Political News

తనపై పోటీ చేయాలంటూ పవన్ కు ఎంపీ సవాల్

వైసిపి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజలు గెలిపించిన ఎంపీ విశాఖలో భద్రత లేదని భయపడి హైదరాబాద్ కు పారిపోతాను అంటున్నాడని పవన్ ఎద్దేవా చేశారు. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, ఆ ఎంపీకి హితవు పలికారు. ఇక చర్చి భూములను ఎంవివి సత్యనారాయణ కబ్జా చేశారని పవన్ సంచలన ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ …

Read More »

జగన్ మోకాళ్లపై కూర్చోబెట్టలేదన్న మంత్రి

వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్ పెద్ద పీట వేశారని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. నామినేటెడ్ పదవులలో 50 శాతానికి పైగా బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు జగన్ కట్టబెట్టారని వైసిపి నేతలు డబ్బా కొడుతూ ఉంటారు. అయితే, జగన్ పాలనలో దళితులను, బీసీలను, మైనారిటీలను బానిసలుగా చూస్తున్నారని, వారితో జగన్ ప్రవర్తించే తీరు అందుకు నిదర్శనం అని పలుమార్లు ప్రతిపక్ష …

Read More »

సోము వీర్రాజు.. సైలెంట్‌

Somu Veerraju

భారతీయ జనతా పార్టీ ఏపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కొంతకాలంగా మౌనంగా ఉన్నారు. ఈ ఏడాది జూన్‌ మొదటి వారంలో ఆయనను అధ్యక్షుడి పదవి నుంచి తప్పించారు. ఆ స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరిని నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులిచ్చింది. ఈ నియామకం వెనుక పలు సమీకరణలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పురంధేశ్వరికి పూర్తిగా సహకరిస్తా.. పార్టీ కార్యకర్తగా తాను పనిచేస్తానని ఆ సమయంలో వీర్రాజు ప్రకటించారు. …

Read More »

టీడీపీ నుంచి జ‌న‌సేన‌లోకి నేత‌లు.. పొత్తు క‌థ కంచికేనా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్య పొత్తు ఉండ‌దా? ఈ రెండు పార్టీలు వేర్వేరుగానే ఎన్నిక‌ల బ‌రిలో దిగుతాయా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఏపీలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాలే అందుకు కార‌ణంగా క‌నిపిస్తోంది. వారాహి యాత్ర‌తో పుల్ జోష్‌లో ఉన్న జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి పోటీ చేసే అవ‌కాశం ఉంది. టీడీపీని కూడా …

Read More »

మోడీకి చంద్ర‌బాబు 9 పేజీల లేఖ‌

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి అదేస‌మ‌యంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు కూడా.. ఏపీ విప‌క్ష నాయు డు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న లేఖ రాశారు. మొత్తం 9 పేజీల లేఖ‌లో అనేక విష యాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. ప్ర‌ధానంగా విప‌క్షాల స‌మావేశాలు, రోడ్ షోల‌కు అనుమ‌తించ‌క‌పోవ‌డం.. అనుమ‌తి ఇచ్చినా.. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ప్రోత్స‌హించి.. దాడులు చేయించ‌డం వంటివిష‌యాల‌ను ఆయ‌న పేర్కొన్నారు. ఇటీవ‌ల పుంగ‌నూరులో జ‌రిగిన దారుణాన్ని చంద్ర‌బాబు …

Read More »

మ‌ల్లారెడ్డి ఎక్క‌డ కాలు పెట్టినా!

బీఆర్ఎస్ మంత్రి మ‌ల్లారెడ్డి.. పూల‌మ్మిన‌, పాల‌మ్మిన‌, క‌ష్ట‌ప‌డ్డా,  స‌క్సెస్ అయిన అనే డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా ఇదే డైలాగ్ కొడుతున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయిన‌ట్లే క‌నిపిస్తోంది.  మేడ్చ‌ల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌జ‌ల నుంచి తీవ్ర నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అభివృద్ధి ప‌నులు చేయ‌డం లేద‌ని, ఎందుకు నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగుతున్నార‌ని ప్ర‌జలు ప్ర‌శ్నిస్తున్నారు. 2014లో ఎంపీగా గెలిచిన మ‌ల్లారెడ్డి …

Read More »

కీల‌క ఓటు బ్యాంకుపై టీడీపీ వ్యూహం!

ఔను.. అటు మ‌హిళ‌లు.. ఇటు రైతులు.. ఈ రెండు ఓటు బ్యాంకులు ఏ పార్టీకైనా అత్యంత కీల‌కం. ఎందు కంటే.. ఎన్నిక‌ల్లో ఇత‌ర వ‌ర్గాల ఓటు బ్యాంకుఎలా ఉన్నా.. ఈ రెండు మాత్రం ఎటూ పోవు. ఖ‌చ్చితంగా పోలింగ్ బూత్‌కు వ‌చ్చేవారిలో రైతులు మ‌హిళ‌లు ఉంటారు. అందుకే.. ఈ రెండు ఓటు బ్యాంకుల‌పైనా.. పార్టీలు క‌న్నేస్తాయి. ఇదే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి భారీ మైలేజీ ఇచ్చింద‌నే చ‌ర్చ ఉంది. ఇక‌, …

Read More »

అప్పుడు జ‌గ‌న్‌.. ఇప్పుడు కేటీఆర్‌..

2019 ఎన్నిక‌ల‌కు మందు జ‌గ‌న్ లాగే.. ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆలోచిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. కేంద్రంలో చ‌క్రం తిప్పుతామ‌ని ఇటీవ‌ల కేటీఆర్ త‌ర‌చూ చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలో వ‌చ్చేది సంకీర్ణ ప్ర‌భుత్వ‌మేన‌ని, అందులో బీఆర్ఎస్ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని కేటీఆర్ అంటున్నారు. అంతే కాకుండా త‌మ‌కు న‌చ్చిన వాళ్ల‌ను ప్ర‌ధానిగా ఎంపిక చేసుకోవ‌చ్చ‌ని, ఆ అధికారం పార్టీకి వ‌స్తుంద‌ని కూడా కేటీఆర్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. …

Read More »

షర్మిలకు ఏపీ బాధ్యతలు ?

మొత్తానికి వైఎస్సార్టీపీ అదినేత్రి వైఎస్ షర్మిల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు ఉంది. కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనానికి అవసరమైన వేదిక ఏర్పాటైపోయిందని సమాచారం. కర్ణాటక నుండి షర్మిలను రాజ్యసభకు ఎంపిక చేయటానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించిందట. అలాగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించబోతోంది. ఏఐసీసీ ప్రధానకార్యదర్శి హోదాలో ఏపీకి ఇన్చార్జి బాధ్యతలు తీసుకోవాలన్న అగ్రనేతల సూచనకు షర్మిల కూడా ఓకే చెప్పారట. సో, అన్నీ విషయాలు ఓకే …

Read More »

లిక్కర్ సిండికేట్లు రెడీ అయ్యాయా ?

Delhi Liquor Scam : CBi Charge Sheet Revelas Shocking Details

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీయార్ ప్రభుత్వం రెండు నెలలు ముదుగానే లిక్కర్ షాపులకు టెండర్ నోటిఫికేషన్ జారీచేసేసింది. పోయినసారి కన్నా ఇపుడు జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికిప్పుడు ఇంత అర్జంటుగా ప్రభుత్వం రెండునెలలు ముందే నోటిఫికేషన్ ఎందుకు జారీచేసింది ? ఎందుకంటే రైతు రుణమాఫీ చేయటం కోసమే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 2018లో రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి …

Read More »

ఎన్నిక‌ల టైం.. ఏదీ అడిగినా ఇచ్చేద్దాం!

తెలంగాణ‌లో ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతోంది. మ‌రో రెండు నెల‌ల్లోపే ఎన్నిక‌ల న‌గారా మోగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీల‌న్నీ విజ‌య వ్యూహాల్లో మునిగిపోయాయి. అభ్య‌ర్థుల ఎంపిక‌.. ప్ర‌చార ప్ర‌ణాళిక‌ల‌పై దృష్టి సారిస్తున్నాయి. మ‌రోవైపు ఇదే అదునుగా తమ డిమాండ్ల సాధ‌న‌కు ప్ర‌భుత్వంపై పోరాటానికి వివిధ వ‌ర్గాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఎన్నిక‌ల‌కు ముందే స‌రైన స‌మ‌య‌మంటూ.. ఇప్పుడైతేనే డిమాండ్లు నెర‌వేర్చుకోగ‌ల‌మ‌నే అభిప్రాయంతో ధ‌ర్నాల‌కు  సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రోవైపు ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందాల‌న్నా.. …

Read More »

టీడీపీతో టచ్ లో బొత్స కుటుంబ సభ్యులు?

వచ్చే ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన, టీడీపీ ఉండవని, ఒకవేళ ఆ రెండు పార్టీలు అప్పటికే ఉంటే తాను గుండు కొట్టించుకుంటారని మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం ఆ పార్టీలకు లేదని, ఎన్నికలప్పుడే వాటికి స్కీములు గుర్తుకు వస్తాయని బొత్స విమర్శలు గుప్పించారు. చెప్పుతో కొడతామని పవన్ వంటి నేతలు చేస్తున్న కామెంట్లపై స్పందించిన బొత్స…చెప్పులు అందరికీ …

Read More »