Political News

రెడ్ బుక్ వ‌ద‌ల‌: మ‌రోసారి లోకేష్ స్ప‌ష్టం

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం ప‌నిచేస్తోంద‌ని ఆరోపించిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే టీడీపీ యువ‌నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెండు రోజుల‌పాటు తిరుప‌తిలో ప‌ర్య‌ట‌న నిమిత్తం బుధ‌వారం రాత్రి రేణిగుంట విమానాశ్ర‌యం చేరుకున్న ఆయ‌న‌.. కొద్ది సేప‌టికే.. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను పార్టీ నాయ‌కులు …

Read More »

ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు – జగన్

రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు. తాజా పార్టీ పార్లమెంటరీ ఇంచార్జ్‌లతో తాడేపల్లిలో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున బలంగా పోరాడాలని సూచించారు. కొందరు ఇంచార్జ్‌లు పనిచేయడం లేదని పేర్కొన్నారు. వారి జాబితా తన దగ్గర ఉందన్నారు. అయితే ఇప్పుడు వారిపై చర్యలు తీసుకునే ఉద్దేశం, వారిని బెదిరించే ఉద్దేశం తనకు …

Read More »

థ్యాంక్స్ మోదీజీ: మధుసూదన్ భార్య కామాక్షి!

పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ ప్రేరేపిత ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడులు పాక్ వెన్నులో వణుకు పుట్టించాయి. అదే సమయంలో ఉగ్రవాదుల తూటాలకు బలి అయిన అమాయకుల కుటుంబాలు మాత్రం ఈ దాడుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి.  పహల్ గాం …

Read More »

‘ఆప‌రేష‌న్ అభ్యాస్’.. స‌క్సెస్‌!

ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌దాడి అనంత‌రం.. భార‌త్-పాకిస్థాన్ దేశాల మ‌ధ్య త‌లెత్తిన ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితి ఎదురైనా దేశ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండి.. తొలుత త‌మ‌ను తాము కాపాడుకునే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం ‘ఆప‌రేష‌న్ అభ్యాస్‌’ పేరుతో మాక్ డ్రిల్‌ను చేప‌ట్టింది. దేశ‌వ్యాప్తంగా 244 కీల‌క జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్‌ను చేప‌ట్టారు. బుధ‌వారం సాయంత్రం 4-4.40 వ‌ర‌కు నిర్వ‌హించిన మాక్ డ్రిల్‌లో ఆయా రాష్ట్రాల‌ పోలీసులు, అగ్నిమాప‌క శాఖ …

Read More »

జెండాల్లేవ్‌.. అంతా ఒక్క‌టే అజెండా.. భార‌త్‌లో ఫ‌స్ట్ టైమ్!!

భార‌త దేశానికి శ‌త్రుదేశాల‌పై యుద్ధాలు కొత్త‌కాదు.. ఉగ్ర‌వాదుల‌పై దాడులు కూడా కొత్త‌కాదు. కానీ.. అందరినీ ఏకం చేయ‌డంలోనూ.. అంద‌రినీ ఒకే తాటిపై న‌డిపించ‌డంలోనూ.. మాత్రం ఇప్పుడు కొత్త పంథా అనుస‌రించింది. అది కూడా భిన్న‌మైన అంత‌ర్గ‌త రాజ‌కీయాల్లో ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని కేంద్రం ఏక‌త్వాన్ని ద‌క్కించుకుంది. తాజాగా జ‌రిగిన సిందూర్ దాడుల‌పై యావ‌త్ దేశం.. ఏక‌తాటిపై నిలిచింది. ఒక‌ప్పుడు భార‌త్ త‌గిన విధంగా జ‌వాబు ఇచ్చిన‌ప్పుడు.. కాంగ్రెస్ స‌హా.. క‌మ్యూనిస్టుల …

Read More »

మోడీ శ‌భాష్‌: విమర్శ‌లు త‌ట్టుకుని.. విజ‌యం ద‌క్కించుకుని!

ఓర్పు-స‌హ‌నం.. అనేవి ఎంతో క‌ష్టం. ఒక విష‌యం నుంచి.. ప్ర‌జ‌ల ద్వారా మెప్పు పొందాల‌న్నా.. అదేస‌మయంలో వ‌స్తున్న విమ‌ర్శ‌ల నుంచి త‌న‌ను తాను డిఫెండ్ చేసుకోవాల‌న్నా ఓర్పు-స‌హ‌నం అత్యంత కీలకం. ప‌హ‌ల్గామ్‌లో జ‌రిగిన దాడి అనంత‌రం.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. గ‌త నెల 22న జ‌రిగిన దాడి అనంత‌రం.. ఒక‌టి రెండు రోజుల్లోనే భార‌త్ పాక్‌కు బుద్ధి చెప్పాల‌ని.. చెబుతుంద‌ని కూడా అంద‌రూ అనుకున్నారు. …

Read More »

శ్రీల‌క్ష్మిని అలా వ‌దిలేయ‌డం కుద‌ర‌దు

సుమారు 1000 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ప్ర‌కృతి సంప‌ద‌ను దోచుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసులో ప్ర‌ధాన దోషులు.. ఓబులాపురం మైనింగ్ కంపెనీ అధిప‌తి, ఎమ్మెల్యే గాలి జ‌నార్ద‌న్ రెడ్డి, అప్ప‌టి గ‌నుల శాఖ అధికారి, ఆయ‌న బావ‌మ‌రిది.. ఏవీ శ్రీనివాసులు స‌హా ప‌లువురికి సీబీఐ కోర్టు.. ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. వారిని వెంట‌నే జైలుకు కూడా త‌ర‌లించారు. అయితే.. ఇదే కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొని.. గ‌తంలో …

Read More »

ఇది పాక్ ఎవరికీ చెప్పుకోలేని దెబ్బ

దాయాది దేశం పాకిస్థాన్‌కు ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. వాస్త‌వానికి ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత‌.. త‌మ‌పై భార‌త్ క‌త్తి దూస్తుంద‌ని పాక్ అంచ‌నా వేసింది. అయితే.. దీనిని యాగీ చేయాల‌ని.. ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించి.. భార‌త్‌ను ఏకాకిని చేయాల‌ని పాక్ ప‌న్నాగం ప‌న్నింది. ఈ క్ర‌మంలోనే గ‌త కొన్ని రోజులుగా క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు కూడా దిగింది. దీంతో భార‌త్ రెచ్చిపోయి.. పాక్‌పై నేరుగా యుద్ధానికి దిగితే.. దానిని బూచిగా చూపించి.. భార‌త్‌పై …

Read More »

ఆప‌రేష‌న్ సిందూర్‌: ప‌వ‌న్ ఫ‌స్ట్ రియాక్షన్ ఇదే!

జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప‌ర్యాట‌క ప్రాంతం ప‌హ‌ల్గామ్‌పై ఉగ్ర‌మూక‌లు దాడులు చేసి.. కులం అడిగి మ‌రీ హ‌తమార్చిన దారుణాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కేంద్రం .. కొంత ఆల‌స్య‌మైనా ఉగ్ర‌మూక‌ల‌పై బెబ్బులి లా విరుచుకుప‌డింది. పాక్ గడ్డ‌పై ఉన్న ఉగ్రమూక‌ల స్తావ‌రాల‌ను.. వారి ఆన‌వాళ్ల‌ను తునాతున‌క‌లు చేసింది. ‘ఆప‌రేష‌న్ సిందూర్‌’ పేరుతో చేప‌ట్టిన ఈ దాడికి యావ‌త్ భార‌తావ‌నే కాకుండా.. ప్ర‌పంచ దేశాల నుంచి కూడా మ‌న‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఇదిలావుంటే.. …

Read More »

‘సిందూర్’లో ఏం జరిగిందంటే..?

జమ్ము కశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగానే పరిగణించింది. ఉగ్ర దాడి జరిగిన నాటి నుంచి దాడి నేపథ్యం, ఉగ్రవాదులకు అందిన సహకారం, పాక్ నుంచి లభించిన ప్రోత్సాహంపై పక్కా ఆధారాలను సేకరించిన తర్వాత ఏ ఒక్కరూ ఊహించని విధంగా బుధవారం తెల్లవారుజామున పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ తన వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ మేరకు దాడులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని …

Read More »

‘ఆపరేషన్ సిందూర్’.. ఈ పేరే ఎందుకు పెట్టారంటే?

భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని (పీవోకే) ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఈ దాడులు నిర్వహించబడ్డాయి. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది ప్రధాన స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. బహవల్పూర్, మురిడ్కే, సియాల్‌కోట్ వంటి ప్రాంతాలపై గగనతల, భూభాగం నుంచి సమన్విత దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్ లో …

Read More »

జ‌నార్ద‌న్‌రెడ్డి అంత ఈజీగా దొర‌కలేదు: జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధిప‌తి, మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి స‌హా మ‌రికొంద‌రికి తాజాగా నాంప‌ల్లిలోని సీబీఐకోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ క్ర‌మంలో ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా విచారించిన .. నాటి సీబీఐ జాయింట్ డైరెక్ట‌ర్‌.. వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ‌, ఉర‌ఫ్ జేడీ లక్ష్మీనారాయ‌ణ తాజాగా నాటి అనుభ‌వాల‌ను.. కేసు విచార‌ణ‌కు సంబంధించిన కీల‌క విష‌యాల‌ను ఓ మీడియా సంస్థ‌తో పంచుకున్నారు. ఆయ‌న చెప్పిన వివ‌రాల ప్ర‌కారం.. …

Read More »