Political News

చెప్పి ఒప్పిద్దాం.. అమ‌రావ‌తిపై బాబు డెసిష‌న్‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని జాతీయ స్థాయిలో కాకుండా.. అంత‌ర్జాతీయ స్థాయికి విస్త‌రించాల‌న్న‌ది సీఎం చంద్ర‌బాబు ఆలోచ‌న‌. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న ప్లాన్ వేరైతే.. ఇప్పుడు దానిని హైలెవిల్‌కు తీసుకు వెళ్లారు. ఐటీ, ఏఐ, క్వాంట‌మ్ వ్యాలీ స‌హా.. అనేక రంగాల‌కు.. అమ‌రావ‌తిని హ‌బ్‌గా మార్చాల‌న్న‌ది సీఎం చంద్ర‌బాబు సంక‌ల్పం. ఈ క్ర‌మంలోనే.. ఇప్ప‌టికే తీసుకున్న 34 వేల ఎక‌రాల‌కు అనుబంధంగా మ‌రో 44 వేల ఎక‌రాల‌ను సమీక‌రించేందుకు(పూలింగ్‌) సిద్ధ‌మ‌య్యారు. …

Read More »

త‌మ్ముళ్లు దారి త‌ప్పుత‌ప్పున్నారు.. బాబు స‌ర్‌!

ఒక పార్టీలో ఏ ఒక్క నేత దారి త‌ప్పినా.. అది పార్టీకి, ఆ పార్టీ అధినేత మెడ‌కు చుట్టుకుంటుంది. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ వైసీపీనే. ర‌ప్పా.. ర‌ప్పా.. అంటూ.. కార్య‌కర్త‌లు హోర్డింగులు ఏర్పాటు చేశారు. కానీ, విమ‌ర్శ‌లు మాత్రం జ‌గ‌న్ కే వ‌చ్చాయి. అయితే.. దౌర్భాగ్యం ఏంటంటే.. వాటిని ఆయ‌న కూడా స‌మ‌ర్ధించుకున్నారు. ఇక‌, చేసేది ఏముంది..? జ‌గ‌న్ కూడా ర‌ప్పా ర‌ప్పా బ్యాచ్‌లో చేరిపోయారు. అంతో ఇంతో ఉన్న …

Read More »

కేసీఆర్ జగన్‌తో క‌లిసిస్తే తప్పు లేదు కానీ

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్‌పై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయ‌కు డు కిష‌న్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. కేసీఆర్ అప‌రిచితుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు(ఇంకా రూపు దిద్దుకోలేదు) స‌హా ఇత‌ర న‌దీ జ‌లాల విష‌యం వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కిష‌న్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఏ రాష్ట్రానికీ అనుకూలంగా …

Read More »

ఈట‌ల వ‌ర్సెస్ సంజ‌య్‌.. పొలిటిక‌ల్ హీట్‌!

తెలంగాణ బీజేపీలో వ‌ర్గ పోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. గ్రూపు రాజ‌కీయాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇదే విష‌యాన్ని గ‌తంలో ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన రాజా సింగ్ వెల్ల‌డించారు. పార్టీని కాపాడుకోవాల్సిన అవ‌స‌రం కూడా ఉంద‌న్నారు. అయితే… పార్టీ అదిష్టానం దీనిపై ఏమేర‌కు దృష్టి పెట్టిందో తెలియ‌దు కానీ.. వ‌ర్గ పోరు మాత్రం ఎక్క‌డా ఆగ‌డం లేదు. నాయకులు ఎవ‌రికి వారుగా గ్రూపు రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. …

Read More »

లిక్క‌ర్ స్కాంలో మిథున్ రెడ్డి రోల్ ఇదీ.. !

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఉన్న ఐదేళ్ల కాలంలో లిక్క‌ర్ ఆ పార్టీ నాయ‌కుల‌కు ఒక ఆదాయ వ‌న‌రు!. ఈ మాట చెప్పింది… ప్ర‌త్య‌ర్థులు కాదు.. ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు. అందుకే.. ఈ కేసులో ఇప్ప‌టికి 44 మందిని విచారించారు. వీరిలోనూ కీల‌క‌మైన మాజీ ఐఏఎస్ అదికారులు కూడా ఉన్నారు. అలానే.. వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి కూడా ఉన్నారు. సో.. …

Read More »

చంద్ర‌బాబు వ‌ల్లే ఇన్ని ప‌ద‌వులు: అశోక్‌

తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తి రాజు పార్టీ స‌భ్యత్వానికి రాజీనామా స‌మ‌ర్పించారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి వేర్వేరుగా ఆయ‌న‌ రాజీనామా లేఖలు పంపించారు. ఈ సంద‌ర్భంగా త‌న రాజ‌కీయం ఎలా ఎక్క‌డ నుంచి ప్రారంభ‌మైంద‌న్న విష‌యాన్ని గ‌జ‌ప‌తిరాజు వివ‌రించారు. ఎన్టీఆర్ పిలుపుతో తాను ప్ర‌జాసేవ చేసేందుకు .. రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌న్నారు. ఈ …

Read More »

మిథున్ రెడ్డికి సుప్రీం షాక్‌.. ఇక, జైలే!

వైసీపీ రాజంపేట ఎంపీ.. పార్ల‌మెంట‌రీ పార్టీ నాయ‌కుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో మిథున్‌రెడ్డిని మాస్ట‌ర్ మైండ్‌గా పేర్కొంటూ.. ఏపీ హైకోర్టు ఆయ‌న‌కు ముంద‌స్తు బెయిల్ నిరాక‌రించింది. దీంతో హైకోర్టు వ్య‌వ‌హారంపై మిథున్‌రెడ్డి నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే.. ఇక్క‌డ కూడా ఆయ‌న‌కు ఊర‌ట ల‌భించ‌లేదు. ముంద‌స్తు బెయిల్ ఇవ్వ‌లేమ‌ని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. అస‌లు ఈ కేసులో …

Read More »

వినుత డ్రైవర్ హత్య.. బొజ్జల సమాధానమిదే

శ్రీకాళహస్తి జనసేన నేత వినుత కోట, ఆమె భర్త.. తమ డ్రైవర్‌ శ్రీనివాసులును హత్య చేసిన కేసులో అరెస్టవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుపారీ కిల్లర్లను పెట్టి శ్రీనివాసులును చంపించిన వినుత, ఆమె భర్త.. మృతదేహాన్ని చెన్నైలో పడేసి వచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో వీళ్లిద్దరితో పాటు మరి కొందరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో దీని వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాళహస్తి …

Read More »

పహల్గాం దాడి వెనుక ఉన్న TRFపై అమెరికా సీరియస్?

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన భయానక ఉగ్రదాడికి బాధ్యత వహించిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’ను అమెరికా అధికారికంగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ఈ ప్రకటన చేయడంతో పాటు, TRF లష్కరే తోయిబా అనే పాక్ కేంద్రిత ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఇది ట్రంప్ ప్రభుత్వం జాతీయ భద్రతపై తీసుకున్న గట్టి నిశ్చయాన్ని …

Read More »

వైసీపీ వైపు రెడ్లు త‌గ్గుతున్నారే ..!

రాష్ట్రంలో రెడ్డి సామాజిక వ‌ర్గం ఒక పార్టీకే ప‌రిమితం కాలేదు. వాస్త‌వానికి సామాజిక వ‌ర్గాల వారీగా క‌మ్మ‌, కాపు వ‌ర్గాలు.. పార్టీల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న విష‌యం తెలిసిందే. 70-80 శాతం మంది క‌మ్మ సామాజిక వ‌ర్గం టీడీపీ వైపు ఉంటే.. 1-2 శాతం మంది క‌మ్యూనిస్టుల వైపు ఉన్నారు. వైసీపీ వైపు ఉన్న‌ది కేవ‌లం 20-30 శాతం మంది మాత్ర‌మే. వారు కూడా అటు ఇటుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వీరిలోనూ.. గ‌తంలో …

Read More »

ద‌శ మార‌నున్న అమ‌రావ‌తి.. ఇదే రీజ‌న్‌!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి సంబంధించి.. కీల‌క మార్పులు తెర‌మీదికి వ‌చ్చాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అమ‌రావ‌తి అంటే.. కేవ‌లం ప్ర‌భుత్వ కార్యాల‌యాలు.. స‌చివాల‌యం, అసెంబ్లీ, హైకోర్టు.. అధికారుల నివాసాల‌కే ప‌రిమిత‌మ‌ని అనుకున్నారు. అస‌లు వాస్త‌వ ప్లాన్ కూడా అక్క‌డికే ప‌రిమితం అయింది. కానీ, ఇప్పుడు ఈ ప్ర‌ణాళిక పూర్తిగా మార‌నుంది. గ‌తంలో చేప‌ట్టిననిర్మాణాలు.. వేసిన ప్లాన్లు అలానే సాగినా.. ఇప్పుడు సేక‌రించ‌నున్న 44 వేల ఎక‌రాల్లో చేసే నిర్మాణాలు.. అదేవిధంగా …

Read More »

`క్లెమోర్ మైన్లే ఏం చేయ‌లేక‌పోయాయ్‌` జ‌గ‌న్‌కు ఇచ్చిప‌డేసిన బాబు

“మూడేళ్లు క‌ళ్లు మూసుకుంటే.. చంద్ర‌బాబు ఎగిరిపోతాడు.“ అని వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన తీవ్ర వ్యాఖ్యల‌పై సీఎం చంద్ర‌బాబు చాలా గ‌ట్టిగా రియాక్ట్ అయ్యారు. `క్లెమోర్ మైన్లే న‌న్ను ఏం చేయ‌లేక‌పోయాయ్‌` అని వ్యాఖ్యానించారు. ఇక‌, నువ్వు (జగన్) ఎంత‌? నీ రాజ‌కీయం ఎంత‌? అని అన్నారు. పిల్ల రాజ‌కీయాలు చేసుకునే వారు.. నేర‌స్థులతో తాను కొట్లాడాల్సి వ‌స్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. “నేను సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాల్లో ఉన్నా. ఇలాంటి …

Read More »