ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలకు ఆయన గట్టి సవాల్ విసిరారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ సిద్ధం పేరుతో సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాను ఒంటరిగా వస్తున్నానని, కూటమి పార్టీలు మూకుమ్మడిగా వస్తున్నాయని, అయినా సిద్ధమేనని ఆయన ప్రస్తావించి ప్రజల మధ్యకు వెళ్లారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. ఇప్పటి వరకు ఈ విషయంలో మౌనంగా ఉన్న …
Read More »చీరలు పంపిస్తా కట్టుకోండి: వైసీపీ నేతల పై మంత్రి కామెంట్స్
వైసీపీ నేతలపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలకు తన సొంత ఖర్చుతో చీరలు పంపిస్తానని, వాటిని కట్టుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో 16 వేల బస్సులు ఉంటే కేవలం 4 వేల బస్సుల్లోనే ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం అనుమతి ఇస్తోందని వైసీపీ నాయకులు …
Read More »నేడు, రేపు ఒకే చోట లోకేశ్, జగన్!
నిజమేనండోయ్…. నేటి రాత్రి, రేపు పగలంతా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్, వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకే చోట అంటే…మరీ ఒకే చోట అని కాదు… ఒకరికి ఒకరు అత్యంత సమీపంలోనే పర్యటించనున్నారు. ఈ ఆసక్తికర పరిణామానికి జగన్ సొంత జిల్లా కడప జిల్లానే వేదిక కానుంది. సోమవారం మధ్యాహ్నానికే …
Read More »ఫస్ట్ టైమ్!… నిండుసభలో తలదించిన హరీశ్!
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు అన్ని అంశాలపైనా సంపూర్ణ అవగాహన ఉందని చెప్పాలి. టీఆర్ఎస్ గా ప్రస్థానం ప్రారంభించిన బీఆర్ఎస్ లో ఆదిలో పార్టీ అదినేత కేసీఆర్ తరఫున అన్నీ తానై చూసుకున్న నేతగా హరీశ్ కు మంచి గుర్తింపు ఉంది. ఈ క్రమంలో పాలనలో దిట్టగా హరీశ్ ఎదిగారు. ఒకానొక దశలో హరీశ్ లేకుంటే …
Read More »హరీశ్..ఇది ఆరడుగుల బుల్లెట్టు: బీఆర్ఎస్
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై రాజకీయ మంటలు రేగిన వేళ… బీఆర్ఎస్ కీలక నేత, కాళేశ్వరం నిర్మాణ సమయంలో సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును ఆ పార్టీ ఓ రేంజిలో ఎలివేట్ చేసింది. హరీశ్ ను ఆరడుగుల బుల్లెట్టుగా ఆ పార్టీ అభివర్ణించింది. కాళేశ్వరంలో అవినీతి జరిగిన మాట వాస్తవమేనని రూలింగ్ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, కేసీఆర్ కుమార్తె …
Read More »“ప్రజలను మోసం చేసే వాడే… నాయకుడు!“
“ప్రజలను ఎంత బాగా మోసం చేసే లక్షణం ఉంటే.. వారే నాయకులు అవుతారు“ అని కేంద్ర మంత్రి… బీజేపీ నేత నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తరచుగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. పైగా ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేస్తారన్న పేరు కూడా తెచ్చుకున్నారు. అయినా.. తను చెప్పాలని అనుకున్నది నిర్మొహమాటంగా చెప్పారు. ఇలానే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ …
Read More »హరీష్ రావు పై కవిత సంచలన ఆరోపణలు
మాజీ మంత్రి హరీష్ రావు, మేఘా అధినేత కృష్ణారెడ్డిలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. వారివల్లే తన తండ్రి కేసీఆర్ కాళేశ్వరం కేసులో సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చిందని షాకింగ్ ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే సమయంలో హరీష్ రావు ఇరిగేషన్ శాఖా మంత్రి అని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వల్లే హరీష్ రావును మంత్రి పదవి నుంచి తొలగించారని కవిత చేసిన ఆరోపణలు తెలంగాణ …
Read More »హరీశ్, సంతోష్ లే అసలు నిందితులు: కవిత
కాళేశ్వరం కమిషన్ నివేదిక, ఈ వ్యవహారంపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో రాజకీయ మంటలను రాజేసింది. నిన్నటిదాకా విదేశీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత సోమవారం వచ్చీరాగానే ఈ వ్యవహారంపై పెను కలకలమే సృష్టించారు. జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కవిత… కాళేశ్వరంలో అవినీతికి పార్టీ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ …
Read More »30 ఇయర్స్ ఇండస్ట్రీ: రాజకీయ జగజ్జేత సీబీఎన్
రాజకీయాలు అందరూ చేస్తారు. తమకు తాము కీర్తి కిరీటాలు తగిలించుకుంటారు కూడా. అయితే తాను రాజకీయాలు చేయడమే కాకుండా వాటిని పదిమంది మెచ్చేలా చేయడంలోనే కీలకమైన వ్యూహం దాగి ఉంటుంది. ఇలాంటి వాటిలో అందెవేసిన చేయి టీడీపీ అధినేత చంద్రబాబు. ఎక్కడీ వీపీ సింగ్, ఎక్కడీ ప్రధానమంత్రి మోడీ, ఎన్నో ఎన్నికల తరాలు, ఎన్నో రాజకీయాలు. ఆయన చేసిన పనులు, వేసిన అడుగులు రాజకీయాల్లో సుస్థిరత్వాన్ని సొంతం చేశాయి. జగజ్జేతగా …
Read More »భాయ్ నువ్వు రిపోర్టు మొత్తం చదివావా?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు జరిగాయి. సుమారు చివరి రెండు గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీకి మధ్య వాదోపవాదాలు జరిగాయి. బీఆర్ ఎస్ సభ్యులు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు పత్రాలను చించేసి విసిరి కొట్టి సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయిన తర్వాత ఎంఐఎం సభ్యుడు మైకు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కమిషన్ …
Read More »కేసీఆర్ తప్పు ఒప్పుకున్నట్టేనా..?
కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డలో పిల్లర్లు కూలిన ఘటన నానాటికీ తెలంగాణ రాజకీయాలను వేడేక్కిస్తోంది. ఈ ఘటనపై ఇప్పటికే జస్టిస్ సీపీ ఘోష్ కమిషన్ ఏర్పాటు, కమిషన్ విచారణకు కేసీఆర్ సహా పలువురు కీలక నేతలు హాజరు కావడం, ఆపై కమిషన్ నివేదిక సమర్పణ, ఆ నివేదికపై అసెంబ్లీలో చర్చ నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లుగా ప్రాజెక్టును కట్టిన కేసీఆర్…అందులో …
Read More »అర్ధరాత్రి హైడ్రామా: భట్టికి హరీష్రావు `రాజీనామా` సవాల్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో పెద్ద ఎత్తున వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్రావుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు.. హరీష్రావుకు మధ్య కూడా తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. సభలో అధికార పక్షం వివరణ ఇస్తుండగానే బీఆర్ ఎస్ పక్ష నాయకులు సభ నుంచి వాకౌట్ చేశారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates