Political News

చంద్రబాబును ఫాలో కావాలన్న మోదీ

ఏపీ సీఎంగా చంద్రబాబు, భారత ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసింది మొదలు వికసిత్ భారత్-2047 కోసం నిర్విరామంగా శ్రమిస్తోన్న సంగతి తెలిసిందే. రాబోయే రెండు దశాబ్దాల కాలంలో సాధించవలసిన ప్రగతి, అందుకు సంబంధించి ఇప్పటి నుంచే రూపొందించాల్సినా కార్యచరణపై ఈ ఇద్దరు నేతలు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే వికసిత్ ఆంధ్ర, వికసిత్ భారత్ కోసం సీఎం చంద్రబాబు ఓ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో ప్రతి …

Read More »

చెల్లి లేఖ‌పై కేటీఆర్ రియాక్షేన్‌

బీఆర్ ఎస్ పార్టీ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌కు ఆయ‌న కుమార్తె, ఎమ్మెల్సీ క‌విత రాసిన సంచ‌ల‌న లేఖ‌.. రాజ‌కీయ వ‌ర్గాల్లో దుమారం రేపింది. ఇక‌, బీఆర్ ఎస్‌పై తీవ్ర చ‌ర్చ‌కు కూడా దారితీసింది. దీనిపై క‌విత శుక్ర‌వారం రాత్రే స్పందించారు. ఆ లేఖ తాను రాసిందేన‌న్నారు. అయితే.. కొంద‌రు కోవ‌ర్టుల కార‌ణంగానే అది బ‌య‌ట‌కు వ‌చ్చి ఉంటుంద‌న్న ఆమె.. కేసీఆర్‌ను దేవుడితో పోల్చారు. ఆయ‌న చుట్టూ ద‌య్యాలు ఉన్నాయ‌ని …

Read More »

క‌విత.. మ‌రో ష‌ర్మిల‌గా మారుతున్నారా!

బీఆర్ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత.. వ్య‌వ‌హారం పై రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ‌ సాగుతోంది. ఆమె గ‌త కొన్నాళ్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. ప్ర‌స్తుతం త‌న తండ్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ వంటివి.. రాజ‌కీయ వ‌ర్గాల‌ను కుది పేస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్‌ను ప్ర‌శ్నించిన కుటుంబ స‌భ్యులు లేరంటే లేరు. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు ఇష్ట‌మైనా … అయిష్ట‌మైనా వాటిని కొన‌సాగించారు. వాటిని పాటించారు. దేశ‌వ్యాప్తంగా పొత్తులు …

Read More »

11 మాసాల్లో ప‌వ‌న్ దూకుడు..

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఆ ప‌ద‌విని తీసుకుని.. పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చి 11 మాసాలు అయింది. ఈ ప‌ద‌కొండు మాసాల్లో కీల‌క‌మైన ప‌లు కార్య‌క్ర‌మాల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒంట‌రిగానే చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. ఈ కార్య‌క్ర‌మాలు కూడా.. సూప‌ర్ హిట్ కొట్ట‌డం మ‌రో ముఖ్య వ్య‌వ‌హారం. వీటిలో ప్ర‌ధానంగా ప‌ల్లె పండుగ‌, గ్రామ స‌భ‌లు, అడ‌విత‌ల్లి బాట, మ‌న వూరు మాటా-మంతి వంటివి ఉన్నాయి. వీటిని చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా …

Read More »

ఇంత జ‌రుగుతున్నా.. అడ్ర‌స్ లేని ‘ధ‌ర్మాన’ బ్ర‌ద‌ర్స్ ..!

ధ‌ర్మాన బ్ర‌ద‌ర్స్ ఎక్క‌డున్నారు? ఏం చేస్తున్నారు? ఇప్పుడు వైసీపీలో ఇదే చ‌ర్చ సాగుతోంది. వైసీపీ హ‌యాంలో మంత్రులుగా ప‌నిచేశారు. వీరిలో ఒక‌రు ఉప ముఖ్య‌మంత్రిగా కూడా చేశారు. కానీ.. పార్టీ అధికారం కోల్పోయిన త‌ర్వాత‌.. ధ‌ర్మాన బ్ర‌ద‌ర్స్ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. వారి వాయిస్ కూడా వినిపించ‌డం లేదు. ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌.. అస‌లు పార్టీ నుంచే కాకుండా.. రాజ‌కీయాల నుంచి కూడా త‌ప్పుకొన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి ధ‌ర్మాన …

Read More »

ఆ భ‌వ‌నం తెలంగాణ‌కే: ఆస్తుల అప్ప‌గింత‌లో ఏపీ కీల‌క నిర్ణ‌యం!

2014నాటి ‘ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం’ ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఆస్తుల పంప‌కాలు జ‌ర‌గాల్సి ఉంది. ఉమ్మ‌డి రాష్ట్రంలో హైద‌రాబాద్‌లో నిర్మించిన ప‌లు భ‌వ‌నాల్లో ఏపీకి కూడా వాటాలు ఉన్నాయి. వీటిని చ‌ట్టంలోనే పేర్కొన్నారు. అయితే.. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి ప‌దేళ్లు దాటిపోయినా.. రాజ‌కీయ ప‌ర‌మైన వివాదాల కార‌ణంగా ఆయా ఆస్తుల పంప‌కాల విషయంలో వివాదాలు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికీ.. నీటి వివాదాలు కొన‌సాగుతున్నట్టే.. ఆస్తుల వివాదాలు …

Read More »

ఎస్-400: మరో రెండిటి కోసం రంగంలోకి అజిత్ దోవల్

అత్యాధునిక రక్షణ వ్యవస్థలలో ఒకటైన ఎస్-400 ట్రయంఫ్, గగనతల భద్రతకు అగ్రశ్రేణి కవచంలా నిలుస్తోంది. ఇది 400 కిలోమీటర్ల దూరం వరకు బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు, యుద్ధవిమానాలను గుర్తించి ధ్వంసం చేయగలదు. శత్రు రేడార్‌ జామింగ్ వ్యవస్థలను ఎదుర్కొని పనిచేసే సామర్థ్యం ఇందులో ఉంది. భారత వైమానిక దళం పంజాబ్, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు ఎస్-400 వ్యవస్థలను మోహరించింది. ఇక మిగిలిన రెండు యూనిట్ల డెలివరీపై …

Read More »

భారత్ లో ఆపిల్‌.. ఈసారి సుంకం హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఆపిల్‌పై మరోసారి గట్టి హెచ్చరికలు చేశారు. అమెరికాలో అమ్మే ఐఫోన్లను ఇతర దేశాల్లో తయారు చేయడం తాము సహించబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా భారత్‌లో ఉత్పత్తి చేస్తున్నందుకు ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి ఇప్పటికే ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు తన అభిప్రాయం చెప్పినట్లు తెలిపారు. అలాగే ఆపిల్ కూడా ట్రంప్ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. …

Read More »

ఔను! ఆ లేఖ నేనే రాశా.. కానీ: క‌విత

బీఆర్ ఎస్ అధినేత‌, త‌న తండ్రి కేసీఆర్‌కు లేఖ రాసిన మాట వాస్త‌వ‌మేన‌ని బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత తాజాగా వెల్ల‌డించారు. అమెరికాలో చ‌దువుతున్న త‌న కుమారుడి గ్రాడ్యుయేష‌న్ వేడుక‌ల్లో పాల్గొనేందుకు అక్క‌డ‌కు వెళ్లిన ఆమె తాజాగా శుక్ర‌వారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు.దీనికి ముందు గురువారం రాత్రి అనూహ్యంగా ఆమె కేసీఆర్‌కురాసిన లేఖ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం.. రాజ‌కీయంగా ఈ లేఖ …

Read More »

“జూన్ 4” జ‌నంలోకి జ‌గ‌న్ స్కెచ్ ఏంటి ..!

వ‌చ్చ‌నెల 4న తాను జ‌నంలోకి వ‌చ్చి తీరుతాన‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఆ రోజు ‘వెన్ను పోటు’ పేరుతో కూట‌మి స‌ర్కారు పై ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. ప్ర‌జ‌ల‌ను స‌మీక‌రించి రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు తెలిపి.. క‌లెక్టరేట్ల‌లో ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. దీనిపై తాజాగా జ‌గ‌న్ ఓ ప్ర‌క‌ట‌న చేశారు. అయితే.. ఇలా ఇప్ప‌టికి అనేక సంద‌ర్భాల్లో జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌లు చేసినా.. ఆయ‌న బ‌య‌ట‌కు రాలేదు. కానీ, ఈ …

Read More »

ప‌వ‌న్ జ‌న‌సేన‌ సినిమా.. స‌క్సెస్సేనా ..!

Pawan Kalyan’s 'Mana Vooru – Maata Maanti' Hits the Mark in Rural AP

‘వెండితెర వేదిక‌గా’ క్యాప్ష‌న్‌తో ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రారంభించిన మ‌న వూరు.. మాటా మంతి కార్య‌క్ర‌మం స‌క్సెస్ అయింది. ఈ కార్య‌క్ర‌మం ద్వారా రెండు ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చు కోవాల‌న్న‌ది ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన ఉద్దేశం. 1) గ్రామీణుల స‌మ‌స్య‌ల‌ను వినేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్న సంకేతాల‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి పంపించ‌డం. 2) గ్రామీణుల‌కు చేరువ‌కావ‌డం ద్వారా.. త‌న ఉనికిని ప‌దిలం చేసుకోవ‌డం. ప్ర‌స్తుతం గ్రామీణుల ఓటు …

Read More »

ఏపీ పొలిటిక‌ల్ హాట్ టాపిక్‌: జ‌గ‌న్ అరెస్టు అవుతారా..!

ఎక్క‌డ విన్నా.. ఏ ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసినా.. వైసీపీ అధినేత జ‌గ‌న్ చుట్టూనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న అరెస్టు అవుతారా? ఆయ‌న‌ను జైలుకు పంపిస్తారా? అనేదే ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రిలోనూ నెల కొన్న ఉత్కంఠ . ప్ర‌స్తుత ప్ర‌భుత్వం వైసీపీ హ‌యాంలో మ‌ద్యం కుంభ‌కోణం జ‌రిగింద‌ని.. వేలాది కోట్ల రూపాయ‌ల‌ను ముడుపులుగా పుచ్చుకుని దారిమ‌ళ్లించార‌ని కూడా చెబుతోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి మ‌రీ విచార‌ణ‌కు …

Read More »