Political News

వైసీపీ నేత పిన్నెల్లి సోద‌రుల‌పై మ‌ర్డ‌ర్‌ కేసు… ఏం జ‌రిగింది?

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంక‌ట్రామిరెడ్డిల‌పై పోలీసులు హ‌త్య కేసు న‌మోదు చేశారు. సెక్ష‌న్ 302(మ‌ర్డ‌ర్ కేసు) కింద వీరిపై కేసు న‌మోదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఉమ్మ‌డి గుంటూరు జిల్లా ప‌ల్నాడులో శ‌నివారం మ‌ధ్యాహ్నం దారుణ హ‌త్య జ‌రిగింది. టీడీపీలోని రెండు వ‌ర్గాల మ‌ధ్య త‌లెత్తిన ఆధిప‌త్య పోరు.. ఈ హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు టీడీపీ క్షేత్ర‌స్థాయి నాయ‌కులు …

Read More »

‘లిక్క‌ర్‌’లో లాజిక్కులు.. వైసీపీ ధైర్యం ఇదేనా.. ?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారాన్ని కూట‌మి ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. ఎవరు ఎక్క‌డ దాక్కున్నా వ‌దిలిపెట్టేదిలేద‌న్న‌ట్టుగా విచార‌ణ‌ను ముమ్మ‌రం చేస్తోంది. అయితే.. ఈ విష‌యం లో వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌బుత్వానికి స‌వాళ్లు రువ్వారు. రండి.. నేను విజ‌య‌వాడ‌లోనే ఉన్నాను. ద‌మ్ముంటే అరెస్టు చేసుకోండి.. అని వ్యాఖ్యానించారు. అయితే.. ఇంత జ‌రుగుతున్నా.. ఇంత మంది అరెస్టు అవుతున్నా. జ‌గ‌న్ ఇలా ఎందుకు వ్యాఖ్యానించార‌న్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. …

Read More »

తెలంగాణ మ‌హిళ‌లు దేశానికి ఆద‌ర్శం: మోడీ ప్ర‌సంశ‌లు

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా మ‌హిళ‌ల‌ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌శంస‌లతో ముంచెత్తారు. అధునాతన సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవ‌డంలో సంగారెడ్డి మ‌హిళా మ‌ణులు దూకుడుగా ఉన్నార‌ని.. వీరు దేశానికే ఆద‌ర్శ‌మ‌ని కొనియాడారు. వ్య‌వ‌సాయ రంగంలో కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న డ్రోన్ల వినియోగాన్ని తెలంగాణ‌లోని సంగారెడ్డి మ‌హిళ‌లు అందిపుచ్చుకున్నార‌ని ప్ర‌ధాని చెప్పారు. వ్య‌వసాయ ఉత్ప‌త్తుల ర‌క్ష‌ణ‌, పురుగుల మందు పిచికారీ వంటి ప‌నుల‌ను డ్రోన్లు చేస్తాయి. ఈ సాంకేతిక‌త‌ను దేశ‌వ్యాప్తంగా …

Read More »

వైసీపీ లిక్క‌ర్ స్కాం.. బీజేపీ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

వైసీపీ హ‌యాంలో ఏపీలో లిక్క‌ర్ స్కాం జ‌రిగింద‌ని.. దాదాపు 3200 కోట్ల‌రూపాయ‌ల‌కు పైగానే ప్ర‌జా ధ‌నాన్ని దోచుకున్నార‌ని కూట‌మి ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ పోలీసు క‌మిష‌న‌ర్ రాజ‌శేఖ‌ర‌బాబు నేతృత్వంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ప్ర‌స్తుతం ఈ బృందం వేగంగా ప‌నిచేస్తోంది. అనేక మందిని అరెస్టు కూడా చేసింది. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై బీజేపీ ఎంపీ, అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు స‌భ్యుడు సీఎం ర‌మేష్ సంచ‌ల‌న …

Read More »

మహానాడు లో ఆ వంటలు పెట్టండి: మోడీ సలహా

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో సీఎం చంద్ర‌బాబు శ‌నివారం రాత్రి భేటీ అయ్యారు. ఉద‌యం అంతా.. నీతి ఆయోగ్ స‌మావేశంలో ప్ర‌ధానితో పాటే పాల్గొన్న సీఎం చంద్ర‌బాబు.. మంచి ప్రెజెంటేష‌న్ ఇచ్చార‌ని ప్ర‌ధానితో కితాబు అందుకున్నారు. అనంత‌రం.. మ‌రోసారి ఐదు నిమిషాల పాటు.. ప్ర‌ధాని అప్పాయింట్ మెంటు తీసుకుని ఆయ‌న‌ను క‌లుసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి టీడీపీ నిర్వ‌హిస్తున్న మ‌హానాడుపై ఆరాతీశారని తెలిసింది. మ‌హానాడు …

Read More »

జ‌పాన్‌ను ప‌క్క‌కు నెట్టిన భార‌త్ .. స‌రికొత్త రికార్డు!

భార‌త దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌పంచంలోనే తొలి మూడు స్థానాల్లో నిల‌బెడ‌తానంటూ.. త‌ర‌చుగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. దీనికి ఆయ‌న ఐదేళ్ల వ‌ర‌కు స‌మ‌యం విధించుకున్నారు. వ‌చ్చే ఐదేళ్ల‌లో భార‌త దేశాన్ని ప్ర‌పంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా తీర్చిదిద్దుతామ‌ని చెబుతున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో తాజాగా ఓ అడుగు ముందుకు ప‌డింది. తొలి ఐదు దేశాల్లో ఐదో స్థానంలో ఉన్న …

Read More »

బాబు విందు.. ఘుమ‌ఘుమ‌లు!

సీఎం చంద్ర‌బాబు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కుప్పంలో నిర్మించుకున్న సువిశాల భ‌వ‌నం.. గృహ ప్ర‌వేశం ఆదివారం తెల్ల‌వారుజామును జ‌రిగింది. శ‌నివారం రాత్రి ఢిల్లీ నుంచినేరుగా హైద‌రాబాద్‌కు.. అక్క‌డ నుంచి బెంగ‌ళూరుకు వ‌చ్చిన ఆయ‌న రోడ్డు మార్గంలో కుప్పానికి చేరుకున్నారు. అనంత‌రం.. ఆయ‌న నిద్ర‌కూడా పోకుండానే.. గృహ ప్ర‌వేశ ఘ‌ట్టంలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సుమారు 25 వేల మంది పార్టీ నాయ‌కులు, మంత్రులు, వీఐపీల‌ను ఆహ్వానించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తుల …

Read More »

వంశీ-నాని-పేర్ని.. వాయించేసిన బుద్దా వెంక‌న్న‌

వైసీపీ నాయ‌కులు, ఉమ్మ‌డి కృష్ణాజిల్లాకు చెందిన వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నానీ, పేర్ని నానీల‌పై టీడీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న వ‌రుస పెట్టి వాయించేశారు. ఒక్కొక్క‌రినీ పేరు పెట్టి మ‌రీ వాయించేశారు. తాజాగా విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడిన బుద్ధా వెంక‌న్న‌.. వారిపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒక్కొక్క‌రి చ‌రిత్రా ప్ర‌జ‌ల‌కు తెలియ‌ద‌నుకున్నారా? అంటూ.. పేర్ని నానీపై విరుచుకుప‌డ్డారు. బుద్దా ఏమ‌న్నారంటే.. “జైల్లో ఉన్న వల్లభనేని వంశీ స్వాతంత్య్ర …

Read More »

పాలు పొంగించిన నారా బ్రాహ్మ‌ణి

ఏపీ సీఎం చంద్ర‌బాబు, నారా భువ‌నేశ్వ‌రి దంపతులు తాజాగా నూత‌న ఇంట్లోకి గృహ ప్ర‌వేశం చేశారు. ఈ సంద‌ర్భంగా వారి కోడ‌లు.. నారా బ్రాహ్మ‌ణి కొత్తింట్లో పాలు పొంగించి.. సంప్ర‌దాయ బ‌ద్ధంగా నిర్వ‌హించిన పూజ‌ల్లో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వ ప‌రంగా కాకుండా.. ప్రైవేటుగానే నిర్వ‌హించారు. దీంతో మీడియాను ఎలో చేయ‌లేదు. ఇక‌, ఈ నూత‌న ఇంటి విష‌యానికి వ‌స్తే చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం.. కుప్పంలోని శాంతిపురం మండలం, శివపురం …

Read More »

త‌మ్ముళ్ల‌కూ ‘సూప‌ర్ సిక్స్‌’.. చంద్ర‌బాబు కీలక నిర్ణ‌యం ..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. ప్ర‌జ‌ల కోసం ఆయ‌న ‘సూప‌ర్ సిక్స్‌’ పేరుతో ఆరు కీల‌క ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించారు. వీటిలో దీపం-2 ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. మిగిలిన వాటిని త్వ‌ర‌లోనే అమ‌లు చేయ‌నున్నారు. వీటికి ప్ర‌జ‌ల నుంచి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు మ‌హిళ‌ల‌ను మంత్ర ముగ్ధుల‌ను చేశాయి. వారిలో టీడీపీపై ఇమేజ్‌ను కూడా పెంచాయి. ఇదిలావుంటే.. ఇప్పుటు టీడీపీ …

Read More »

టైం ఇవ్వాలి.. బాబు వినాలి.. లేక‌పోతే.. !

ఏ పార్టీలో అయినా.. నాయ‌కుల‌కు సంతృప్తి-అసంతృప్తి అనేవి రెండూ ఉంటాయి. రెండు ఉన్న వారు కూడా ఉంటారు. ఎంత చేసినా అసంతృప్తేనా? అనే మాట హైక‌మాండ్ నుంచి వినిపిస్తుంది. కానీ ఎంతో చేస్తున్నాం.. అయినా త‌మ‌కు గుర్తింపు లేద‌ని క్షేత్ర‌స్తాయిలో నాయ‌కులు అంటారు. ఈ రెండు ఏ పార్టీలో అయినా కామ‌నే. అయితే.. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్తానం ఉన్న టీడీపీలో ఇప్పుడు.. మ‌రింత ఎక్కువ‌గా ఈ మాట వినిపిస్తోంది. మ‌రొ …

Read More »

ప‌వ‌న్ నోరు విప్పేశారు.. ఇక‌, పెద్ద‌లు ఏం చేస్తారు?

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌పై ఏపీ డిప్యూటీ సీఎం, అగ్ర‌హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ విరుచుకుప‌డ్డారు. ఆయ‌న ఉన్న‌దేదో మొహానే చెప్పేశారు. ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌కు సూటిగా.. సుత్తిలేకుండా.. త‌న మ‌న‌సులో మాట‌ను చెప్పేశారు. ఎక్క‌డా డొంక తిరుగుడు లేదు. ఎక్క‌డా నాన్చుడు ధోర‌ణిని కూడా అవలంభించ‌లేదు. మ‌రి ఇప్పుడు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ఏం చేస్తారు? ఏం చేయాలి? అనేది వారి కోర్టులోకే చేరింది. తాజాగా ఆగ్ర‌హం వెనుక‌.. ప్ర‌భుత్వాన్ని పెద్ద‌లు క‌లుసుకోవ‌డం లేద‌న్న …

Read More »