Political News

రాహుల్‌కు రిలీఫ్‌.. లోక్‌స‌భ్య స‌భ్య‌త్వం పున‌రుద్ధ‌ర‌ణ‌

కాంగ్రెస్ అగ్ర‌నాయకుడు రాహుల్‌గాంధీకి భారీ ఊర‌ట ల‌భించింది. ఆయ‌న లోక్‌స‌భ స‌భ్య‌త్వాన్ని పున‌రుద్దరిస్తూ పార్లమెంటులోని లోక్‌స‌భ స‌చివాల‌యం తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. ఈమేరకు రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. కీల‌క‌మైన పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో రాహుల్‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తేయ‌డం.. కాంగ్రెస్ పార్టీకి కూడా బిగ్ రిలీఫ్ అనే చెప్పారు. 2018 క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల ప‌క్షాన రాహుల్ …

Read More »

భూమా కుటుంబంలో రాజ‌కీయ చిచ్చు.. ఏం జ‌రుగుతుంది..?

భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి-భూమా జ‌గ‌త్‌విఖ్యాత‌రెడ్డి-భూమా మౌనికారెడ్డి. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో విఖ్యాత్‌రెడ్డి-మౌనిక అక్కాత‌మ్ముళ్లు. బ్ర‌హ్మానంద‌రెడ్డి.. ఈ కుటుంబం మ‌లిచిన రాజ‌కీయ నాయ‌కుడు. 2017లో జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌లో హ‌ఠాత్తుగా రాజ‌కీయ తెర‌మీద‌కు వ‌చ్చిన నాయ‌కుడు బ్ర‌హ్మానంద‌రెడ్డి. అయితే.. ఆయ‌నేమీ.. టెంప‌ర‌రీ కోసం రాలేద‌ని.. స్వ‌యంగా చెప్పారు. 2019లో టికెట్ వివాదం ఏర్ప‌డిన‌ప్పుడు.. స్వతంత్రంగా పోటీ చేస్తాన‌ని కూడా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. పాల‌వ్యాపారి కావ‌డంతోపాటు.. ఆర్థికంగా …

Read More »

ఒకే ఒక్క వివాదం: వైసీపీ ఎమ్మెల్యే గ్రాఫ్ ఢ‌మాల్‌..!

ఒక్క వివాదం.. ఒకే ఒక్క వివాదం.. వైసీపీ ఎమ్మెల్యే గ్రాఫ్‌ను ఢ‌మాల్ మ‌ని ప‌డేసిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం వినుకొండ‌లో కొన్ని రోజుల కింద‌ట‌.. టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ నేత‌ల మ‌ధ్య తీవ్ర వివాదం తెర‌మీదికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ చేస్తున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర 2000 కిలో మీట‌ర్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా వినుకొండ‌లో …

Read More »

పొత్తుపైనే పొన్నాడ భవిష్యత్తు ఆధారపడుందా ?

రాబోయే ఎన్నికలకు సంబంధించి మూడు అంశాలు జనాల్లో విపరీతంగా చర్చ జరుగుతున్నాయి. మొదటిదేమో టీడీపీ-జనసేన మధ్య పొత్తుంటుందా ఉండదా ? అని. రెండో అంశం ఏమిటంటే పొత్తుంటే లాభం ఎవరికి ? నష్టం ఎవరికి అని. మూడో అనుమానం ఏమిటంటే టీడీపీ, జనసేన పొత్తుల్లో పోటీచేయబోయే నియోజకవర్గాలు ఏవని. మిగిలిన నియోజకవర్గాల సంగతిని పక్కనపెట్టేసినా ఉమ్మడి తూర్పుగోదావరి జల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో పై అంశాలపై బాగా చర్చలు జరుగుతున్నాయి. దీనికి …

Read More »

కాంగ్రెస్‌లో ఆ ఒక్క‌రు ఎవ‌రు?

తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చే దిశ‌గా రాబోయే రెండు నెల‌లు కీల‌క‌మ‌ని, విభేదాలు ప‌క్క‌న‌పెట్టి నేత‌లంద‌రూ క‌లిసి ప‌ని చేయాల‌ని ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ మార్గ‌నిర్దేశ‌నం చేశారు. వ‌చ్చే 100 రోజులు అత్యంత కీల‌క‌మ‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీలోని ముఖ్య నేత‌ల మ‌ధ్య విభేదాల‌పైనా మాట్లాడారు. 2018 ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో గెల‌వాల్సింద‌ని, కానీ నాయ‌కుల మ‌ధ్య ఐక్య‌త లేక‌పోవ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని వేణుగోపాల్ అన్న‌ట్లు తెలిసింది. …

Read More »

టీడీపీపై పరోక్షంగా కుల ముద్ర వేసిన పవన్

సీఎం జగన్ పాలనలో రైతాంగం నిర్వీర్యమైందని, రైతుల కష్టాలు ఇబ్బందులు పెరిగిపోయాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున పవన్ తన సొంత డబ్బులు ఇవ్వడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెవత్తాయి. ఈ నేపథ్యంలోనే …

Read More »

జగన్ ను కాంగ్రెస్ వేధించింది: కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికలకు ముందు దాదాపుగా ఇవే చిట్టి చివరి సమావేశాలు కావడంతో సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ రోజు సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, మళ్లీ అధికారం చేపడతామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. …

Read More »

అసెంబ్లీ అదిరిపోయేలా.. కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌సంగం.. !!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ద‌ద్ద‌రిల్లే ప్ర‌సంగం చేశారు. గంటా 42 నిమిషాల‌పాటు నిరాఘాటంగా ప్ర‌సంగించిన కేసీఆర్.. ఆసాంతం.. ప్ర‌జ‌ల‌ను ఆకట్టుకునేలా ప్ర‌సంగించారు. మ‌రో మాట‌లో చెప్పాలంటే.. ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌సంగ‌మే చేశారు. నిజాం సంస్థానం పాల‌న నుంచి నేటి త‌న పాల‌న వ‌ర‌కు పూస గుచ్చిన‌ట్టు వివ‌రించారు. ఏపీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు.. రాష్ట్రాల‌తో ఆయ‌న పోలిక పెట్టారు. ఒక‌టి కాదు.. రెండు కాదు.. అనేక విష‌యాల‌ను ఆయ‌న …

Read More »

ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ టిక్కెట్ కోసం రంగంలోకి కీల‌క నేత‌…!

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్ పోరు తార‌స్థాయికి చేరుకుంది. ఇది భూమా నాగిరెడ్డి కుటుంబంలోనే చిచ్చు రేపుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆళ్ల‌గ‌డ్డ విష‌యం లోను.. నంద్యాల నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలోనూ రేగిన టికెట్ మంట‌లు ఇప్ప‌ట్లో చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేద‌ని ప‌రిశీల‌కులు కూడా చెబుతున్నారు. భూమా కుటుంబానికి ఈ సారి ఒక్క టికెట్ మాత్ర‌మే ఇవ్వాలని.. సీనియ‌ర్లు చెబుతున్నారు. అది కూడా నంద్యాల‌తో స‌రిపెట్టాల‌ని అంటున్నారు. ఆళ్ల‌గ‌డ్డ …

Read More »

ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ ఉద్యమకారుడు, ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గద్దర్ ఈరోజు తుది శ్వాస విడిచారు. గద్దర్ ను బ్రతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గద్దర్ మృతి పట్ల తెలంగాణలోని పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. …

Read More »

ఇద్దరి టార్గెట్ ఒకటేనా ?

రాబోయే ఎన్నికల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ నియోజకవర్గాలుండబోతున్నాయి. అందులో సికింద్రాబాద్ ఒకటి. పైగా సికింద్రాబాద్ లోక్ సభ లేదా అసెంబ్లీ నియోజకవర్గంపై ఇద్దరు మహిళా ప్రముఖల కన్నుపడిందని సమాచారం. ఇందుకనే ఈ నియోజకవర్గం బాగా పాపులర్ అవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల, రీసెంటుగా బీజేపీలో చేరిన సినీ సెలబ్రిటీ జయసుధ సికింద్రాబాద్ లో ప్రత్యర్ధులుగా తలపడే అవకాశాలున్నట్లు సమాచారం. కొంతకాలంగా వైఎస్సార్టీపీ విషయమై …

Read More »

పొత్తు లేదా? అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేస్తున్న బాబు, ప‌వ‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా ఇత‌ర పార్టీల‌తోనూ క‌లిసి ప‌నిచేస్తామ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ అంటున్నారు. టీడీపీ అధినేత బాబు కూడా ఇలాంటి వ్యాఖ్య‌లే చేస్తున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి జ‌న‌సేన‌, బీజేపీ, టీడీపీ పొత్తుతో బ‌రిలో దిగుతాయ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. వైసీసీ కూడా ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను విమ‌ర్శిస్తోంది. కానీ టీడీపీతో క‌లిసే ఉద్దేశం లేద‌ని జ‌న‌సేన‌తో పొత్తులో ఉన్న …

Read More »