చూసి ఆయ‌న చ‌లించిపోయారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చే క్ర‌మంలో ఆయ‌నా క‌న్నీరు పెట్టుకున్నారు. ఆప‌రేష‌న్ సిందూర్‌ లో పాల్గొని జ‌మ్ముకశ్మీర్‌లోని రాజౌరీలో పాక్ ఎదురు కాల్పుల్లో అమ‌ర‌వీరుడైనా అనంత‌పురం జిల్లా కిళ్లి తండాకు చెందిన అగ్నివీర్ ముర‌ళీనాయ‌క్‌.. అంత్య‌క్రియ‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొన్నారు. …

Read More »

మురళీ నాయక్ కుటుంబానికి పవన్ ఆర్థిక సాయం

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా సరిహద్దు వద్ద ఇరు దేశాల సైనికులు కాల్పులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు, అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే మురళీ నాయక్ పార్థివ దేహానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. ప్రభుత్వం అందిస్తున్న రూ.50 లక్షల ఆర్థిక సాయానికి తోడు పవన్ వ్యక్తిగతంగా రూ.25 …

Read More »

ఖాకీలంటే భయం లేదు!… కేసులంటే లెక్క లేదు!

ఏపీలో ఇప్పుడు ఓ విచిత్ర వాతావరణం నెలకొంది. ఐధేళ్ల పాటు వైసీపీ రాష్ట్రాన్ని పాలించగా… రాష్ట్ర ప్రజలు మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి అధికారం నుంచి దించేసి… టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమిని గద్దెనెక్కించారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయంటూ పలు కేసులు నమోదు చేసిన కూటమి సర్కారు… వాటి దర్యాప్తునకు ఏకంగా సిఐడీ, సిట్, లోకల్ పోలీస్ విభాగాలను రంగంలోకి దించింది. ఆదిలో …

Read More »

ట్రంప్‌ది ప్ర‌య‌త్న‌మే.. విజ‌యం మోడీదే..

భార‌త్-పాకిస్థాన్‌ల మ‌ధ్య త‌లెత్తిన భీక‌ర ఉద్రిక్త‌త‌లు.. దాడుల‌కు ఫుల్ స్టాప్ ప‌డింది. దీనిని యావ‌త్ భార‌త దేశం హ‌ర్షిస్తోంది. అయితే.. అమెరికా మీడియా స‌హా.. ప‌లు ప్ర‌పంచ స్థాయి మీడియా చానెళ్లు.. అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఆయ‌న జోక్యం కార‌ణంగానే పాక్‌-భార‌త్ ల మ‌ధ్య త‌లెత్తిన ఉద్రిక్త‌త‌ల‌కు..యుద్ధానికి దారి తీసే ప‌రిస్థితులు కూడా స‌మ‌సిపోయాయ‌ని.. పేర్కొంటున్నాయి. ట్రంప్ ఈజ్ హీరో.. అంటూ అమెరికా మీడియా సీఎన్ ఎన్ …

Read More »

పోతిన‌కు సెగ‌.. ఫోన్లు స్విచ్ఛాఫ్.. !

విజ‌య‌వాడ‌కు చెందిన ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ జ‌న‌సేన నేత‌.. ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న పోతిన వెంక‌ట మ‌హేష్‌కు తొలి అడుగులోనే సెగ పుట్టింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క వ‌ర్గం నుంచి జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున పోటీ చేయాల‌ని భావించిన పోతిన‌కు .. పార్టీ అధిష్టానం శ్రీముఖం చూపించింది. దీంతో నాలుగు మాట‌లు అనేసి.. ఆ వెంట‌నే వైసీపీలోకి జంప్ అయ్యారు. అప్ప‌టి ఉంచి ఖాళీగా …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. కొన్ని ప్ర‌శ్న‌లు.. !

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. వ‌చ్చే ఏడాది నుంచో ఆపై ఏడాది నుంచో పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్న‌ట్టుగా సంకేతాలు పంపుతున్నారు. ఈవిష‌యంపై అనుకూల మీడియా జోరుగా క‌థ‌నాలు రాస్తోంది. అయితే..ఈ పాద‌యాత్ర‌పై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇదిలావుంటే.. అస‌లు పాద‌యాత్ర ప్రారంభిస్తే.. జ‌గ‌న్ కు కొన్నిప్ర‌శ్న‌లు ఎదురు కాక‌త‌ప్ప‌దు. పాద‌యాత్ర అనేది నాయ‌కులు చేయ‌డం త‌ప్పుకాదు. ఆమాట‌కు వ‌స్తే.. న‌ర్మ‌దా బ‌చావో ఆందోళ‌న్ స‌మ‌యంలో అనేక మంది …

Read More »

పాక్ వ‌క్ర‌బుద్ధి: `ఒప్పందానికి` తూట్లు.. మ‌ళ్లీ కాల్పులు

పాకిస్థాన్ త‌న వ‌క్ర‌బుద్దిని మ‌రోసారి బ‌య‌ట పెట్టుకుంది. భార‌త్ దాడుల‌కు భీతిల్లిన దాయాది దేశం.. అమెరికాతో మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేయించుకుని.. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి ముందుకు వ‌చ్చింది. దీంతో భార‌త్ కూడా.. స‌రేన‌ని ఒప్పుకుంది. ఈ ఒప్పందం ప్ర‌కారం.. శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల నుంచి ఇరు దేశాలు కూడా.. కాల్పులకు పాల్ప‌డ‌కూడ‌ద‌ని.. పాల్ప‌డ‌వ‌ని కూడా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని, భార‌త్‌, పాకిస్థాన్‌లు కూడా ధ్రువీక‌రించారు. …

Read More »

వైరల్ వీడియో.. పోలీసులతో రజినీ బాహాబాహీ

ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శనివారం జరిగిన ఓ వివాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. ఈ వీడియోలో వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజినీ.. పోలీసు అధికారులను నెట్టివేస్తున్న దృశ్యాలతో పాటుగా రజినీని చాకచక్యంగా తప్పించి ఆమె కారులోని శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలీసులను అడ్డగించే క్రమంలో రజినీ సాగిన తీరుతో పాటు.. …

Read More »

సీజ్ ఫైర్ పై భారత్, పాక్ రియాక్షన్

భారత్, పాక్ ల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా భారత విదేశాంగ శాఖ కూడా ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత్, పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని భారత విదేశాంగ శాఖ …

Read More »

భారత్, పాక్ యుద్ధానికి చెక్ పెట్టిన ట్రంప్

భారత్, పాకిస్తాన్ సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. అనధికారికంగా యుద్ధం జరుగుతున్న క్రమంలో రేపో,మాపో అధికారికంగా కూడా మిలిటరీ చర్యలకు ఇరుదేశాలు దిగబోతున్నాయని ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఇరు దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని, ఒక రాత్రంతా సుదీర్ఘ …

Read More »