Political News

‘తిరుమలతో పాటు మరిన్ని ఆలయాలకూ కల్తీ నెయ్యి’

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి వాడింది అసలు నెయ్యే కాదని ఇప్పటికే ఓ నివేదిక బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే వ్యవహారంలో తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తిరుమల కు సరఫరా అయిన కల్తీ నెయ్యి… ఏపీలోని ప్రముఖ ఆలయాలకూ సరఫరా …

Read More »

ప్రెస్ మీటా?… పనిష్మెంట్ క్లాసా?

ప్రెస్ మీట్…తెలుగులో విలేకరుల సమావేశం.. ఎంతసేపు జరుగుతుంది. ఓ అరగంట..ఇంకా కాస్త సరుకు ఉన్న సబ్జెక్ట్ అయితే 45 నిమిషాలు. అంతకుమించి సమయం పెరిగితే… ఆ మీడియా సమావేశానికి హాజరైన మీడియా ప్రతినిదులకు నిద్ర ముంచుకు వస్తుంది. అంతేకాదండోయ్… ఆ ప్రెస్ మీట్ నిర్వహించే ప్రధాన వక్త అనుచరులు కూడా ఇంకెంత సేపు స్వామీ అంటూ ఆ వక్త వైపు కొరకొరా చూస్తారు. గంటకు పైగా సాగే ప్రెస్ మీట్ …

Read More »

బనకచర్ల తో జగన్ కు ఇబ్బందే!

వైసీపీ అధినేత జగన్ మెడకు భారీ ఉచ్చే బిగుసుకుంటోంది. ఇప్పటి వరకు ఆయనను రాజకీయంగానే టార్గెట్ చేసిన కూటమి ప్రభుత్వం.. తాజాగా ఆయనను సీమకు కీలకమైన బనకచర్ల ప్రాజెక్టు విషయంలోనూ ఇరుకున పెట్టే వ్యూహానికి తెరదీసింది. ఇప్పుడు ఆయన స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో వైసీపీ అధినేత జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ.. మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన గర్జన వెనుక పక్కా రాజకీయ వ్యూహం …

Read More »

జైలు నుంచి ఆసుపత్రికి వంశీ… ఏమైంది?

వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గురువారం రాత్రి మరోమారు విజయవాడ జైలు నుంచి నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. జైలు అదికారులే ఆయనను ఆసుపత్రికి తరలించారు. వివిధ కేసులతో 3 నెలల క్రితమే అరెస్టైన వంశీ… జైలులో పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఇటీవలే సమగ్ర వైద్య పరీక్షల కోసం ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ కూడా సమర్పించింది. తాజాగా గురువారం డీహైడ్రేషన్ తో …

Read More »

డిప్యూటీ సీఎంగా ఏడాది!.. పవన్ ప్రోగ్రెస్ ఇదిగో!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి గురువారానికి సరిగ్గా ఏడాది దాటిపోతోంది.  మొన్నటిదాకా సినీ నటుడిగా, ఓ రాజకీయ పార్టీ అదినేతగానే కొనసాగిన పవన్ ఏడాది క్రితం డిప్యూటీ సీఎం అనే కొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారు. డిప్యూటీ సీఎం హోదాలో వపన్… గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక రంగాల శాఖలను ఏరికోరి మరి ఎంపిక చేసుకున్నారు. అంతేకాదండోయ్.. ఈ శాఖలపై ఆయన అనతి …

Read More »

కేంద్రం సమక్షంలో త్వరలో బాబు, రేవంత్ భేటీ

తెలుగు రాష్ట్రాల మద్య ఇప్పుడు పోలవరం- బానకచర్ల ప్రాజెక్టు పెద్ద సమస్యగా మారిపోయింది. గోదావరి నుంచి వృథాగా సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీల్లో కేవలం 200 టీఎంసీల వినియోగం కోసం చేపట్టే ఈ ప్రాజెక్టుతో రాయలసీమ రతనాల సీమగా మారుతుందని ఏపీ వాదిస్తోంది. అయితే తమ ప్రాజెక్టులకు అభ్యంతరాలు తెలుపుతూ.. మాకు నష్టం కలిగించే ప్రాజెక్టును నిర్మిస్తామంటే మేమెలా ఒప్పుకుంటామంటూ తెలంగాణ వాదిస్తోంది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు వ్యవహారం ఇప్పుడు నేరుగా …

Read More »

ఇది బాబు మార్కు వ్యూహం!

తెలుగు రాష్ట్రాల మధ్య రచ్చకు కారణమవుతుందని భావిస్తున్న పోలవరం-బానకచర్ల ప్రాజెక్టు… ఇరు రాష్ట్రాల మధ్య మరింత స్నేహ సంబంధాలను పెంపొందించనుందని చెప్పక తప్పదు. ఇందుకు ఈ ప్రాజెక్టుపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వ్యూహమే కారణమని చెప్పాలి. వాస్తవంగా బాబు కంటే రాజకీయాల్లో జూనియర్ అయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం చేసిన వ్యాఖ్యలు విన్నవారు… బానకచర్ల ఇరు రాష్ట్రాల మధ్య పెద్ద …

Read More »

‘వెధవ పనుల వల్లే వైసీపీకి 11 సీట్లు’

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి సర్కారుపై చేసిన విమర్శలకు వెనువెంటనే కౌంటర్లు వచ్చి పడ్డాయి. ఆ కౌంటర్లు కూడా నేరుగా టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు నుంచే రావడం గమనార్హం. గురువారం అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు… వెధవ పనులు చేసిన కారణంగానే వైసీపీ 11 సీట్లకే పరిమితమైందని ఓ …

Read More »

అంబటి అరెస్టు ఖాయమే

వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే.. ఈ కేసుల్లో పెట్టిన సెక్ష‌న్లు గ‌మ‌నిస్తే.. ఆయ‌న‌కు క‌నీసం ఏడేళ్లు త‌క్కువ కాకుండా శిక్ష‌లు ప‌డేలా ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆయ‌న‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండానే అరెస్టు చేసేందుకు పోలీసుల‌కు అవ కాశం ఏర్ప‌డింది. బుధ‌వారం వైసీపీ అధినేత జ‌గ‌న్ రెంట‌పాళ్ల‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా పోలీసుల‌కు, వైసీపీ నాయ‌కుల‌కు మ‌ధ్య వాగ్వాదం చోటు …

Read More »

చెవిరెడ్డన్న‌కు జ‌గ‌న్ స‌ర్టిఫికేట్‌

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డిని మ‌ద్యం కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు అరెస్టు చేయ‌డంపై మాజీ సీఎం జ‌గ‌న్ స్పందించారు. చెవిరెడ్డి అమాయ‌కు డ‌ని ఆయ‌న స‌ర్టిఫికెట్ ఇచ్చారు. రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారుపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరిగింద‌ని.. దీనిని దారి మ‌ళ్లించేందుకే త‌మ పార్టీ నాయ‌కుల‌ను అరెస్టు చేస్తున్నార‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న పార్టీ నేత‌ల అరెస్టు చిట్టాను విప్పారు. “చెవిరెడ్డన్న‌ అరెస్ట్‌ …

Read More »

యుద్ధం చేస్తున్నాం: జ‌గ‌న్‌

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా మీడియాతో మాట్లాడారు. సుమారు 40 నిమిషాల పాటు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. బుధ‌వారం గుంటూరు జిల్లా రెంట‌పాళ్ల‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను వివ‌రించారు. రాష్ట్రంలో తాము.. అధికార పార్టీ టీడీపీ, దానిని స‌మ‌ర్థించే ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నామ‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు దిగ‌జారాయ‌న‌డానికి బుధ‌వారం నాటి రెంట‌పాళ్ల ప‌ర్య‌ట‌నే ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ప‌రామ‌ర్శించినా.. ఓర్చుకోలేని స్థితిలో కూట‌మి ప్ర‌భుత్వం …

Read More »

‘రప్పా రప్పా..’ అరెస్ట్ అయిపోయాడు

ఓవైపు పోలీసులు అనుమతులు లేదంటున్నా.. ఆంక్షలు పెట్టినా.. అవేమీ పట్టించుకోకుండా బుధవారం పల్నాడు పర్యటన చేశారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. పోలీసులు వారిస్తున్నా వినకుండా.. బారికేడ్లను తోసుకుంటూ వేలమంది ర్యాలీలు చేశారు. జగన్ నినాదాలతో ఊగిపోయారు. కాగా ఈ ర్యాలీలో కొందరు వైసీపీ కార్యకర్తలు పట్టుకున్న ప్లకార్డుల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద …

Read More »