Political News

బాబు గారిది.. స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీసుకునే నిర్ణ‌యాల‌ పై కొంత గ‌డ‌బిడ‌.. తాత్సారం రెండూ ఉంటాయ‌ని పార్టీ నాయ‌కులు చెబుతారు. ఆయ‌న ఏ నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా.. సుదీర్ఘ స‌మ‌యం తీసుకుంటారు. చాలా కోణాల్లో ఆచి తూచి అడుగులు వేస్తారు. ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. ముందు వెనుక‌లుకూడా ఆలోచించు కుంటారు. అందుకే నాయ‌కులు “అమ్మో.. బాబుగారి నిర్ణ‌య‌మా? అయితే ఏడాదైనా ప‌డుతుంది!” అని స‌ర‌దా వ్యాఖ్య‌లు చేస్తారు. ఇది స‌హ‌జ‌మే. వాస్త‌వానికి చంద్ర‌బాబు …

Read More »

‘మ‌హానాడు’.. అస‌లీ పేరు ఎలా వ‌చ్చింది?

‘మ‌హ‌నాడు’.. ఇది టీడీపీకి మాత్ర‌మే సొంత‌మైన పేరు. వాస్త‌వానికి ప్ర‌తి పార్టీ కూడా ప్లీన‌రీ పేరుతో ఆ పార్టీ విధి విధానాల‌ను ఏటా చ‌ర్చిస్తుంది. ద‌శ‌-దిశ‌ల‌ను క‌ల్పిస్తుంది. కానీ, ఇత‌ర పార్టీల‌కు.. టీడీపీకి మ‌ధ్య తేడా ఉంది. ఆయా పార్టీలు ఆవిర్భ‌వించిన రోజును పుర‌స్క‌రించుకుని ప్లీన‌రీని నిర్వ‌హిస్తాయి. అక్క‌డి నుంచి రెండు రోజులు మూడు రోజుల పాటు కార్య‌క్ర‌మాలు ఉంటాయి. కానీ, టీడీపీలో అలాకాదు. పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మాజీ …

Read More »

వైసీపీకి ఇచ్చిపడేసిన సాయిరెడ్డి

రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటున్నానని ప్రకటించి… అందులో భాగంగానే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పార్టీ ద్వారా దక్కిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి సోమవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా జగన్ పార్టీకి నిజంగానే ఇచ్చి పడేశారు. జగన్ కోటరీ అంటూ ప్రస్తావిస్తూ సాగిన ఆయన ప్రకటన… తననే జగన్ కోటరీ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. 3 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో తనకు …

Read More »

కేసీఆర్ ఆత్మ‌తో క‌విత‌ భేటీ… రాయ‌బారమేనా?

బీఆర్ఎస్ నాయ‌కురాలు.. ఎమ్మెల్సీ క‌విత పార్టీ అధినేత‌.. త‌న తండ్రి కేసీఆర్‌ను ఉద్దేశించి సూచ‌న‌లు చేస్తూ.. రాసిన లేఖ సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. దీని పై రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ.. మీడియా లోనూ అనేక రూపాల్లో చ‌ర్చ‌సాగింది. ఇక‌, పార్టీ అధినేత కేసీఆర్ అయితే.. అస‌లు ఈ లేఖ‌పై ఎవ‌రూ స్పందించొద్దు! అని తేల్చి చెప్పిన‌ట్టు కూడా స‌మాచారం. దీంతో అప్ప‌టి నుంచి ఈ లేఖ వ్య‌వ‌హారంపై ఎవ‌రూ స్పందించ‌డం …

Read More »

వైసీపీ కిం క‌ర్త‌వ్యం: పునాదుల నుంచి ప‌గుళ్లు.. !

Y S Jagan

వైసీపీకి పునాదులు అన‌ద‌గ్గ నాయ‌కులు అరెస్టు అయిపోయారు. అందునా.. వివాదాల‌కు చాలా చేరువ‌గా.. పార్టీ అధినేత‌పై ఈగ కూడా వాల‌నివ్వ‌కుండా.. చూసుకున్న నాయ‌కులు జైళ్ల‌కు వెళ్లిపోతున్నారు. ఈ ప‌రిణామాలు.. వైసీపీ పునాదుల నుంచి ప‌గుళ్లు ప‌ట్టేసిన ప‌రిస్థితిని క‌ళ్ల‌కు క‌డుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డిని అరెస్టు నుంచి త‌ప్పించేందుకు చాలానే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. దీనికి కూడా రెండు కార‌ణాలు ఉన్నాయి. 1) రెడ్డి సామాజిక వ‌ర్గంలో …

Read More »

సంక్షోభం దిశ‌గా బీఆర్‌ఎస్‌.. స‌రిదిద్దేవారేరీ?

తెలంగాణ‌ను ప‌ది సంవత్స‌రాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ.. ఉద్య‌మాన్ని ర‌గిలించి ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ.. ఇప్పుడు సంక్షోభం దిశ‌గా దాదాపు ప్ర‌మాద‌పు టంచుల వ‌ర‌కు చేరిపోయిందని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఎవ‌రికి వారు భీష్మించుకుని కూర్చున్న నేప‌థ్యంలో పార్టీ ముక్క‌లు చెక్క‌లు అవుతుందా? లేక‌.. టీ క‌ప్పులో తుఫానుగా మారుతుందా? అనే విష‌యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. బీఆర్ఎస్ అధినేత కుమార్తెగా, ఎమ్మెల్సీగా క‌విత రాసిన లేఖ‌.. ప‌రిస్థితి …

Read More »

కేటీఆర్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో.. తీవ్ర ర‌గ‌డ‌.. లాఠీచార్జి!

బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాల‌యంలో తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయ‌కులు పోటా పోటీగా నినాదాలు చేసుకోవ‌డంతోపాటు.. ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వ‌ర్గాల‌పైనా లాఠీ చార్జి చేశారు. చెద‌ర గొట్టారు.అంతేకాదు.. కేటీఆర్ క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద 144 సెక్ష‌న్ విధిస్తున్న‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు. అయిన‌ప్ప‌టికీ.. ప‌రిస్థితులు ఉద్రిక్త‌తంగానే కొన‌సాగుతున్నాయి. ఏం జ‌రిగింది? మాజీ …

Read More »

జూన్ 4: కూట‌మి కొత్త అజెండా.. వైసీపీకి చెక్‌.. !

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. కూట‌మి స‌ర్కారుపై ఒత్తిడి తెచ్చే క్ర‌మంలో జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర‌సన‌ల‌కు రెడీ అయిన విష‌యం తెలిసిందే. ‘వెన్నుపోటు’ పేరుతో జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌డంతోపాటు.. క‌లెక్ట‌రేట్ల‌లో విన‌తి ప‌త్రాలు కూడా ఇచ్చేందుకు ఆయ‌న రెడీ అయ్యారు. రాష్ట్రం లో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పడి ఏడాది అయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌లేద‌న్నది జ‌గ‌న్ నిర‌స‌న‌ల …

Read More »

జగన్ ఇష్టారాజ్యం చెల్లదు!.. కడప జిల్లాకు పాత పేరే!

2019- 2024 మధ్య కాలంలో ఏపీలో వైసీపీ తనదైన శైలి ఇష్టారాజ్య పాలనను సాగించింది. తాను తీసుకున్న ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా ప్రజాభిప్రాయం మేరకు చేపట్టని నాటి సీఎం జగన్… తనకు తట్టిందే చట్టం, నచ్చిందే న్యాయం అన్నట్లుగా వ్యవహరించారు. ఈ క్రమంలో తన సొంత జిల్లా కడప జిల్లాకు ఉన్న ప్రాధాన్యాన్ని కూడా తుంచేస్తూ తన తండ్రి పేరునే జిల్లా పేరుగా మార్చేశారు. అయితే టీడీపీ అధినేత …

Read More »

తారా జువ్వ‌లా మోడీ గ్రాఫ్‌.. ఎలా ఎగ‌బాకిందంటే!

“ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గ్రాఫ్ ఒక్క‌సారిగా ఎగ‌బాకింది. తారా జువ్వ‌లా దూసుకుపోయింది. మ‌నం ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఆయ‌న గ్రాఫ్ పుంజుకుంది.” -తాజాగా కేంద్ర మంత్రి ఒక‌రు వ్యాఖ్యానించారు. ఇది నిజమేన‌ని జాతీయ మీడియా కూడా పేర్కొంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా మోడీ హ‌వా మ‌రింత పెరిగిన‌ట్టు క‌థ‌నాలు రాసుకొచ్చింది. సాధార‌ణంగా.. విశ్వ‌గురుగా పేరొందిన మోడీ.. ఇప్పుడు మ‌రింత పుంజుకున్నార‌నేది ఈ క‌థ‌నాల సారాంశం. వాస్త‌వానికి ఏప్రిల్ 22న జ‌రిగిన …

Read More »

సింగిల్ వర్డ్ తో స్టాలిన్ కు షాకిచ్చిన పవన్

అంతా అనుకున్నట్టుగానే జరుగుతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను వ్యతిరేకిస్తున్న తమిళనాడు అదికార పార్టీ డీఎంకేపైకి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తన మిత్రపక్షమైన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను రంగంలోకి దించింది. ఎన్డీఏ రచించిన వ్యూహాన్ని పవన్ పక్కాగా అమలు చేసిన తమిళ గడ్డలోనే డీఎంకేకు గట్టి షాకిచ్చారు. నిత్యం ప్రాంతీయ వాదంలో తమను మించిన వారు లేరంటూ బీరాలు పలుకుతున్న డీఎంకే …

Read More »

టీడీపీ నేత‌తో సాయిరెడ్డి భేటీ.. త‌ప్పేంటి..?

వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డి వ్య‌వ‌హారం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ గా మారింది. ఈ నెల తొలి వారంలో ఆయ‌న విజ‌య‌వాడ‌కు వ‌చ్చారు. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ కుంభ‌కోణంలో రూ.3200 కోట్ల మేర‌కు అవినీతి జ‌రిగింద‌ని.. ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం విచార‌ణ కూడా జ‌రుగుతోంది. ఈ విచార‌ణ‌కే సిట్ అధికారులు పంపిన నోటీసుల మేర‌కు.. సాయిరెడ్డి ఈ నెల తొలి …

Read More »