ఏపీలో కీలకమైన ఓటు బ్యాంకు సంతృప్తితోనే ఉందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఏపీలో ప్రభుత్వాన్ని మార్చగల శక్తిగా కొన్ని వర్గాలను రాజకీయ నాయకులు పేర్కొంటారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు.. యువత.. గ్రామీణులు కీలకం. మధ్యతరగతి వారు ఉన్నా.. వారు పోలింగ్ బూత్ వరకు వస్తారో రారో.. అనేది చెప్పడం కష్టం. సో.. వారిని దాదాపు ఎలిమినేట్ చేస్తారు. దీంతో సాధారణంగా మహిళలను, ఉద్యోగులను, యువతను, గ్రామీణులను మాత్రమే ఓటు …
Read More »కేసీఆర్కు అచ్చిరాని ‘బీ’-ఆర్ఎస్?
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సెంటిమెంటు చాలా ఎక్కువ. ఆయన హేతువాది అని ఎక్కడా చెప్పుకోలేదు. అయితే.. గియితే.. కమ్యూనిస్టు భావజాలం కొంత మేరకు ఉన్నా.. అవి ఆయన సెంటిమెంటుకు అడ్డం కూడా కాలేదు. నుదిటిన బొట్టు పెట్టినా.. ఎన్నికల సమయంలో యాగాలు చేసినా.. ఆయన సెంటిమెంటు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క ఎన్నికల సమయం అనేకాదు.. అసలు ఆది నుంచి కూడా సెంటిమెంటుకు పెద్ద పీట వేశారు. …
Read More »జూన్ 4పై పవన్ మార్కు పవర్ పంచ్ డైలాగ్
జూన్ 4… ఆ రోజు ఏపీలో రాజకీయంగా పెను ప్రకంపనలే సంభవించనున్నాయి. ఇప్పటికే విపక్ష వైసీపీ జూన్ 4న వెన్నుపోటు దినంగా ప్రకటించింది. కూటమి పాలనపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ దిశగా ఆ పార్టీ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. అయితే అదే రోజున కూటమి పార్టీలకు కూడా అత్యంత ముఖ్యమైన రోజే. ఎందుకంటే… ఆ రోజే వైసీపీ పాలనకు తెర పడి కూటమికి రికార్డు మెజారిటీ కట్టబెడుతూ …
Read More »పశ్చిమ బెంగాల్ పోలీసులపై పవన్ కల్యాణ్ ఆగ్రహం..
మీరు చదివింది నిజమే. ఆంధ్రప్రదేశ్కు చాలా దూరంగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంపైనా, అక్కడి పోలీసులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇదేనా మీరు పాటించే లౌకికత్వం?” అంటూ నిప్పులు చెరిగారు. లౌకికత్వం అంటే అందరికీ సమానంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అయితే, కొందరి విషయంలో లౌకికత్వం కవచంగా మారుతోందని, మరికొందరి విషయంలో ఖడ్గంగా మారుతోందని తీవ్రంగా విమర్శించారు. “ఇదేం పోలీసింగ్?” అంటూ …
Read More »ఎమ్మెల్సీ ఓకే!… మంత్రి పదవి ఎప్పుడు?
తెలంగాణలో అదికార పార్టీ కాంగ్రెస్ లో మంత్రి పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. మంత్రివర్గ విస్తరణ అదుగో, ఇదుగో అంటూ అధిష్ఠానం కాలయాపన చేస్తున్న కొద్దీ కొత్తగా ఆశావహులు చేరిపోతున్నారు. ఫలితంగా మంత్రి పదవుల కోసం పోటీ ఓ రేంజిలో పెరిగిపోతోంది. ఈ పోటీ, నేతల మధ్య మాటల తూటాలు.. ఇవేవీ పట్టని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ మాత్రం తన పని తాను చేసుకుని పోతున్నారు. …
Read More »జగన్ వాహనాలకు ఈరోజు తో చెక్
ఏపీలో రేషన్ పంపిణీ వ్యవస్థ ఆదివారం నుంచి పూర్తిగా మారిపోయింది. మొన్నటిదాకా వాహనాల ద్వారా జరిగిన రేషన్ సరుకుల పంపిణీకి స్వస్తి చెప్పిన కూటమి ప్రభుత్వం… పాత పద్ధతిలో రేషన్ డీలర్ల షాపుల వద్దే రేషన్ సరుకుల పంపిణీని ప్రారంభించారు. ఫలితంగా ఏపీవ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభోత్సవాలు కోలాహలంగా జరిగాయి. జనం రేషన్ డీలర్ల షాపులకు ఉత్సాహంగా తరలివచ్చి తమ రేషన్ …
Read More »షర్మిలాగ్రహం: జగన్తో పాటు ఈసారి లోకేష్ కూడా!
కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తరచుగా తన అన్న, వైసీపీ అధినేత జగన్ను విమర్శించే విషయం తెలిసిందే. సందర్భం ఏదైనా జగన్పై ఆమె విరుచుకుపడుతున్నారు. ఇది రాజకీయంగా ఆమెకు బలాన్నిఇచ్చిందా? లేదా? అనేది పక్కన పెడితే.. మొత్తానికి షర్మిలాగ్రహం మాత్రం.. తగ్గడం లేదు. కట్ చేస్తే.. ఇప్పుడు పదోతరగతి విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనంలో తప్పులు దొర్లాయి. దీంతో 11 వేల మందికి పైగా విద్యార్థుల జవాబు …
Read More »నాటి దౌర్జన్యకాండలు ఇంకా ఆగలేదబ్బా!
ఏపీలో 2019 నుంచి ఐదేళ్ల పాటు సాగిన వైసీపీ పాలనను వైరి వర్గాలు దౌర్జన్య పాలనగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని 2024 ఎన్నికల్లో ప్రజల వద్దకు తీసుకెళ్లి… దౌర్జన్యకాండకు పాల్పడుతున్న వైసీపీని విపక్షంలోకి కూటమి పార్టీలు నెట్టేశాయి. అంతటితో వైసీపీ దౌర్జన్యాలు ఆగుతాయిలే అని అంతా అనుకున్నారు. అలా అనుకున్న వారి ఆశలు అడియాశలే అయ్యాయని చెప్పక తప్పదు. ఇప్పటికీ మెజారిటీ శాఖల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన అధికారులే …
Read More »గిరిపుత్రుల మనసులో ‘దారులు’.. ఇక జనసేన కే జై కొట్టేనా…!
సాధారణ ప్రజానీకానికీ.. గిరిజనులకు మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. సాధారణ ప్రజలకు ఎప్పుడూ ఏదో ఒకటి వారికి కనిపించాలి. ప్రభుత్వాలు వారిని మెప్పించాలి. ఎప్పటికప్పుడు ప్రచారాలకు పడిపోతూ ఉంటారన్న పేరు కూడా ఉంది. అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. నగర ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు వేయని వ్యూహాలు లేవు. ప్రకటించని ఫథకాలు కూడా లేవు. అయినా..వారి ఓటు బ్యాంకుపై ఎప్పుడు సందిగ్థతే కొనసాగుతుంది. ఎప్పుడూ సందేహాలు..ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటాయి. చివరకు …
Read More »టెన్త్ పేపర్లు ఎత్తుకుపోయిన జగన్: లోకేష్
ఏపీలో పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మ్యూల్యాంకనంలో తప్పులు దొర్లడం.. పలువురు విద్యార్థులు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్ సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు. వేలాది మంది పదోతరగతి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. “వారం రోజుల్లోనే ఫలితాలను వెల్లడిస్తామని.. ప్రకటించి, రికార్డుల కోసం విద్యార్థుల జీవితాలను ఫణంగా పెట్టారని” ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. ఈ …
Read More »బంజారాహిల్స్ లో ‘జాగృతి’!…వివాదాల జోలికెళ్లని కవిత!
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సాంస్కృతిక విభాగం తెలంగాణ జాగృతి సంస్థ బంజారాహిల్స్ లోని నూతన కార్యాలయంలోకి మారింది. నిన్నటిదాకా ఇందిరా పార్క్ సమీపంలోని అశోక్ నగర్ కేంద్రంగా సాగిన ఈ కార్యాలయాన్ని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తనకు మరింత అందుబాటులో ఉండే విధంగా బంజారాహిల్స్ లోని తన ఇంటికి సమీపంలోని ప్రైవేటు భవంతిలోకి మార్చేశారు. శనివారం సంప్రదాయబద్ధంగా పూజలు చేసి కవిత పార్టీ …
Read More »వైఎస్ మారాడు.. జగన్ కూడా మారాలి..: జేసీ ప్రభాకర్
వైసీపీ అధినేత జగన్ అంటేనే కారాలు మిరియాలు నూరే అనంతపురం జిల్లాకు చెందిన, టీడీపీ నాయకుడు, ప్రస్తుతం తాడిపత్రి మునిసిపల్ చైర్మన్గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా వైసీపీ అధినేత జగన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్టాడుతూ.. “జగన్ మారాలి. లేకపోతే.. కష్టమే. ఇంకా బెదిరింపులు.. సాధింపులు చేస్తానంటే.. ప్రజలు ఒప్పుకోరు. ప్రజలు కూడా రక్షణ కోరుకుంటున్నారు. బెదిరింపులతో రాజకీయాలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates