“ఈ రోజు నుంచే.. ఈ క్షణం నుంచే నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తా. జగన్ భరతం పట్టేందుకే.. నేను రాజకీయ నాయకుడిగా మారుతున్నా. జగన్కు చుక్కలు చూపిస్తా. ఎవరైనా జగన్ గురించి ఫిర్యాదు చేయాలని అను కుంటే.. నిర్భయంగా 7816020048 వాట్సాప్ నంబర్ కు సమాచారం పంపండి. నేను మీకు అండగా ఉంటా. అందరం కలిసి జగన్ భూతాన్ని జైల్లో పెడదాం” అని ఏపీకి …
Read More »శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ కల్యాణ్ సతీమణి!
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కల్యాణ్ సతీమణి, ఇటాలియన్ అన్నాలెజెనోవో తిరుమల సంప్రదాయాలకు పెద్దపీట వేశారు. విదేశాలకు చెందిన వారు, ఇతర మతాలను ఆచరించేవారు.. తిరుమలకు వచ్చినప్పుడు ఎలాంటి సంప్రదాయాలు పాటించాలో ఖచ్చితంగా వాటిని ఆమె పాటించారు. కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్లో జరిగిన అగ్రిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. దీంతో శ్రీవారికి మొక్కుకున్న అన్నా లెజెనోవా.. మార్క్ శంకర్ …
Read More »స్టూడెంట్గా దాచుకున్న సొమ్ము నుంచి కోటి ఖర్చు చేశా: నారా లోకేష్
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి నారాలోకేష్ తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఉండబట్టే అలా చేసినట్టు చెప్పారు. తాజాగా మంగళగిరి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నారా లోకేష్ శంకు స్థాపన చేశారు. అదేసమయంలో మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా పలువురికి పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ …
Read More »అమరావతికి డబ్బే డబ్బు.. మాటలు కాదు చేతలే!
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ పాలనలో మూడు రాజధానుల పేరుతో అమరాతిని మురగబెట్టడంతో అంచనా వ్యయం పెరిగిపోయింది. దీనికి తోడు అన్ని శాఖల్లోనూ అప్పులు పేరుకుపోయాయి. దీంతో స్వయంగా రాజధానిని నిర్మించలేక.. కేంద్రం నుంచి సాయం తెచ్చుకునే ప్రయత్నాలు చేశారు. అయితే.. కేంద్రం తను ఇచ్చేదానికంటే కూడా.. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకు …
Read More »అఖండ రాజధాని అమరావతికి మరో 30 వేల ఎకరాలు
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగానే కాకుండా అఖండ రాజధానిగా తీర్చిదిద్దాలని కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇప్పటికే సేకరించిన 33 వేల ఎకరాల భూములకు అదనంగా మరో 30 వేల …
Read More »అశోక్కే చంద్రబాబు మొగ్గు.. ఏం జరుగుతోంది ..!
విజయనగరం మాజీ ఎంపీ పూసపాటి అశోక్ గజపతి రాజు వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారా? ఇదే సమయంలో సీనియర్ నాయకుడైనప్పటికీ.. యనమల రామకృష్ణుడుని పక్కన పెట్టారా? అంటే.. ఔననే అంటున్నారు సీనియర్ నాయకులు. ఇటీవల యనమల రామకృష్ణుడు 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ఉద్దే శించి.. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ఓ పుస్తకాన్నికూడా లిఖించారు. దీనిపై పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. కానీ, యనమల ఇంత …
Read More »మోదీ, శ్రేయోభిలాషుల పట్ల పవన్ భావోద్వేగం
అసలే చిన్న కుమారుడు, ఆపై అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న వైనం.. అలాంటి కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిస్తే… ఏ తండ్రి అయినా ఇట్టే కుప్పకూలిపోతారు. జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిస్థితి కూడా ఈ నెల 8న ఇదే తరహా పరిస్థితి. గిరిజన గ్రామాల రూపురేఖలు మార్చేద్దామన్న భారీ లక్ష్యంతో ఏకంగా రెండు రోజుల పాటు అరకు పరిధిలో పర్యటన కోసం ఆయన అల్లూరి …
Read More »మాధవ్ చిందులు ఇంతమందిని బుక్ చేశాయా?
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మొన్న పోలీసుల అదుపులోని నిందితుడిపై దాడికి యత్నించడం, ఆపై తనను అరెస్టు చేసిన పోలీసులపై చిందులు తొక్కడం ఏపీలో పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాను మాజీ పోలీసు అధికారిని అని, మాజీ ఎంపీని అని పోలీసులపై ఆయన చిందులేసిన దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ తరహా మాధవ్ చిందులాట ఏకంగా 11 మంది పోలీసులపై చర్యలకు …
Read More »ఇక సకలం సజ్జల చేతుల్లోనే!
సజ్జల రామకృష్ణారెడ్డి… అటు సొంత పార్టీ వైైసీపీతో పాటు ఇటు ఆ పార్టీ వైరి వర్గాల్లోనూ నిత్యం నానుతూ ఉండే పేరిది. వైసీపీ అధికారంలో ఉండగా… సకల శాఖల మంత్రిగా పిలిపించుకున్న సజ్జల… వైసీపీ ప్రభుత్వానికి ప్రధాన సలహాదారు గా పని చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విపక్షానికి పరిమితం కాగా… ఆ పార్టీ వ్యవహారాలను నడుపుతూ బిజీబిజీగానే సాగుతున్నారు. పార్టీలో అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాతి స్థానం ఇప్పుడు …
Read More »‘టాప్’ లేపిన తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation) నియంత్రణలోనూ తమకు సాటి రాగల రాష్ట్రాలు దేశంలోనే లేవని నిరూపించాయి. దేశంలో అత్యల్ప ద్రవ్యోల్బణం నమోదు అయిన రాష్ట్రాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు టాప్ లేపాయని చెప్పాలి. అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పగా… దానిని అనుసరించిన ఆంధ్ర ప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. వెరసి దేశంలోనే అత్యల్ప వస్తు, సేవల …
Read More »బాబు మాటతో ఆక్వాకు భరోసా దక్కింది!
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా… కూటమి సర్కారు తీసుకున్న వేగవంతమైన నిర్ణయంతో త్వరలోనే కోలుకునే దిశగా సాగుతోంది. ఇప్పటికే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గత వారం ఆక్వా రంగానికి సరికొత్త జవసత్వాలు నింపేలా ఓ కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు చేసిన పలు సూచనల్లో కీలకంగా భావిస్తున్న పలు అంశాలు అమలు దిశగా …
Read More »వీడియో : కొడుకుని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి తిరిగి వచ్చారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన తన సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో గాయపడ్డ మార్క్ శంకర్ ను పవన్ తన భుజాన ఎత్తుకుని మరీ ఎస్కలేటర్ నుంచి దిగుతూ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates