Political News

చెవిరెడ్డన్న‌కు జ‌గ‌న్ స‌ర్టిఫికేట్‌

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డిని మ‌ద్యం కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు అరెస్టు చేయ‌డంపై మాజీ సీఎం జ‌గ‌న్ స్పందించారు. చెవిరెడ్డి అమాయ‌కు డ‌ని ఆయ‌న స‌ర్టిఫికెట్ ఇచ్చారు. రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారుపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరిగింద‌ని.. దీనిని దారి మ‌ళ్లించేందుకే త‌మ పార్టీ నాయ‌కుల‌ను అరెస్టు చేస్తున్నార‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న పార్టీ నేత‌ల అరెస్టు చిట్టాను విప్పారు. “చెవిరెడ్డన్న‌ అరెస్ట్‌ …

Read More »

యుద్ధం చేస్తున్నాం: జ‌గ‌న్‌

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా మీడియాతో మాట్లాడారు. సుమారు 40 నిమిషాల పాటు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. బుధ‌వారం గుంటూరు జిల్లా రెంట‌పాళ్ల‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను వివ‌రించారు. రాష్ట్రంలో తాము.. అధికార పార్టీ టీడీపీ, దానిని స‌మ‌ర్థించే ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నామ‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు దిగ‌జారాయ‌న‌డానికి బుధ‌వారం నాటి రెంట‌పాళ్ల ప‌ర్య‌ట‌నే ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ప‌రామ‌ర్శించినా.. ఓర్చుకోలేని స్థితిలో కూట‌మి ప్ర‌భుత్వం …

Read More »

‘రప్పా రప్పా..’ అరెస్ట్ అయిపోయాడు

ఓవైపు పోలీసులు అనుమతులు లేదంటున్నా.. ఆంక్షలు పెట్టినా.. అవేమీ పట్టించుకోకుండా బుధవారం పల్నాడు పర్యటన చేశారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. పోలీసులు వారిస్తున్నా వినకుండా.. బారికేడ్లను తోసుకుంటూ వేలమంది ర్యాలీలు చేశారు. జగన్ నినాదాలతో ఊగిపోయారు. కాగా ఈ ర్యాలీలో కొందరు వైసీపీ కార్యకర్తలు పట్టుకున్న ప్లకార్డుల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద …

Read More »

‘నరికేస్తాం’ అంటున్నా జగన్ కు తప్పనిపించట్లేదు?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లిలోని తన పార్టీ కేంద్ర కార్యాలయంలో సుదీర్ఘంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎప్పటిలానే కూటమి పాలన కంటే తన పాలనే మెరుగ్గా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికే మొత్తం అన్నీ పాత విషయాలే మాట్లాడిన జగన్… చివరలో మాత్రం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాటి రెంటపాళ్ల పర్యటనలో వైసీపీ కార్యకర్త ఒకరు రెచ్చగొట్టే ఓ …

Read More »

జగన్ వేలికి ‘బాబు’ రింగు

వైసీసీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లిలోని తన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వచ్చిన జగన్ ఓ మోస్తరు వెరైటీగా కనిపించారు. సాధారణంగా జగన్ చేతులకు ఓ గడియారం తప్పించి ఇతరత్రా ఉంగరాలు గానీ, అలంకరణ వస్తువులు గానీ ఎప్పుడూ కనిపించవు. అయితే గురువారం నాటి మీడియా సమావేశంలో జగన్ తన ఎడమ చేతి మిడిల్ ఫింగర్ కు …

Read More »

బెట్టింగ్ లో ఆత్మహత్య చేసుకుంటే ప‌రామ‌ర్శ‌లా?: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. బుధ‌వారం గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలోని రెంట‌పాళ్ల గ్రామంలో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ‌త ఏడాది ఆత్మ‌హ‌త్య చేసుకున్న వైసీపీ నాయ‌కుడు నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. అయితే.. ఈ ప‌రామ‌ర్శ‌పై జ‌గ‌న్ సోద‌రి, కాంగ్రెస్ పార్టీ చీఫ్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. బెట్టింగులో డ‌బ్బులు పోగొట్టుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటే ప‌రామ‌ర్శిస్తారా? అంటూ.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బెట్టింగు రాయుడికి.. విగ్రహాలు కట్టడం ఏంటి …

Read More »

ఢిల్లీ టూర్లపై బీఆర్ఎస్ కు రేవంత్ దిమ్మతిరిగే రిప్లై!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ వెళుతున్న వైనంపై విపక్షాలు.. ప్రత్యేకించి బీఆర్ఎస్ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఈ విమర్శలపై పలుమార్లు తనదైన శైలి సమాధానం ఇచ్చిన రేవంత్ తాజాగా బుధవారం నాటి అఖిలపక్ష సమావేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. తన ఢిల్లీ టూర్లపై విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ కు ఆయన దిమ్మితిరిగే రితిలో అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ఆయా ప్రాజెక్టులకు అనుమతులు కేంద్రం కాకుంటే… …

Read More »

వారికి వాయిస్ లేకుండా పోయింది!

నాయ‌కుడు అన్నాక‌.. మీడియాతో అనుబంధం ఉంటుంది. నాయ‌కులకు-మీడియాకు మ‌ధ్య అవినాభావ సంబంధం కూడా పెరిగిపోయింది. ఎంత సేపూ.. మీడియా ముందు ఉండాల‌నే నాయ‌కులు కోరుకుంటారు. అవ‌స‌రం వ‌స్తే.. అదే ప‌నిగా మీడియా ముందు కూర్చునే నాయ‌కులు కూడా.. ఏపీలో బాగానే ఉన్నారు. మీడియా ముందు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతోపాటు.. సంచ‌ల‌నాలు సృష్టించాల‌ని బావించే వారు కూడా ఉన్నారు. అయితే.. ఇప్పుడు వీరికి ప‌నిలేకుండా పోయింది. ముఖ్యంగా టీడీపీలో నాయ‌కులు ఫైర్ …

Read More »

వైసీపీ సైకో ఫ్యాక్ట‌రీ: లోకేష్

ఏపీలో ప్ర‌జ‌లు వైసీపీకి గ‌త ఎన్నిక‌ల్లో 11 స్థానాలే ఇచ్చి.. ప‌క్క‌న కూర్చోబెట్టినా ఇంకా బుద్ధి రాలేద‌ని.. ఆ పార్టీ తీరు మార‌లేద‌ని టీడీపీయువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. వైసీపీ సైకోల‌ను త‌యా రు చేసే పెద్ద ఫ్యాక్ట‌రీగా మారింద‌ని ఎద్దేవా చేశారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న లోకేష్ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా గుంటూరులో ప‌ర్య‌టించారు. ఇక్క‌డి రెంట‌పాళ్ల గ్రామంలో …

Read More »

చెవిరెడ్డి వాదనలు చెల్లలేదు.. 1 వరకు జైలు

ఏపీలో తీవ్ర కలకలం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ బెజవాడ ఏసీబీ కోర్టు బుధవారం రాత్రి ఉత్వర్లులు జారీ చేసింది. దీంతో చెవిరెడ్డిని సిట్ అధికారులు మరికాసేపట్లో బెజవాడలోని జిల్లా జైలుకు తరలించనున్నారు. చెవిరెడ్డితో పాటుగా ఆయన బాల్య స్నేహితుడు వెంకటేశ్ నాయుడినీ కోర్టు జైలుకు పంపింది. …

Read More »

ఆ పాత ఫోన్లు ఏమయ్యాయి కేటీఆర్!

ఫార్మూలా ఈ కారు రేసుల వ్యవహారంలో ఇప్పటిదాకా రెండు పర్యాయాలు ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరైన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన రెండో దఫా విచారణ సందర్భంగా ఏసీబీ అధికారులు… 2021 నుంచి 2024 మధ్యలో వినియోగించిన సెల్ ఫోన్లను స్వాధీనం చేయాలని కేటీఆర్ ను కోరారు. అయితే ఇఫ్పుడు వాటిని తీసుకురాలేదని తప్పించుకున్న కేటీఆర్ తాజాగ బుధవారం అసలు …

Read More »

బనకచర్లకు 2019లోనే అంకురార్పణ: రేవంత్ రెడ్డి

ఏపీ ప్రతిపాదిస్తున్న పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుకు 2019లోనే అంకురార్పణ జరిగిందని తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో భాగంగా బనకచర్లపై కీలక చర్చ జరిగింది. ఏపీ ప్రతిపాదిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని అఖిలపక్ష సమావేశానికి వివరించిన రేవంత్… తెలంగాణకు తీరని నష్టం చేకూర్చే ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్రానికి తీర్మానం పంపుదామన్నారు. అందుకోసం అన్ని పార్టీలు కలిసి రావాలని కూడా …

Read More »