Political News

‘కొండ‌’ను త‌వ్వే వ‌ర‌కు వ‌ద‌లేలా లేరే!

ఓరుగ‌ల్లు కాంగ్రెస్ పార్టీలో నెల‌కొన్న వివాదాలు, విభేదాలు ఇప్ప‌ట్లో స‌మ‌సి పోయేలా క‌నిపించ‌డం లేదు. పైగా.. మంత్రి కొండా సురేఖ భ‌ర్త, మాజీ ఎమ్మెల్యే కొండా ముర‌ళీధ‌ర్‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల్సిందేన‌న్న డిమాండ్ వెల్లువెత్తుతోంది. తాజాగా మాజీ మంత్రి క‌డియం శ్రీహ‌రి స‌హా.. వ‌రంగ‌ల్ నుంచి కీల‌క నాయ‌కులు గాంధీ భ‌వ‌న్‌కు పోటెత్తారు. కొండాపై ఫిర్యాదుల ప‌రంప‌ర‌ను పార్టీ ఇంచార్జి న‌ట‌రాజ‌న్ ముందు ఉంచారు. ఆయ‌న వ‌ల్ల పార్టీలో …

Read More »

పొలిటిక‌ల్ డిబేట్‌: జ‌గ‌న్‌కు అవ‌కాశం ఇస్తోందెవ‌రు?

జ‌గ‌న్ జ‌నంలోకి వ‌స్తున్నారు. కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోతున్నారు. ర‌ప్పా-ర‌ప్పా డైలాగులు పేలుస్తున్నారు. పోలీసుల‌ను కూడా హెచ్చ‌రిస్తున్నారు. అది పొదిలైనా.. రెంట‌పాళ్లైనా.. తాజాగా బంగారు పాళ్య‌మైనా. జ‌గ‌న్ దూకుడు ఎక్కువ‌గానే ఉంది. జ‌న స‌మీక‌ర‌ణ కూడా అలానే ఉంది. వీటిని నిలువ‌రించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. ఓ ప‌ట్టాన సాధ్యం కావ‌డంలేదు. అంతా అయిపోయాక‌.. స‌ర్కారు కేసులు పెట్టి మ‌రోరూపంలో బద్నాం అవుతోంది. ఈ క్ర‌మంలో అస‌లు జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు అవ‌కాశం ఇస్తోందెవ‌రు? …

Read More »

మాధ‌వ్‌ది అదే అజెండా.. తేల్చేశారుగా!

ఏపీ బీజేపీ చీఫ్‌గా కొత్త‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌.. పీవీఎన్ మాధ‌వ్‌.. త‌న అజెండాను చెప్ప‌క‌నే చెప్పారు. ప‌క్కా హిందూత్వ వాదిగా ఆయ‌న ముద్ర వేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ బీజేపీ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించిన వారిలో గ‌త రెండు ద‌శాబ్దాల కాలంలో సోము వీర్రాజు ఒక్క‌రే ఇలా హిందూత్వ అజెండాను ఫాలో అయ్యారు. అయితే.. మ‌ధ్య మ‌ధ్య ఆయ‌న కూడా ప‌ట్టువిడుపుల ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించారు. అయిన‌ప్ప‌టికీ.. సోము …

Read More »

ఆర్ఎస్ఎస్‌కు వందేళ్లు.. !

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాతృసంస్థ‌.. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌(ఆర్ఎస్ఎస్‌) స్థాపించి 99 సంవ‌త్స‌రాలు పూర్త‌వుతున్నాయి. ఈ ఏడాది అక్టోబ‌రు 2 నాటికి ఆర్ఎస్ఎస్ ఏర్ప‌డి 99 ఏళ్లు పూర్తయి.. 100వ సంవ‌త్స‌రంలోకి సంస్థ అడుగు పెట్ట‌నుంది. ఈ నేప‌థ్యంలో దేశంలో హిందూత్వ‌కు మ‌రింత ప‌దును పెట్టేలా కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. దాదాపు ల‌క్ష‌కు పైగా స‌మావేశాలు నిర్వ‌హించేలా ప్లాన్ చేశారు. వీటిని గ్రామీణ ప్రాంతాల్లోనూ.. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోనూ …

Read More »

చంద్ర‌బాబు మాస్టారికి అరుదైన గౌర‌వం.. ఏంటో తెలుసా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా స్కూల్ మాస్టారి అవ‌తారం ఎత్తిన విష‌యం తెలిసిందే. దాదాపు 45 నిమిషాల‌కుపైగా ఆయ‌న 8వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు సైన్సుపాఠం బోధించారు. వారిని ప్ర‌శ్న‌లు అడుగుతూ.. స‌మాధానాలు రాబ‌డుతూ.. పాఠ్య పుస్త‌కాన్ని ఫాలో అవుతూ.. విద్యార్థులకు ‘వ‌న‌రులు’ అనే పాఠాన్ని బోధించారు. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని ప్ర‌భుత్వం పాఠ‌శాల‌లో నిర్వ‌హించిన ‘మెగా పేరెంట్స్‌-టీచ‌ర్స్’ కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు ఇలా స్కూల్ మాస్ట‌ర్‌గా మారిపోయారు. అక్క‌డే మధ్యాహ్న భోజ‌నం …

Read More »

అరెస్టుకు రెడీ అంటోన్న ప్రసన్నకుమార్ రెడ్డి

కోవూరు ఎమ్మెల్యే, టీడీపీ మహిళా నేత వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రసన్న కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రసన్న కుమార్ రెడ్డి తాను ఎక్కడికి …

Read More »

ఏం సాధించిన‌ట్టు జ‌గ‌న్‌?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. చేప‌ట్టిన చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం ప‌ర్య‌ట‌న ద్వారా ఆయ‌న ఏం సాధించిన‌ట్టు? రైతు లకు ఏమేర‌కు మేలు చేసిన‌ట్టు? ఇదీ.. ఇప్పుడు స‌ర్వ‌త్రా వినిపిస్తున్న ప్ర‌శ్న‌లు. నిజానికి మామిడి కొనుగోలు స‌మ‌స్య‌.. గ‌త రెండు నెల‌లుగా ఉంది. రైతులు ఇబ్బందులు ప‌డుతున్న మాటా వాస్త‌వ‌మే. నెల రోజుల కింద‌టే.. టీడీపీ అనుకూల మీడియా లోనే మామిడి రైతుల క‌ష్టాల‌పై క‌థ‌నాలు వ‌చ్చాయి. …

Read More »

ఓడిపోయిన దువ్వాడకు డబ్బులిచ్చిన చిరు

2019-24 మధ్య వైభవం చూసి.. గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం చవిచూశాక బాగా అన్ పాపులర్ అయిన నేతల్లో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. ఆయన వ్యక్తిగత వ్యవహారాలు తీవ్ర దుమారం రేపడంతో, పార్టీ నుంచి సస్పెండై రాజకీయాలకు దూరమయ్యే పరిస్థితిని కొనితెచ్చుకున్నారు దువ్వాడ. అధికారంలో ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆయన ఏ స్థాయిలో నోరు పారేసుకున్నారో తెలిసిందే. అలాంటి వ్యక్తి …

Read More »

జ‌గ‌న్ కుట్ర‌ల‌పై విచార‌ణ‌?

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. వైసీపీ నాయ‌కులు, ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న కుట్ర‌ల‌పై విచార‌ణ‌కు ఆదేశించాల‌ని నిర్ణ‌యించారు. తాజాగా జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో రాష్ట్రానికి పెట్టుబ‌డులు రాకుండా వైసీపీ చేస్తున్న కుట్ర ల‌పై సీఎం చంద్ర‌బాబు మంత్రివ‌ర్గంతో చ‌ర్చించారు. ఎంతో క‌ష్ట‌ప‌డి రాష్ట్రానికి పెట్టుబ‌డుల‌ను ఆహ్వానిస్తున్నామ‌ని చెప్పారు. దీనికి తాను రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని చెప్పారు. అయితే.. ఇంత క‌ష్ట‌ప‌డి కంపెనీల‌ను ఒప్పిస్తే.. పెట్టుబ‌డులు రాకుండా …

Read More »

‘మ‌న ఎమ్మెల్యేను అంత మాటంటే.. మీరు ఏంచేస్తున్నారు?“

సీఎం చంద్ర‌బాబు త‌న మంత్రి వ‌ర్గ బృందంలోని 10-15 మంది మంత్రుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “మీరంతా నిద్రపోతు న్నారా?” అంటూ..వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పై వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్య‌ల‌ పై స్పందించిన సీఎం చంద్ర‌బాబు.. ఈ విష‌యంలో మంత్రులు వ్య‌వ‌హ‌రించిన తీరును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. “మ‌న ఎమ్మెల్యేను అంతంత మాట‌లంటే.. మీరు …

Read More »

‘జ‌గ‌న్‌-కేసీఆర్ స్నేహం.. తెలంగాణ‌ను ముంచింది’

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌, తెలంగాణ‌ మాజీ సీఎం కేసీఆర్ ల తెర‌చాటు స్నేహ‌మే తెలంగాణ‌ను జ‌ల‌ వివాదాల్లోకి నెట్టింద‌ని వ్యాఖ్యానించారు. వారిద్ద‌రి మ‌ధ్య ఎలాంటి స్నేహం ఉన్నా.. తెలంగాణ‌కు మేలు చేసేలా ఉండాల‌ని.. కానీ, తీవ్రంగా న‌ష్ట‌ప‌రిచేలా వ్య‌వ‌హ‌రించార‌ని అన్నారు. అదే తెలంగాణ స‌మాజానికి మ‌ర‌ణ శాస‌నం రాసింద‌న్నారు. ఈ అధికారం కేసీఆర్‌కు ఎవ‌రు ఇచ్చార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. గ‌తంలోనే …

Read More »

ఫ‌స్ట్ మాట‌లోనే తూటా పేల్చిన ఏపీ బీజేపీ చీఫ్‌!

ఏపీ బీజేపీ నూత‌న అధ్య‌క్షుడిగా ఇటీవ‌ల ఎంపికైన పాకాల వెంక‌ట నాగేంద్ర మాధ‌వ్‌.. తన తొలి మాట‌లోనే తూటా పేల్చారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా ఎంపికై వారం గ‌డిచినా.. మంచి రోజు కోసం వెయిట్ చేసిన ఆయ‌న‌ తాజాగా బుధ‌వారం విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యంలో బాథ్య‌త‌లు చేప‌ట్టారు. ముందుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బీజేపీ ఆఫీసు వ‌ర‌కు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంత‌రం ఆయ‌న విజ‌య‌వాడ‌లోని ప్ర‌ముఖ షాపింగ్ సెంట‌ర్ …

Read More »