వైసీపీ కీలక నాయకుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని వైసీపీ మద్యం కుంభకోణాన్ని విచారి స్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు అరెస్టు చేసేందుకు ఆగమేఘాలపై నిర్ణయాలు తీసు కుంటున్నారు. ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టుల్లో మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు రద్దయిపోవడంతో.. మరో సారి ఆయన తప్పించుకోకుండా.. చూసేలా సిట్ అధికారులు స్థానిక కోర్టులో అరెస్టుపై వారెంట్ జారీ కోసం.. మెమో దాఖలు …
Read More »ఈటెలను వెన్నుపోటు పొడిచిన సొంత పార్టీ వాళ్లు ఎవరబ్బా?
తనను సొంత పార్టీ వాళ్లే వెన్నుపోటు పొడిచారని.. బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తాజాగా ఆయన పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో గత 2023 ఎన్నికల్లో జరిగిన పరిణామాలు సహా.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను కూడా వివరించారు. ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు.. ఆయనకు మధ్య వివాదాలు ముసురుకున్న విషయం తెలిసిందే. హుజూరాబాద్లో ఈటలకు చెక్ పెట్టే విధంగా మంత్రి వ్యవహరిస్తున్నారన్న …
Read More »జగన్ చుట్టూ అష్టదిగ్బంధనం?
వైసీపీ అధినేత జగన్ అరెస్టుపై కొన్నాళ్లుగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయనను తప్పకుండా అరెస్టు చేస్తారని.. రేపో మాపో.. అన్నట్టుగా ఉందని కొన్నాళ్లు.. కాదు.. ఈ వారం, ఈ నెలలోనే అరెస్టు చేస్తారని.. టీడీపీ అనుకూల మీడియాల్లోనూ కథనాలు వచ్చాయి. కానీ.. నెలలు జరుగు తున్నా.. జగన్ అరెస్టుపై మాత్రం ఎలాంటి ప్రకటనా రావడం లేదు. ఎక్కడా దానికి సంబంధించిన దూకు డు నిర్ణయం కూడా …
Read More »‘జగన్ అడ్డంగా దొరికాడు.. వదిలేది లేదు’
ఏపీ సీఎం చంద్రబాబు.. వైసీపీ అధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఆయన స్పందించారు. పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు వైసీపీ మద్యం కుంభకోణం.. ఈ కేసును విచారి స్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం పనితీరు, వారు చేస్తున్న అరెస్టులు వంటివాటిని ప్రస్తావించారు. ఈ కేసు దాదాపు కొలిక్కి వచ్చిందని చెప్పారు. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు …
Read More »పిఠాపురంలో వైసీపీ ఉన్నట్టా.. లేనట్టా… ?
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యర్థి పక్షం అంటూ లేకుండా పోయిందా? ముఖ్యంగా వైసీపీ తరఫున వాయిస్ వినిపించడం లేదా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గతంలో వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న పెండెం దొరబాబు.. నేరుగా జనసేనలోనే చేరిపోయారు. ఇది వైసీపీని ఏమీ చేయదని మొదట్లో అనుకున్నా.. ఆయన వర్గం, ఆయన అనుచరులు ఇప్పుడు గుండుగుత్తగా.. జనసేన వైపే ఉన్నారు. …
Read More »సినిమా డైలాగులతో రాజకీయాలు చేయలేరు
రాజకీయాల్లో ఓర్పు.. నేర్పు చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రత్యర్థులు పన్నే వలకు చిక్కకుండా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం కూడా నాయకులకు ఉంటుంది. ఈ విషయంలో ఏ చిన్న తేడా జరిగినా .. ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు వైసీపీ నాయకుల పరిస్థితి.. ప్రత్యర్థి బుట్టలో పడినట్టు కనిపిస్తోంది. సాధారణంగా.. ఎవరు అధికారంలో ఉంటే.. వారు ప్రత్యర్థులను రెచ్చగొట్టడం అనేది కామన్. ఇది దేశవ్యా ప్తంగా అందరికీ తెలిసిందే. వైసీపీ అధికారంలో …
Read More »చంద్రబాబూ మీరు విజ్ఞులు.. ఇలా చేయొచ్చా?: సీఎం రేవంత్
ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముఖ్యంగా పాల మూరులో కీలకమైన ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇలా అడ్డుకోవడం ధర్మం కాదన్నారు. “చంద్రబాబూ మీరు విజ్ఞులు.. ఇలాచేయొచ్చా?“ అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో చంద్రబాబు ప్రారంభించిన కల్వకుర్తి ప్రాజెక్టు అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంశాన్నికూడా లేవనెత్తారు. …
Read More »పార్లమెంటులో బనకచర్లపై గళం: చంద్రబాబు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు..సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈనేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కారుకు మద్దతు ఇస్తున్న టీడీపీ.. వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించింది. తాజాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్.. సహా ఇతర పార్టీ ఎంపీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేవారు. కేంద్రం నుంచి రావాల్సిన …
Read More »‘2034 వరకు పాలమూరు బిడ్డే సీఎం’
తెలంగాణ ముఖ్యమంత్రిగా 2034 వరకు పాలమూరు బిడ్డే ఉంటాడని.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాలమూరు నుంచి ఎన్నికైన కేసీఆర్.. ఈ గడ్డకు ఏం చేశారో చెప్పాలని బీఆర్ఎస్ అధినేతను ఆయన నిలదీశారు. కరీంనగర్ నుంచి వచ్చి.. పాలమూరు నుంచి నిలబడితే..ఇక్కడి ప్రజలు కేసీఆర్ను అక్కున చేర్చుకున్నారని..కానీ, ఆయన ఇక్కడి వారిని గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. పాలమూరులో శ్రీశైలం ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేశారా? అని ప్రశ్నించారు. వారికి …
Read More »చెప్పి ఒప్పిద్దాం.. అమరావతిపై బాబు డెసిషన్
ఏపీ రాజధాని అమరావతిని జాతీయ స్థాయిలో కాకుండా.. అంతర్జాతీయ స్థాయికి విస్తరించాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. నిన్న మొన్నటి వరకు ఉన్న ప్లాన్ వేరైతే.. ఇప్పుడు దానిని హైలెవిల్కు తీసుకు వెళ్లారు. ఐటీ, ఏఐ, క్వాంటమ్ వ్యాలీ సహా.. అనేక రంగాలకు.. అమరావతిని హబ్గా మార్చాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పం. ఈ క్రమంలోనే.. ఇప్పటికే తీసుకున్న 34 వేల ఎకరాలకు అనుబంధంగా మరో 44 వేల ఎకరాలను సమీకరించేందుకు(పూలింగ్) సిద్ధమయ్యారు. …
Read More »తమ్ముళ్లు దారి తప్పుతప్పున్నారు.. బాబు సర్!
ఒక పార్టీలో ఏ ఒక్క నేత దారి తప్పినా.. అది పార్టీకి, ఆ పార్టీ అధినేత మెడకు చుట్టుకుంటుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ వైసీపీనే. రప్పా.. రప్పా.. అంటూ.. కార్యకర్తలు హోర్డింగులు ఏర్పాటు చేశారు. కానీ, విమర్శలు మాత్రం జగన్ కే వచ్చాయి. అయితే.. దౌర్భాగ్యం ఏంటంటే.. వాటిని ఆయన కూడా సమర్ధించుకున్నారు. ఇక, చేసేది ఏముంది..? జగన్ కూడా రప్పా రప్పా బ్యాచ్లో చేరిపోయారు. అంతో ఇంతో ఉన్న …
Read More »కేసీఆర్ జగన్తో కలిసిస్తే తప్పు లేదు కానీ
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్పై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకు డు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ అపరిచితుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్టు(ఇంకా రూపు దిద్దుకోలేదు) సహా ఇతర నదీ జలాల విషయం వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఏ రాష్ట్రానికీ అనుకూలంగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates