మద్యం కుంభకోణంలో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. నన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం నా వద్ద పనిచేసిన, నా స్నేహితులపై ఒత్తిడి తీసుకుని వచ్చి తప్పుడు స్టేట్ మెంట్ల కోసం సిట్ యత్నిస్తోంది. నన్ను అరెస్టు చేయాలనుకుంటే… కేవలం సమాచారం ఇస్తే చాలు. నేనే సిట్ కార్యాలయానికి వస్తా. మీకు ఏమాత్రం శ్రమ అవసరం లేదు. అంటూ కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్న వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి …
Read More »రేణిగుంట కాదు.. ‘శ్రీవేంకటేశ్వర’ విమానాశ్రయం!
దేశ, విదేశాల నుంచి తిరుమల వచ్చే భక్తులు విమానాలను ఆశ్రయించే విషయం తెలిసిందే. ఈ క్రమంలో తిరుపతికి వచ్చే విమానాలు చిత్తూరు జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయానికి వస్తున్నాయి. ఇదే ప్రస్తుతం అందుబాటులో ఉన్న విమానాశ్రయం. ఇక్కడ దిగి 15 కిలో మీటర్ల దూరంలోని తిరుపతికి రోడ్డు మార్గంలో చేరుకుంటున్నారు. అయితే.. సుదీర్ఘకాలంగా ఉన్న రేణిగుంట విమానాశ్రయం పేరును తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.. ‘శ్రీవేంకటేశ్వర విమానాశ్రయం’గా మార్పు చేయాలని …
Read More »‘కుప్పం’ మహిళకు బాబు పరామర్శ.. రూ.5 లక్షల సాయం
అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురి చేసిన ఘటన ఏపీలో కలకలమే రేపింది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలో ఈ ఘటన జరగడంతో దీనికి మరింత ప్రాధాన్యం లభించింది. ఈ వీడియోలు వైరల్ కాగా… సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. తాజాగా మంగళవారం సాయంత్రం బాధిత మహిళ శిరీషతో ఆయన ఫోన్ లో పమార్శించారు. అంతేకాకుండా రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన బాబు.. ఆమె పిల్లల …
Read More »‘బానకచర్ల’పై కేంద్రం కసరత్తు షురూ!
పోలవరాన్ని బానకచర్లతో అనుసంధానం చేయడం ద్వారా ఏపీ రూపురేఖలే మారిపోతాయన్నది సాగునీటి రంగ నిపుణులు ఘంటాపథంగా చెబుతున్న మాట. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణులు నిజంగానే ఈ ప్రాజెక్టు అద్భుతమని, ఇది పూర్తి అయితే గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో పాటు రాయలసీమ రతనాల సీమగా మారిపోతుందని చెబుతున్నారు. ఏపీకి వరప్రదాయనిగా పరిగణిస్తున్న ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం …
Read More »‘ఇచ్చిన మాట’ నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం
‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్తాన్ తూటాకు బలై.. వీరమరణం పొంది, దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాను మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ తల్లీతండ్రులను ఆదుకుంటామని ఏప్రిల్లో జరిగిన ఘటన అనంతరం.. ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఆర్థిక సాయంతోపాటు.. ఐదు ఎకరాల పొలాన్ని, …
Read More »అమరావతికి బూస్ట్!.. ఆ రెంటికీ కేంద్రం ఓకే!
ఏపీ రాజధాని అమరావతిలో ఇప్పుడు ఎక్కడ చూసిన పండుగ వాతావరణం కనిపిస్తోంది. అమరావతి కోసం సేకరించిన భూముల్లో ఎక్కడికక్కడ నిర్మాణ పనులకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతికి కేంద్రం ఓ శుభవార్త చెప్పింది. ఈ వార్త అమరావతి నిర్మాణానికి నిజంగానే బిగ్ బూస్ట్ అని చెప్పక తప్పదు. రాజధాని నగరంలోని రెండు కీలక నిర్మాణాలను తానే నిర్మించి ఇస్తానని కేంద్రం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏ …
Read More »వైసీపీ హయాంలో షర్మిల ఫోన్ ట్యాపింగ్?!
ఏపీలో వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్కు, ఆయన సోదరి వైఎస్ షర్మిల ఫోన్ లను ట్యాప్ చేశారా? ఆమె ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో రాజకీయంగా అడుగులు ముందుకు వేస్తున్నారు? ఎవరి సలహాలు తీసుకుంటున్నారు? అనే కీలక విషయాలను అప్పట్లోనే తెలుసుకున్నారా? అంటే..తాజాగా దీనికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. వైఎస్ షర్మిల ఫోన్ సైతం ట్యాప్ అయిందని తాజాగా వెలుగు చూసింది. వైసీపీ హయాంలో జగన్కు, షర్మిలకు మధ్య …
Read More »“ఆయన బతికుంటే.. పవన్ రాజకీయాల్లోకి వచ్చేవారు కాదు!”
“ఆయన బతికుంటే.. పవన్ రాజకీయాల్లోకి వచ్చేవారు కాదు!”- అని జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేవారు ఉంటే.. చిరంజీవి, పవన్ కల్యాణ్లు అసలు రాజకీయాల్లోకి వచ్చేవారు కాదని.. వారు తమ సినిమాలు చేసుకునేవారని చెప్పారు. అలా సేవ చేసే వారు లేకపోబట్టే.. వారు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో కాపు …
Read More »‘కుప్పం’ ఘటనపై కఠిన చర్యలకు బాబు, అనిత ఆదేశం
అప్పు తీర్చలేదన్న కారణంగా ఓ మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన ఏపీలో పెను కలకలమే రేపింది. ఈ ఘటన సాక్షాత్తు టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో జరగడంతో ఈ ఘటనకు చెందిన వీడియోలు మరింత వైరల్ గా మారాయి. అయితే చంద్రబాబుతో పాటు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత కూడా వేగంగా స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన …
Read More »లిక్కర్ కేసులో కొత్త, వింత కథ!
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మద్యం కుంభకోణంలో మంగళవారం అనూహ్యంగా ఓ కొత్త స్టోరీ వినిపించింది. ఈ స్టోరీ కొత్తదిగానే కాకుండా వింతగానూ ఉందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటిదాకా కనీసం నోటీసులు కూడా జారీ కాని వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి గత కొంత కాలంగా తనను అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఆరోపణల్లో …
Read More »ఢిల్లీకి లోకేష్.. రీజనేంటి?
ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. గత నెలలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోడీని కుటుంబ సమేతంగా కలుసుకున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుసుకున్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ఇప్పుడు మరోసారి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు రెడీ అయ్యారు. బుధ, గురువారాల్లో ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. దీంతో ఇప్పుడు ఆయన పర్యటనకు సంబంధించిన విశేషం ఏంటనేది ఆసక్తిగా మారింది. …
Read More »బెంగళూరులో చెవిరెడ్డి అడ్డగింత?
వైసీపీ కీలక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని బెంగళూరులో విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారు. ఆయనను తిరిగి ఏపీకి పంపించారు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు నిర్ధారించారు. బెంగళూరు నుంచి శ్రీలంక రాజధాని కొలంబో వెళ్లే విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్ సమయంలో చెవిరెడ్డిని విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారని చెప్పారు. ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates