నిజమే… ఏపీలో ఇకపై విపక్షం వైసీపీ పప్పులు ఉడకవ్. ఆ పార్టీ ఇష్ఠారాజ్యంగా వ్యవహరించడానికి కూడా వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం ఒకే ఒక్క ఘటనతో వైసీపీ నేతలు, శ్రేణులకూ అర్థమైపోయింది. ఇకపై ఏ పని చేయాలన్నా పోలీసులు ఇచ్చిన అనుమతులు, విధించే ఆంక్షలకు లోబడే వైసీపీ నేతలు, శ్రేణులు ముందుకు సాగక తప్పదు. ఇందుకు సోమవారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని జిల్లా కలెక్టరేట్ జరిగిన ఘటనే …
Read More »ఓరుగల్లు కాంగ్రెస్కు ‘కొండంత’ భారం!
వరంగల్గా పిలుచుకుని ఓరుగల్లు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సీనియర్ల నుంచి పెద్ద ఇబ్బందే వచ్చింది. వ్యక్తిగత వైషమ్యాలు.. వివాదాలు.. ముసురుకున్న నాయకత్వం.. ఒకరి పై ఒకరు మాటల యుద్ధాన్ని చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర్ లపై స్థానిక సీనియర్ నాయకులు ఎలుగెత్తారు. “వారు కావాలో.. మేం కావాలో తేల్చుకోండి!” తేల్చుకోవాలని పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఇప్పుడు …
Read More »గుజరాత్లోనే మోదీకి షాక్ ఇచ్చిన ఉప ఎన్నికలు!
దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి భారీ షాక్ తగిలింది. అంతేకాదు, మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోనూ బీజేపీ ఓడిపోయింది. కేవలం ఒక్కే ఒక్క స్థానంలో మాత్రమే బీజేపీ విజయాన్ని సాధించింది. ఇదే సమయంలో మోదీతో నిత్యం వివాదాలు సాగించే ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అటు గుజరాత్లోను, ఇటు తమ పాలన సాగుతున్న పంజాబ్లోను ప్రజలు ఆప్ అభ్యర్థులను గెలిపించారు. …
Read More »ఈయనతో కాంగ్రెస్ కు కష్టమేనా..?
తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి… పార్టీకి ఎంతో బలమన్న వాదనలు నిన్నటిదాకా వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ భ్రమలన్నీ తొలగిపోయి…వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందంటే మాత్రం అందుకు పొంగులేటి ప్రధాన కారణంగా నిలుస్తారన్న వాదనలు ఇప్పుడు అంతకంతకూ బలపడుతున్నాయి. పొంగులేటి వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందన్న మాట వినిపించినా ఆశ్చర్యం లేదన్న …
Read More »విచారణకురా బాబూ.. చెవిరెడ్డి కుమారా
వైసీపీ నాయకుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వసూలు చేసిన నగదును విదేశాలకు తరలించే ప్రక్రియలో చెవిరెడ్డి పాత్ర ఉందన్నది ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు(సిట్) చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి కూడా …
Read More »షర్మిల అక్కడ ఫైల్ అవుతున్నారు
ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల.. ఇటు కూటమి ప్రభుత్వం, అటు ప్రధాని మోడీ, మరోవైపు.. సొంత సోదరుడు జగన్ను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. కూటమి సర్కారు, ప్రధాని మోడీ సంగతి ఎలా ఉన్నా వైసీపీ అధినేత జగన్పై విరుచుకు పడుతున్నారు. సమయం, సందర్భం చూసుకుని తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నారు. అయితే.. ఈ సందడిలో పడిన ఆమె.. పార్టీ కార్యక్రమాలపై ఒకింత సీతకన్నేశారు. దీంతో క్షేత్రస్థాయిలో నాయకులు పార్టీలో …
Read More »అప్రూవర్గా కృష్ణంరాజు.. సాక్షికి ఉచ్చు?
వైసీపీ అధినేత జగన్కు చెందిన సాక్షి మీడియాలో అమరావతి రాజధానిని “వేశ్యల రాజధాని” అంటూ చేసిన తీవ్ర వివాదాస్పద, దారుణ వ్యాఖ్యల కేసులో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు అప్రూవర్గా మారేందుకు అనుమతి కోరారు. “ఉన్నది చెప్పేస్తా. నన్ను వదిలేయండి!” అని పోలీసుల ముందు ఆయన వేడుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో ఏ1గా ఉన్న కృష్ణంరాజును మూడు రోజుల పాటు అమరావతిలోని తుళ్లూరు పోలీసులు విచారించారు. అయితే మొదటి రోజు …
Read More »సింగమయ్య చనిపోయాడని తెలీదు: జగన్ డ్రైవర్
గుంటూరు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో ఈ నెల 18న వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పర్యటించారు. తన పార్టీకి చెందిన ఓ కార్యకర్త 2024లో చనిపోయిన నేపథ్యంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి, కుటుంబా న్ని పరామర్శించారు. ఈ సమయంలో వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. అయితే.. విచ్చలవిడిగా వ్యవహరించిన కారణంగా.. ఆయన కాన్వాయ్ కింద పడి సింగమయ్య అనే వృద్ధుడు నలిగిపోయినట్టు తాజాగాపోలీసులు ఓ వీడియోను వెలుగులోకి …
Read More »సూడో సెక్యూలరిస్టులను ఏకి పడేసిన పవన్
ఈ మధ్య జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురంచి చాలా గట్టిగా మాట్లాడుతూ.. సెక్యూలరిజం పేరుతో హిందూ మతాన్ని తక్కువ చేసే వాళ్ల మీద ఘాటుగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి సూడో సెక్యూలరిస్టుల తీరును బలంగా ఎండగట్టాడు. తమిళనాడులోని మధురైలో నిర్వహిస్తున్న మురుగ భక్తర్గళ్ మానాడు కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న పవన్.. తన ప్రసంగంతో భారీగా హాజరైన జనాలను ఉర్రూతలూగించాడు. …
Read More »ఇదేం రాక్షసానందం అన్నయ్యా?: షర్మిల
వైసీపీ అధినేత జగన్ పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల విరుచుకుపడ్డారు.”ఇదేం రాక్షసానందం” అంటూ.. విమర్శలు గుప్పించారు. గుంటూరు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో పర్యటించిన సమయంలో జగన్ కారు డోర్ దగ్గర నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ.. ముందుకు సాగుతుండగా.. అదే కారు కింద పడి సింగమయ్య అనే వృద్ధుడు మృతి చెందిన దారుణ వీడియో వెలుగు చూసిన నేపథ్యంలో జగన్పై ఆమె నిప్పులు చెరిగారు. …
Read More »అక్కడ కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ క్రేజ్ మరింత పెరుగుతుందా..?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతల నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజకీయంగా మాత్రం ఒక్కో పరీక్షలో విజయం సాధిస్తూ తన పట్టు నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు.. గ్రేటర్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని తన పట్టు నిలుపుకునేందుకు రేవంత్ కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. …
Read More »జగన్ది నేర పూరిత నిర్లక్ష్యం: మాణిక్కం ఠాకూర్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్.. వైసీపీ అధినేత జగన్ పై తొలిసారి విమర్శలు గుప్పించారు. గతంలో అనేక ఆరోపణలు వచ్చినా.. జగన్పై పన్నెత్తు మాట అనని ఠాకూర్ తాజాగా గుంటూరు జిల్లా రెంటపాళ్ల సమీపంలో జగన్ కారు కింద పడి సింగమయ్య అనే వృద్ధుడు మృతి చెందిన ఘటనపై సీరియస్ కామెంట్లే చేశారు. దీనిని ఖండిస్తున్నట్టు తెలిపారు. జగన్ నాయకుడుకాదన్నారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates