తెలంగాణ రాజకీయాల్లో వరుసగా బుధవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదే సమయంలో పార్టీ నుంచి దక్కిన శాసనమండలి సభ్యత్వానికి (ఎమ్మెల్సీ) రాజీనామా చేశారు. అది కూడా స్పీకర్ ఫార్మాట్ లో ఆమె రాజీనామా చేయడం గమనార్హం. ఈ మేరకు పార్టీ నుంచి తనను సస్పెండ్ …
Read More »కేటీఆర్ పై కవిత షాకింగ్ వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పై, మాజీ మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన కవితపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే సస్పెన్షన్ అనంతరం తొలిసారి మీడియాతో మాట్లాడిన కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి హరీష్ రావుతో పాటు తన సోదరుడు కేటీఆర్ ను కూడా …
Read More »నేటి తరం: బాబు నుంచి నేర్వాల్సిందిదే.. !
“చంద్రబాబు ఓ డిక్షనరీ. ఆయన నుంచి మనం చాలానేర్చుకోవాలి.” – ఈ ఏడాది టీడీపీ ఘనంగా నిర్వహించిన పసుపు పండుగ మహానాడులో ఓ నాయకుడు చేసిన వ్యాఖ్య ఇది. నిజమే.. చంద్రబాబు ఒక డిక్షనరీనే. కానీ, తరచి చూస్తే.. ఆయన ఓ గ్రంధం!!. రాజకీయంగా ఏం చేయాలి.. ఏం చేయకూడదు.. ఎలా ఎదగాలి.. ఎక్కడ తగ్గాలి.. ఎక్కడ నెగ్గాలో పట్టి చూపించే పెద్ద బాలశిక్ష కూడా!. ముఖ్యంగా నేటి తరం …
Read More »బఫే భోజనం ఎంతో.. ఎరువులు కూడా అంతే!
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్నట్టే .. రైతులు యూరియా, ఎరువుల సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా జిల్లాల్లో అయితే.. అసలు యూరియా కొరత ఆకాశానికి అంటుతోంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాత్రి పూట కూడా ఎరువుల కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. అక్కడే పడుకుని నిద్ర చేస్తున్నారు. ఇది వాస్తవం. దీనిపై సీఎం చంద్రబాబు కూడా రెండు సార్లు …
Read More »సీఎం రేవంత్ రెడ్డి వాహనాలకు 75 వేల రూపాయల ఫైన్లు!
అదేంటి? అనుకుంటున్నారా? నిజమే. ట్రాఫిక్ రూల్స్ను పాటించకపోతే.. హైదరాబాద్ పోలీసులు ఎవరనే విషయాన్ని పక్కన పెట్టి చెలాన్లు విధిస్తున్నారు. ఈ విషయాన్ని గతంలో సీఎం రేవంత్ రెడ్డే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ప్రజలకు ట్రాఫిక్ పట్ల అవగాహన ఉండాలన్న ఆయన.. ఎవరు తప్పుచేసినా.. జరిమానాలు చెల్లించాల్సిందేనని వ్యాఖ్యానించారు. చివరకు తను తప్పు చేసినా పోలీసులు ఆలోచన చేయాల్సిన అవసరం లేదన్నారు. బహుశ.. ఈ విషయం దృష్టిలో పెట్టుకున్నారో.. ఏమో.. ట్రాఫిక్ …
Read More »బాబు సవాల్కు వైసీపీ స్పందన.. ఏమన్నారంటే!
ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం రాజంపేటలో పర్యటించిన సందర్భంగా రాష్ట్ర ప్రతిపక్ష(ప్రధాన కాదు) పార్టీ వైసీపీ అధినేతను ఉద్దేశించి గట్టి సవాలే రువ్వారు. దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు రావాలని.. ఏ విషయంపైనైనా చర్చించేందుకు తాము ‘సిద్ధం’గా ఉన్నామని.. చెప్పారు. ఈ సందర్భంగా ఆయన గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్, ఆయన నాయకులు సిద్ధం – సిద్ధం అంటూ.. చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. “అప్పట్లో సిద్ధం అన్నారుగా.. ఇప్పుడు సిద్ధమేనా? …
Read More »‘మీరంతా సక్రంగా పనిచేసి ఉంటే.. మన ప్రభుత్వం ఉండేది కదా!’: జగన్
వైసీపీ అధినేత జగన్.. సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “చంద్రబాబుకు ఆ ధైర్యం లేదు” అంటూ వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం.. సాయంత్రం స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకున్నారు.పలువురి నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. అదేవిధంగా పలువురు చిన్నారులకు.. కొద్దిపాటి ఆర్థిక సాయం అందించారు. అనంతరం.. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పలు విషయాలపై …
Read More »‘గణపతి బప్పా’ వర్సెస్ వైసీపీ ‘రప్పా-రప్పా’!
‘పుష్ప-2’ సినిమాలో ‘రప్పా-రప్పా నరకుతా!’ అనే డైలాగు.. సినిమాకు సంబంధించి ఎంత ఫేమస్ అయిందో తెలియదు కానీ.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు.. ఈ డైలాగును అందిపుచ్చుకున్న తర్వాత.. రప్పా-రప్పా డైలాగుకు హద్దులు లేకుండా పోయాయి. తెలంగాణ నుంచి మహారాష్ట్ర(ఇటీవల ఓ పార్టీ నాయకులు రప్పా రప్పా వ్యాఖ్యలు చేశారు)వరకు రప్పా-రప్పా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రత్యర్థుల రాజకీయాలను ప్రస్తావిస్తూ.. వారిని ఉద్దేశించి ఈ హెచ్చరికలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ …
Read More »మోడి చెప్పిన ‘డిజిటల్ డైమండ్’ కథ ఏంటి?
భారత్ నుంచి మరో విప్లవాత్మక ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన 32-బిట్ మైక్రోప్రాసెసర్ ‘విక్రమ్ 3201’ను తాజాగా ఆవిష్కరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని “డిజిటల్ డైమండ్”గా అభివర్ణించారు. “గత శతాబ్దం ఆయిల్ ఆధారంగా నడిచిందంటే.. ఈ శతాబ్దం చిప్లపై ఆధారపడి ఉంటుంది” అని ఆయన పేర్కొనడం ఈ ఆవిష్కరణ ప్రాధాన్యాన్ని మరింతగా చాటిచెప్పింది. ‘విక్రమ్ 3201’ అనేది …
Read More »మొక్కై వచ్చి మానై ఎదిగి.. పవన్కు విషెస్ వెల్లువ!
ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఆశేతు హిమాచలం.. ఆయనకు శుభాకాంక్షలు చెబుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు వరకు.. పవన్ కల్యాణ్కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించారు. ఎవరెలా స్పందించినప్పటికీ.. పవన్ కల్యాణ్ ప్రజాసేవలను వారు కొనియాడారు. మొక్కై వచ్చి.. మానై ఎదిగారంటూ.. విషెస్ను కుమ్మరించారు. ప్రధాని ఏమన్నారు? ప్రధాన మంత్రి …
Read More »ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం: సీబీఐకి సుగాలి ప్రీతి కేసు
2017లో సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కర్నూలులోని హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ కు ప్రీతి ఉరి వేసుకుని మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ ముందుకు సాగలేదు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రీతి కేసు విచారణ వేగవంతం చేసి బాధితులకు న్యాయం …
Read More »ముందే వేడెక్కించేసిన చంద్రబాబు.. !
ఏపీ సీఎం చంద్రబాబు.. అసెంబ్లీ సమావేశాలను ముందే వేడెక్కించేశారు. ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాలకు రావాలని .. వైసీపీ అధినేత జగన్ను అసెంబ్లీ స్పీకర్ .. అయ్యన్న పాత్రుడు ఇప్పటికే ఆహ్వానించారు. అయితే.. జగన్ వస్తారా? రారా ? అనేది ఇప్పటికీ సస్పెన్షన్లోనే ఉంది. ఇదిలావుంటే.. ఈ సమావేశాలకు సంబంధించి… చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates