తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. ఒక్కసీటు తగ్గినా.. తానే బాధ్యత తీసుకుంటానని తేల్చి చెప్పారు. దీనికి ఎవరినీ బాధ్యులను చేయబోనన్న ఆయన.. ఇప్పటి నుంచే కార్యకర్తలు కష్టపడాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ …
Read More »కేసీఆర్ మార్క్.. ఆసుపత్రిలో పార్టీ సమీక్ష
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాదించిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. ఉద్యమంలో ప్రపంచంలో ఎక్కడా లేని సరికొత్త రీతులతో నిరసనలతో హోరెత్తించిన కేసీఆర్.. నాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేశారు. ఆపై పదేళ్ల పాటు తెలంగాణను పాలించారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో తరచూ ఆసుపత్రికి వెళుతున్నారు. తాజాగా గురువారం రాత్రి యశోద ఆసుపత్రిలో …
Read More »సీనియర్-జూనియర్ మాటే వద్దు: పెద్దాయన తేల్చేశారు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, జూనియర్లు.. అనే మాటే వద్దని అందరూ కలసి కట్టుగా ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తేల్చేశారు. తాజాగా ఆయన పార్టీ నాయకులతో(పీసీసీ) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంతర్గత కలహాలపై వారితో రహస్యంగా చర్చించారు. ఎవరూ పార్టీకి తేడాలేదన్నారు. అందరూ సమానులేనని చెప్పారు. తొలిసారి విజయం దక్కించుకున్న ఆనందం ఉండడం తప్పుకాదని.. మలి విజయం కోసం.. మరింత రెట్టింపు …
Read More »దేశాన్ని దోచిన బడా బాబుల జల్సాలు చూశారా?
ఒకరేమో యావత్తు ప్రపంచానికి కింగ్ ఫిషర్ బీర్లను పంపిణీ చేస్తున్న యునైటెడ్ బ్రూవరీస్ యజమాని విజయ్ మాల్యా. మరొకరేమో క్రికెట్ ను ఎలా వ్యాపార వస్తువుగా మార్చాలో చూపించి… అదే సమయంలో దేశంలో అందిన కాడికి దోచి విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ వ్యవస్థాపక చైర్మన్ లలిత్ మోదీ. లలిత్ మోదీ మాదిరే మాల్యా కూడా భారత దేశ బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలను ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయిన వ్యక్తే. …
Read More »అందుకే మేం కనిగిరి నుంచి వెళ్లిపోయాం: పవన్ కల్యాణ్
గతంలో తమ కుటుంబం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఉండేదని.. అయితే.. ఇక్కడ తాగు నీరు కలుషితమని అందుకే.. తమ కుటుంబం ఆరు మాసాల కాలంలో అక్కడ నుంచి వేరే చోటకు తరలి పోయిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కనిగిరిలో ఫ్లోరైడ్ జలాలు వస్తున్నాయని .. దీంతో ఇక్కడి వారు అనారోగ్యం బారినపడుతున్నారని చెప్పారు. ఈ సమస్య తనకు కూడా తెలుసునని వ్యాఖ్యానించారు. చిన్నప్పుడు తాము …
Read More »బాబు తో మామూలుగా వుండదు మరి
చంద్రబాబుకు ఒక కీలక లక్షణం ఉంది. ముందు తాను అప్పగించిన పనిని పూర్తి చేయాలని ఆయన చెబుతారు. ఆ తర్వాత.. నాయకులు చెప్పే మాటలు వింటారు. వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రయ త్నిస్తారు. తాజాగా కొందరు.. నాయకులు సీఎంవోకు క్యూకట్టారు. వీరిలో ఉమ్మడి తూర్పు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. పలు అర్జీలతో సీఎంవోకు వచ్చిన వారు చాలా సేపు వెయిట్ చేశారు. అయితే.. చివరకు చంద్రబాబే …
Read More »వైసీపీ నేతలకు పవన్ మాస్ వార్నింగ్
తప్పు చేసిన వైసీపీ నేతలు ఈ రోజు చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటూ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, ఆ విషయం వదిలేసి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి పార్టీల నేతలపై రివేంజ్ తీర్చుకుంటామని వార్నింగులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 2029లో మళ్ళీ వస్తే అంతు …
Read More »కవిత – స్వయం ప్రకాశితమేనా?!
కల్వకుంట్ల కవిత. ఆమె రాజకీయ భవితవ్యం ఏంటి? ఎటు పయనిస్తారు? ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? ఇదీ.. ఇప్పుడు తెలంగాణలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చగా మారిన విషయం. సొంత పార్టీ పెడతారని తొలుత చర్చ వచ్చినా.. అదేం లేదని తేలిపోయింది. అంతేకాదు.. బీఆర్ ఎస్ను తను ఓన్ చేసుకున్న తీరు.. సీఎం సీటు తనదేనని చెప్పిన విధానం వంటివి కూడా.. ఆమె రాజకీయ ఫ్యూచర్ పై అనేక చర్చలకు …
Read More »జగనన్న ఇళ్లకు చంద్రబాబు మోక్షం..
వైసిపి హయంలో సీఎంగా ఉన్న జగన్ పలు పథకాలను ప్రారంభించారు. అయితే కొన్ని అనివార్య కార ణాల వల్ల కరోనా వంటి మహమ్మార్లు విజృంభించిన నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులు నిలిచిపోయాయి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సాధారణంగా ఇలాంటి ప్రాజెక్టులను కొనసాగిస్తాయని చెప్పడానికి ఎక్కడ అవకాశం లేదు. ఎందుకంటే గతంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చేశారు. అదేవిధంగా రాజధాని అమరావతి పనులను కూడా అటుకెక్కించారు. కాబట్టి ప్రభుత్వం మారితే …
Read More »వైసీపీ రాదని గ్యారెంటీ ఇవ్వండి.. ఈ సారి రైతుల వంతు!
ఏపీ రాజధాని అమరావతిలో ఒకింత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. పైకి అంతా బాగుందని చెబుతున్నా .. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం కావొచ్చు.. లేదా.. రైతులను అదృశ్య శక్తులు రెచ్చగొడుతున్న తీరుతో కావొచ్చు.. ఏదేమైనా.. మలివిడత భూ సమీకరణ ప్రక్రియకు ఆపశోపాలు పడాల్సి వస్తోంది. రాజధానిని మరింత విస్తరించాలని భావిస్తున్న కూటమి ప్రభుత్వం.. మరో 44 వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించేందుకు రెడీ అయింది. నూతనంగా తీసుకునే భూములలో అంతర్జాతీయ …
Read More »గిరిజనుల మనసు దోచిన పవన్ కల్యాణ్.. ఈసారి ఇలా!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గిరిజనుల సంక్షేమం.. వారి సౌకర్యాలు వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రహదారులు వేయిస్తున్నారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. అంతేకాదు.. వారి మనసెరిగి మెసులు కుంటున్నారు. కొన్నాళ్ల కిందట.. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని గిరిజనుల కుటుంబాలకు పాదరక్షలు పంపించిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో అడవి బిడ్డలు పవన్ కల్యాణ్ ఆప్యాయతకు …
Read More »చంద్రబాబు చేస్తోంది కరెక్టే..!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తరఫున చేసిన మంచి పనులను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన పథకాలు, చేసిన సంక్షేమం, ఇతరత్రా అనేక అంశాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని భావిస్తారు. ప్రధానంగా పెట్టుబడులు తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ కల్పనకు తమ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తోందో అన్నది చెప్పే ప్రయత్నం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates