ఎక్కడ విన్నా.. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా.. వైసీపీ అధినేత జగన్ చుట్టూనే చర్చ జరుగుతోంది. ఆయన అరెస్టు అవుతారా? ఆయనను జైలుకు పంపిస్తారా? అనేదే ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ నెల కొన్న ఉత్కంఠ . ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని.. వేలాది కోట్ల రూపాయలను ముడుపులుగా పుచ్చుకుని దారిమళ్లించారని కూడా చెబుతోంది. ఈ క్రమంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి మరీ విచారణకు …
Read More »చంద్రబాబు నాయకత్వంలో..: కేంద్రానికి పవన్ లేఖ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తాజాగా గురువారం రాత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనికి సంబంధించిన విషయాలను ఆయన ఎక్స్లో పంచుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం లో రాష్ట్రం వడివడిగా అభివృద్ధి బాట పడుతోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కేంద్రం సహకారంతో పలు అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్కు కృతజ్ఞతలు చెబుతున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. …
Read More »ఏపీలో ఫస్ట్ కరోనా కేసు.. సీఎం రియాక్షన్ ఇదే!
2019-21 మధ్య రెండు మూడు దశలుగా విస్తరించి.. లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా ప్రస్తుతం మరోసారి ప్రపంచ దేశాలకు సవాల్ రువ్వుతోంది. ప్రస్తుతం ఐదారు దేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఇది బలమైన కరోనా వైరస్ రూపాంతరమా? లేక సాధారణంగా పోతుందా? అనే దానిపై పరిశోధనలు జరుగుతు న్నాయి. ఇదిలావుంటే.. తాజాగా ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలోని ఓ కాలనీకి చెందిన …
Read More »అన్నకు ఐదు ప్రశ్నలు.. గ్యాప్ ఫిల్ చేసిన షర్మిల!
వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్ను ఉద్దేశించి కాంగ్రెస్ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక మైన ఐదు ప్రశ్నలు సంధించారు. ఒకరకంగా చెప్పాలంటే.. ఇటీవల కాలంలో జగన్పై విమర్శలకు దూరంగా ఉన్న షర్మిల.. ఆ గ్యాప్ను తాజాగా భర్తీ చేసేశారు. తాజాగా జగన్పై షర్మిల నిప్పులు చెరుగుతూ పలు ప్రశ్నలు సంధించారు. ఏపీలో లిక్కర్ మాఫియా థ్రిల్లర్ సిరీ స్ను తలపిస్తోందన్న ఆమె దీంతో వైసీపీకి భయం పట్టుకుందని …
Read More »కేసులతో 4 పెళ్లిళ్లు ప్రమాదంలో పడ్డాయా?
ఏపీలో కూటమి సర్కారు వరుసబెట్టి కేసులు నమోదు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. గత వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఈ కేసుల్లో ఇప్పటికే చాలా మంది నేతలు, అధికారులు, అనధికారులు అరెస్టు కాగా… వారిలో పలువురు కీలక వ్యక్తులు ఉన్నారు. అరెస్టుల వరకు ఓకే గానీ.. ఈ అరెస్టుల కారణంగా ఆయా నిందితుల ఇళ్లల్లో శుభకార్యాలు నిలిచిపోయే ప్రమాదం వచ్చి పడిందట. ఈ విషయాన్ని ఏ దారిన …
Read More »మన సిక్కోలు నాయుడు కీర్తి చక్రతో మెరిశారు
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేజర్ మల్ల రామ గోపాల్ నాయుడు భారత సైన్యం అందించే అత్యున్నత పురస్కారాల్లో రెండోదైన కీర్తి చక్రతో మెరిశారు. కీర్తి చక్రతో మెరవడమే కాదండోయ్.. ఈ గ్యాలంట్రీ అవార్డును అందుకున్న తొలి తెలుగు రైతు బిడ్డ కూడా మన నాయుడే కావడం గమనార్హం. భారత స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఏటా సైనికులు ఇచ్చే గ్యాలంట్రీ అవార్డులను ఈ ఏడాదికి సంబందించి గురువారం రాష్ట్రపతి ద్రౌపది …
Read More »హాట్ టాపిక్… కేసీఆర్ కు కవిత 6 పేజీల లేఖ
తెలుగు నేల రాజకీయాల్లో గురువారం ఓ హాట్ టాపిక్ ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాదించిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆయన కుమార్తె, మాజీ ఎంపీ కవిత ఓ సుదీర్ఘ లేఖ సంధించారు. దాదాపుగా 6 పేజీలతో కూడిన ఈ లేఖ ఇటీవలే వరంగల్ కేంద్రంగా జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తర్వాతే రాసినట్లుగా భావిస్తున్నారు. అయితే ఇతమిద్ధంగా ఎప్పుడు ఆమె తన …
Read More »అరెస్టుకు జగన్ మెంటల్లీ ప్రిపేర్ అయిపోయినట్టే!
ఏపీలో రోజుకో మలుపు తిరుగుతున్న మద్యం కుంభకోణం కేసులో త్వరలోనే ఓ కీలక పరిణామం జరగబోతోందని కూటమి పెద్దలు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. వైసీీపీ హాయాంలో జరిగిన ఈ కుంభకోణం మొత్త ఆ పార్టీ అదినేత, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని… ఇప్పటిదాకా అరెస్టు అయిన దాదాపుగా అందరూ నిందితులు చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ స్కాంలో అంతిమ లబ్ధిదారు కూడా …
Read More »కూటమి పాలనలో రైతాంగం పరిస్థితి ఎలా ఉంది?
టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు ఏపీలో పాలనను చేపట్టి అప్పుడే ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రంగాల్లో తాము చేసిందేమిటి? సాధించిన ప్రగతి ఏమిటి? ఇంకా చేపట్టాల్సిన చర్యలేమిటి? అన్న వాటిపై సీఎం చంద్రబాబు సమీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం వ్యవసాయం, అనుబంధ రంగాలపైనా ఆయన సమీక్ష చేశారు. ఈ సమీక్ష ఓకే గానీ… చంద్రబాబు ఏడాది పాలనలో రైతాంగం ఎలా ఉంది? అన్న విషయాన్ని పరిశీలిస్తే… …
Read More »23 నిమిషాల్లోనే పాకిస్థాన్కు చుక్కలు చూపించాం: మోడీ
రాజస్థాన్లోని బికనీర్లో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించారు. అనంతరం.. నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. పాకిస్థాన్లోని ఉగ్ర శిబిరాలపై భారత్ చేపట్టి న ఆపరేషన్ సిందూర్ విషయాన్ని ప్రస్తావించారు. 22 నిమిషాల్లో పహల్గాంలో ఉగ్రవాదులు మన ఆడపడు చుల సిందూరం తుడిచేశారని, పేర్లు అడిగి మరీ కాల్చేశారని అన్నారు. అయితే.. ఆపరేషన్ సిందూర్ ద్వారా మనం 23 నిమిషాల వ్యవధిలోనే పాకిస్థాన్కు చుక్కలు చూపించామన్నారు. …
Read More »చంద్రబాబుకు సాయిరెడ్డి లొంగిపోయారు: జగన్
వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత వైసీపీ అధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సాయిరెడ్డికి క్రెడిబులిటీ లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో కసిరెడ్డి రాజ శేఖర్ తో తనకు సంబంధం లేదని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోని తాజాగా విజయసాయిరెడ్డిపై జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు …
Read More »కేడర్ కు షాక్…పార్టీ నడిపేందుకు డబ్బుల్లేవన్న జగన్
“తాను ఉన్నంతకాలం తత్వం బోధపడదు.. తత్వం బోధ పడ్డాక తానుండడు” అని ఒక కొటేషన్ ఉంది. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కు ఇది అతికినట్లు సరిపోతుంది. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కేడర్ ను, శ్రేణులను, కార్యకర్తలను, ఆఖరికి మెజారిటీ ఎమ్మెల్యేలను కూడా జగన్ విస్మరించారన్నది జగమెరిగిన, జగనెరిగిన సత్యం. అందుకే, ఈ మధ్య పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలతో సమావేశమైన ప్రతి సారీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates