Political News

మాట‌లు చెప్పొద్దు.. చేత‌ల‌కు రండి: చంద్ర‌బాబు పిలుపు

ఏపీ సీఎం చంద్ర‌బాబు తొలిసారి బ‌హిరంగ వేదిక‌పై స్వ‌ల్ప ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ‘మాట‌లు చెప్పొద్దు.. చేత‌ల‌కు రండి!’ అని ఆయ‌న పిలుపునిచ్చారు. తాజాగా అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించిన సీఎం.. సీమ‌కు వ‌ర‌దాయినిగా పేర్కొనే హంద్రీనీవా ప‌నుల‌ను ప‌రిశీలించారు. మండు టెండ‌లో దాదాపు గంట‌న్న‌ర పాటు ప్రాజెక్టు వ‌ద్దే ఆయ‌న ఉన్నారు. అధికారులు, ఇంజ‌నీర్ల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టులో పూడిక తీత ప‌నుల‌ను స్వ‌యంగా ప‌రిశీలించారు. వీటిని …

Read More »

పాకిస్థాన్‌లో అంత‌ర్యుద్ధం.. హెహ‌బాజ్ చుట్టూ ఉచ్చు!

భార‌త్‌ను ఢీ కొంటామ‌ని.. త‌గిన విధంగా బుద్ది చెబుతామ‌ని బీరాలు ప‌లికిన పాకిస్థాన్ ప్ర‌ధాన మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్ చుట్టూ పెద్ద ఉచ్చు చిక్కుకుంది. ఆయ‌న‌ను ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వి నుంచి దించేయాలంటూ.. పాకిస్థాన్ పార్ల‌మెంటులో మెజారిటీ స‌భ్యులు డిమాండ్ చేశారు. వీరిలో మాజీ ప్ర‌ధాని, ప్ర‌ముఖ క్రికెట‌ర్ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన ఎంపీలు ఉన్నారు. అదేవిధంగా సొంత పార్టీలు ఎంపీలు కూడా.. ప్ర‌ధాని ష‌రీఫ్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు …

Read More »

ఇస్రో కేంద్రాలు, పోర్టుల వద్ద హై అలర్ట్

పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత్ శుక్రవారం మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశంలోని అన్ని పోర్టులు, అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు వద్ద భద్రతను ఓ రేంజికి పెంచేసింది. దాదాపుగా పోర్టులన్నీ సరిహద్దుల వెంటే ఉన్న నేపథ్యం… వాటి నుంచే మన నావికా దళం ప్రత్యర్థి దేశంపై విరుచుకుపడుతుండటం, విదేశీ వాణిజ్యానికి పోర్టులు కీలక కేంద్రాలుగా కొనసాగుతున్న నేపథ్య్లంలో వాటికి ఎంతమాత్రం నష్టం జరగని రీతిలో భారత్ పటిష్ట చర్యలు చేపట్టింది  భారత్ లోని …

Read More »

పాక్ ది ఎంతటి పన్నాగమో తెలుసా..?

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి పాక్ వైఖరే కారణం. ఈ మాట భారత్ మాత్రమే చెబుతున్నది కాదు. యావత్తు ప్రపంచ దేశాలు పాక్ గురించి ఇదే మాటను చెబుతున్నాయి. పహల్ గాం ఉగ్రదాడికి అన్ని రకాలుగా అండదండలు అందించింది పాకిస్తానే. పహల్ గాం దాడి తర్వాత భారత్ పైకి కవ్వింపు చర్యలకు దిగింది కూడా ఆ దేశమే కదా. వెరసి …

Read More »

పిక్ టాక్!… ఇలాంటి ఆతిథ్యం నెవర్ బిఫోర్!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిజంగానే ఏది చేసినా ప్రత్యేకమే. సినిమాల్లో స్టెప్పులేసినా…అదిరేటి డైలాగులు చెప్పినా..డూప్ లు లేకుండా స్టంట్ లలో పాల్గొన్నా… ఇలా ఏ విషయం తీసుకున్నా పవన్ ది ఓ ప్రత్యేక రేంజే. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే… పవన్ ను మించిన హీరో లేరంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అదే ప్రత్యేక శైలిని పవన్ కొనసాగిస్తున్నారు. …

Read More »

టీడీపీ ఆఫీస్‌పై దాడి.. ఎవ్వరికీ తెలీదంట

వైసీపీ నాయ‌కుడు, గ‌త వైసీపీ స‌ర్కారులో ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించిన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఆ పార్టీ యువ నాయ‌కుడు, విజ‌య‌వాడ వైసీపీ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా ఉన్న దేవినేని అవినా ష్ చౌద‌రిల‌ను తాజాగా ఏపీ సీఐడీ పోలీసులు విచారించారు. 2021-22 మ‌ధ్య కాలంలో మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఫ‌ర్నిచ‌ర్ స‌హా.. అద్దాలు కూడా ధ్వంస‌మ‌య్యాయి. ప‌లువురు కార్య‌క‌ర్త‌లు కూడా …

Read More »

‘జడ్ ప్లస్’లో జగన్ కు నిరాశ!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధ రించాలని దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు శుక్రవారం లైట్ తీసుకుందని చెప్పక తప్పదు. సీఎంగా ఉండగా… తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కొనసాగిందని, అయితే విపక్షంలోకి మారిన తర్వాత తనకు ఏమాత్రం ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కేంద్రం తన భద్రత స్థాయిని తగ్గించిందని జగన్ …

Read More »

సైన్యానికి రేవంత్ జీతం ఇచ్చేస్తున్నారు

భార‌త్‌-పాకిస్థాన్ దేశాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం సంచల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్రం కూడా తీసుకోని నిర్ణ‌యం తీసుకుంది. ప్రస్తుతం దేశ భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ విష‌యంలో అవ‌స‌ర‌మైన సామ‌గ్రి కొనుగోలు.. ఇత‌ర అవ‌స‌రాల‌కు కూడా కేంద్రానికి సొమ్ములు అవ‌స‌రం. అయితే.. ఇప్పుడు ఇబ్బంది ఉంద‌ని కేంద్ర‌మేమీ ప్ర‌క‌టించ‌లేదు. కానీ, త‌మ వంతు బాధ్య‌త‌గా సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం …

Read More »

ఈడీ దెబ్బ‌.. వైసీపీలో కుదుపు.. !

వైసీపీ అధినేత జగ‌న్‌కు ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్(ఈడీ) దెబ్బ కొత్త‌కాదు. ఆయ‌నకు సంబంధించిన ఆస్తుల కేసులో ఈడీ అనేక మార్లు ఆయ‌న‌ను ప్ర‌శ్నించ‌డం.. ఆయ‌న‌ను జైలుకు కూడా పంపించ‌డం తెలిసిందే. కానీ, ఇత‌ర నాయ‌కుల‌కు మాత్రం ఈడీ దెబ్బ కొత్త‌గానే ఉంది. ముఖ్య‌మంత్రుల‌ను సైతం అరెస్టు చేయ‌గ‌ల శ‌క్తి ఉన్న ఈడీ ఇప్పుడు వైసీపీపై దృష్టి పెట్టింది. జ‌గ‌న్ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం లో.. 3 వేల కోట్ల రూపాయ‌ల‌కు …

Read More »

తిరుమల కొండపై ఇక ‘చైనీస్’ దొరకదు!

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడు కొండల్లో భక్తులు ఎంతో నిష్టతో సాగుతూ ఉంటారు. వెంకన్న దర్శనమే పరమావధిగా ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న భక్తులు… తిరుమలలో ఎంతో భక్తి శ్రద్ధలతో సాగుతూ ఉంటారు. అందులో భాగంగా మద్యం, మాంసం, ధూమపానం ఇతరత్రా అసాంఘీక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సాగే భక్తులు… వెంకన్న దర్శనంతో తమ జన్మ ధన్యమైందన్న భావనతో పులకించిపోతారు. ఇలాంటి పరమ పవిత్రమైన …

Read More »

కశ్మీర్ లోని ఏపీ విద్యార్థుల భద్రతపై ఫోకస్

భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితులు తప్పడం లేదు. ఎక్కడికక్కడ జనం చిక్కుబడిపోయారు. పలు కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు.. ప్రత్యేకించి పాక్ తో సరిహద్దు ప్రాంతంలోని రాష్ట్రాలకు వెళ్లిన ప్రజలు మరింతగా ఇబ్బంది పడుతున్నారని చెప్పక తప్పదు. ఇలాంటి వారిలో విద్యార్థులదే అదిక శాతమని చెప్పాలి. ప్రస్తుతం కశ్మీర్ కు విద్యాభ్యాసం నిమిత్తం వెళ్లిన వారు తీవ్ర భయాందోళనలో కూరుకుపోయారు. …

Read More »

తెలుగు జవాన్ మురళి వీర మరణం

పాకిస్తాన్ తో భారత యుద్ధం అంతకంతకూ భీకరంగా మారుతోంది. తొలుత ఉగ్రదాడి, ఆ తర్వాత కవ్వింపు చర్యలకు దిగిన పాక్.. యుద్ధానికి కారణం కాగా.. పాక్ కు తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు భారత్ యుద్ధ తీవ్రతను పెంచేస్తోంది. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ సరిహద్దుల్లో దేశ రక్షణ విధుల్లో నిమగ్నమైన తెలుగు జవాన్ మురళి నాయక్ వీర మరణం పొందారు. పాక్ జరిపిన కాల్పుల్లో మురళి మృతి చెందినట్లు …

Read More »