కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఓటర్లను తొలగించే హక్కు తమకు ఉందని.. అదేసమయంలో ఎందుకు తొలగించామో.. చెప్పాల్సిన అవసరం మాత్రం తమకు లేదని.. నిబంధనలు కూడా తమకు అనుకూలంగానే ఉన్నాయని వాదిస్తూ వచ్చిన ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చిం ది. “ప్రజాస్వామ్యంలో ఓట్లు తొలగించడం అంటే.. ప్రజల హక్కులను తొలగించినట్టే. దీనిని తెలుసుకునే అవకాశం, అవసరం కూడా వారికి ఉంటుంది. ఈ విషయంలో ఎన్నికల సంఘం …
Read More »నిజమేగా… ప్రోత్సాహకాల్లేకుండా పెట్టుబడులు ఎలా?
ఇది అసలే పోటీ ప్రపంచం. ఓ కంపెనీ తన రెండో యూనిట్ ను నెలకొల్పాలని అనుకుంటున్నట్లు బయటి ప్రపంచానికి తెలిసిందంటే… ఆ కంపెనీ ముందు పలు దేశాలు, ఆయా దేశాల్లోని పలు రాష్ట్రాలు వాలిపోతాయి. తమ పరిధిలో ఆ యూనిట్ ను ఏర్పాటు చేయాలంటే… కాదు మా పరిధిలో ఏర్పాటు చేయాలంటూ ఇంకో దేశమో, రాష్ట్రమో ప్రతిపాదిస్తాయి. ఈ క్రమంలో తమ పరిధిలో ఆ యూనిట్ ను ఏర్పాటు చేస్తే.. …
Read More »పులివెందులలో అసెంబ్లీ రౌడీ ‘సీన్’.. దీనికి సమాధానమేంటి జగన్!
బ్యాలెట్లలో సాధారణంగా ఓటర్లు.. తమ ఓటు హక్కును మాత్రమే వినియోగించుకుంటారు. కానీ.. తొలిసారి ఏపీలో ఓటర్లు తమ ఓటు హక్కుతో పాటు.. మనోభావాలను ప్రతిబింబించేలా కొన్ని వ్యాఖ్యలు రాసి.. వేరేగా కూడా స్లిప్పులు వేశారు. వీటిని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పులివెందుల, ఒంటిమిట్టల్లో ఈ నెల 12న జెడ్పీటీసీ అభ్యర్థుల స్థానాలకు ఉప ఎన్నిక జరిగింది. దీనిని ఈవీఎంతో కాకుండా బ్యాలెట్ విధానంలోనే నిర్వహించారు. కేవలం అసెంబ్లీ, పార్లమెంటు …
Read More »ఆర్. ఎస్. ప్రవీణ్ అరెస్టు.. కేటీఆర్ ఫైర్!
బీఆర్ ఎస్ పార్టీ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపింది. ప్రజల కోసం పోరాటం చేస్తున్నవారిని అరెస్టు చేయడం, వారి గొంతు నొక్కడం సీఎం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తక్షణమే ప్రవీణ్ కుమార్ను విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే.. …
Read More »పులివెందుల పోరు: బాలయ్య ఫస్ట్ రియాక్షన్
పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం దక్కించుకుంది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి(మారెడ్డి రవీంద్రనాథ్రెడ్డి) సతీమణి మారెడ్డి లత ఇక్కడ పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఆమెకు ఏకంగా 6 వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి. అంతేకాదు.. వైసీపీ తరఫున పోటీలో ఉన్న హేమంత్కుమార్ రెడ్డి డిపాజిట్(రూ.2500) కోల్పోయారు. ఈ పరిణామాలపై అధికార పార్టీలో హర్షం వ్యక్తమవుతోంది. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు …
Read More »‘జగన్ అంటే అసహ్యం వేస్తోంది’
‘జగన్ అంటే అసహ్యం వేస్తోంది. ఇంత నిర్లజ్జగా మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు.’ అని టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రజాస్వామ్యం గురించి, విలువ గురించి.. ఆయన మాట్లాడుతుంటే.. అసహ్యంగా ఉందన్నారు. తాజాగా స్పీకర్ అయ్యన్న సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పులివెందుల, ఒంటిమిట్టల్లో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలను ఆయన ప్రస్తావించారు. ప్రజలు స్వయంగా చెబుతున్న దాని ప్రకారం.. ఇక్కడ 30 …
Read More »జగన్-అమిత్షాల మధ్యే హాట్లైన్: మాణిక్కం మాట
ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్పై వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలు తెలిసిందే. రాష్ట్రంలో చంద్రబాబు పాలన, అవినీతి, అక్రమాలు ఆయనకు కనిపించడం లేదని.. తాను మాత్రమే మాణిక్కానికి కనిపిస్తున్నారని బుధవారం జగన్ విమర్శించారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఓటు బ్యాంకు పై కూడా వారు ప్రశ్నించడం లేదన్నారు. రాహుల్గాంధీకి- చంద్రబాబుకు మధ్య హాట్లైన్ కొనసాగుతోందని, అందుకే మౌనంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అయితే.. ఈవ్యాఖ్యలపై మాణిక్కం ఠాకూర్ తాజాగా …
Read More »పులివెందులపై టీడీపీ జెండా… వైసీపీకి డిపాజిట్ గల్లంతు
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార కూటమి రథసారథి టీడీపీ విజయ దుందుభి మోగించింది. ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) సతీమణి లతా రెడ్డి తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై ఏకంగా 6033 భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. దాదాపుగా 35 ఏళ్ల తర్వాత ఈ స్థానంలో టీడీపీ విజయం సాధించడం గమనార్హం. …
Read More »బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుందా… దిగజారుతోందా..?
తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది. ఒకే ఒక ఓటమి టిఆర్ఎస్ను కష్టాల ఊబిలోకి నెట్టేసింది. ఒక్క ఓటమి తర్వాత అటు పార్టీపై కేసీఆర్ ఫ్యామిలీకి పట్టు సడలుతోంది. మరోవైపు ఫ్యామిలీ లోనూ విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో …
Read More »బాలయ్య ఇలాకాలో జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారా…?
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. ఈ క్రమంలో గత ఐదేళ్లలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం పార్టీ అధినేత జగన్కు ఉంది. అయితే టిడిపి కంచుకోటలో పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తూ మరింతగా దిగజారుతున్న వాతావరణం కనిపిస్తోంది. తెలుగుదేశం కంచుకోట హిందూపురం నియోజకవర్గం.. ఇక్కడ …
Read More »రోజాను అరెస్టు చేయాలా.. వద్దా …!
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మాజీ మంత్రి రోజా వ్యవహారం వైసీపీలోనే కాదు.. కూటమిలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో నిర్వహించిన కార్యక్రమాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని.. పేర్కొంటూ కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై దృష్టి పెట్టిన విజిలెన్స్ అధికారులు తాజాగా తమ నివేదికను ప్రభుత్వానికి అందించారు. దీనిలో సుమారు 40 కోట్ల రూపాయల లోపు అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. …
Read More »కదిరిలో కందికుంట పాలిటిక్స్ ప్రశాంతం ..!
నియోజకవర్గాల రాజకీయాలు కూడా ఆసక్తిగా మారుతుంటాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడి వేడిగా ఉన్న నియోజకవర్గాలు కొన్నయితే.. ఎలాంటి వివాదాలు లేని నియోజకవర్గాలు కొన్నిఉన్నాయి. రాయలసీమ ప్రాంతాన్ని తీసుకుంటే.. ఇక్కడి 53 నియోజకవర్గాల్లో సగానికిపైగా నియోజకవర్గాల్లో రాజకీయాలు దూకుడుగా ఉన్నాయి. అధికార పక్షం ఎమ్మెల్యేల వైఖరి కొన్ని కొన్ని చోట్ల వివాదం కూడా అవుతోంది. అయితే.. మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం.. ప్రశాంతమైన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates