Political News

విచార‌ణ‌కు రండి..: సాయిరెడ్డికి నోటీసులు

“విచార‌ణ‌కు రండి. ఈ నెల 18న హాజ‌రై మాకు స‌హ‌క‌రించండి. వ‌చ్చేప్పుడు మీ వ‌ద్ద ఉన్న ఆధారాలు వివ‌రాలు కూడా తీసుకురండి!” అని వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డికి వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంపై విచార‌ణ చేస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు తాజాగా నోటీసులు పంపించారు. ఆయ‌న ఈమెయిల్ స‌హావాట్సాప్‌ల‌కు ఈ నోటీసులు పంపించార‌ని అధికారులు తెలిపారు. ఈ నెల 18న …

Read More »

2న అమరావతికి మోదీ.. రాజధాని పనుల పున:ప్రారంభం

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. మే నెల 2న అమరావతి రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ… రాజధాని పనులను పున:ప్రారంభించనున్నారు. ఈ మేరకు అమరావతి పర్యటనకు సంబంధించి మోదీ షెడ్యూల్ మంగళవారం ఖరారు అయ్యింది. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు …

Read More »

భూమ‌న‌పై టీటీడీ ఫిర్యాదు.. కేసు న‌మోదు!

వైసీపీ నాయ‌కుడు, తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డిపై తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఫిర్యాదు చేసింది. తిరుప‌తి జిల్లా ఎస్పీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రాజుకు టీటీడీ బోర్డు స‌భ్యుడు, బీజేపీ నాయ‌కుడు.. భాను ప్ర‌కాష్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు న‌మోదుచేస్తామ‌ని ఎస్పీ మీడియాకు చెప్పారు. కాగా.. భూమ‌న‌పై టీటీడీ ఫిర్యాదు చేయ‌డం ఇదే తొలిసారి. పైగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం మాజీ చైర్మ‌న్‌పై ఫిర్యాదు చేయ‌డం.. కేసు న‌మోదు చేయ‌డం కూడాఇదే …

Read More »

సోనియా అల్లుడికి ఈడీ న‌జ‌ర్‌.. ఏం జ‌రిగింది?

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నాయ‌కురాలు.. సోనియా గాంధీ అల్లుడు.. ప్రియాంక గాంధీ భ‌ర్త‌.. రాబ‌ర్ట్ వాద్రాను ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు మ‌రోసారి టార్గెట్ చేశారు. విచార‌ణ‌కురావాలంటూ.. తాజాగా ఆయ‌న‌కు నోటీసులు పంపించారు. ఈ నెల 20న ఢిల్లీలోని త‌మ‌ కార్యాల‌యానికి రావాలంటూ.. ఈడీ అధికారులు నోటీసుల్లో స్ప‌ష్టం చేశారు. వ‌చ్చేప్పుడు.. గుర్గావ్‌లోని భూములకు సంబంధించి ఉన్న ఆధారాల‌ను కూడా తీసుకురావాల‌ని పేర్కొన్నారు. కాగా.. గ‌త మూడేళ్ల కింద‌టే వాద్రాపై …

Read More »

‘భూభారతి’ మరో ‘ధరణి’ కాకుంటే చాలు!

గడచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ… నాటి భూ రికార్డుల వెబ్ సైట్ ధరణిపై సంచలన ఆరోపణలు గుప్పించింది. అధికారంలోకి వచ్చాక ధరణిని సముద్రంలో పారేస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి పలు మార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీనే కాకుండా ధరణిని రూపొందించిన బీఆర్ఎస్ సర్కారు కూడా ఈ వెబ్ సైట్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించింది. ధరణి …

Read More »

కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను కొనేస్తాం: కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాల‌న‌తో ప్ర‌జ‌లు, పారిశ్రామిక వేత్త‌లు విసుగు చెందార‌ని అన్నారు. ఈనేప‌థ్యంలో కేసీఆర్ మ‌రోసారి ముఖ్య‌మంత్రి కావాల‌ని ఆయా వ‌ర్గాలుకోరుతున్నాయ‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసైనా స‌రే.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేయాల‌ని ఒత్తిళ్లు వ‌స్తున్నాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీనికి సంబంధించి పెట్టుబ‌డులు పెట్టేందుకు సొమ్ములు కురిపించేందుకు.. పారిశ్రామిక వేత్త‌లు సిద్ధంగా …

Read More »

ఏపీలో కాంగ్రెస్ ప్ర‌క్షాళ‌న‌.. ఏం చేస్తారు ..!

తాజాగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌క్షాళ‌న దిశ‌గా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. దేశ‌వ్యాప్తంగా పార్టీని ప‌రుగులు పెట్టించాల‌ని.. పార్టీ ఇమేజ్‌ను పెంచాల‌ని.. వ‌చ్చే సార్వ‌త్రిక స‌మ‌రం నాటికి.. విజ‌యం దిశ‌గా అడుగులు వేయాల‌ని పార్టీ నాయ‌కులు సంకల్పించారు. తాజాగా రెండు రోజుల కింద‌ట గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో నిర్వ‌హించిన‌.. ఏఐసీసీ శిఖ‌రాగ్ర స‌మావేశాల్లో పార్టీ భ‌విత‌వ్యాన్ని నాయ‌కులు చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో అన్ని రాష్ట్రాల్లోనూ మార్పుల దిశ‌గా అడుగులు వేయాల‌ని …

Read More »

రాజ్ కసిరెడ్డి సమర్పించు ఈడీ క్రియేషన్స్

మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రాజ్ కసిరెడ్డి. ఇతగాడికి సంబంధించిన అంశాలపై ఫోకస్ చేసిన అధికారులు ఆశ్చర్యంతో అవాక్కు అవుతున్నారు. ఎందుకంటే.. రాజ్ కసిరెడ్డి వ్యాపార లెక్కల్లోకి వెళుతున్న కొద్దీ బయటకు వస్తున్న వివరాలే. ఎక్కడ చూసినా ఇతగాడి వ్యాపారాలే కనిపిస్తున్నట్లుగా చెబుతున్నారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో విచారణ జరిపే సంస్థగా అందరికి తెలిసిన ‘ఈడీ’ పేరు మీదనే ఈడీ …

Read More »

టీడీపీలో గుస‌గుస‌: లోకేష్ ప‌ట్టాభిషేకం.. ఎప్పుడు..!

టీడీపీ ప‌గ్గాల వ్య‌వ‌హారం.. ఎప్ప‌టిక‌ప్పుడు ఆ పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా ఉన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం 1994-95 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు టీడీపీ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు. 2014 కు ముందు రాజ‌కీయ అరంగేట్రం చేసిన నారా లోకేష్‌.. అప్ప‌ట్లో ఐటీడీపీని స్థాపించి.. స‌మ‌ర్థ‌వంతంగా ముందుకు న‌డిపారు. పార్టీ విధివిధానాలు, చంద్ర‌బాబు ఇమేజ్‌ను పెంచేలా.. ఆయ‌న సోష‌ల్ మీడియాను స‌మ‌ర్థవంతంగా వాడుకుని పార్టీ అధికారంలోకి వ‌చ్చేలా చేశారు. త‌ర్వాత‌.. ఎమ్మెల్సీ అయ్యారు. …

Read More »

వరల్డ్ బ్యాంకు ముందు వైసీసీ వ్యూహాలు ఫ్లాప్

ఇంట్లో అభాసుపాలు అయితే తమలోనే ఏదో తప్పుందని గ్రహించాలి. ఆ తప్పును సరిదిద్దుకోవాలి. అలా కాకుండా తనను ఇంటిలోవాళ్లు గుర్తించలేకపోయారు…తాను చేస్తోంది సరైనదేనని భావించి బయటోళ్ల వద్ద అదే వాదన వినిపిస్తే… మళ్లీ అభాసుపాలు కావడం తప్పించి ఇంకేం ఉండదు కదా. ఇప్పుడు ఏపీలో విపక్షంగా మారిన వైసీపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. అసలే ఘోరాతి ఘోర ఓటమి. ఆపై పార్టీని వీడి నమ్మకస్తులంతా వెళ్లిపోతున్నారు. ప్రత్యర్థి శిభిరంలో …

Read More »

ఏపీ బీజేపీ చీఫ్‌గా సుజ‌నా చౌద‌రి.. నిజ‌మేనా ..!

ఏపీ బీజేపీ చీఫ్‌గా మార్పు ఖాయ‌మ‌ని సంకేతాలు అందుతున్నాయి. ఈ నెల‌లోనే మార్పు త‌ప్ప‌ద‌న్న మాటా వినిపిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు కూడా ప్రారంభం అవుతోంది. ఇటీవ‌ల త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్‌ను నిమిషాల వ్య‌వ‌ధిలోనే ప‌క్క‌న పెట్టారు. త‌మ‌కు అవ‌కాశం.. అవ‌స‌రం పెరిగిన నేప‌థ్యంలో బీజేపీ ఇలాంటి మార్పుల దిశ‌గా అడుగులు వేస్తోంది.త్వ‌ర‌లోనే మూడు కీల‌క రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో జాతీయ‌స్థాయిలో బీజేపీ చీఫ్‌ను కూడా …

Read More »

అమ‌రావ‌తి హైప్ అంటే ఇదీ.. భూమిలిస్తామని నిర‌స‌న‌లు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు అమ‌రావ‌తికి హైప్ వ‌చ్చింది. అలా ఇలా కాదు.. ఒక‌వైపు ఆర్థిక సంస్థ‌లు రుణాలు ఇస్తామ‌ని వెంట‌బ‌డుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కాద‌ని.. ఇవ్వ‌లేమ‌ని చెప్పిన ఎస్బీఐ, యూనియ‌న్ బ్యాంకులు వంటివి ఇప్పుడు ప‌రుగులు పెట్టుకుని వ‌చ్చి మ‌రీ క్యూక‌ట్టుకుని నోట్ల క‌ట్ట‌ల‌తో సొమ్ములు స‌మకూర్చేందుకు రెడీ అయ్యాయి. ఇప్పుడు మ‌రో రూపంలో అమ‌రావతికి క‌లిసి వ‌చ్చింది. అదే భూముల వ్య‌వ‌హారం. అమ‌రావ‌తిలో ప్రాజెక్టులు …

Read More »