Political News

ఈ రెడ్డ్లు ఇద్దరూ మాత్రం దొరకరు

ఒక‌రు మ‌ద్యం అక్ర‌మాల్లో వేల కోట్ల రూపాయ‌లు తిన్నార‌న్న‌ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. మ‌రొక‌రు గ‌నుల అక్ర‌మాల్లో వంద‌ల‌ కోట్ల రూపాయ‌లు పోగేసుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ రెండు కేసుల‌కు సంబంధించి ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాల‌ను కూడా నియ‌మించింది. వారికి చేతినిండా సొమ్ములు కూడా ఇచ్చింది. ఎక్క‌డికి వెళ్లేందుకైనా.. నిందుల‌ను అరెస్టు చేసేందుకైనా కూడా అనుమ‌తులు ఇచ్చింది. అయినా.. స‌ద‌రు నిందితులు మాత్రం ఇప్ప‌టికీ దొర‌క‌లేదు. స‌రిక‌దా.. అస‌లు.. …

Read More »

జ‌పాన్‌ లో రేవంత్ చేస్తున్న పనేంటి!

“రండి పెట్టుబ‌డులు పెట్టండి. మీకు అవ‌స‌ర‌మైన స‌కల సౌక‌ర్యాలుక‌ల్పించేందుకు మా ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది“ అని రేవంత్ రెడ్డి జ‌పాన్ పారిశ్రామిక వేత్త‌ల‌కు పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం జపాన్‌ పర్యటనలో ఉన్నఆయ‌న టోక్యోలో నిర్వహించిన ఇండియా-జపాన్‌ భాగస్వామ్య కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి జ‌పాన్‌కు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైద‌రాబాద్ పెట్టుబ‌డులకు గ‌మ్య స్థానంగా మారిద‌న్నారు. అనేక ఎక‌రాల భూమి …

Read More »

నన్ను రాజకీయాల్లోకి లాగకండి: గంగూలీ గగ్గోలు

గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి అడుగు పెడతారని తరచూ వార్తలు వచ్చేవి. ఆయన బెంగాల్‌లో ఏదో ఒక పార్టీలో చేరతారని, ముఖ్యమైన హోదా తీసుకుంటారని రకరకాల ఊహాగానాలు వినిపించేవి. కానీ, అలాంటి వార్తల నుంచి గంగూలీ ఎప్పుడూ దూరంగానే ఉన్నారు. రాజకీయాలపై తన వైఖరిని క్లియర్‌గా చెప్పలేదు కానీ, ఆయన మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామకాల సమస్యపై కొందరు …

Read More »

2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి పడిపోయా: సాయిరెడ్డి

ఏపీలో మద్యం కుంభకోణం విచారణ కోసం ఏర్పాటు అయిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరైన వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణం మొత్తం ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి నేతృత్వంలోనే జరిగిందని ఇదివరకే చెప్పిన మాటను సాయిరెడ్డి శుక్రవారం కూడా మరోమారు వినిపించారు. మద్యం కుంభకోణం మొత్తాన్ని రాజ్ కసిరెడ్డే నడిపించారని …

Read More »

రాజాసింగ్ దారెటు? కీల‌క స‌మావేశానికి డుమ్మా!

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. ఫైర్‌బ్రాండ్‌.. నాయ‌కుడు ఘోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దారెటు? మ‌రి కొన్ని గంట‌ల్లో జ‌ర‌గ‌నున్న హైద‌రాబాద్ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓటు ఎవ‌రికి వేయ‌నున్నారు? అస‌లు వేస్తారా? లేదా? ఏం చేస్తారు? ఇదీ.. ఇప్పుడు బీజేపీ నాయ‌కుల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న విష‌యాలు. తాజాగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌పై పార్టీ తెలంగాణ చీఫ్‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న‌.. పార్టీ నాయ‌కులు భేటీ అయ్యారు. ఓటు …

Read More »

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌.. ప‌ట్టు బిగించిన టీడీపీ

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణకు ఏపీ గ‌వ‌ర్న‌ర్‌.. ఆమోద‌ముద్ర వేశారు. ఆ వెంట‌నే ప్ర‌భుత్వం కూడా.. గెజిట్ నోటిఫికేష‌న్ ఇచ్చేసింది. తాజాగా శుక్ర‌వారం జ‌రిగిన ఈ క్ర‌తువు ద్వారా.. ఇక నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టే ఉద్యోగ నియామ‌కాలు.. ప‌థ‌కాలు.. ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు దీనిని అమ‌లు చేయ‌నున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్ర‌కారం.. రాజీవ్ రంజ‌న్ మిశ్రా నేతృత్వంలో ఏక‌స‌భ్య క‌మిష‌న్ ఏర్పాటు చేసిన కూట‌మి ప్ర‌భుత్వం.. దీనిని బిల్లుగా మార్చి.. జాతీయ ఎస్సీ …

Read More »

సిట్ విచారణకు సాయిరెడ్డి… ఏం జరుగుతోంది?

వైసీపీ పాలనలో ఏపీలో భారీ ఎత్తున మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం… విచారణను మరింత వేగవంతం చేసినట్లుగా సమాచారాం. తాజాగా సిట్ విచారణకు వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం హాజరయ్యారు. వాస్తవానికి గురువారమే ఈ విచారణకు రావాల్సిన ఆయన.. గురువారమే విజయవాడకు వచ్చినా కొన్ని కారణాల వల్ల విచారణకు హాజరు కాలేదు. తాజాగా …

Read More »

కూల్ కూల్ గా!… ఏసీలకూ మోదీ సబ్సీడీ స్కీమ్!

దేశంలో సంక్షేమ పథకాలకు కాదేదీ అనర్హం అన్నట్టుగా సాగుతోంది ఎన్డీఏ పాలన. ప్రతి విషయంలోనూ సబ్సీడీలు, ప్రోత్సాహకాలు, రాయితీలు అంటూ సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ… ఇప్పుడు వేసవిలో చల్లబరిచే ఏసీలకూ సరికొత్త సబ్సీడీ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారట. ప్రధాన మంత్రి ఎయిర్ కండీషనర్ యోజన (పీఎం ఏసీ యోజన)గా పరిగణిస్తున్న ఈ పథకానికి ఇంకా తుది రూపు రాలేదు గానీ… కసరత్తు అయితే శరవేగంగానే …

Read More »

కూట‌మి పాల‌న‌కు జ‌గ‌న్ మార్కులు!

Y S Jagan

ఏ పార్టీకైనా.. నాయ‌కుడికైనా నాయ‌కులు ముఖ్య‌మే..వారిని ఊర‌డించాల్సిందే.. బుజ్జ‌గించాల్సిందే.. క‌ష్టంలో ఉంటే.. కాపాడుకోవాల్సిందే. ఏ పార్టీ అయినా చేసేది ఇదే. అయితే.. వీరితోపాటు.. నాయ‌కుల‌కు.. పార్టీలకు కావాల్సింది.. ప్ర‌జ‌లు. వారు ఓటేస్తేనే… ఏ పార్టీ అయినా ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుంటుంది. అధికారం ద‌క్కించుకుంటుంది. ఈ విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌దిమాసాలు పూర్త‌యినా.. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నాయ‌కుల కోసం బ‌య‌ట‌కు వ‌స్తున్న జ‌గ‌న్‌.. …

Read More »

గిరిజ‌న ఓటుపై జ‌న‌సేన క‌స‌ర‌త్తు?

ఏపీలోని గిరిజ‌న ఓటు బ్యాంకుపై కూట‌మి పార్టీల్లో కీల‌క‌మైన జ‌న‌సేన పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోందా? ప్ర‌స్తుతం వైసీపీకి అనుకూలంగా ఉన్న గిరిజ‌న ఓట్ల‌ను త‌మ వైపు తిప్పుకొంటే.. బ‌ల‌మైన ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని కూడా.. భావిస్తోందా? అంటే.. ఔన‌నే అంటు న్నారు ప‌రిశీల‌కులు. 2024 ఎన్నిక‌ల్లో తొలిసారి జ‌న‌సేన ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యం ద‌క్కించుకుంది. ఇది ఊహించ‌ని ప‌రిణామం. అస‌లు ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన …

Read More »

జై కిసాన్ అని సాయం చేసిన జవాన్ లకు జై..వైరల్

‘జై జవాన్..జై కిసాన్’…ఈ నినాదం గురించి తెలియని భారతీయుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. శత్రు దేశాల నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు సరిహద్దుల్లో పగలూ, రాత్రీ పహారా కాస్తున్న సైనికులను మనం జై జవాన్ అంటూ ఎంతో గౌరవిస్తుంటాం. ఇక, లాభం వచ్చినా..నష్టం వచ్చినా…పట్టించుకోకుండా దేశ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తూ పంటలు పండించే రైతులను జై కిసాన్ అని పొగుడుతాం. ఈ క్రమంలోనే జై జవాన్..జై కిసాన్ …

Read More »

హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు భారం.. కారణమిదే..

హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు ఒక ప్రధాన జీవనాడి లాంటిది. రోజూ వేలాది మంది ప్రజలు ఈ రైల్‌ను వినియోగించుకుంటూ, ట్రాఫిక్‌, కాలుష్యం వంటి సమస్యల నుంచి తప్పించుకుంటున్నారు. ముఖ్యంగా వేసవి వేడి మధ్య ఎయిర్ కండిషన్డ్ సౌకర్యాలతో కూడిన మెట్రో ప్రయాణం ఒక వరంగా మారింది. అయితే, ఇదంతా తక్కువ ఖర్చుతో కుదిరిన రోజులే. ఇప్పుడు మాత్రం మెట్రో ఛార్జీలు పెరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరోనా కాలం …

Read More »