Political News

సేఫ్ హౌస్ లోకి పారిపోయిన పాక్ ప్రధాని

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మొదలై రెండు రోజులు కూడా ముగియలేదు…అప్పుడే పాకిస్తాన్ తన అపజయాన్ని అంగీకరించే దిశగా సాగుతోంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం తన అధికారిక నివాసాన్ని వదిలి సురక్షిత ప్రాంతానికి తరలిపోయారు. ఇటీవల పహల్ గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ను బుధవారం తెల్లవారుజామున చేపట్టిన సంగతి తెలిసిందే. తొలుత పాక్ భూభాగంలోకి ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా భారత్ …

Read More »

అమరావతి మూలపాడు దశ తిరుగుతుంది

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నవ నగరాలతో నిర్మితం కానున్న సంగతి తెలిసిందే. వీటిలో అత్యధిక ప్రాధాన్యం కలిగిన క్రీడా నగరం (స్పోర్ట్స్ సిటీ) కోసం కూటమి సర్కారు ప్రాథమిక ప్రతిపాదనలు రూపొందించడం, వాటిలో కొన్ని లోటుపాట్లు ఉండగా… వాటిని సరిదిద్దడం, ఆ సరిదిద్దిన ప్రతిపాదనల మేరకు నాలుగు గ్రామాల రైతులు తమ భూములను స్సోర్ట్స్ సిటీ కోసం ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం… ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. …

Read More »

పాక్ దొంగ దారి!… యుద్ధం మొదలైనట్టే!

దాయాదీ దేశాలు భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధం మొదలైపోయిందనే చెప్పాలి. ఈ మేరకు గురువారం యుద్ధం జరుగుతున్న తీరుకు ప్రబల నిదర్శనాలు కనిపించాయి. పహల్ గాం ఉగ్ర దాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలనే భారత్ టార్గెట్ చేసింది. అంతేకాకుండా తాము ఇప్పటిదాకా పాక్ పౌర సమాజాన్ని గానీ, ఆ దేశ సైనిక స్థావరాలను టార్గెట్ చేసి గానీ దాడులే చేయలేదని కూడా …

Read More »

శత్రు దుర్బేధ్యం భారత్… గాల్లోనే పేలిన పాక్ మిస్సైళ్లు

ఓ వైపు పాకిస్తాన్ కుట్రపూరిత వ్యూహాలు, మరోవైపు ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాద దాడులు… వెరసి నిత్యం భారత సరహద్దుల వద్ద కాల్పుల మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నేరుగా భారత్ లోకి చొరబడిపోయి భీకర దాడులకూ పాల్పడుతున్నారు. ఇవన్నీ చూస్తూ కూడా భారత్ ఎందుకంత సహనంతో ఉందని చాలామంది తమను తాము ప్రశ్నించుకుంటూ ఉంటారు. అహింసను నమ్మిన భారత్.. ఓ పరిధిదాకా …

Read More »

ఈ విష‌యం అప్పుడే చెప్పా.. నేత‌ల‌కు జ‌గ‌న్ క్లాస్.. !

వైసీపీ నాయ‌కుల‌పై కేసులు న‌మోదవుతున్నాయి. ఇప్ప‌టికే ప‌దుల సంఖ్య‌లో కేసులు ప‌డ్డాయి. జైలు-బెయిలు అంటూ.. నాయ‌కులు, అప్ప‌ట్లో వైసీపీకి అనుకూలంగా ప‌నిచేశార‌ని చెప్పుకొనే ఐపీఎస్ అధికారులు కూడా కేసులు ఎదుర్కొంటున్నారు. పీఎస్ ఆర్ ఆంజ‌నేయులు ఏకంగా జైలు జీవితం గ‌డుపుతున్నారు. ఇంకా మ‌రికొంద‌రి చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. వారి ప్రొఫైల్‌తో సంబంధం లేకుండా. వైసీపీ హ‌యాంలో చేసిన ప‌నులే శాపంగా ప‌రిణ‌మించాయి. ఇక‌, నాయ‌కుల ప‌రిస్థితి వేరే చెప్పాల్సిన అవ‌స‌రం …

Read More »

ఏపీ లిక్క‌ర్ స్కాం.. ఈడీ ఎంట్రీ..

ఏపీని కుదిపేస్తున్న లిక్క‌ర్ కుంభ‌కోణం వ్య‌వ‌హారంపై ఇప్పుడు కేంద్రం ప‌రిధిలోని ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ దృష్టి పెట్టింది. ఏపీ మ‌ద్యం కుంభ‌కోణంలో ఏం జ‌రిగిందో త‌మ‌కు వివ‌రాలు ఇవ్వాల‌ని లిక్క‌ర్ స్కామ్‌ను విచారిస్తున్న ప్రత్యేక ద‌ర్యాప్తు బృందానికి లేఖ రాసింది. దాదాపు 3200 కోట్ల రూపాయ‌లకు పైగా నిధులు చేతులు మారాయ‌ని.. మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగింద‌ని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం భావిస్తోంది. దీనిలో అనేక మంది పాత్ర ఉంద‌ని, లిక్క‌ర్ …

Read More »

అన్ని పాపాలకు ఒకేసారి సమాధానం!

భారత్ అంటే నరనరాన పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు… ఇప్పటిదాకా భారత్ పై లెక్కలేనన్ని దాడులకు దిగారు. వేల మందిని పొట్టనబెట్టుకున్నారు. వందలాది దాడులకూ తెగబడ్డారు. అయితే ఈ దాడులపై ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తూ వస్తున్న భారత్… వాటన్నింటికీ ఇప్పుడు ఒకేసారి గట్టిగానే బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో పాటుగా దుష్ట పన్నాగాలు పన్నుతున్న పాక్ కు తగిన రీతిలో బుద్ధి చెప్పింది. బుధవారం …

Read More »

ఇంచార్జుల‌కు జాకీలేస్తున్న జ‌గ‌న్‌.. !

వైసీపీ అధినేత జ‌గ‌న్ .. ఇటీవ‌ల పార్టీ పార్ల‌మెంటరీ స్థాయి ఇంచార్జ్‌ల‌ను నియ‌మించారు. ఇది జ‌రిగి దాదాపు వారం అవుతోంది. కీల‌క‌ నాయ‌కులు అనుకున్న‌ వారికి, అదేవిధంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న‌వారికి కూడా ఈ పోస్టులు కేటాయించారు. సాధారణంగా పార్ల‌మెంట‌రీ స్థాయి ఇంచార్జ్ అంటేనే.. పెద్ద ప‌ద‌వితో స‌మానం. పార్టీ స్థాయిలో చూసుకుంటే పార్ల‌మెంటు ఇంచార్జ్‌ల‌కు మంచి విలువ‌తోపాటు.. పార్టీ ప‌రంగా కూడా నాయ‌కుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకునే అవ‌కాశం కూడా …

Read More »

జిల్లాపై ప‌ట్టుకోసం ఎంపీ ఆప‌శోపాలు.. కానీ..!

ఎంపీల‌కు త‌మ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని శాస‌న స‌భ స్థానాల‌ పై ప‌ట్టు ఉండ‌డం వేరు. ఎందుకంటే.. ఎంపీ లాడ్స్ నుంచి నిధుల‌ను ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఖ‌ర్చు చేయ‌డం.. అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు నిధులు వెచ్చించ‌డం వ‌ర‌కు ఓకే. కాబ‌ట్టి శాస‌న స‌భ్యుల‌పైనా.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌పైనా ప‌ట్టు పెంచుకునేందుకు ఎంపీలు ప్ర‌య‌త్నిస్తారు. ఇది త‌ప్పుకాదు. అయితే.. ఒక‌రిద్ద‌రు ఎంపీలు మాత్రం ఏకంగా తాము ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని జిల్లాల‌పైనే ప‌ట్టు …

Read More »

హిట్ ఫార్ములా నే మరో సారి నమ్ముకున్న జగన్

2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగానే సమయం ఉంది. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే తప్పించి… ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు ఏపీకి ముఖ్యమంత్రి కాలేరు. నాలుగేళ్ల సమయం ఉందని రాజకీయ నేతలు అలా ఖాళీగా కూర్చోలేరు కదా. అందుకే కాబోలు…2029 ఎన్నికల్లో విజయం దక్కించుకునే దిశగా ఇప్పుడే వ్యూహాలు రచించుకుంటున్న జగన్ బుధవారం ఓ కీలక ప్రకటన చేశారు. 2029 ఎన్నికల్లో …

Read More »

వైసీపీలో ఒకే ఒక్క ‘కుర్రోడు’ ..!

వైసీపీలో నాయ‌కులు బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఎన్నిక‌లు పూర్త‌యి ఏడాది అయినా పెద్ద‌గా ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. నోరు విప్ప‌డం లేదు. కీల‌క నాయ‌కులు కేసుల్లో చిక్కుకోగా.. కేసులు లేని నాయ‌కులు.. విమ‌ర్శ‌లు చేసేందుకు సాహ‌సించ‌డం లేదు. దీంతో అంతా స్త‌బ్దుగా ఉంది. అయితే.. విజ‌య‌వాడలో మాత్రం ఒకే ఒక్క కుర్రోడు మాత్రం బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తున్నాడు. ఆయ‌నే దేవినేని అవినాష్ చౌద‌రి. విష‌యం ఏదైనా బ‌లంగా వాద‌న …

Read More »

విజయమ్మ లాజిక్ తో జగన్ కు కఫ్టమే

వైైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కన్న తల్లి విజయమ్మ నుంచే భారీ షాక్ రెడీ అయిపోయిందన్న వాాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీకి చెందిన షేర్ల బదలాయింపు వ్యవహారంలో జగన్, విజయమ్మల మధ్య నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ)లో ఓ భారీ యుద్ధమే జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై బుధవారం ఇరు వర్గాల తరఫు …

Read More »