తెల్లవారితే… రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుండగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉండి, లక్షలాది ఓట్లను ప్రభావితం చేసే పే రివిజన్ కమిషన్ పై గుడ్ న్యూస్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం నూతన వేతన సవరణ సంఘాన్ని (పీఆర్సీ) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నివేదిక వచ్చే వరకు 5 శాతం ‘మధ్యంతర …
Read More »బ్రేకింగ్ః మైనంపల్లి ఎఫెక్ట్తో నందికంటి రాజీనామా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా రోజు రోజుకు రసకందాయంలో పడుతోంది. మల్కాజ్గిరి సిటింగ్ ఎమ్మెల్యే, ఇటీవలే బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు కారణంగా మరో ముఖ్యనేత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మొదటి నుంచి మైనంపల్లి చేరికను వ్యతిరేకిస్తున్న మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఈరోజు తన అనుచరులతో సమావేశం తర్వాత …
Read More »పవన్ దూకుడు: తెలంగాణలో పోటీ చేసే స్థానాలు ఇవే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో దూకుడు పెంచారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి నాలుగో విడత వారాహి యాత్ర ఆదివారం నుంచి మొదలుపెట్టిన జనసేనాని ఈ సందర్భంగా ఏపీలోని రాజకీయ పరిస్థితులు, తన పొత్తుల విషయంలో కీలక ప్రకటనలు చేశారు. అయితే, ఓ వైపు ఇలా ఏపీ పాలిటిక్స్ గురించి వివరిస్తూనే మరోవైపు తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికలపై సైతం పవన్ ఫోకస్ పెట్టారు. తాజాగా త్వరలో జరగబోయే తెలంగాణ …
Read More »రాయలసీమలోనే తేల్చుకోనున్న భువనేశ్వరి?
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరి ప్రజా క్షేత్రంలోకి రాబోతున్నారా? ఇప్పటికే నిరసన కార్యక్రమాలు, ర్యాలీలో పాల్గొంటూ టీడీపీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్న ఆమె.. ఇక బస్సు యాత్రతో ప్రజల్లోకి మరింత వెళ్లబోతున్నారా? అంటే టీడీపీ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. త్వరలోనే నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేస్తారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ నెల 3 (మంగళవారం)ను సుప్రీం కోర్టులో చంద్రబాబు …
Read More »మైనంపల్లి రాక.. మెదక్ కాంగ్రెస్ లో కుంపటి
బీఆర్ఎస్ నుంచి రెండు టికెట్లు ఆశించి భంగపడ్డ మైనంపల్లి హన్మంతరావు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిపోయారు. కాంగ్రెస్ నుంచి తనకు మల్కాజిగిరి, తన తనయుడు రోహిత్ కు మెదక్ టికెట్లు ఇస్తామనే హామీతో మైనంపల్లి హస్తం గూటికి వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు మెదక్ లో కాంగ్రెస్ లో ఇదే ఇప్పుడు కుంపటి రాజేసిందనే చెప్పాలి. తాజాగా కాంగ్రెస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం …
Read More »కాంగ్రెస్ సీనియర్లకు ‘పాపులర్’ టెన్షన్
తెలంగాణా కాంగ్రెస్ సీనియర్లలో కొత్త పంచాయితీ మొదలైంది. అదేమిటంటే సీనియర్లు అయినంత మాత్రాన టికెట్లు గ్యారెంటీ లేదని తాజాగా అధిష్టానం నుంచి సంకేతాలు అందుతుండటమే. నియోజకవర్గంలో తమకు కాకుండా అధిష్టానం ఇంకెవరికి టికెట్ ఇస్తుందని కొందరు సీనియర్లు ఇంతకాలం చాలా ధీమాగా ఉన్నారు. అయితే పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు అధిష్టానానికి పాపులర్ రిపోర్టు ఇచ్చారనే ప్రచారం మొదలవ్వటంతో కొందరు సీనియర్లలో టెన్షన్ మొదలైంది. ఇంతకీ ఆ పాపులర్ రిపోర్టు …
Read More »కాంగ్రెస్ కి ఊపు తెప్పించే సర్వే
తెలంగాణ తో సహా తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూల పవనాలే వీస్తున్నట్లున్నాయి. తెలంగాణ తో కలిపి చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం ఎన్నికలు జరగాల్సుంది. చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలపై సర్వే సంస్ధలు ప్రీ పోల్ నిర్వహించాయి. పై మూడు రాష్ట్రాల్లో తమ సర్వే వివరాలను సంస్ధలు తాజాగా విడుదల చేశాయి. దాని ప్రకారం మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి …
Read More »సీఎం పదవి వద్దనను, కానీ..
రాబోయే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే యువత పెద్ద ఎత్తున నష్టపోతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సీఎం జగన్ కు ఐదేళ్ల కాలం ఒక వ్యక్తి జీవితంలో ఎంత విలువైందో తెలియదని పేర్కొన్న జనసేన అధినేత ఐదేళ్ల కాలంలో చాలా మంది యువత వయస్సు పెరిగి ఉద్యోగాలకు అర్హత కోల్పోతారు కాబట్టి వారే ఆలోచించుకోవాలని సూచించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో …
Read More »రాస్కో సాంబ – రాబోయేది టీడీపీ-జేఎస్పీ గవర్నమెంటే
రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం-జనసేన పార్టీల సంయుక్త ప్రభుత్వం ఏర్పడుతుందని… జనసేన పార్టీ (జెఎస్పి) అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. వారాహి యాత్ర నాలుగో విడత యాత్ర లో భాగంగా ఆదివారం అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ 2024లో జరిగే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) ఓటమి ఖాయమని అన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని జేఎస్పీ ఎన్నికల్లో పోటీ …
Read More »ఓటుకు నోటు కేసు : అక్టోబర్ 4వ తేదీన విచారణ
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయో ఇప్పటికే విన్నాం. ఈ నేపథ్యంలో మరో పరిణామం అందరినీ షాక్ కు గురిచేసింది. అప్పట్లో కొన్నేళ్ల కిందట కలకలం రేపిన ఓటుకునోటు కేసు విచారణలో జాప్యం జరుగుతోందని, సీబీఐతో విచారణ జరిపించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఓటు నోటు కేసు పిటిషన్ తాజాగా …
Read More »పవన్ వారాహి యాత్రః ప్రభుత్వం పై పవన్ దండయాత్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈరోజు క్రిష్ణా జిల్లాలో ప్రారంభమైన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టు తర్వాత, జనసేన పొత్తు ప్రకటించిన తర్వాత జరుగుతున్న వారాహి యాత్ర కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ ఏం మాట్లాడుతాడు అన్నదానిపై ఆసక్తి నెలకొని ఉంది. ఊహించినట్లే కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో పవన్ ప్రసంగం సంచలనంగా ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈరోజు పవన్ మాట్లాడుతూ …
Read More »చంద్రబాబు అరెస్టు- జరిగిన డ్యామేజ్ తిరిగొస్తుందా?
చంద్రబాబు అరెస్టు మీద బీఆర్ఎస్ అగ్ర నాయకులు స్పందిస్తున్నారు. బాబు అరెస్టు దురద్రుష్టకరమని బీఆర్ఎస్ ప్రధాన నాయకుడు, మంత్రి హరీష్ రావు తాజాగా పేర్కొన్నారు. మరోవైపు చంద్రబాబు మాటెత్తని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. దివంగత ఎన్టీఆర్ ను మాత్రం కీర్తిస్తున్నారు. అయితే చంద్రబాబు అరెస్టు విషయంలో బీఆర్ఎస్ కు జరుగుతున్న డ్యామేజీని కవర్ చేసేందుకే హరీష్, కేటీఆర్ ఇలా రంగంలోకి దిగారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ నేరుగా …
Read More »