గుండెపోటు కారణంగా మూడు రోజుల పాటు జీవన పోరాటం చేసిన బీఆర్ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాగంటికి నివాళి అర్పించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మాగంటి ఇంటికి వచ్చారు. ఈ సందర్బంగా మాగంటి పార్థీవ దేహాన్ని చూసినంతనే కేసీఆర్ కన్నీటిపర్యంతం అయ్యారు. భావోద్వేగంతో కేసీఆర్ కన్నీరు పెట్టుకుని ఏడ్చేశారు. ఆ తర్వాత కాస్తంత …
Read More »మట్టిని కూడా వదల్లేదా.. వైసీపీ నేతలపై నివేదికలు..!
వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై ప్రభుత్వం ఇంకా నివేదికలు తెప్పించుకుంటూనే ఉంది. గత జగన్ పాలనలో జరిగిన మద్యం, ఇసుక అక్రమాలపై విచారణలు జరుగుతున్నాయి. అయితే.. ఇప్పుడు ఇసుక లభ్యత లేని సీమలోని పలు జిల్లాల్లో మట్టి అక్రమాలపై విచారణ చేయించేందుకు ప్రభు త్వం రెడీ అయింది. మట్టిని కూడా వదలకుండా గత వైసీపీ నాయకులు, మంత్రులు దోచుకున్నారన్నది సర్కారుకు వచ్చిన ఫిర్యాదులను బట్టి తెలుస్తోంది. వీటిపైనే ఇప్పుడు …
Read More »ఈ కనువిప్పు జోగిదేనా?, జగన్ ది కూడానా?
ఓ మనిషి ఏదైనా తప్పు చేసినప్పుడు అది తప్పని తెలియాలంటే… ఏదో పెద్ద జరగరాని ఘటన జరిగితే తప్ప కనువిప్పు కలగదు. ఇప్పుడు ఏపీలోని విపక్షం వైసీపీలోనూ అదే తరహా మార్పు కనిపిస్తోంది. అధికారంలో ఉన్నంత కాలం రాజధాని అమరావతి కాదని, మూడు రాజధానులు అని కదం తొక్కిన జగన్ అండ్ కో… విశాఖను రాజధానిగా చేసి అమరావతి కలను కూల్చాలని యత్నించారు. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జనం …
Read More »ఇంటా-బయటా.. చంద్రబాబుకు సవాళ్లు!
ఏపీ సీఎం చంద్రబాబుకు ఇంటా-బయటా కూడా.. ప్రధాన సవాళ్లు ఎదురవుతున్నాయి. గతంలో టీడీపీలో పనిచేసి.. ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటున్న ఒకరిద్దరు సీనియర్ నాయకులు రాజధాని అమరావతికివ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమమే లేవదీ స్తున్నారు. వయసు రీత్యా వృద్ధులే అయినా.. మాటల పరంగా వారు చేస్తున్న ప్రచారం.. అమరావతికి శరాఘాతంగా మారు తోంది. ఉదాహరణకు మాజీ మంత్రి, టీడీపీ మాజీ నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు.. అమరావతి రాజధానికి వ్యతిరేకంగా …
Read More »ప్రజలకు చేరువ.. ఈ ఎమ్మెల్యేలు సూపర్.. !
కూటమి ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేల చొరవ అద్భుతః అని అనిపిస్తోంది. ఇది ఎవరో వారంటే ఇష్టమైనవారు.. వారికి అనుచరులుగా ఉన్న వారు చెబుతున్న మాట కాదు. అచ్చంగా జనాల నుంచే ఈ మాట వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు వస్తుంటే.. హారతులు పట్టే పరిస్థితి మరోసారి ఏపీలో కనిపిస్తోంది. ఇది ఒకప్పటి సంప్రదాయం. ఎమ్మెల్యేలు తమకు మేలు చేశారని భావిస్తే.. ప్రజలు వారిని ఎలా నెత్తిన పెట్టుకుంటారన్నది గతంలో ఎప్పుడో జరిగింది. ఇప్పుడు …
Read More »చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. తమ్ముళ్లూ విన్నారా?
టీడీపీ అధినేత, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి గతంలో ఎప్పుడూ ఇవ్వని వార్నింగ్ ఇచ్చారు. బహుశ ఆయన పార్టీ పగ్గాలు చేపట్టిన మూడు దశాబ్దాల కాలంలో ఎప్పుడూ కూడా ఇలా ఇంత సీరియస్ అయి ఉండరు. కానీ.. ఇప్పుడు సమయం వచ్చిందని భావిస్తున్నట్టు ఉన్నారు. అందుకే.. పార్టీలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తామని చెప్పిన బాబు.. దీనిని కట్టు తప్పిన వారు ఎంతటి వారైనా పార్టీ …
Read More »నేడే కేబినెట్ విస్తరణ… ఆ ముగ్గురు ఎవరంటే?
అదుగో, ఇదుగో అంటూ దాదాపుగా అరు నెలల నుంచి ఊరిస్తూ వస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ఆదివారం ముహూర్తం కుదిరింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.20 గంటల మధ్య రాజ్ భవన్ లో జరగనున్న కేబినెట్ విస్తరణలో కొత్తగా ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వీరిలో పార్టీపై గట్టి పట్టున్న జి.వివేక్ (మాల)తో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (మాదిగ), వి.శ్రీహరి ముదిరాజ్ (బీసీ)లు ఉన్నారు. …
Read More »బ్రేకింగ్… జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మృతి
తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీకి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు సాధించిన బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ (62) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత గురువారం మధ్యాహ్నం తర్వాత ఇంటిలో గుండెపోటు కారణంగా కింద పడిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటీన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన మూడు రోజులపాటు మృత్యువుతో పోరాటం చేశారు. అయితే ఈ పోరులో ఓడిన గోపీనాథ్ ఆదివారం తెల్లవారుజామున 5.45 …
Read More »ఇక టీడీపీలోకి ఎంట్రీ అంత వీజీ కాదు!
మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీకి చెందిన కీలక నేతలు చాలా మంది ఆ పార్టీని వీడారు. వారిలో మోపిదేవి వెంకటరమణ లాంటి వారు టీడీపీలో చేరితే… బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వారు జనసేనలో చేరారు. ఇక ఆర్ కృష్ణయ్య లాంటి వారు బీజేపీలో చేరారు. ఇలాంటి చేరికల్లో జనసేనలోకే అధికంగా జరిగాయి. టీడీపీలోకి మాత్రం వేళ్లమీద లెక్క పెట్టేంత మందికి మాత్రమే ఎంట్రీ లభించింది. బీజేపీలోకీ అంతే. ఇతర పార్టీల పరిస్థితి …
Read More »బీజేపీకి బనకచర్ల సెగ.. !
తెలంగాణ బీజేపీకి-ఏపీలోని కర్నూలు జిల్లాలో చంద్రబాబు ప్రభుత్వం నిర్మించాలని భావిస్తున్న ‘బనకచర్ల’ ప్రాజెక్టుకు మధ్య రాజకీయ దుమారం రేగుతోంది. ఏపీలో కూటమి సర్కారు ఉన్న విషయం తెలిసిందే. బీజేపీ-టీడీపీ-జనసేన కలసి కట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దీంతో ఏపీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితిలో తెలంగాణ బీజేపీ నాయకులు ఉన్నారు. అంతేకాదు.. ఇటీవల ఈటల రాజేందర్ కూడా.. ఏపీలో ప్రభుత్వం బాగుందని కితాబు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీలో …
Read More »`సంతృప్తి`.. మళ్లీ పెరిగింది.. ఈసారి ఎంతంటే.. !
చంద్రబాబు పాలనలో సంతృప్తి కొలమానాలు సహజం. ఎప్పటికప్పుడు.. ప్రభుత్వం అందిస్తున్న పాలన పై ఆయన లెక్కలు వేసుకుని గణాంకాలతో సహా ప్రజలకు వివరించడం రివాజు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 11 మాసాల్లో 10కి పైగా సర్వేలు చేయించారు. వీటిలో ఆయా పథకాలు.. ప్రభుత్వ పాలన, ఎమ్మెల్యేల పనితీరు, మంత్రుల రికార్డు, సీఎంగా చంద్రబాబు పనితీరు.. ఇలా అనేకం ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎక్కడా లేని …
Read More »నిజమే సారూ.. మరి జనంలోకి రావొచ్చుగా!
రాష్ట్రంలో శాంతి భద్రతలసమస్య కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని.. పోలీసులను వినియోగించుకుని రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు. తాజాగా సోషల్ మీడియా ఎక్స్లో ఆయన సుదీర్ఘ పోస్టు చేశారు. దీనిలో అనేక విషయాలు వెల్లడించారు. జిల్లాల వారీగా గత వారంలో జరిగిన అన్ని విషయాలను పేర్కొన్నారు. ఒక వైసీపీ నాయకుడిని గంజాయి పేరుతో వేధించారని.. 2లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారని జగన్ పేర్కొన్నారు. అయితే.. ఆ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates