Political News

సీఎం రేవంత్ రెడ్డి వాహ‌నాల‌కు 75 వేల రూపాయ‌ల‌ ఫైన్లు!

అదేంటి? అనుకుంటున్నారా? నిజ‌మే. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించ‌క‌పోతే.. హైద‌రాబాద్ పోలీసులు ఎవ‌ర‌నే విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి చెలాన్లు విధిస్తున్నారు. ఈ విష‌యాన్ని గ‌తంలో సీఎం రేవంత్ రెడ్డే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ప్ర‌జ‌ల‌కు ట్రాఫిక్ ప‌ట్ల అవ‌గాహ‌న ఉండాల‌న్న ఆయ‌న‌.. ఎవ‌రు త‌ప్పుచేసినా.. జ‌రిమానాలు చెల్లించాల్సిందేన‌ని వ్యాఖ్యానించారు. చివ‌ర‌కు త‌ను త‌ప్పు చేసినా పోలీసులు ఆలోచ‌న చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. బ‌హుశ‌.. ఈ విష‌యం దృష్టిలో పెట్టుకున్నారో.. ఏమో.. ట్రాఫిక్ …

Read More »

బాబు స‌వాల్‌కు వైసీపీ స్పంద‌న.. ఏమ‌న్నారంటే!

ఏపీ సీఎం చంద్ర‌బాబు సోమ‌వారం రాజంపేట‌లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌తిప‌క్ష‌(ప్ర‌ధాన కాదు) పార్టీ వైసీపీ అధినేత‌ను ఉద్దేశించి గ‌ట్టి స‌వాలే రువ్వారు. ద‌మ్ముంటే అసెంబ్లీ స‌మావేశాల‌కు రావాల‌ని.. ఏ విష‌యంపైనైనా చ‌ర్చించేందుకు తాము ‘సిద్ధం’గా ఉన్నామ‌ని.. చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్‌, ఆయ‌న నాయ‌కులు సిద్ధం – సిద్ధం అంటూ.. చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించారు. “అప్ప‌ట్లో సిద్ధం అన్నారుగా.. ఇప్పుడు సిద్ధ‌మేనా? …

Read More »

‘మీరంతా స‌క్రంగా ప‌నిచేసి ఉంటే.. మ‌న ప్ర‌భుత్వం ఉండేది క‌దా!’: జ‌గ‌న్‌

వైసీపీ అధినేత జ‌గ‌న్.. సీఎం చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “చంద్ర‌బాబుకు ఆ ధైర్యం లేదు” అంటూ వ్యాఖ్యానించారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని ఇడుపుల‌పాయ‌లో ఆయ‌న స‌మాధి వ‌ద్ద నివాళుల‌ర్పించిన అనంతరం.. సాయంత్రం స్థానిక ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు.ప‌లువురి నుంచి విన‌తి ప‌త్రాలు తీసుకున్నారు. అదేవిధంగా ప‌లువురు చిన్నారుల‌కు.. కొద్దిపాటి ఆర్థిక సాయం అందించారు. అనంత‌రం.. పార్టీ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు ప‌లు విష‌యాల‌పై …

Read More »

‘గ‌ణ‌ప‌తి బ‌ప్పా’ వ‌ర్సెస్‌ వైసీపీ ‘ర‌ప్పా-ర‌ప్పా’!

‘పుష్ప-2’ సినిమాలో ‘ర‌ప్పా-ర‌ప్పా న‌ర‌కుతా!’ అనే డైలాగు.. సినిమాకు సంబంధించి ఎంత ఫేమ‌స్ అయిందో తెలియ‌దు కానీ.. వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.. ఈ డైలాగును అందిపుచ్చుకున్న త‌ర్వాత‌.. ర‌ప్పా-ర‌ప్పా డైలాగుకు హ‌ద్దులు లేకుండా పోయాయి. తెలంగాణ నుంచి మ‌హారాష్ట్ర‌(ఇటీవ‌ల ఓ పార్టీ నాయ‌కులు ర‌ప్పా ర‌ప్పా వ్యాఖ్య‌లు చేశారు)వ‌ర‌కు ర‌ప్పా-ర‌ప్పా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ప్ర‌త్య‌ర్థుల రాజ‌కీయాల‌ను ప్ర‌స్తావిస్తూ.. వారిని ఉద్దేశించి ఈ హెచ్చ‌రిక‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ …

Read More »

మోడి చెప్పిన ‘డిజిటల్ డైమండ్’ కథ ఏంటి?

భారత్‌ నుంచి మరో విప్లవాత్మక ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన 32-బిట్‌ మైక్రోప్రాసెసర్‌ ‘విక్రమ్‌ 3201’ను తాజాగా ఆవిష్కరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని “డిజిటల్‌ డైమండ్‌”గా అభివర్ణించారు. “గత శతాబ్దం ఆయిల్‌ ఆధారంగా నడిచిందంటే.. ఈ శతాబ్దం చిప్‌లపై ఆధారపడి ఉంటుంది” అని ఆయన పేర్కొనడం ఈ ఆవిష్కరణ ప్రాధాన్యాన్ని మరింతగా చాటిచెప్పింది. ‘విక్రమ్‌ 3201’ అనేది …

Read More »

మొక్కై వ‌చ్చి మానై ఎదిగి.. ప‌వ‌న్‌కు విషెస్ వెల్లువ‌!

ఏపీ డిప్యూటీ సీఎం , జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజును పురస్క‌రించుకుని.. ఆశేతు హిమాచలం.. ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు చెబుతోంది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నుంచి ఏపీ సీఎం చంద్ర‌బాబు వ‌ర‌కు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. ఒక్కొక్క‌రు ఒక్కొక్క విధంగా స్పందించారు. ఎవ‌రెలా స్పందించిన‌ప్ప‌టికీ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జాసేవ‌ల‌ను వారు కొనియాడారు. మొక్కై వ‌చ్చి.. మానై ఎదిగారంటూ.. విషెస్‌ను కుమ్మ‌రించారు. ప్ర‌ధాని ఏమ‌న్నారు? ప్ర‌ధాన మంత్రి …

Read More »

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం: సీబీఐకి సుగాలి ప్రీతి కేసు

2017లో సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కర్నూలులోని హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ కు ప్రీతి ఉరి వేసుకుని మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ ముందుకు సాగలేదు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రీతి కేసు విచారణ వేగవంతం చేసి బాధితులకు న్యాయం …

Read More »

ముందే వేడెక్కించేసిన చంద్ర‌బాబు.. !

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. అసెంబ్లీ స‌మావేశాల‌ను ముందే వేడెక్కించేశారు. ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ స‌మావేశాల‌కు రావాల‌ని .. వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను అసెంబ్లీ స్పీక‌ర్ .. అయ్య‌న్న పాత్రుడు ఇప్ప‌టికే ఆహ్వానించారు. అయితే.. జ‌గ‌న్ వ‌స్తారా? రారా ? అనేది ఇప్ప‌టికీ స‌స్పెన్ష‌న్‌లోనే ఉంది. ఇదిలావుంటే.. ఈ స‌మావేశాల‌కు సంబంధించి… చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీశాయి. …

Read More »

వైఎస్ వార‌సురాలిగా.. ష‌ర్మిల‌కు ఎన్ని మార్కులు.. ?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల గురించి కొన్ని ప్రధాన పత్రికల్లో తాజాగా పతాక శీర్షిక వార్తలు వచ్చాయి. వైఎస్‌ వారసురాలిగా ఆమె ఏ మేరకు మార్కులు వేసుకున్నారు.. ఏ మేరకు పార్టీని పుంజుకునేలా చేశారు.. ప్రజల ఏమనుకుంటున్నారు.. అనే మూడు విషయాలపై మీడియా ప్రధానంగా దృష్టి సారించింది. ఇది ఒక మీడియాలోనే కాదు పార్టీలోనూ కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలకు పిసిసి చీఫ్ …

Read More »

అలా ఐతే సీబీఐ విచార‌ణ వ‌ద్దు: హైకోర్టు సంచ‌ల‌న ఆదేశం

తెలంగాణ ప్ర‌భుత్వానికి గ‌ట్టి షాక్ త‌గిలింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ఆరోపిస్తూ.. నియ‌మించిన పీసీ ఘోష్ క‌మిష‌న్ ఇచ్చిన నివేదిక రాష్ట్రంలో రాజ‌కీయ దుమారం రేపుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సద‌రు క‌మిష‌న్‌పై ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ నిప్పులు చెరుగుతోంది . దీనిని పీసీ ఘోష్ క‌మిష‌న్ కాద‌ని.. ఇది పీసీసీ క‌మిష‌న్ అని వ్యాఖ్యానిస్తోంది. ఈ క్రమంలోనే స‌ద‌రు క‌మి ష‌న్‌ను ర‌ద్దు చేశాయాల‌ని …

Read More »

జగన్ తల్లి ‘జట్టు’ మార్చేశారా?

సెప్టెంబర్ 2 అంటే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం గుర్తుకు వస్తుంది. హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోయారు. ఈ ఘటన జరిగి 16 ఏళ్లు అవుతోంది. తమ సొంత ఎస్టేట్ ఇడుపులపాయలో తండ్రికి సమాధి కట్టుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏటా వైఎస్ వర్థంతి, జయంతి సందర్భంగా అక్కడకు వెళ్లి తండ్రికి నివాళి అర్పిస్తుంటారు. మంగళవారం కూడా అదే …

Read More »

బ్రేకింగ్: ఎమ్మెల్సీ కవితపై వేటు

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయురాలు ఎమ్మెల్సీ కవిత కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీపై, కొందరు బీఆర్ఎస్ నాయకులపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్, కృష్ణారెడ్డిలపై కవిత చేసిన వ్యాఖ్యలతో ఆ విమర్శలు తార స్థాయికి చేరాయి ఈ నేపథ్యంలోనే తాజాగా కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా బీఆర్ఎస్ అధిష్టానం …

Read More »