తెలంగాణ రాజధాని హైదరాబాద్లో రెండు రోజుల కిందట వరకు.. మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా జరిగాయి. భారీ ఎత్తున నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వానికి ప్రశంసలు దక్కాయి. మొత్తంగా 108 దేశాలకు చెందిన సుందరీమణులు.. ఈ పోటీలో పాల్గొన్నారు. దాదాపు 20 రోజుల పాటు వారు ఇక్కడే ఉన్నారు. ఈ పోటీల ద్వారా తెలంగాణ పర్యాటక ప్రాంతాలను.. రాష్ట్ర ఉన్నతిని ప్రపంచానికి చాటుకునే …
Read More »జగన్ను చూస్తే జాలేస్తోంది : ఆర్ ఆర్ ఆర్
చాలా రోజుల తర్వాత.. మాజీ సీఎం జగన్పై.. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు(ఆర్ ఆర్ ఆర్) స్పందించారు. గతంలో తరచుగా జగన్ను టార్గెట్ చేసిన రఘురామ.. ఇటీవల కాలంలో మౌనంగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా తెనాలి యువకులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడిన ఘటన నేపథ్యంలో ఆ యువకుల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. అయితే.. జగన్ తెనాలి …
Read More »జగన్ ఉగ్రవాదులను కూడా పరామర్శిస్తాడా?: జనసేన కిరణ్ రాయల్
వైసీపీ అధినేత జగన్పై జనసేన నాయకులు విమర్శలు గుప్పించారు. తాజాగా మంగళవారం జగన్.. తెనాలిలో పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్న యువకుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సర్కారు, పోలీసుల తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ ఘటనను ఉద్దేశించి.. జనసేన నాయకుడు, తిరుపతి జిల్లా పార్టీ ఇన్ చార్జి కిరణ్ రాయల్ స్పందించారు. జగన్పైనా, ఆయన వ్యవహార శైలి పైనా తీవ్ర విమర్శలు చేశారు. గత ఏప్రిల్ 22న …
Read More »పాత కేసులు ఉంటే కొట్టేస్తారా : జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాటి తెనాలి పర్యటన నిరసనలతో మొదలు కాగా… ఏ బాధితులను అయితే పరామర్శించడానికి వెళ్లారో…వారికే షాకిచ్చేలా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పిల్లలను తాను వెనకేసుకుని రావడం లేదని ఆయన బహిరంగంగా ప్రకటించి… బాదితుల కుటుంబాలను ఆయన షాక్ కు గురి చేశారు. ఈ పిల్లలు గతంలో తప్పులు చేసి ఉండవచ్చు కూడా అని జగన్ వ్యాఖ్యానించారు. యుక్త వయసులో …
Read More »జగన్ గో బ్యాక్..తెనాలిలో హై టెన్షన్
శాంతి భద్రతలు కాపాడుతూ విధి నిర్వహణలో ఉన్న పోలీసుపై గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు దాడి చేశారు. దీంతో, ఆ యువకులకు బుద్ధి చెప్పేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. నడి రోడ్డుపై ఆ యువకులకు అరికాళ్ల కోటింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో మరే గంజాయి బ్యాచ్ పోలీసులపై చేయి ఎత్తకుండా పనిష్మెంట్ ఇచ్చారు. పోలీసులను కొట్టిన ఆ యువకులకు తగిన శాస్తి జరిగిందని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, …
Read More »పొగరుతో వెళ్లి కరువులో ఇరుక్కున్న పాక్!
జలవనరుల విషయంలో చాలా కాలంగా గా ఓ లబ్ధిదారుగా ఉన్న పాకిస్థాన్ ఇప్పుడు నీటి కొరతతో అల్లాడుతోంది. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం ఇప్పుడు ప్రభావాన్ని చూపిస్తోంది. పొగరుతో నదిలో పారేది రక్తం అంటూ చేసిన కామెంట్స్ కు ప్రతిఫలంగా కరువుతో అల్లాడే పరిస్థితి ఎదురైంది. సింధు జలాల ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరించి, తన హక్కైన నీటిని నిలిపివేసిన భారత్ చర్యలతో పాకిస్థాన్ వ్యవసాయ …
Read More »నందిగంతో సజ్జల ములాఖత్… ఇప్పుడే ఎందుకంటే..?
వైసీపీ అదికారంలో ఉండగా… ఆ పార్టీకి చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఓ రేంజిలో తనదైన హవా సాగించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో పాలుపంచుకున్నవారంతా దాదాపుగా నందిగం అనుచరవర్గమేనని కూడా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయనపై ఇతరత్రా పలు కేసులూ ఉన్నాయి. ఈ క్రమంలో కూటమి సర్కారు అదికారంలోకి రాగానే… పాత కేసుల బూజు దులపగా… నందిగం అరెస్టయ్యారు. ఏకంగా 3 నెలలకు పైగా …
Read More »ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ.. మళ్లీ జైలుకు వంశీ
కేసుల సుడిలో చిక్కుకున్న వైసీీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ సోమవారం సాయంత్రం విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఆసుపత్రి నుంచి ఆయనను పోలీసులు నేరుగా బెజవాడ జిల్లా జైలుకు తరలించారు. అనారోగ్య కారణాలతో వంశీకి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యంతర బెయిల్ ఆసుపత్రిలో చికిత్స వరకే కొనసాగుతుందని, చికిత్స పూర్తి కాగానే …
Read More »జనం వద్ద ఇంకా రూ.2 వేల నోట్లు వున్నాయా
ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న అతి పెద్ద నిర్ణయాల్లో డీమానిటైజేషన్ కూడా ఒకటి. అన్నింటికంటే కూడా ఈ నిర్ణయమే అతి పెద్దదని కూడా చెప్పాలి. ఈ నిర్ణయంతో అప్పటిదాకా ఉన్న రూ.100, రూ.500 నోట్లు రద్దు కాగా…కొత్తగా రూ.2 వేల నోటు అందుబాటులోకి వచ్చింది. అయితే రూ.100, రూ.500 నోట్లను మార్చిన తర్వాత ఆర్బీఐ రూ.2 వేల నోట్లను రద్దు చేసింది. జనం వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను …
Read More »5 కాదు 11.. కేసీఆర్ వ్యూహమేంటీ?
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన వ్యూహాన్ని సడెన్ గా మార్చేశారు. బీఆర్ఎస్ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు, నాణ్యతా ప్రమాణాలపై ఏర్పాటు అయిన జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ ఏకసభ్య కమిషన్ విచారణకు ఈ నెల 5న కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. విచారణకు హాజరు అయ్యేందుకు కేసీఆర్ కూడా సానుకూలంగానే ఉన్నా… ఎందుకనో గానీ సోమవారం ఆయన తన …
Read More »అభివృద్ధిలో తెలంగాణ కంటే ఏపీ అద్భుతం: తెలంగాణ ఎంపీ
తెలుగు నేల విభజన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండా ప్రస్థానం ప్రారంభించిన నవ్యాంధ్రప్రదేశ్.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఇదేదో… ఇప్పుడు ఏపీలో అదికారంలో ఉన్న పార్టీకు చెందిన నేతలో, లేదంటే టీడీపీ అభిమానులో చెబుతున్న మాట కాదు. అభివృద్ధిలో ఏపీతో నిత్యం పోటీ పడుతున్న తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, బీజేపీ నేత, మల్కాజిగిరీ ఎంపీ ఈటెల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో ఏపీ అద్భుతంగా రాణిస్తూ …
Read More »తిరువూరు డ్రామా కు తెరపడింది
ఏపీలో స్థానిక సంస్థల పాలక వర్గాలు వరుసబెట్టి వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలకు షిప్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉన్నా కూడా ఆయా పురపాలికలకు చెందిన మెజారిటీ సభ్యులు వైసీపీని వీడి టీడీపీ, జనసేనల్లో చేరిపోతున్నారు. ఇప్పటికే విశాఖ, తిరుపతి వంటి కీలక నగరపాలక సంస్థలు టీడీపీ వశం కాగా… తాజాగా కృష్ణా జిల్లా పరిధిలోని తిరువూరు నగర పంచాయతీ కూడా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates