Political News

‘జ‌గ‌న్ 2.0’.. వైసీపీ లోక‌ల్ టాక్ ఇదే.. !

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. 2.0పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ 2.0 చాలా భి న్నంగా ఉంటుంద‌ని.. కార్య‌క‌ర్త‌ల‌కు అగ్ర‌తాంబూలం ఇస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. కార్య‌క‌ర్త‌లు ప్ర‌తి ఒక్క‌రినీ గుర్తు పెట్టుకుంటాన‌ని కూడా చెప్పుకొచ్చారు. దీంతో జ‌గ‌న్ 2.0పై వైసీపీలో చ‌ర్చ ప్రారంభ‌మైంది. ఇది న‌మ్మ శ‌క్యంగా లేద‌నికొంద‌రు అప్పుడే పెద‌వివిరుస్తుండ‌గా.. మ‌రికొంద‌రు నాయ‌కులు మాత్రం 2.0 బాగానే ఉంటుంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో …

Read More »

జ‌గ‌న్‌పై నిప్పులు చెరుగుతున్న జైలు ప‌క్షులు!

వైసీపీ త‌ర‌ఫున గ‌త ప్ర‌భుత్వంలో ఉండి.. పార్టీని, అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌ను కూడా హైలెట్ చేసిన వారు.. అదేస‌మ‌యంలో అప్ప‌టి విప‌క్ష నాయ‌కులైన చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌ను ఇష్టానుసారంగా దూషించిన వారు ఇప్పుడు జైల్లో మ‌గ్గుతున్న విష‌యం తెలిసిందే. వీరిలో ఒక్క పోసాని కృష్ణ‌ముర‌ళి మాత్ర‌మే అతి క‌ష్టంమీద బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. అది కూడా అనేక ష‌రతుల‌కు లోబ‌డి కోర్టు.. ఆయ‌న‌కు ష‌ర‌తులు ఇచ్చింది. ఇక‌, బెయిల్ రాకుండా.. …

Read More »

జ‌మిలి ప‌క్కా.. రాసిపెట్టుకోవ‌చ్చు!

దేశంలో జ‌మిలి ఎన్నిక‌లు జ‌రుగుతాయా? జ‌ర‌గవా? ఈ విష‌యంలో బీజేపీ అడుగులు ముందుకు ప‌డ‌తాయా? ప‌డ‌వా? అనే సందేహాలు త‌ర‌చుగా తెర‌మీదికి వ‌స్తూనే ఉన్నాయి. కానీ, మ‌రోవైపు జ‌మిలి ఎన్నిక‌ల బిల్లును తెర‌మీదికి తీసుకువ‌చ్చారు. పార్ల‌మెంటులోనూ ప్ర‌వేశ పెట్టారు. దీనిపై ప్ర‌త్యేకంగా ఆరు మాసాల పాటు అధ్య‌యనం కూడా జ‌రిగిపోయింది. అయినా.. ఈ సందేహాలు మాత్రం కొన‌సాగాయి. దీనికి కార‌ణం.. బీజేపీ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో త‌క్కువ సీట్లు తెచ్చుకున్న ద‌రిమిలా.. …

Read More »

వైఎస్ అవినాశ్ ఇరుక్కుపోయినట్టేనా..?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో మంగళవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై సుప్రీంకోర్టు జరుపుతున్న విచారణలో ఏపీ ప్రభుత్వం మంగళవారం ఓ అదనపు అఫిడివిట్ ను దాఖలు చేసింది. అందలో కడప ఎంపీగా కొనసాగతున్నవైఎస్ అవినాశ్ రెడ్డి…ఈ కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టించారని సదరు అఫిడవిట్ లో రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ కేసును తప్పుదోవ …

Read More »

సిస్కో టీంలో వైసీపీ యాక్టివిస్ట్… ఇట్టే పట్టేసిన లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఒళ్లంతా కళ్లు చేసుకుని సాగతున్నారు. ఓ వైపు పార్టీ వ్యవహారాలు, మరోవైపు ప్రభుత్వ పాలన… నిత్యం బిజీబిజీగా సాగుతున్న లోకేశ్ ప్రతి విషయాన్ని చాలా లోతుగా పరిశీలిస్తూ సాగుతున్నారు. లోకేశ్ నిశిత పరిశీలన ఎంత లోతుగా ఉంటుందన్న విషయానికి నిదర్శనంగా మంగళవారం ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఓ కంపెనీ ప్రతినిధిగా వచ్చిన వైసీపీ …

Read More »

చంద్ర‌బాబు మాట్లాడితే.. టీవీల‌కు అతుక్కుపోయేవారు: మ‌ల్లారెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. లాబీల్లో మీడియాతో సంభాషించారు. స‌భ జ‌రుగుతుండ‌గా బ‌య‌ట‌కు ఎందుకు వ‌చ్చార‌ని మీడియా మిత్రులు ప్ర‌శ్నించారు. దీనికి మ‌ల్లారెడ్డి స్పందిస్తూ.. “ఏముంటద‌బ్బా.. స‌భ‌లోని. బ‌ట్టలు విప్పుడు-క‌త్తులు దూసుడేగా” అని వ్యాఖ్యానించారు. దీనికి కొన‌సాగింపుగా.. గ‌తంలో నిర్మాణాత్మ‌కమైన చ‌ర్య‌లు జ‌రిగేవ‌న్నారు. స‌భ‌లో దివంగ‌త వైఎస్‌, ప్ర‌స్తుత ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తుంటే.. …

Read More »

“మూడేళ్ల త‌ర్వాత.. జ‌గ‌న్ వ‌చ్చేది జైలుకే.. స్వాగ‌త ఏర్పాట్లు చేస్తా”

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “మూడేళ్ల త‌ర్వాత‌.. వ‌చ్చేది మ‌న ప్ర‌భుత్వ‌మే. అప్పుడు మీకు న్యాయం చేస్తా” అంటూ.. పులివెందుల రైతులను ఉద్దేశించి వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. అకాల వ‌ర్షంతో కుప్ప‌కూలిన అర‌టి తోట‌లను ప‌రిశీలించి, రైతుల‌ను పరామ‌ర్శించిన జ‌గ‌న్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఈ వ్యాఖ్య‌లను ఇమిటేట్ చేసిన బుచ్చ‌య్య …

Read More »

‘తాళం` తీసేవారు లేరు.. వైసీపీ ఏం చేస్తుంది?

ఔను.. నిజ‌మే! ఏపీలో వైనాట్ 175 నినాదంతో ఎన్నిక‌ల‌కు వెళ్లిన వైసీపీ.. కేవ‌లం 11 స్థానాల‌కే ప‌రిమితమైంది. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం చ‌వి చూసింది. ఊహించ‌ని ప‌రాజ‌యం… పార్టీ అధినేత జ‌గ‌న్ వేసుకున్న లెక్క‌లు దారి త‌ప్ప‌డం తెలిసిందే. అయితే..ఈ ప్ర‌భావం.. పార్టీ నాయ‌కుల‌పై భారీగానే ప్ర‌భావం చూపించింది. ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకోవ‌డం లేదంటూ.. జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగిన నాయ‌కులు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే …

Read More »

ఇలాగైతే… 20 లక్షల కొలువులు ఓ లెక్కా?

ఏపీలోని కూటమి సర్కారు జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. సర్కారీ ఖజానాను గత ప్రభుత్వ పెద్దలు ఖాళీ చేయడంతో పాటుగా కొత్తగా అప్పులు పుట్టని పరిస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేసి వెళ్లినా…టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో కూటమి సర్కారు అద్భుతాలనే చేసి చూపిస్తోంది. ఈ 9 నెలల కాలంలోనే ఏపీకి రూ.8 లక్షల కోట్ల పై చిలుకు పెట్టుబడులను ఆకర్షించిన కూటమి… వాటి ద్వారా ఏకంగా 6 …

Read More »

బాబుకు ఉద్యోగి లేఖ!.. ఇంత చేస్తూ ప్రచారం చేసుకోరా?

ఏపీలో వైసీపీ పాలన, కూటమి పాలనల్లోని వ్యత్యాసాలను ఎత్తి చూపారు ఓ ఉద్యోగి. అంతేనా నాటి ప్రభుత్వ పాలనలో తామెలాంటి ఇబ్బందులు పడ్డామన్న మాటను ఆ ఉద్యోగి తన అక్షరాలతోనే కళ్లకు కట్టారు. అక్కడితోనూ ఆయన ఆగలేదు. ప్రస్తుత ప్రభుత్వం తమ కోసమే కాకుండా రాష్ట్రంలోని వివిధ వర్గాలకు చేస్తున్న న్యాయాన్ని కూడా ప్రస్తావించారు. కూటమి న్యాయం వల్ల జరుగుతున్న లాభాన్నీ సోదాహరణంగా వివరించారు. నాడు అణచివేతతోనే ప్రచారాన్నిహోరెత్తిస్తే.. నేడు …

Read More »

కోర్టుల‌తో ప‌రిహాస‌మా?: ఎమ్మెల్యేల అన‌ర్హ‌త కేసులో సుప్రీం ఫైర్

తెలంగాణ‌కు చెందిన ఎమ్మెల్యేల అన‌ర్హత పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌తివాదులైన జంపింగ్‌ ఎమ్మెల్యేల త‌ర‌ఫున న్యాయ‌వాదులు.. నాలుగు వారాల‌స‌మ‌యం కోరారు. తాము అఫిడ‌విట్‌లు వేసేందుకు స‌మ‌యం ఇవ్వాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి జస్టిస్ బీఆర్ గ‌వాయ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “కోర్టుల‌తో ప‌రిహాస‌మా? మా స‌మ‌యాన్ని వృధా చేస్తారా?” అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున న్యాయ‌వాదులు స్పందిస్తూ.. ఎమ్మెల్యేలపై అన‌ర్హ‌త …

Read More »

మహిళా ఎమ్మెల్యేకు సారీ చెప్పిన స్పీకర్

గెడ్డం ప్రసాద్ కుమార్… తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నేత. ఆది నుంచి కాంగ్రెస్ ను అంటిపెట్టుకుని సాగుతున్న ఆయన… తాజాగా మంగళవారం శాసనసభాపతి హోదాను, గౌరవాన్ని మరింతగా పెంచేలా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. సభలో ఓ సభ్యురాలి గురించి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ఆయన తన ఉదాత్త స్వభావాన్ని మరింతగా ఇనుమడింపజేసుకున్నారు. స్పీకర్ స్థానంలో ఉండి కూడా ఈ తరహా …

Read More »