టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఒక్కసారి చెబితే నిజంగానే వంద సార్లు చెప్పినట్టే. అదేదో సినిమా డైలాగ్ లా స్ఫూరించినా…చంద్రబాబు మాట చెప్పారంటే అది జరిగి తీరుతుంది. ప్రభుత్వ పాలనలో కీలక భూమిక పోషిస్తున్న ఉద్యోగుల విషయంలో చంద్రబాబు మరింత శ్రద్ధగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా ఇట్టే స్పందిస్తున్న చంద్రబాబు.. గతంలో వారికి దక్కకుండాపోయిన సర్కారీ నిధులను కూడా విడుదల చేస్తున్నారు. …
Read More »తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ.. కీలక చర్చలు!
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గ విస్తరణకు సిద్ధమైందా? ఆ దిశగా వడివడిగా చర్యలు తీసుకునేందుకు రెడీ అయిందా? అంటే .. తాజా పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ చేయాలన్నది కొన్నాళ్లు గా వినిపిస్తున్న డిమాండ్. సుమారు నాలుగు నుంచి ఐదు కీలక శాఖలు.. సీఎం రేవంత్రెడ్డి చేతిలోనే ఉన్నాయి. పైగా కీలకమైన హోం శాఖ కూడా ఆయన చెంతనే ఉంది. ఈ నేపథ్యంలో …
Read More »ఏపీకి అంతర్జాతీయ వర్సిటీ వచ్చేసింది!
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండానే సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించిన ఏపీ… టీడీపీ నేతృత్వంలో అన్నీ సమకూరిపోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రానికి నూతన రాజధానిగా ఎంపిక అయిన అమరావతికి నిధులే కాదు… విద్యాలయాలు కూడా క్యూ కడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని ప్రసిద్ధ విద్యా సంస్థల్లో కొన్ని తమ క్యాంపస్ లను అమరావతిలో ఏర్పాటు చేశాయి. ఫలితంగా భవిష్యత్తులో అమరావతితో పాటుగా ఏపీ కూడా విద్యా …
Read More »20 లక్షల ‘బంగారు కుటుంబాలు: లక్ష్యం ప్రకటించిన చంద్రబాబు
విజనరీ ముఖ్యమంత్రిగా పేరున్న ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా మరో కీలక లక్ష్యాన్ని ప్రకటించారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో 20 లక్షల ‘బంగారు కుటుంబాలను’ తయారు చేయాలని నిర్దేశించుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ప్రతిపాదిత పీ-4(పబ్లిక్-ప్రైవేటు-పీపుల్స్-పార్టనర్ షిష్) పథకాన్ని ఈ ఉగాది నుంచి ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. దీనిలో భాగంగా ఏడాది కాలంలో 20 లక్షల పేద కుటుంబాలను సంపన్న కుటుంబాలుగా తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు వివరించారు. దీనికి అధికాదాయ వర్గాలు, …
Read More »ఎంపీలకు చేతినిండా డబ్బు.. మోడీ కీలక నిర్ణయం!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యులకు మరోసారి వేతనాలు పెంచింది. రెండేళ్ల కిందట ఒకసారి వేతనాలు పెంచిన కేంద్రం.. తాజాగా మరోసారి 24 శాతం మేరకు వారికి వేతనాలు పెంచుతూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ వేతనాలు పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. అంతేకాదు.. పెంచిన వేతనాలు.. గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. …
Read More »ఫర్లే.. రోడ్డుందిగా: ఏపీ ప్రజల్లో ఎంత మార్పు.. !
ఏపీ ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే.. ఇది అన్ని వర్గాల ప్రజల్లోనా.. లేక, కొందరిలోనేనా అనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుతం మెజారిటీ ప్రజలు కూటమి సర్కారు తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రతిపక్షం వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని.. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని పెద్ద ఎత్తున ఆరోపిస్తోంది. ఇది కొంత వాస్తవమే అయినా.. ప్రజల్లోనూ మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం సూపర్ సిక్స్లో …
Read More »ఢిల్లీ లో రేవంత్… ఆ సారైనా గ్రీన్ సిగ్నల్ లభించేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం దేశ రాజధాని డిల్లీ చేరుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి బయలుదేరిన రేవంత్…ఇప్పటికే ఢిల్లీలో ఉన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కూడా తమ బృందంతో కలుపుకుని కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలతో భేటీ కానున్నారు. ఈ భేటీపై కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కేబినెట్ లో ఇంకో …
Read More »పార్లమెంటులో ‘అరకు’!… ఒకటి కాదు, రెండు స్టాళ్లు!
ఏపీ గిరి పుత్రులు పండిస్తున్న సేంద్రీయ అరకు కాఫీ రుచులు విశ్వవ్యాప్తంగా విస్తరించాలన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంకల్పంలో సోమవారం ఓ కీలక ఘట్టం పూర్తి అయ్యింది. చంద్రబాబు కృషితో ఇప్పటికే అరకు కాఫీకి జియో ట్యాగ్ గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. తాజాగా భారత అత్యున్నత చట్టసభ పారమెంటులోకి అరకు కాఫీ సగర్వంగా ఎంట్రీ ఇచ్చింది. సోమవారం పార్లమెంటు ఆవరణలోని లోక్ సభ, రాజ్యసభ …
Read More »జగన్ ‘గడప’పై టీడీపీ జెండా ఎగరబోతోందా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడపగా ముద్రపడ్డ కడపలో వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలో విపక్ష కూటమి దాదాపుగా క్లీన్ స్వీప్ చేసినంత పనిచేసింది. ఇప్పుడు కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని చేజిక్కించుకునే దిశగా టీడీపీ మొదలుపెట్టిన చర్యలు వైసీపీని వణికిస్తున్నాయని చెప్పక తప్పదు. టీడీపీ చర్యలతో బెంబేలెత్తిపోయిన వైసీపీ తన జడ్పీటీసీలను ఇప్పటికే బెంగళూరులో ఏర్పాటు చేసిన …
Read More »తమ్మినేని డిగ్రీ వివాదం.. కదిలిన విజిలెన్స్
వైసీపీ నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వంతు వచ్చింది. ఆయన గతంలో ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్లు.. నకిలీవని, ఆయన పదో తరగతి కూడా పాస్ కాలేదని.. విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఆమదాలవలస నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే, తమ్మినేని బావమరిది కూన రవి కుమార్.. ఈ విషయంపై పట్టుబట్టారు. దీంతో వైసీపీ హయాంలోనే ఆయనపై డిగ్రీ సర్టిఫికెట్లకు సంబంధించి భారీ విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. పైగా.. …
Read More »కేసీఆర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: పెరిగిన సెగ
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వ్యవహారం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రభుత్వం కోల్పోయారు. అయినప్పటికీ.. ప్రజలు ఆయనకు గజ్వేల్ నియోజకవర్గంలో బ్రహ్మరథం పట్టారు. కానీ, 15 మాసాలుగా కేసీఆర్.. అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్, ఇంటికే పరిమితం అవుతున్నారు. ఒకే ఒక్కసారి గత ఏడాది జరిగిన బడ్జెట్ సమావేశాల రోజు సభకు వచ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత.. ఆయన అసెంబ్లీ ముఖం కూడా …
Read More »పులివెందుల రైతుకు కష్టం.. జగన్ కన్నా ముందే సర్కారు స్పందన!
వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం.. పులివెందులలో రైతులకు భారీ కష్టం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. దీంతో అరటి, చీనీ(బత్తాయి) తోటలు వేలాది ఎకరాల్లో నేలమట్టం అయ్యాయి. ఇలాంటి సమయంలో స్థానిక ఎమ్మెల్యేగా జగన్ స్పందించాల్సి ఉంది. రైతుల కష్టాలు తెలుసుకుని సర్కారు ద్వారా వారికి సాయం అందించాల్సి ఉంటుంది. కానీ, జగన్ సోమవారం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates