Political News

సిసలైన రాజకీయం మొదలెట్టిన లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ నుంచి వచ్చిన ఓ ప్రకటన ఈ సిసలైన రాజకీయం ఎలా ఉంటుందన్న విషయాన్ని విడమరచి మరీ చెప్పేసింది. ”ఎన్నికల వరకు మాత్రమే రాజకీయం… ఆ తర్వాత ప్రభుత్వం శాశ్వతం భావనతో సాగాలి. ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించండి జగన్”అంటూ లోకేశ్ కామెంట్ చేశారు. ఎంతో పరిణతి ఉంటే తప్పించి ఈ మాట రాదన్నది రాజకీయ విశ్లేషకుల …

Read More »

ఐపాక్ సేవలకు వైసీపీ గుడ్ బై చెప్పేసిందా?

ఏపీలో విపక్షం వెనుక ఓ పక్కా ప్రణాళికతో వేసే ప్రతి అడుగును ఒకటికి పది సార్లు ఆలోచించి మరీ వేయించే సంస్థ ఒకటి ఉండేది. అదే మనమంతా ఐ ప్యాక్ గా పిలుచుకునే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటి. ప్రశాంత్ కిశోర్ చేతుల్లో పురుడు పోసుకున్న ఈ సంస్థ నుంచి ఆయనే బయటికి వెళ్లిపోగా… ఆ తర్వాత కూడా ఈ సంస్థ సేవలను వైసీపీ వినియోగించుకుంది. దాదాపుగా పదేళ్లకు పైగా …

Read More »

న్యాయం వైపు బాబు.. ఓటు బ్యాంకు వైైపు జగన్: మంద కృష్ణ

దళిత సామాజిక వర్గంలో బీసీల మాదిరే చాలా కులాలు ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి ఎస్సీలుగా పరిగణిస్తున్నాం. బీసీల మాదిరే తమకూ విడివిడిగా రిజర్వేషన్లు కావాలన్న మాదిగల డిమాండ్ కు టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వెన్నుదన్నుగా నిలిస్తే… మాదిగలకు మద్దతు ఇస్తే వారికంటే సంఖ్యలో ఎక్కువగా ఉన్న మాలల ఓట్లు తనకు దక్కకుండా పోతాయోనన్న భయంతో వైైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు …

Read More »

రేవంత్, కేటీఆర్.. ఒకే మాట, ఒకే బాట

నియోకజవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలతో డీఎంకే అదినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శనివారం చెన్నై వేదికగా ఓ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రావాలంటూ దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపారు. డీఎంకే మంత్రులు, ఎంపీలను పంపి మరీ… ఆయా పార్టీల నేతలకు స్టాలిన్ ఆహ్వానాలు అందేలా చూశారు. ఈ భేటీకి తెలంగాణ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ …

Read More »

శ్యామల కేసుపై హైకోర్టు ఎమందంటే…

బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశారంటూ టాలీవుడ్ కు చెందిన చాలా మంది ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపైనా హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో హీరో విజయ్ దేవరకొండతో పాటు రానా దగ్గుబాటి, ప్రణీత, ప్రకాశ్ రాజ్ సహా ఇంకా చాలా మందే ఉన్నారు. వీరిలో యాంకర్ శ్యామల కూడా ఉన్నారు. అయితే ఈ కేసులకు వీరిలో ఏ ఎవ్వరూ పెద్దగా …

Read More »

సీఐడీ కోర్టులోనూ బెయిల్.. పోసాని రిలీజ్ అయినట్టేనా?

టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి శుక్రవారం మరో భారీ ఊరట లభించింది. ఇప్పటిదాకా తనపై నమోదు అయిన కేసుల్లో కొన్నింటిలో బెయిల్, కొన్నింటిలో అరెస్టుల నుంచి మినహాయింపు పొందిన పోసానికి… తాజాగా సీఐడీ కోర్టు కూడా బెయిల్ మంజూరు చేసింది. ఈ లెక్కన పోసానిపై నమోదు అయిన అన్ని కేసుల్లోనూ ఆయనకు ఊరట లబించినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. కోర్టు ఆర్డర్లు జైలు అదికారులు …

Read More »

ప‌వ‌న్ ప్ర‌యోగాలు.. సైనికుల ప‌రేషాన్లు..!

జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న ప్ర‌యోగాలు.. జ‌న‌సేన నాయ‌కుల‌కు ఇబ్బందిగా మారుతున్నాయి. సాధార‌ణంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి, పార్టీలో ఉన్న‌వారికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ, పార్టీ కార్య‌క్ర‌మాలు స‌హా.. ఇత‌ర ప‌దవుల విష‌యంలో తాను ఎంపిక చేసుకున్న వారికి ప‌వ‌న్ అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. దీంతో కేడ‌ర్ మాట ఎలా ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో గ‌త ఏడాది ఎన్నిక ల్లో పార్టీ విజ‌యం కోసం కృషి …

Read More »

వ‌ర్గీక‌ర‌ణ ఓకే.. `వ‌క్ఫ్` మాటేంటి.. బాబుకు ఇబ్బందేనా?

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు మ‌రో కీల‌క‌మైన వ్య‌వ‌హారం క‌త్తిమీద సాముగా మార‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు పాలన వేరు.. ఆమోదించిన బిల్లులు.. తెచ్చుకున్న గ్రాంట్లు వేరు. కానీ, ఇప్పుడు కీల‌క‌మైన వ‌క్ఫ్ బోర్డు బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెల‌పాల్సి ఉంటుంది. తాజాగా గురువారం ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు సంబంధించిన రాజీవ్ రంజ‌న్ మిశ్రా ఏక‌స‌భ్య క‌మిష‌న్ ఇచ్చిన నివేదిక‌ను స‌భ ఆమోదించిన విష‌యం తెలిసిందే. దీనిపై మాల సామాజిక వ‌ర్గం ఆందోళ‌న …

Read More »

‘ముంతాజ్’కు మంగళం పాడేసిన చంద్రబాబు

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరికి అత్యంత సమీపంలో ఓ ప్రైవేట్ హోటల్ వెలిసేందుకు అనుమతులు జారీ అయిన వైనం చాలా కాలంగా హిందువులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తోంది. అప్పటికే తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతున్నా సరైన చర్యలు లేవంటూ ఆందోళన వ్యక్తం అవుతుంటే… శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ వెలిసేందుకు అనుమతులు జారీ అవడం నిజంగా మరింతగా ఆందోళన రేకెత్తించేదే. ఇప్పుడు …

Read More »

తిరుమలలో బాబు ఫ్యామిలీ… అది ట్రెడిషన్ గా మారిందా?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుటుంబం మొత్తాన్ని తీసుకుని శుక్రవారం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని సన్నిధి తిరుమలకు చేరుకున్నారు. మనవడు నారా దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని.. తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణీలతో కలిసి చంద్రబాబు తిరుమల లో స్వామి వారి సేవలో పాలుపంచుకున్నారు. ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బాబుకు ఘన స్వాగతం పలికి.. దగ్గరుండి మరీ …

Read More »

అన్న‌గారి పాత్ర‌లో ఆర్ ఆర్ ఆర్‌.. ఇర‌గ‌దీతే!

దివంగ‌త ఎన్టీఆర్ న‌ట‌న గురించి ఎంత చెప్పినా.. వేనేళ్ల పొగిడినా త‌క్కువే. ఆయ‌న న‌ట‌న‌కు మ‌రింత అద్దం ప‌ట్టిన పాత్ర `దాన‌వీర‌శూర‌కర్ణ` సినిమాలోని దుర్యోధ‌నుడి పాత్ర‌. దీనిలో `ఏమంటివేమంటివి..` అంటూ సాగే.. డైలాగ్‌(దీనిని తిరుప‌తి వెంక‌ట‌క‌వులు రాశార‌ని అంటారు) ఎంతో ఫేమ‌స్‌. సినిమా మొత్తం ఒక ఎత్త‌యితే.. అన్నగారి నోటి నుంచి గంగా ప్ర‌వాహం మాదిరిగా దూసుకు వ‌చ్చిన ఈ ఒక్క డైలాగ్ మ‌రో ఎత్తు. ఆ డైలాగు.. చాలా …

Read More »

త్రిశంకు స్వ‌ర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలు?

వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో న‌లుగురి ప‌రిస్థితి ఎలా ఉన్నా.. మిగిలిన ఏడుగురు మాత్రం త్రిశంకు స్వ‌ర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్ర‌జా ప్ర‌తినిధులుగా వారు స‌భ‌కు రావాల‌ని.. ప్ర‌జ‌ల ప‌క్షాన స‌భ‌లో గ‌ళం వినిపించాల‌ని భావిస్తున్న మాట వాస్త‌వం. అయితే.. దీనికి పార్టీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ తీసుకు న్న నిర్ణ‌యం.. గీసిన ల‌క్ష్మణ రేఖ వంటివి వారికి ప్ర‌తిబంధ‌కంగా మారాయి. దీంతో వారు అటు స‌భ‌కు వెళ్లాలో.. …

Read More »