టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్పై ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు కీలక నేతలు స్పందించిన సంగతి తెలిసిందే. చాలామంది చంద్రబాబు అరెస్టు చేసిన తీరును ఖండించారు. మరికొందరైతే, మోడీ అండతోనే జగన్..చంద్రబాబును అరెస్టు చేయించారని కూడా ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్, మోడీలతోపాటు సీఎం …
Read More »మహిళా రిజర్వేషన్ బిల్లు..సోనియా క్రెడిట్ మోడీ కొట్టేశారా?
వినాయక చవితి సందర్భంగా నూతన పార్లమెంటు భవనంలో తొలిసారిగా సభలను ఈ రోజు నుండి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ అమృత ఘడియల్లో కొత్త పార్లమెంటులోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. కొత్త పార్లమెంటులోకి అడుగుపెట్టబోయే ముందు పార్లమెంటు సభ్యులంతా చివరిసారిగా పాత పార్లమెంటులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలనుద్దేశించి పాత పార్లమెంటు సెంట్రల్ హాల్లో మోడీ ప్రసంగించారు. కొత్త పార్లమెంటు భవనంలోకి మారుతున్నప్పటికీ పార్లమెంటు పాత …
Read More »జనసేనకు ‘గ్లాసే’.. ఎన్నికల సంఘం ప్రకటన
జనసేన పార్టీ ఎన్నికల గుర్తుగా గ్లాసునే కేటాయిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. కొన్ని నెలల కిందట దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఉన్న ఓట్లను.. సీట్లను.. గుర్తింపు వంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకుని కేంద్ర ఎన్నికల సంఘం ఆయా పార్టీలగుర్తులను రద్దు చేసింది. ఇలా.. జనసేన కూడా అప్పట్లో తనకు ఉన్న గ్లాస్ గుర్తును కోల్పోయింది. దీంతో అప్పట్లో రాజకీయంగా జనసేనపై ఏపీ అధికార పార్టీ వైసీపీ …
Read More »చంద్రబాబుకు దక్కని ఊరట..బెయిల్ వాయిదా
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వ్యవహారంలో అరెస్టయి రాజమండ్రి జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు రిమాండ్ రిపోర్టు, ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని, అమరావతి రింగ్ రోడ్డు కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించలేదు. అమరావతి ఇన్నర్ …
Read More »చంద్రబాబుకు బండ్ల గణేష్ బాసట
టిడిపి అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ, ప్రతిపక్ష నేతలతో పాటు జాతీయస్థాయి నేతలు, ఐటీ ఉద్యోగులు, టిడిపి ఎన్నారై నేతలు నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రముఖ నిర్మాత ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావుతోపాటు పలువురు సినీ ప్రముఖులు …
Read More »మూడు సీట్లపై జనసేన కన్నేసిందా ?
రాబోయే ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో ఎన్నికలకు వెళ్ళబోతున్న జనసేన పెద్ద ప్లానులోనే ఉన్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పట్టుదలగా ఉందట. రాజంపేట, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లోని నేతలు మహా ఉత్సాహంగా ఉన్నారట పోటీ విషయంలో. పార్టీ తరపున అంతర్గతంగా కూడా నేతలు, క్యాడర్ సమావేశాలు పెట్టుకుని తమ పార్టీనే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతోందని చెప్పేసుకుంటున్నారు. మామూలుగా అయితే జనసేన గెలుపు కష్టమని …
Read More »ఏపీలో ఉత్కంఠ.. బాబుకు బెయిల్ వచ్చేనా? ఏం జరుగుతుంది?
ఏపీలో నరాలు తెగే ఉత్కంఠ భరిత వాతావరణం కొనసాగుతోంది. ఇటు రాజకీయ నాయకులే కాదు.. అటు సాధారణ పౌరులు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుంది? టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? రాదా? అని అన్ని వర్గాలు ఎదురు చూస్తున్నాయి. చంద్రబాబు బెయిల్పై ఈ రోజు(మంగళవారం) ఒకే సారి రెండు కోర్టుల్లో విచారణ జరగనుంది. చంద్రబాబు బెయిల్ కోరుతూ.. ఇటు ఏసీబీ కోర్టులో, అటు హైకోర్టులో …
Read More »కాంగ్రెస్ గ్యారంటీలకు కౌంటర్… డైరెక్టుగా రంగంలోకి మోడీ
తెలంగాణలో ఎన్నికల రాజకీయం హీటెక్కిన సంగతి తెలిసిందే. ఓవైపు సంక్షేమ-అభివృద్ధి పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనధికార ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో అలర్టయిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో హైదరాబాద్లో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించి, అనంతరం తుక్కుగూడలో విజయ భేరి పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆరు హామీలను ప్రకటించింది. 6 గ్యారెంటీలు, డిక్లరేషన్లతో తెలంగాణలో విజయం సాధిస్తామని కాంగ్రెస్ నేతల్లో ధీమా వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో …
Read More »ఏపీకి అన్యాయం జరిగింది.. తెలంగాణలో రక్తం పారింది: మోడీ
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తొలిరోజు.. లోక్సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. సుమారు 42 నిమిషాల పాటు ఆయన 75 ఏళ్ల పార్లమెంటు ప్రస్థానంపై చర్చను ప్రారంభించి ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన కీలకమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కూడా ఈ పార్లమెంటు భవనంలోనే జరిగిందన్న ప్రధాని.. అయితే, శాస్త్రీయంగా ఈ విభజన జరగలేదని విమర్శలు గుప్పించారు. “తెలంగాణ …
Read More »చారిత్రక నిర్ణయాలు తప్పవు: మోడీ
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలే ఉంటాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని ఈ రోజు ఉదయం పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. జీ-20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ భవిష్యత్తుకు భారత్ ఆశాకిరణంగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. పార్లమెంటు …
Read More »జగన్కు చంద్రబాబుకు సాపత్యమా ధర్మాన సార్?!
ఏపీ అధికార పార్టీ వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. చంద్రబాబు అరెస్టు, జైలులో పెట్టడం పట్ల ఆసేతు హిమాచలం ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మహిళలు, వృద్ధులు కూడా రోడ్లమీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు, ఎన్నారైలు.. రిలే నిరాహార దీక్షలు చేస్తూ..చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ విషయంపై మౌనంగా ఉండాల్సిన మంత్రి ధర్మాన.. …
Read More »అందరి చూపూ బ్రాహ్మణి పైనే
అనుకోని అతిథులు కామనే. మన జీవితాల్లోనూ ఎంతో మంది అనుకోకుండా తటస్థ పడడం, వారితో మనకు సాన్నిహిత్యం ఏర్పడడం తెలిసిందే. అయితే, రాజకీయాల్లోనూ ఇలాంటి సందర్భాలు ఉంటాయా? ఇలా కూడా జరుగుతుందా? అంటే.. జరుగుతుందనే అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఏపీ టీడీపీకి అనుకోని అతిథి పరిచయం అయ్యారు. ఇలా అనుకోని అతిథి వస్తారని కానీ, పార్టీకి కీలకంగా మారతారని కానీ.. ఎవరూ ఊహించలేదు. కానీ, ఇప్పుడు అందరి చూపూ అనుకోని …
Read More »