Political News

భలే చెప్పినవన్నా: గంగుల్ స్పీచ్‌కు కేటీఆర్ ఫిదా!

తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం జరిగిన రెండు కీలక బిల్లుపై చర్చలో విపక్షం బీఆర్‌ఎస్ తరఫున గంగుల కమలాకర్ బలమైన గళం వినిపించారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రి పొన్నం ప్రభాకర్‌లను లక్ష్యంగా చేసుకుని గంగుల విమర్శలు గుప్పించడమే కాకుండా ఆయా బిల్లులకు సంబంధించి కొన్ని సూచనలు కూడా చేశారు. ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. “భలే చెప్పినవన్నా” అంటూ సభలోనే …

Read More »

మ‌హిళ‌ల‌కు మ‌రిన్ని వ‌రాలు.. బాబు కీల‌క నిర్ణ‌యం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కు మ‌రిన్ని వ‌రాలు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం అమ‌లు చేస్తున్న రెండు కీల‌క ప‌థ‌కాల‌కు సంబంధించి నిర్ణ‌యాలు తీసుకున్నారు. వీటిలో సూప‌ర్ 6 హామీల్లో ఒక‌టైన త‌ల్లి వంద‌నం ప‌థ‌కంలో మిగిలి పోయిన ల‌బ్దిదారుల‌కు వెంట‌నే నిధులు మంజూరు చేయాల‌ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. జిల్లాకు 200 నుంచి 300 మ‌ధ్య‌లో పెండింగు ద‌ర‌ఖాస్తులు ఉన్నాయి. వీటిలో అర్హులైన ప్ర‌తి తల్లికి ఎంత మంది పిల్ల‌లు ఉన్నా, …

Read More »

దేశంలో ఓట్ల దొంగలు: రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓట్ల చోరీ ఉద్యమాన్ని చారిత్రక ఘటనగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. దీనిని మున్ముందు కూడా మరింత తీవ్రంగా కొనసాగించనున్నట్టు ఆయన తెలిపారు. ఆదివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల గ్యాప్‌లో రేవంత్ రెడ్డి కేరళలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ కీలక నాయకుడు కేసీ వేణుగోపాల్ రాసిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అలెప్పీలో జరిగిన విద్యార్థుల‌కు ఎంపీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కూడా రేవంత్ …

Read More »

మోడీ తర్వాత.. ఆ ఛాన్స్ మళ్లీ లోకేష్‌కే!

ఔను.. మీరు చదివింది నిజమే. ప్రస్తుతం ప్రధాన మంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ తర్వాత ఓ గొప్ప అవకాశాన్ని దక్కించుకున్న మంత్రిగా నారా లోకేష్ రికార్డు సృష్టించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఘనంగా నిర్వహించే కార్యక్రమానికి నారా లోకేష్‌కు ఆహ్వానం అందింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏటా స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాం (ఎస్‌వీపీ)ని ఘనంగా నిర్వహిస్తుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులను ఏరికోరి ఆహ్వానిస్తుంది. వారి స్ఫూర్తిని తమ …

Read More »

జ‌గ‌న్‌కు అయ్య‌న్న‌ అప్పీల్‌.. ఏమ‌న్నారంటే!

వైసీపీ అధినేత‌, ఏపీ విప‌క్ష‌ (ప్ర‌ధాన కాదు) నాయ‌కుడు జ‌గ‌న్‌కు అసెంబ్లీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు కీల‌క సూచ‌న చేశారు. అసెంబ్లీకి రావాల‌ని ఆయ‌న‌ను మ‌రోసారి కోరారు. అంతేకాదు.. స‌భ‌కు వ‌స్తే మాట్లాడే స‌మ‌యంలో ఇస్తామ‌న్నారు. స‌భ‌కు రాకుండా ప్రెస్ మీట్లు పెట్టే సంప్ర‌దాయాన్ని సృష్టించ‌వ‌ద్ద‌ని, ఇది ప్ర‌జాస్వామ్యంలో మంచి ప‌ద్ద‌తి కాద‌ని వ్యాఖ్యానించారు. వ‌చ్చే నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయ‌ని, …

Read More »

జాతీయ పార్టీగా జనసేన.. రీజనేంటి?

జనసేన పార్టీని జాతీయ పార్టీగా మారుస్తానంటూ ఉప ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ప్రకటించారు. వచ్చే 10 సంవత్సరాల్లో అన్నీ అనుకూలిస్తే జనసేన జాతీయ పార్టీగా ఆవిర్భవిస్తుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే అసలు జాతీయ పార్టీగా ఆవిర్భవించాల్సిన అవసరం ఏంటి? ఎందుకు వచ్చిందీ ఆ ఆలోచన? అనేది కీలక విషయం. ప్రస్తుతం ఉన్న టీడీపీ కూడా జాతీయ పార్టీగానే నమోదైంది. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, …

Read More »

ట్రెండ్ మార్చిన చంద్ర‌బాబు.. ఎక్క‌డికెళ్తే అక్క‌డే!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు ట్రెండ్ మార్చారా? ఎక్క‌డికి వెళ్తే అక్కడ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. గ‌తంలో 2014-19 మ‌ధ్య కూడా ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య తిరిగారు. కానీ, భ‌ద్ర‌తా ప‌ర‌మైన కార‌ణాలు లేదా.. పాల‌నా ప‌ర‌మైన ఒత్తిడి నేప‌థ్యంలో ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా.. అక్క‌డి ప‌నులు చూసుకుని వెనుదిరిగేవారు. ప్ర‌జ‌ల‌తో కేవ‌లం ముచ్చ‌ట్ల వ‌ర‌కే ప‌రిమితం అయ్యేవారు. కానీ, ఈ ఏడు …

Read More »

విశాఖ‌లో అంతా ఓకే క‌దా.. బాబు ఆరా..!

విశాఖ రాజ‌కీయాల‌పై సీఎం చంద్ర‌బాబు ఆరా తీశారు. గ‌త రెండు మాసాల కింద‌ట విశాఖప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌ను కూట‌మి కైవ‌సం చేసుకున్న ద‌రిమిలా సీఎం చంద్ర‌బాబు క్షేత్ర‌స్థాయిలో పార్టీ వ్య‌వహారాలు, రాజకీయాల‌పై జిల్లాకే చెందిన పార్టీ రాష్ట్ర చీఫ్ ప‌ల్లా శ్రీనివాస‌రావుతో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించారు. విశాఖలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు నగరానికి సంబంధించిన డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంత‌రం పార్టీ నాయ‌కుల‌తో ఆయ‌న అంత‌ర్గ‌తంగా చ‌ర్చించారు. ఈ చ‌ర్చ‌ల్లో …

Read More »

జ‌గ‌న్ పాలిటిక్స్‌.. అయితే ఏంటి..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాలిటిక్స్ భిన్నంగా ఉన్నాయి. ఆయ‌న ఏం జ‌రిగినా భిన్నంగా ఆలోచ‌న చేస్తారు. ఏ విష‌యాన్ని కూడా ఆయ‌న సీరియ‌స్‌గా తీసుకోరు. ఇది మంచిది కాదు. కొంప‌తీసి రాసేస్తారా ఏంటి? రాయ‌మాకండి! అని వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తాజాగా మీడియా ముందు చేసిన వ్యాఖ్య‌లు. నిజ‌మే! జ‌గ‌న్ పాలిటిక్స్ అంతే అని మిగిలిన నాయ‌కుల మాట కూడా. ఆది నుంచి ఏం …

Read More »

జ‌గ‌న్ విమానం ఎక్కేస‌రికి నీళ్ల‌న్నీ ఇంకిపోయాయి: చంద్ర‌బాబు

నా నియోజ‌క‌వ‌ర్గంలో వారు (వైసీపీ) పాగా వేయాల‌ని అనుకున్నారు. అందుకే సినిమా సెట్టింగులు వేసి కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో నీరు పారించామ‌ని డ్రామాలు ఆడారు. ఎక్క‌డి నుంచో నీరు తీసుకువ‌చ్చి ఇక్క‌డ పారించి రిబ్బ‌న్లు క‌ట్ చేశారు. కానీ, జ‌గ‌న్ తిరిగి విమానం ఎక్కేస‌రికి ఆ నీళ్ల‌న్నీ ఇంకిపోయాయి. ఇదీ ఆనాటి పాల‌న‌. కానీ ఇప్పుడు వ‌ర‌ద ప్ర‌వాహం మీరు చూస్తున్నారు. మ‌న‌సు పెట్టి ప‌నులు చేస్తున్నాం. కృష్ణ‌మ్మ‌ను తీసుకువ‌చ్చాం. రైతుల‌కు, …

Read More »

ద‌స‌రా త‌ర్వాత‌.. ప‌వ‌న్ `త్రిశూల్‌`!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ద‌స‌రా పండుగ త‌ర్వాత‌.. జ‌న‌సేన త‌ర‌ఫున `త్రిశూల్‌` కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిపారు. విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతున్న `సేనతో సేనాని` కార్య‌క్ర‌మంలో చివ‌రి రోజు శ‌నివారం ఆయ‌న పార్టీ నాయకులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. ఈ సంద‌ర్భంగా భ‌విష్య‌త్తు పార్టీ వ్యూహాల‌ను ఆవిష్క‌రించారు. విశాల దృక్ఫ‌థం ఉన్న యువ‌త‌కు పార్టీ పెద్ద‌పీట వేస్తుంద‌న్నారు. ప‌ద‌వుల కోసం, …

Read More »

సభలో సహకరిస్తాం కానీ: కేటీఆర్ షరతులు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము సభలో సహకరిస్తామని చెప్పారు. ఏ విషయంపైనైనా అర్థవంతమైన చర్చలు చేపట్టేందుకు పూర్తిగా సహకారం ఉంటుందని తెలిపారు. అయితే సభ విషయంలో తాము సూచించినట్టు నిర్ణయాలు తీసుకోవాలని షరతులు విధించారు. సభను కేవలం మొక్కుబడిగా నాలుగు రోజులు నిర్వహించి చేతులు దులుపుకోవద్దన్నారు. కనీసం రెండు …

Read More »