రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికీ ఎలాంటి అవకాశం వస్తుందో.. ఎవరు ఎటువైపు మారుతారో అనేది చెప్పడం కష్టం. ‘అవసరం-అవకాశం’ అనే రెండు పట్టాలపై ప్రయాణం చేసే రాజకీయ నాయకులు.. తమ అవసరానికి తగిన విధంగా రాజకీయాలను మార్చుకోవడం అనేది పార్టీలు మారడం అనేది తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైసీపీకి చెందిన ఎం ఎల్ సి ఒకరు టిడిపికి టచ్ లోకి వెళ్లారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల …
Read More »సందడి లేని బీఆర్ఎస్ భవన్!
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కీలకమైన సెప్టెంబరు 17(తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం)నాడు మౌనంగా ఉండిపోయింది. వాస్తవానికి సెప్టెంబరు 17ను ప్రజాపాలన దినోత్సవంగా ప్రారంభించిందే.. అప్పటి సీఎం కేసీఆర్. ఆయన అధికారంలో ఉన్న పది సంవత్సరాలు కూడా.. ఈ రోజు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబురాలు చేశారు. ఇక, పార్టీ కార్యాలయంలో ఆటా పాటలతోపాటు విందులు కూడా ఏర్పాటు చేశారు. అప్పటి సీఎం కేసీఆర్.. ఘనంగా ఈ కార్యక్రమాల్లో …
Read More »నారా లోకేష్ కేరాఫ్ ఇంటర్నేషనల్… !
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రభావం అంతర్జాతీయ స్థాయికి చేరిందా? నిన్న మొన్నటివరకు ఢిల్లీలో రాజకీయాలు చేయడంలో ఆయన దూకుడుగా వ్యవహరించారు.. ఇప్పుడు ఆయన ప్రభావం అంతర్జాతీయ స్థాయికి చేరేలాగా వ్యవహరిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో సింగపూర్ తాజాగా లండన్లో పర్యటించిన నారా లోకేష్ అక్కడి పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. వాస్తవానికి సీఎం చంద్రబాబుతో కలిసి నారా లోకేష్ గాని ఇతర మంత్రులు …
Read More »సమరం లేదు.. `సభ` ఏకపక్షమే!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అంటే.. అధికార విపక్షాల మధ్య హోరా హోరీ వాదనలు.. సవాళ్లు.. ప్రతిసవాళ్లకు కేంద్రాలుగా మారుతున్నాయి. ఇటీవల తెలంగాణలోనూ ఇలాంటి వాతావరణమే కనిపించింది. అధికార పక్షం కాంగ్రెస్… ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ ఎస్ మధ్య తీవ్రస్తాయిలో మాటల యుద్ధం జరిగింది. అంశం ఏదైనా కూడా సభలో ప్రతిపక్షం ఉంటేనే ఒక విధమైన చర్చ సాగుతుంది. కానీ, …
Read More »నా గురించి చెబితే.. నవ్వుకున్నారు: చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో తొలితరం ఆర్థిక సంస్కరణలను మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకువచ్చారని చెప్పారు. అయితే.. ఆతర్వాత.. రెండోతరం ఆర్థిక సంస్కరణలను తానే తీసుకువచ్చానని అన్నారు. అయితే.. ఈ విషయం చెబితే నవ్వుకుంటున్నారని.. నా గురించి నేను గొప్పగా చెప్పానని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కానీ.. వాస్తవం ఏంటో ఆనాడు ఉన్న నాయకులను అడిగినా… ప్రస్తుతం అభివృద్ధి ఫలాలను అందుకుంటున్న వారిని అడిగినా చెబుతారని …
Read More »టీఆర్పీ.. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ
జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి… ఆ తర్వాత రాజకీయాల వైపు వచ్చిన చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఏకంగా సొంతంగానే రాజకీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) పేరిట నూతన పార్టీని ప్రకటించిన మల్లన్న.. తన పార్టీ ద్వారా ఇప్పటిదాకా అసెంబ్లీ గడప తొక్కని బీసీ కులాలను ఏకంగా చట్ట సభల్లో కూర్చోబెడతానని సంచలన ప్రకటన చేశారు. ఇకపై జరిగే ప్రతి ఎన్నికల్లోనూ …
Read More »ఈవీఎంలలో మార్పులు.. ఇక ఫొటో చూసి ఓటు వేయొచ్చు
భారత ఎన్నికల వ్యవస్థలో ఓటర్లకు మరింత సులభతరం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇకపై ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్ ఫొటోలు కూడా ముద్రించనుంది. బిహార్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుందని అధికారులు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి గందరగోళం లేకుండా ఓటర్లు సులభంగా తమ అభ్యర్థిని …
Read More »వైసీపీలో భూమన ఒంటరి పోరాటం.. !
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన.. తిరుమల, తిరుపతిని ఆధారంగా చేసుకుని సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. గతంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్లు ఇచ్చే సమయంలో జరిగిన తొక్కిసలాట, తర్వాత.. గోవుల మరణాలు.. అన్యమత ప్రచారం, అన్యమత ఉద్యోగులు.. ఇలా అనేక అంశాలను భూమన ప్రస్తావించారు. అదేసమయంలో తిరుపతిలో స్వామి కొండకు ఆనుకుని స్టార్ హోటళ్లకు.. భూములు …
Read More »10 కోట్ల ఖర్చు: లక్ష్యాలు నెరవేరేనా బాబూ!?
అమరావతిలో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సుకు దాదాపు రూ.10 కోట్ల వరకు ఖర్చయినట్టు అధికారులు చెబుతున్నారు. కలెక్టర్లకు బస, భోజనాలు, వాహనాల ఖర్చు, రాకపోకల చార్జీలు, అల వెన్సులు, వారి దిగువస్థాయి అధికారులు, డ్రైవర్లకు కూడా సేమ్ టు సేమ్ ఖర్చులు.. వెరసి.. 10 కోట్ల రూపాయల వరకు ఖర్చయినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే.. ఇంత ఖర్చు చేసినా.. సీఎం చంద్రబాబు లక్ష్యాలు …
Read More »కవితపై నిఘా.. : బీఆర్ఎస్ వ్యూహం ఏంటి?
హైదరాబాద్లోని కీలక నియోజకవర్గం జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల చివరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార, ప్రతిపక్షాలు.. ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. మరీ ముఖ్యంగా తమ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోకుండా ఒడిసి పట్టుకోవాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇక, ఏడాదిన్నర పాటు సాగించిన తమ పాలనకు ఈ ఉప ఎన్నిక దర్పణం పడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో …
Read More »విశ్వవిజేత మోడీ: ఫస్ట్ టైమ్ పవన్ సెల్ఫీ వీడియో
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మించిన నాయకుడు లేడని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. మోడీ 75వ పుట్టిన రోజును పురస్కరించుకుని పవన్ కల్యాణ్.. గతానికి భిన్నంగా.. మరో రెండు అడుగులు ముందుకు వేసి.. సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. దీనిలో పూర్తిగా ఇంగ్లీష్లో మాట్లాడిన ఆయన మోడీని ఆకాశానికి ఎత్తేశారు. మోడీని ‘విశ్వ విజేత’గా అభివర్ణించారు. ఆయన దేశంలోనే కాకుండా.. అంతర్జాతీయంగా …
Read More »జోగి రమేష్ అరెస్టు.. రీజనేంటి?
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్ బ్రాండ్ నేత.. మాజీ మంత్రి జోగి రమేష్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం.. ఆయనను స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే.. తన అరెస్టును జోగి తప్పుబట్టారు. తాను ప్రజల కోసం రోడ్డుమీదకు వస్తే.. పోలీసులు అక్రమార్కులను కాపాడేందుకు తనను అరెస్టు చేశారని అన్నారు. ఇక, జోగి అరెస్టును నిరసిస్తూ.. వైసీపీ కార్యకర్తలు.. పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. దీంతో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates